in eluru
-
విద్యారంగంలో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలి
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో విద్యారంగాన్ని పటిష్టం చేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలపడానికి డీఈఓ కృషి చేయాలని ఎమ్మెల్సీ రాము సూర్యారావు కోరారు. డీఈఓ ఆర్ఎస్ గంగాభవానీకి రాష్ట్రస్థాయి అవార్డు లభించిన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గంగాభవానీని కలసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. భవిష్యత్లో మరిన్ని విద్యా ప్రమాణాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యాశాఖ ఏడీ ఏవీ వెంకటరమణ, సూపరింటెండెంట్లు పురుషోత్తం, అజీజ్, రీజనల్ స్పోర్ట్స్ కో– ఆర్డినేటర్ పీఎస్ సుధాకర్, పాండు రంగారావు, డి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లా కేంద్రమైన ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని తెలిపారు. పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఇందుకూరి రామకృష్ణంరాజు ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. ఏలూరు విజయవిహార్ సెంటర్ నుంచి ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లే సందులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు దోహదం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, ఇచ్చిన ప్రతి రుణానికి యూనిట్ స్థాపన జరిగి తీరాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. బ్యాంకర్లు, జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు ఉపాధి పథకాలు ఎంతో దోహదపడతాయన్నారు. తీసుకున్న రుణంతో యూనిట్లు స్థాపించకుండా ఉంటే బ్యాంకర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో పేదవర్గాల జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయించడంలో నిరంతరం బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నానని, ఎక్కడా లేనివిధంగా జిల్లాలో పేదల జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి అత్యధిక నిధులు కేటాయించేలా చేస్తున్నప్పటికీ చాలాచోట్ల తీసుకున్న రుణాలను పేదవర్గాలు సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడంలో బ్యాంకర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ ఎంహెచ్.షరీఫ్, ఎల్డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి
ఏలూరు అర్బన్ : వేసవిలో చల్లగాలి కోసం చాలామంది ప్రజలు ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. శుక్రవారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ ప్రజలతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. సమస్యలు విని సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని నిరోధించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అయితే దొంగతనాలు అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. దానిలో భాగంగా ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో తలుపులకు తాళాలు వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ ఇళ్లలో విలువైన నగలు, పెద్దమొత్తంలో నగదు ఉంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లే క్రమంలో సదరు విషయాన్ని సంబంధిత పోలీస్స్టేషన్ లో తెలిపితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 28 మంది ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. తణుకు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో క్రికెట్ బెట్టింగ్, బైక్ రేసింగ్లు జరుగుతున్నాయని నిరోధించాలని కోరాడు. ఏలూరు నుంచి ఫోన్ చేసిన వ్యక్తి తంగెళ్లమూడి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఆకతాయిల ఆగడాలను నిరోధించాలని ఫిర్యాదు చేశాడు. చింతలపూడి నుంచి ఫోన్ చేసిన వ్యక్తి పట్టణంలో కోడి పందేలు, పేకాటలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, వాటిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. -
పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో తప్పనిసరిగా క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తొలగించాలని కలెక్టర్కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖా ప్రగతి తీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. జూన్12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అన్ని పాఠశాలల్లో క్రీడాప్రణాళికలను రూపొందించి పటిష్టవంతంగా అమలు చేయాలని చెప్పారు. ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి, జనవరి 29 రిపబ్లిక్ డే సందర్భంగా కచ్చితంగా స్పోర్ట్స్ మీట్స్ను నిర్వహించి క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించాలని కలెక్టరు సూచించారు. 600 పాఠశాలల్లో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో వాకింగ్ ట్రాక్లను నిర్మిస్తామన్నారు. వివిధ వృత్తుల్లో శిక్షణనిచ్చే కార్యక్రమాలను పాఠశాల టైం టేబుల్లో పొందుపర్చాలని తెలిపారు. జూన్ 12 నాటికి విద్యార్థులకు రెండు జతల యూనిఫాంతో పాటు అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సర్వశిక్షాభియా¯ŒS పీఓ వి.బ్రహ్మానందరెడ్డి, సీఈఓ రూజ్వెల్ట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈఓ ఆర్.గంగాభవాని, ఎస్ఎస్ఏ పీఓ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. -
తుంపర సేద్యం తప్పనిసరి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్న దృష్ట్యా ఉద్యాన పంటలకు తుంపర సేద్యం తప్పనిసరి అని, ఎవరైనా డ్రిప్ ఏర్పాటు చేయకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లో తుంపర సేద్యంపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరువు జిల్లాలుగా ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా కన్నా పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మెట్ట ప్రాంతం వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని షరీఫ్ చెప్పారు. నీటి వనరులను సద్వినియోగం చేసుకుని తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే తుంపర సేద్యాన్ని ఉద్యానవన పంటలకు తప్పనిసరి చేయాలని, లేకపోతే నీరులేక పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 45 వేల హెక్టార్లలో బిందు సేద్యాన్ని అమలు చేసి ప్రతి ఎకరాలో డ్రిప్ ఏర్పాటు చేసి తీరాలి్సందేనని, ఈ లక్ష్యాన్ని అధిగవిుంచేందుకు రోజువారీ ప్రగతి నివేదికలను కలెక్టర్ భాస్కర్ సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన చర్యలు అమలు చేస్తున్నారన్నారు. మైక్రో ఇరిగేషన్అధికారి రామ్మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో మిగిలిన 45 వేల హెక్టార్లలో ఈ ఏడాది కచ్చితంగా బిందు సేద్యాన్ని అమలు చేసి రైతులకు సమకరిస్తామని చెప్పారు. ఉద్యాన శాఖ డెప్యూటీ డైరెక్టర్ వైవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ బిందుసేద్యం ద్వారా రైతులు 40 శాతం నుంచి 50 శాతం వరకూ విద్యుత్ ఆదా చేసుకోవచ్చన్నారు. -
సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
సీపీవోలపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ఏలూరు అర్బన్ : కమ్యూనిటీ పోలీస్ అధికారుల (సీపీవో)పై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ భాస్కర్భూషణ్ స్థానిక అమీనాపేటలో ఉన్న సురేష్ బహుగుణ స్కూల్ ఆవరణలో ఉన్న కల్యాణ మండపంలో సీపీవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీపీవోల సేవలను కొనియాడారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారు పోలీసులతో పాటు సమాజసేవలో పాటు పడుతున్నారని అందుకు ప్రతిఫలంగా వారి సేవల ప్రాతిపదికన ఏటా బెస్ట్ సీపీవోలను ఎంపిక చేసి ప్రోత్సాహకాలను అందిస్తామని, బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఏఎస్పీ వలిశల రత్న, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : క్రమశిక్షణ, నిబద్ధత వంటి పర్యాయ పదాలకు నిర్వచనమైన ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత, స్పృహ కలిగి ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించవలసిన సమయం వారికి వినియోగించకుండా అవమానాల పాలుకావద్దని హితవు పలికారు. బయోమెట్రిక్ హాజరు అమలుపై మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులను సమయానికి బడికి వెళ్లమనడం తప్పా అని ప్రశ్నించారు. ప్రతి శనివారం మీ ఊరు– మీ మంత్రి కింద నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోరే వ్యక్తి జవహర్ అని పేర్కొన్నారు. డీఈవో ఆర్ఎస్ గంగా భవానీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి మంత్రి జవహర్ మార్గదర్శకులుగా నిలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు మాట్లాడుతూ 1997లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మంత్రి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేసేవారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీటీఎఫ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో ముందుకు వెళ్లారన్నారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎన్ టీయూ జిల్లా అధ్యక్షుడు డి.ప్రసాదరాజు, ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు గుగ్గులోతు కృష్ణ, జేఏసీ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీఎన్ జీవో సంఘ ఉపాధ్యక్షుడు రమేష్, ఆర్యూపీపీ జిల్లా అ«ధ్యక్షుడు టి.గిరిరాజు, వైఎస్సార్ సీపీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధీర్, టీఎన్ యూఎస్ జిల్లా అధ్యక్షుడు టీవీ రామకృష్ణ, ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం మంత్రి జవహర్ దంపతులను వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఘనంగా సత్కరించాయి. డిప్యూటీ డీఈవో డి. ఉదయ్కుమార్, సర్వశిక్షాభియాన్ సీఎంవో రూజ్వెల్ట్ పాల్గొన్నారు. -
ఒప్పందాలు అమలు చేయాల్సిందే
ఏలూరు (మెట్రో): ఆయిల్ కంపెనీలు డీలర్లకు ఇచ్చిన రాతపూర్వక హామీ ప్రకారం 11 ఒప్పందాలను తక్షణమే అమలు చేసి పెట్రోల్, డీజిల్ డీలర్లను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్ల అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఏలూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, దేశంలోనూ పెట్రోల్, డీజిల్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెట్రోలియం డీలర్లు 365 రోజులు, 24 గంటలు పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్ 4న ఆయిల్ కంపెనీలు రాతపూర్వకంగా రాసిచ్చిన నిర్ణయాలను కూడా అమలు చేయకుండా ఒప్పందాలను అగౌరపరిచాయన్నారు. ఈ నిర్ణయాలు అమలు చేసేందుకు మార్చి 9న ఢిల్లీలో సమావేశమై మరో రెండు నెలలు సమయం కావాలని కోరారని, రెండు నెలల సమయం ఇచ్చినా అమలు చేయలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో డీలర్లకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగని రీతిలో ఖర్చులను తగ్గించుకునే విధంగా షిప్ట్ విధానాలను అమలు చేసేందుకు నిర్ణయిస్తున్నట్టు చెప్పారు. తక్షణమే 11 ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 నుంచి ఉద్యమం ఆయిల్ కంపెనీలు ఒప్పందాలను అమలు చేయకుంటే ఈ నెల 10 నుంచి శాంతియుతంగా ఉద్యమిస్తామని గోపాలకృష్ణ చెప్పారు. కొనుగోళ్లు నిలిపేసి మొదటి విడతగా నిరసన తెలుపుతామన్నారు. అదే విధంగా 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బంకులు పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 14 నుంచి ఆదివారం సెలవు దినంగా ప్రకటించనున్నట్టు చెప్పారు. తక్షణమే ఆయిల్ కంపెనీలు స్పందించి అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులు అమలు చేస్తూ, 11 ఒప్పందాలను అమలు చేయాలని కోరారు. ఈనెల 10 నుంచి నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు గమిని రాజా, కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు టి.సూర్యనారాయణరెడ్డి, ట్రెజరర్ కె.అంజిబాబు, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్, నాయకులు శేఖర్ పాల్గొన్నారు. -
ఉద్యోగులు ప్రజలతో మమేకం కావాలి
ఏలూరు (మెట్రో) : ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న వ్యతిరేక భావం పోవాలంటే ఉద్యోగులు ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించాలని, వారితో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఏపీ ఎన్జీవోలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ కొందరు ఉద్యోగుల పట్ల ప్రజల్లో సరైన అభిప్రాయం లేదని పదిమందికీ మేలు చేసే కార్యక్రమాల్లో కొన్ని విషయాలు ఇబ్బంది అనిపించినా కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేస్తే పరవాలేదన్నారు. వ్యక్తి కోసం చట్టాన్ని అతిక్రమించి ఎవరు పనిచేసినా సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా శాఖా పరంగా ఇబ్బందులు పడుతుంతే తన దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులూ కష్టపడి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆర్.సూర్యారావు, ఎన్జీవో నాయకులు చోడగిరి శ్రీనివాస్, రమేష్కుమార్, శ్రీధర్, సత్యనారాయణ, ఐవీఎస్ఎన్ రాజు పాల్గొన్నారు. న్యాయమూర్తి గోపి బాధ్యతల స్వీకరణ ఏలూరు(సెంట్రల్) : జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా జి.గోపి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయనను ఇటీవలే జిల్లా కోర్టు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
వేసవిలోనూ నిరంతర విద్యుత్
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో వేసవిలో కూడా 24 గంటలూ విద్యుత్ సరఫరా అందించి ప్రజల అభిమానాన్ని చూరగొంటామని ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సీహెచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జలసిరి పథకం అమలులో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపి రాష్ట్రస్థాయి అవార్డు పొందిన ఆయన్ని విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ కంపెనీ ప్రధాన కార్యదర్శి తురగా రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఈ కార్యాలయంలో మంగళవారం దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఉత్పత్తికి వినియోగానికి తీవ్ర అంతరం ఉండేదని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద జిల్లాలో 1,169 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వేగవంతంగా అందించి రాష్ట్రంలో ఉత్తమ జిల్లాగా పశ్చిమను తీర్చిదిద్దడంలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా 23/11 కేవీ సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తామని, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం కింద 6 ఇండోర్ సబ్స్టేషన్లు గత రెండున్నరేళ్లలో ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్ ఓసీ ఉద్యోగుల అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు బి.వీరభద్రరావు, నాయకులు జి.గంగాధర్, ఎన్.అప్పారావు, సీహెచ్ వెంకట్రాజు, నారాయణ, కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ బహుజన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సాల్మన్రాజు, ఎస్.సురేష్, పి.సుగుణ రావు, వీఆర్ ఆంజనేయులు ఎస్ఈకి పుష్పగుచ్చం అందించారు. -
బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్ : త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక పూర్తయిందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేష న్ కార్యదర్శి ఎంఎ న్ శ్రీనివాస్కుమార్ అన్నారు. ఆదివారం ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియంలో జిల్లా బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. పోటీలకు తాడేపల్లిగూడెం, మార్టేరు, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు వచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేశారు. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తాయని చెప్పారు. అసోసియేష న్ కోశాధికారి కె.మురళీకకృష్ణ, గవ్వా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మిస్తాం
ఏలూరు (మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, ప్యాకేజీలను అమలు చేసి అన్ని విధాలా అదుకుంటామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే 29 ఇళ్ల కాలనీల పనుల ప్రగతి తీరుపై ఐటీడీఏ, గృహ నిర్మాణశాఖాధికారులతో ఆయన సమీక్షించారు. కొత్త భూసేకరణ ప్యాకేజీ ప్రకారం నిర్ధేశించిన ఇళ్లు నిర్మిస్తామన్నారు. పాత ప్యాకేజీ ద్వారా అయితే విశాలమైన స్థలం, భవనం, పై అంతస్తు నిర్మించుకునేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే రూ.192 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి కాలనీలో కమ్యూనిటీ హాల్, సూపర్ బజార్, ప్రత్యేక పార్కు, చౌక డిపో, ఆరోగ్య కేంద్రం, అంగ న్వాడీ భవనం, పాఠశాలలు, ఇతర సౌకర్యాలు కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో నిర్మించే 11 కాలనీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ షణ్మోహ న్Sను కలెక్టర్ ఆదేశించారు. -
అమ్మ ఒడి ప్రచార రథం ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లలకు అందిస్తోన్న పథకాలను గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు అమ్మ ఒడి ప్రచార రథాన్ని ఏర్పాటు చేసినట్టు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు చెప్పారు. ఈ మేరకు గురువారం ఏలూరులో జెండా ఊపి ప్రచారరథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అందరికీ విద్యను అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ బడుల్లో అనేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ క్లాస్రూమ్స్, ప్రత్యేకావసరాలు కలిగిన పిల్లలకు భవితా కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సర్వశిక్ష అభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రచార రథం జిల్లాలో జూన్ 30వ తేదీ వరకు గ్రామాల్లో తిరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో కళాజాతాల ద్వారా అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలనే నినాదంతో ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ సీఎంవో టీటీఎఫ్ రూజ్వెల్ట్, ఏపీవో పి.భాస్కరరావు తదితరులు ఉన్నారు. -
ఎంసెట్-17ను పటిష్టంగా నిర్వహించాలి
ఏలూరు సిటీ : ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్-17 ఆన్లైన్ పరీక్షలను అత్యంత పటిష్టవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆ«ధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ నీట్ పరీక్షా ప్రశ్నపత్రాలను ఏలూరు పరీక్షా కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గతేడాది తెలంగాణలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీక్ కావటంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలోని ఎంసెట్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్రంలో తొలిసారి ఆన్లైన్లో ఎంసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారని, విద్యార్థుల్లోని భయాన్ని, ఆందోళనను తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ ఆన్లైన్ ఎంసెట్, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఈ మోడల్ ఎంసెట్, నీట్ పరీక్షలకు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కన్వీనర్గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర, జిల్లాస్థాయి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన మోడల్ నీట్ పరీక్షకు 5 డివిజన్లలలో 12 పరీక్షా కేంద్రాల్లో 900 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజీ వైస్ ప్రిన్సిపల్ మేకా అమరావతి, అధ్యాపకులు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్.మోహన్ ఉన్నారు. -
‘అమ్మఒడి’ ప్రారంభం
ఏలూరు సిటీ : జిల్లాలో 5 సంవత్సరాల వయసు నిండి బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేకంగా అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్ఎస్ గంగాభవాని, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి చెప్పారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమ కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 5 ఏళ్ల వయసు కలిగిన పిల్ల లు 50 వేల 200 మంది ఉండగా, అంగన్వాడీ కేంద్రాల్లో 27 వేలమంది వరకూ ఉన్నారని తెలిపారు. ఈ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో ఇంటింటా తిరిగి పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని, యూనీఫామ్స్, మధ్యాహ్న భోజన పథకం, భవనాలు, మరుగుదొడ్లు సౌకర్యం వంటివాటిపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 22 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. బడిఈడు పిల ్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామ -
స్త్రీ విద్య కోసం పోరాడిన పూలే
ఏలూరు (మెట్రో) : సమాజంలో సాంఘిక, మూడ నమ్మకాలను ఖండించి స్త్రీల విద్య కోసం పోరాడిన మహావ్యక్తి జ్యోతిరావు పూలే అని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన పూలే 191వ జయంతి సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో స్త్రీలు అభివృద్ధి చెందకుంటే ఆ సమాజం అభివృద్ధి చెందదని, మహిళలు విద్యావంతులు కావాలని పూలే ఆకాంక్షించారన్నారు. మహిళల విద్య కోసం ఆ రోజుల్లోనే ఎంతో కృషి చేసిన వ్యక్తి పూలే అన్నారు. ప్రతి ఒక్కరూ పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ సమాజాభివృద్ధికి పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ బలహీన వర్గాలకు పూలే ఆశాజ్యోతి అన్నారు. పూలే జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. బీసీ నాయకులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన పూలే జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పూలే తన జీవితాన్ని సమాజాభివృద్ధికి దారపోశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, జిల్లా పరిషత్ సీఈవో డి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ కోరారు. స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలో పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
వైఫై జోన్గా కలెక్టరేట్
ఏలూరు (మెట్రో) : జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాన్ని వైఫై జోన్గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలు తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ కనెక్షన్, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. జిల్లాలో 12,361 ప్రభుత్వ కార్యాలయాలకు తొలిదశగా ఫైబర్ గ్రిడ్ అనుసంధాన ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. రూ.149కే ఫైబర్ నెట్ కనెక్షన్ను జిల్లాలో 6,274 ఆఫీసులకు, రూ.299 ఫ్యాకేజీ కింద 5,628 కార్యాలయాలకు, రూ.1,499 ప్యాకేజీ కింద 206, రూ.2499లకు ప్యాకేజీ కింద 253 ప్రభుత్వ ఆఫీసులకు అందించనున్నట్టు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం వేగవంతంగా కలుగుతుందన్నారు. సమావేశంలో ఫైబర్ గ్రిడ్ ప్రతినిధి సతీష్, డీఎంహెచ్వో డాక్టర్ కె.కోటేశ్వరి, ఐసీడీఎస్ ఆర్జేడీ విద్యావతి, డీఈవో ఆర్ఎస్.గంగాభవాని, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పల్లెల్లో శనివారం నుంచి నెలరోజులు పాటు పర్యటించనున్నట్టు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో పంచాయతీ పన్నుల వసూలు, బయోమెట్రిక్ హాజరు, శానిటేషన్, డంపింగ్ యార్డుల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఏడాదిన్నరగా పల్లెల ప్రగతికి నిరంతరం వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించానని క్షేత్రస్థాయిలో ఏం ప్రగతి జరిగిందో, చేపట్టిన సంస్కరణల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయా? లేదా? అని స్వయంగా పరిశీలన చేస్తానన్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో కచ్చితంగా పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం వేళ టెలికాన్ఫరె న్స్ నిర్వహిస్తానని ఏప్రిల్ మాసమంతా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాలు ఉండబోవని చెప్పారు. గ్రామాల్లో నివాసం ఉండని పంచాయతీ సెక్రటరీలు, ఈవోపీఆర్డీల ఉద్యోగం ఆ రోజులో సమాప్తమవుతుందన్నారు. ఏలూరు డివిజన్ పంచాయతీ అధికారి సీహెచ్ రాజ్యలక్ష్మి పనితీరు పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డీపీవో కె.సుధాకర్, డివిజనల్ పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతి ప్రదానం
ఏలూరు సిటీ : ఏపీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపుస్మా) ఆధ్వర్యంలో ఏలూరు జోన్ స్పోర్ట్స్ మీట్–16కు సంబందించి బహుమతి ప్రదానోత్సవ వేడుక స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ–2 ఎంహెచ్ షరీఫ్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మదుసూధనరావు, డీఎస్డీవో ఎండీ సిరాజ్, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ హాజరయ్యారు. స్పోర్ట్స్మీట్లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 25 పాఠశాలల నుంచి 2,305 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లలో పోటీపడ్డారు. అలాగే అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అపుస్మా 15 మంది రైతులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరుకాగా అపుస్మా జోన్ అధ్యక్షుడు ఎంఎన్.శ్రీకాంత్, సెక్రటరీ కె.విజయలక్ష్మి, కోశాధికారి ఎస్.రాజ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్ఆర్కేఎ ప్రసాద్, జోనల్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి.రవిశంకర్ పాల్గొన్నారు. -
మూడో పంటకు ముందస్తు ప్రణాళిక
ఏలూరు (మెట్రో): జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో మూడో పంటకు అవసరమైన ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని, మూడో పంట ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ ప్రాధాన్యతా రంగాల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో తొలిసారిగా మూడో పంటను ప్రోత్సహిస్తున్నామని రైతుల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించేందుకు నాలుగు నెలల ముందే సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ పాస్ విధానం ద్వారా మాత్రమే ఎరువులు, పురుగు మందులు అమ్మకాలు చేయాలని ఏడు నెలలుగా చెబుతున్నా ఇంకా మాన్యువల్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయని కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ పోస్ ద్వారానే ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయ శాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరి, ఉద్యానశాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక పాల్గొన్నారు. ఆర్ అండ్ బీ పనులు వేగిరపర్చాలి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో మార్చి 21వ తేదీ నాటికి ఆర్ అండ్ బీ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్ అండ్ బీ పనులపై ఆయన సమీక్షించారు. మార్చి 28 నుంచి మే 30 వరకు డెల్టా ఆధునికీకరణ పనుల నిమిత్తం కాలువల ద్వారా నీటి విడుదల ఆపేస్తామని చెప్పారు. జిల్లాలో ఆర్అండ్బి శాఖ ద్వారా రు.351 కోట్లతో 81 పనులను చేపట్టారని దానిలో రూ.121 కోట్లతో 31 పనులు పూర్తిచేయగా, 27 పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పదేపదే సమావేశాలు నిర్వహించినా పనులు మాత్రం జాప్యం చేస్తున్నారన్నారు. ఏలూరు, నరసాపురం, కొవ్వూరు డివిజన్ల ఆర్ అండ్ బీ సిబ్బంది పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లొద్దు జిల్లాలో రాబోయే వారం రోజుల్లో తుపాను సంభవించే అవకాశమున్న దృష్టా్య తీర ప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ భాస్కర్ ప్రకటనలో కోరారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, అవసరమైన సమచారాన్ని అందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 08812–230050 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందాలని సూచించారు. విరాళాలకు పన్ను లేదు సైనిక సంక్షేమ నిధికి విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉందని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు బుధవారం నగరంలోని సైనిక సంక్షేమ నిధికి విరాళాలు సేకరించారు. విరాళాలు అందించే దాతలు సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ బ్రాంచ్ ఖాతా నెంబర్ 33881128795లో జమచేయాలని సూచించారు. -
మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏలూరు కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేందుకు ఉపయోగపడతుందన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందటం ద్వారా నేడు అనేక భయంకర వ్యాధుల నుంచి విముక్తి లభించిందన్నారు. డీఈవో మధుసూధనరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించటమే కారణమన్నారు. విద్యార్థులు తార్కిక విధానంలో ఆలోచిస్తూ, తమలోని సృజనాత్మకతను జోడించాలని కోరారు. నగర మేయర్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రాంప్రసాద్, కార్పొరేటర్ చోడే వెంకటరత్నం, వైజ్ఞానిక ప్రదర్శనల కన్వీనర్ డీవీ రమణ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ’ప్రస్తుత సమాజంలో నగదు రహిత చెల్లింపుల పాత్ర’ అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యూటన్ గమన నియమం న్యూటన్ 3వ గమన నియమం వినియోగించి శక్తి సూత్రం ద్వారా యంత్రం ఎలా ముందుకు వెళుతుందో ప్రయోగం చేశాను. వ్యతిరేక దిశలో శక్తి వినియోగించినప్పుడు గమన నియమం వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించే రాకెట్స్లోనూ ఇదే శక్తి సూత్రాన్ని పాటిస్తారు. కేడీవీ ప్రసాద్ వర్మ, జెడ్పీహెచ్ఎస్, ఎన్ఆర్పీ అగ్రహారం ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ను నౌకల్లో రవాణా చేస్తారు. కొన్నిసార్లు ఆయిల్ నౌకలు దెబ్బతిని సముద్రంలో ఆయిల్ పడిపోతుంది. దీంతో సముద్రజలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ద్వారా ఆయిల్ను వెలికితీయవచ్చు. కె.శివలలిత, జెడ్పీహెచ్ఎస్, దెందులూరు రైల్ వైబ్రేషన్స్తో విద్యుత్ ప్రయాణిస్తోన్న రైలు వైబ్రేషన్స్ ద్వారా విద్యుత్ను తయారు చేసే అవకాశం ఉంది. రైలు పైన సిం«థటిక్ క్రిస్టల్స్తో పరికరాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఒత్తిడి చేస్తూ, రైలు వైబ్రేషన్స్తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్ను రైలు లోపల లైట్లు, ఫ్యాన్లకు వినియోగించుకోవచ్చు. ఎం.రవిశంకర్, ఎస్సీబీఎంహెచ్ఎస్, పాలకొల్లు వ్యర్థ జలాల శుద్ధీకరణ వ్యర్థ జలాలను శుద్దిచేస్తే రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థజలాలు సముద్రాల్లోకి వదిలివేయటం ద్వారా జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు వ్యర్థనీటిని శుద్ది చేయాలి. తొమ్మిది దశల్లో శుద్ధి చేస్తే సాధారణ అవసరాలకు సమస్య ఉండదు. జి.గీతిక, శర్వాణీ పబ్లిక్ స్కూల్, ఏలూరు కొల్లేరును కాపాడుకుందాం సహజసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరును భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రకృతి సంపదను, మత్స్యసంపద, పక్షి సంపదను కాపాడుకోవాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతిలో చేపల వేట చేయాలి. కొల్లేరును మనం భద్రం చేసి ఉంచాలి. సీహెచ్ గాయత్రి, కస్తూరిభా స్కూల్, ఏలూరు గోల్డెన్ రైస్ గోల్డెన్ రైస్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోటెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో మన రాష్ట్రంలోనూ తక్కువ ధరకే, తక్కువ నీటిని వినియోగించి గోల్డెన్ రైస్ను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో బీటా కెరోటిన్, బీ కెరోటిన్, విటమిన్స్ ఉన్నాయి. ఎస్.భాస్కర్ ప్రభాత్, సెయింట్ అలోషియస్, ఆకివీడు -
భూగర్భ జలాల అభివృద్ధికి నిధులు
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భ జలాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,500 కోట్లతో 1.24 లక్షల బోరుబావులు నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని రాష్ట్ర భూగర్భజల శాఖ డైరెక్టర్ కె.వేణుగోపాల్ చెప్పారు. పట్టణంలోని భూగర్భజల శాఖ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో భూగర్భజలాల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో భూగర్భజలాల వాడకం బాగా పెరిగిందని సమృద్ధిగా ఉండే జిల్లాలో కూడా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడం ప్రమాదకర పరిణామమని ఆయన చెప్పారు. గత మే నెలలో 19.08 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు వర్షాలు, పోలవరం కుడి కాలువ తదితర అంశాల వల్ల ప్రస్తుతం 17.01 మీటర్ల లోతులో ఉన్నాయన్నారు. ఆరునెలలతో పోలిస్తే 2 మీటర్లు భూగర్భజలాలు పెరిగినా గత నెలతో పోలిస్తే 0.53 మీటరు నీరు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 1.24 లక్షల బోరు బావులు నిర్మిస్తే అదనంగా 10 లక్షల ఎకరాలకు సేద్యపు నీరు అందుబాటులోకి తీసుకురాగాలని చెప్పారు. జిల్లాలో వినూత్న కార్యక్రమం కలెక్టర్ కాటంనేని భాస్కర్ ముందు చూపువల్ల రాష్ట్రంలోనే ప్రప్రథమంగా గోదావరి జలాలను భూగర్భంలోకి మళ్లించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వేణుగోపాల్ చెప్పారు. పెదవేగి మండలం జానంపేట సమీపంలోని జగన్నాథపురంలో రైతుల సహకారంతో భూగర్భ జలాలను పెంపొందించడానికి ప్రయోగాత్మకమైన కృషి ఫలిచిందనన్నారు. త్వరలోనే 15 బోర్లు ద్వారా గోదావరి జలాలను భూగర్భంలో భద్రపరుస్తామన్నారు. జగన్నాథపురం గ్రామంలో చిలకలపూడి నరేంద్ర అనే రైతు భూమిలో కోడూరు చెరువు ద్వారా పట్టిసీమ నీటిని మళ్లిచి ఆదర్శ రైతు పర్వతనేని బాబ్జి ఇంజక్షన్ బావికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ బావిని తాము పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశామన్నారు. భూగర్భ జలశాఖ ఉపసంచాలకుడు శ్రీనివాసరావు, జిల్లా ఉపసంచాలకుడు రంగారావు పాల్గొన్నారు. -
జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఏలూరు (మెట్రో) : జిల్లా ఎన్జీవో ఎన్నికల షెడ్యూల్ను తూర్పు, కృష్ణా జిల్లాలకు చెందిన ఎన్జీవో నాయకులు, జిల్లా ఎన్జీవో ఎన్నికల అధికారి ఉల్లి కృష్ణ శుక్రవారం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి ఇలా 15 పోస్టులతో కూడిన జిల్లా కమిటీకి సంబంధించి 25వ తేదీ మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన చేస్తారు. అనంతరం జాబితాను విడుదల చేస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే 26వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఇచ్చి 26న తుదిజాబితా ప్రకటిస్తారు. ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేష¯ŒS వస్తే 25నే నూతన జిల్లా ఎన్జీవో కమిటీని ప్రకటిస్తారు. నామినేషన్లు అధికంగా వస్తే డిసెంబర్ 4న మధ్యాహ్నం వరకూ ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని 15 తాలూకాలకు చెందిన 277 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేసులో రెవెన్యూశాఖ : జిల్లా ఎన్జీవో అధ్యక్ష పదవి కోసం జిల్లా రెవెన్యూ శాఖ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. ఇప్పటికే ఆ శాఖ తమ నుంచి ఏలూరు ఎన్జీవో తాలూకా కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించింది. అదే విధంగా పే అండ్ అకౌంట్స్, ఇరిగేష¯ŒS శాఖల నుంచి హరనాథ్, చోడగిరి శ్రీనివాసరావు కూడా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. -
ప్రశాంతంగా పోలీస్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష
ఏలూరు అర్బ న్భీమవరం టౌ న్ : జిల్లాలో పోలీస్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులో 20, భీమవరంలో 18 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్, అడిషనల్ ఎస్పీ ఎ న్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు. -
5 నుంచి పీడీఎస్యూ మహాసభలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా 14వ మహాసభలు ఈనెల 5,6 తేదీల్లో నిర్వహించనున్నామని సంఘ అధ్యక్షుడు ఈ.భూషణం తెలిపారు. బుధవారం స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పీడీఎస్యూకు గణనీయమైన చరిత్ర ఉందని, పట్టణ, మండల స్థాయి నాయకులు దీనిని కొనసాగిస్తూ విద్యార్థులతో మమేకమై విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు -
సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై కేసు
ఏలూరు అర్బన్ : ప్రభుత్వ సొమ్ము కాజేసిన కాంట్రాక్టు ఉద్యోగిపై త్రీటౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. సిరిగిరి వెంకట శివనాగప్రసాద్ జంగారెడ్డిగూడెంలోని ఉద్యానవనశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఎ.దుర్గేష్ బ్యాంకులో శాఖ పేరిట జమ చేయాలని రూ.11,45,251 విలువైన బేరర్ చెక్ను వెంకట శివనాగ ప్రసాద్కు ఇచ్చారు. ఆ చెక్ను మార్చుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగి దాదాపు రూ.రెండు లక్షలు కాజేసి మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేశాడు. దీనిని గుర్తించిన ఏడీ దుర్గేష్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకట శివనాగ ప్రసాద్పై మంగళవారం మోసం కేసు నమోదు చేశారు. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి టీటీ పోటీలు
గోపన్నపాలెం (దెందులూరు): అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం నుంచి 6వ తేదీ వరకు ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి పీవీకేడీ ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా టేబుల్టెన్నిస్ అసోసియేషన్, సీఆర్ఆర్ విద్యాసంస్థలు సంయుక్తంగా పోటీలు నిర్వహించనున్నాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు, 10 మంది అఫీషియల్స్, కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు. 5 కేటగిరీలుగా పోటీలు మహిళలు, పురుషులు వయో పరిమితి లేదు. యువజనులు మహిళలు, పురుషులు 21 ఏళ్లలోపు జూనియర్ బాలబాలికలు 18 ఏళ్లలోపు సబ్ జూనియర్ బాలబాలికలు 15 ఏళ్లలోపు క్యాడెట్ బాలబాలికలు 11 ఏళ్లలోపు పై కేటగిరీల్లో వ్యక్తిగత పోటీలు నిర్వహిస్తారు. టీమ్ చాంపియన్షిప్ పురుషులు, మహిళలు, జూనియర్ బాలుర విభాగంలో పోటీలు జరుగుతాయి. అన్ని కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్, నగదు బహుమతులు అందిస్తారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి, బాలురకు వట్లూరు కళాశాల సూర్య హాస్టల్ నందు, బాలికలకు సీఆర్ఆర్ మహిళా కళాశాలలో, టెక్నికల్ అఫిషియల్కు ఏలూరు విద్యానగర్లో, సోషల్ సర్వీస్ సెంటర్ నందు ఏర్పాట్లు చేశారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేస్తారు. దాతల సాయం జిల్లా జట్టుకు, టెక్నికల్ అఫిషియల్స్కు యూనిఫాంను కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అధినేత కొమ్మారెడ్డి రాంబాబు అందించనున్నారు. విజేతలకు నగదు బహుమతిని ఏలూరు క్లబ్ (టౌన్హాల్) స్పాన్సర్ చేస్తున్నారు. స్టాగ్ కంపెనీ నాలుగు అంతర్జాతీయ టేబుల్స్ను స్పాన్సర్ చేస్తోంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, చీఫ్ ప్యాట్రన్ ఉప్పలపాటి శ్రీరాంప్రసాద్ పోటీలను పర్యవేక్షిస్తారు. -
రేపటి నుంచి రాష్ట్రస్థాయి టీటీ పోటీలు
గోపన్నపాలెం (దెందులూరు): అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం నుంచి 6వ తేదీ వరకు ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి పీవీకేడీ ప్రసాద్ చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా టేబుల్టెన్నిస్ అసోసియేషన్, సీఆర్ఆర్ విద్యాసంస్థలు సంయుక్తంగా పోటీలు నిర్వహించనున్నాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు, 10 మంది అఫీషియల్స్, కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు. 5 కేటగిరీలుగా పోటీలు మహిళలు, పురుషులు వయో పరిమితి లేదు. యువజనులు మహిళలు, పురుషులు 21 ఏళ్లలోపు జూనియర్ బాలబాలికలు 18 ఏళ్లలోపు సబ్ జూనియర్ బాలబాలికలు 15 ఏళ్లలోపు క్యాడెట్ బాలబాలికలు 11 ఏళ్లలోపు పై కేటగిరీల్లో వ్యక్తిగత పోటీలు నిర్వహిస్తారు. టీమ్ చాంపియన్షిప్ పురుషులు, మహిళలు, జూనియర్ బాలుర విభాగంలో పోటీలు జరుగుతాయి. అన్ని కేటగిరీల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన క్రీడాకారులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్, నగదు బహుమతులు అందిస్తారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి, బాలురకు వట్లూరు కళాశాల సూర్య హాస్టల్ నందు, బాలికలకు సీఆర్ఆర్ మహిళా కళాశాలలో, టెక్నికల్ అఫిషియల్కు ఏలూరు విద్యానగర్లో, సోషల్ సర్వీస్ సెంటర్ నందు ఏర్పాట్లు చేశారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపికచేస్తారు. దాతల సాయం జిల్లా జట్టుకు, టెక్నికల్ అఫిషియల్స్కు యూనిఫాంను కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అధినేత కొమ్మారెడ్డి రాంబాబు అందించనున్నారు. విజేతలకు నగదు బహుమతిని ఏలూరు క్లబ్ (టౌన్హాల్) స్పాన్సర్ చేస్తున్నారు. స్టాగ్ కంపెనీ నాలుగు అంతర్జాతీయ టేబుల్స్ను స్పాన్సర్ చేస్తోంది. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమ్మారెడ్డి రాంబాబు, చీఫ్ ప్యాట్రన్ ఉప్పలపాటి శ్రీరాంప్రసాద్ పోటీలను పర్యవేక్షిస్తారు. -
మరిన్ని డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
ఏలూరు సిటీ : జిల్లాలో మరిన్ని డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావును కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. గురువారం వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, ఏలూరులలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, తణుకులో కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వాటితో పాటు జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరులో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. జిల్లాలో మాతా శిశు మరణాలు, ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతమంది గర్భిణులు ప్రసవిస్తున్నారు, ఎంతమంది పిల్లలు మరణిస్తున్నారనే వివరాలను కచ్చితంగా సేకరించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్స్ తదితర వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో కె.కోటేశ్వరిని ఆదేశించారు. అంగన్వాడీ చిన్నారులకు నూతన విద్యావిధానం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు నీతికథలు, సూక్తులు తెలియచేసి వారిలో చదువుపై ఆసక్తి పెంచే నూతన విద్యను అందించేందుకు ప్రత్యేక నీతి కథలు పుస్తకాన్ని 15 రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో విద్యాశాఖా పనితీరుపై అధికారులతో సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలంటే కోడిగుడ్డు, అన్నం పెట్టే శిబిరాలుగా మాత్రమే చూడవద్దని చిన్న వయసు నుంచే నీతికథలు బోధించి వారిని ఆకట్టుకునే రీతిలో విద్య అందించాలని కలెక్టర్ కోరారు. 15న అంతర్జాతీయ హ్యాండ్వాష్ 15న ప్రపంచ వ్యాప్తంగా చేతులు పరిశుభ్రపరిచే దినోత్సవాన్ని జరుపుతున్న దృష్ట్యా ప్రతి పాఠశాలలోనూ ఈ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 435 హైస్కూల్స్లో పూర్తి స్థాయిలో కంప్యూటర్లను ఏర్పాటు చేసి 7,200 మంది ఉపాధ్యాయులు విధిగా బయోమెట్రిక్ హాజరు వేసేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు జేసీ ఎంహెచ్. షరీఫ్, డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ పీవో వి.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనకు రుణాలు
ఏలూరు (మెట్రో): జిల్లాలో పేదరిక నిర్మూలనకు వివిధ కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అందించేందుకు ఈనెల 18వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించాలని, తర్వాత ఆన్లైన్ నిలిపివేస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఎస్సీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల అధికారులతో రుణాల మంజూరు తీరుపై సమీక్షించారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 63 వేలకు చేరిందని కలెక్టర్ చెప్పారు. దరఖాస్తు గడువును పెం^è మని, దశల వారీగా అర్హులందరికీ రుణాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాపు రుణమేళాలు నిర్వహించామని, తాడేపల్లిగూడెం, చింతలపూడి, ఉండి నియోజకవర్గాల పరిధిలో కాపు రుణమేళాలు నిర్వహించి లబ్ధిదారులకు యూనిట్లను అందిస్తే జిల్లా అంతటా కాపులకు పెద్ద ఎత్తున రుణాలు అందించిన ఘనత జిల్లాకు దక్కుతుందని చెప్పారు. దసరా తర్వాత పెద్ద ఎత్తున వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణమేళాలు నిర్వహించి లబ్ధిదారులకు యూనిట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. ఏజేసీ షరీఫ్, లీడ్బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి, మైనారిటీ కార్పొరేషన్ అధికారి శాస్త్రి, బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధి కామేష్ పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేస్తామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం విద్యాశాఖ ప్రగతి తీరుపై సమీక్షించారు. సమాజానికి పనికొచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలే తప్ప పాస్ కోసం మాస్ కాపీయింగ్ను ప్రోత్సహించవద్దని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జిల్లాలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యతో పాటు వివిధ వత్తుల్లో నైపుణ్యం పెంచేలా కొత్త కోర్సులను అమలు చేస్తామని తెలిపారు. టెన్త్ ఫలితాల్లో జిల్లాకు రాష్ట్రంలో ఆఖరి స్థానం వచ్చినా పర్వాలేదు గాని కాపీలను ప్రోత్సహించవద్దని సూచించారు. డీఈవో మధుసూదనరావు, ఎస్ఎస్ఏ పీవో బ్రహ్మానందరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి ఉదయ్కుమార్, ఏవోఈలు పాల్గొన్నారు. హాస్టళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారులు ఏలూరు (మెట్రో): ప్రతి మండలంలోని హాస్టళ్లలో పరిశుభ్రత, వసతుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా జిల్లా అధికారులను నియమించనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులతో సమీక్షించారు. సంక్షేమ, రెసిడెన్షియల్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలతోపాటు పరిశుభ్రత పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ను ఆదేశించారు. అధికారులు తప్పనిసరిగా హాస్టళ్లను సందర్శించి డార్మెటరీలో ఫ్యాన్, లైట్, దోమల నెట్, టాయిలెట్, తాగునీరు, శానిటేషన్పై ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ఫొటోలు అప్లోడ్ చేయాలన్నారు. దసరా సెలవుల అనంతరం తాను హాస్టళ్లను తనిఖీ చేస్తానని ఏ ఒక్కటి లేకున్నా సంబంధితాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ సోషల్వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, జిల్లా వెనుకబడినసంక్షేమాధికారి లక్ష్మీప్రసాద్, ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరెడ్డి, మైనార్ట సంక్షేమశాఖ జిల్లా అధికారి హెచ్విఎస్ మూర్తి పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చట్టం అమలు చేయండి జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వైద్యారోగ్యశాఖాధికారులను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎన్ని ప్రై వేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ఎన్ని స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి, అక్కడకు ఎంత మంది వెళ్లి స్కానింగ్ చేయించుకుంటున్నారనే వివరాలు ఉన్నాయా అని డీఎంహెచ్వోను ప్రశ్నించారు. లింగనిర్ధారణపై సరైన తనిఖీలు లేకపోవడం వల్లే జిల్లాలో ఇప్పటివరకూ ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు. డీఎంహెచ్వో కె.కోటేశ్వరి, డీసీహెచ్ఎస్ శంకరరావు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
తమ్మిలేరును అభివృద్ధి చేయండి
ఏలూరు (మెట్రో) : తమ్మిలేరులో గుర్రపుడెక్క, తూడు తొలగించి తమ్మిలేరును అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల వద్ద తమ్మిలేరును ఆయన పరిశీలించారు. తమ్మిలేరులో గుర్రపుడెక్క, తూడు తొలగించే పనులను పరిశీలించారు. తమ్మిలేరు వల్ల గతంలో ఏలూరు ముంపునకు గురైన పరిస్థితుల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా తమ్మిలేరును వెడల్పు చేసి నీరు సక్రమంగా పారుదల జరిగేలా చూడాలని ఆదేశించారు. తమ్మిలేరు మురికి కూపంగా కాకుండా సేద్యపు నీటిని అందించే ఒక ప్రధాన కాలువగా తీర్చిదిద్దాలని దీని కోసం ఎన్ని నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు. సురేష్ చంద్ర బహుగుణ పేరిట నిర్వహిస్తున్న పోలీస్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల అభివృద్ధికి రూ. 25 లక్షలు తక్షణ గ్రాంటుగా ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. -
చైల్డ్ ఇన్ఫో నమోదుకు 26 వరకు అవకాశం
ఏలూరు సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చైల్డ్ ఇన్ఫో నమోదుకు ఈ నెల 26వ తేది వరకు చివరి అవకాశం ఇచ్చినట్టు డీఈవో డి.మధుసూదనరావు గురువారం తెలిపారు. జిల్లాలో 5.40 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా ఇప్పటివరకు 4.40 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చైల్డ్ ఇన్ఫోలో నమోదయ్యారని, ఇంకా లక్ష మంది విద్యార్థులు నమోదు కావాల్సి ఉందని వారిలో 30 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 70 వేల మంది ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారని తెలిపారు. గడువు తేదిలోపు నూరు శాతం అప్లోడ్ చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థుల వివరాలు నమోదు చేయని ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ విద్యా సంస్థలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు వాయిదా ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడ బిషప్ గ్రేసీ హైస్కూల్లో నిర్వహించాల్సిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు వాయిదా వేసినట్లు తెలిపారు. అక్టోబర్ 5, 6 తేదీల్లో అదే వేదికగా కళా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 24న నిర్వహించాల్సిన ఇంగ్లిష్–1 సమ్మెటివ్ పరీక్షను వాయిదా వేసినట్టు డీఈవో తెలిపారు. -
హేండ్బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు రూరల్ : వచ్చేనెల 1, 2 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొనే జిల్లా హేండ్బాల్ జూనియర్ జట్టును జిల్లా హేండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్ఎం లెనిన్, టి.కొండలరావు బుధవారం ప్రకటించారు. మంగళవారం ఏలూరు ఇండోర్స్టేడియంలో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. జిల్లా జట్టు ఇదే.. ఎం.సుకుమార్, ఎ.చందు, ఎస్కే కాశీం(కేపీడీటీ, ఏలూరు), ఇ.ప్రవీణ్, బి.సాయికుమార్, డి.చంటి, కె.పండు, టి.గణేష్(ఎస్పీడీటీ, ఏలూరు), బి.వెంకటేశ్వరరావు (సింగన్నగూడెం), పి.ముకుల్ జీ(టీపీగూడెం), కె.శ్రీను, ఎం.శివకష్ణ(భీమడోలు), ఎ.శ్రీ హర్ష(బుట్టాయిగూడెం), కె.ఆకాష్(కోపల్లి), డి.ప్రశాంత్( ఏలూరు పోలీస్ స్కూల్), జి.జయరాజు (ఆకివీడు), స్టాండ్బైగా కె.సునీల్కుమార్, పి.సాల్మన్రాజు, బి.వెంకటేష్, ఎం.వెంకటేష్ ఎంపికయ్యారు. -
ఓంశాంతి శాంతి శాంతిః
ఏలూరు సిటీ : ‘సత్యం, అహింస’ ఆయుధాలుగా శాంతిమార్గంలో పయనించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్ముడు నడిచిన నేల ఇది. మువ్వన్నెల జాతీయ పతకంలోనూ శాంతికి ప్రతీకగా శ్వేతవర్ణాన్ని చేర్చిన ఘనత మన భారతదేశానిది. ప్రపంచశాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ అనే ఆధునిక సాంస్కృతిక కళా ప్రదర్శన చేశారు. బుధవారం స్థానిక ఫైర్స్టేషన్ సెంటరులో సుమారు 800 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతమాతకు, మహాత్మాగాంధీకి వందన సమర్పణ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శాంతి స్థాపనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నారాయణ విద్యా సంస్థల డీజీఎం ఎంవీఎస్ బ్రహ్మాజీ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో శాంతి స్థాపనకు కృషి చేసి అసువులు బాసిన పోలీసు ఉన్నతాధికారుల చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుందన్నారు. ప్రజలంతా శాంతి, ఐక్యతతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాళ్లు డి.సునీల్కుమార్, కె.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఓంశాంతి శాంతి శాంతిః
ఏలూరు సిటీ : ‘సత్యం, అహింస’ ఆయుధాలుగా శాంతిమార్గంలో పయనించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్ముడు నడిచిన నేల ఇది. మువ్వన్నెల జాతీయ పతకంలోనూ శాంతికి ప్రతీకగా శ్వేతవర్ణాన్ని చేర్చిన ఘనత మన భారతదేశానిది. ప్రపంచశాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు ఫ్లాష్ మాబ్ అనే ఆధునిక సాంస్కృతిక కళా ప్రదర్శన చేశారు. బుధవారం స్థానిక ఫైర్స్టేషన్ సెంటరులో సుమారు 800 మంది విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించారు. భారతమాతకు, మహాత్మాగాంధీకి వందన సమర్పణ దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శాంతి స్థాపనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నారాయణ విద్యా సంస్థల డీజీఎం ఎంవీఎస్ బ్రహ్మాజీ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో శాంతి స్థాపనకు కృషి చేసి అసువులు బాసిన పోలీసు ఉన్నతాధికారుల చిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుందన్నారు. ప్రజలంతా శాంతి, ఐక్యతతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం వేణుగోపాల్, కళాశాల ప్రిన్సిపాళ్లు డి.సునీల్కుమార్, కె.నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీసుల పిల్లలు మరిన్ని విజయాలు సాధించాలి
ఏలూరు అర్బన్ : పోలీసుల పిల్లలు అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, విజయాలను చూసి గర్వపడుతున్నానని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ అన్నారు. డాక్టర్ టి.వెంకటేశ్వరరావు, టి.ప్రభాకరరావులు తమ తండ్రి జ్ఞాపకార్థం స్థానిక సురేష్ బహుగుణ పోలీస్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ప్రతిభ చూపిన వారికి ఏటా నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు భాస్కర్భూషణ్ చేతులమీదుగా విద్యార్థులకు నగదు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల పిల్లలు మరింతగా శ్రమించి భవిష్యత్లో మరిన్ని విజయాలు నమోదు చేయాలని, పోలీస్ శాఖకు వన్నె తేవాలని ఆకాంక్షించారు. అందుకోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. పిల్లల విజయంలో తోడ్పాటు అందించిన పాఠశాల ఆధ్యాపకులు, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న పూర్వ విద్యార్థుల యోచన ఆదర్శనీయమన్నారు. ఆర్.కీర్తి (పదో తరగతి). కె.గణే ష్ (పదో∙తరగతి), కె.ఆంజనేయులు (ఇంటర్), ఎస్ఎల్సీ సాయికుమార్ (ఇంటర్)లకు రూ.10,000, జేవీ.శివకుమార్, బి.సౌజన్యలకు రూ.2,500 నగదు అందించారు. ఏఆర్ డీఎస్పీ బి.చంద్రశేఖర్, ఆర్ఐ ఎ.వెంకట్రావు పాల్గొన్నారు. -
పేదలకు హామీగా ఉంటా.. రుణాలివ్వండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో పేదలకు హామీ నేనే ఇస్తా.. రుణాలిచ్చి ఆదుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాంకర్లను కోరారు. కలెక్టరేట్లో ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల రుణాల జారీ తీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ చింతలపూడి చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంకు, జంగారెడ్డిగూడెం సహకార కేంద్ర బ్యాంకు అధికారులు హామీ ఇస్తేనే గాని ఎస్సీలకు రుణాలు ఇవ్వలేమని చెబుతున్నారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పేదలకు రుణాలందించడంలో ఏ బ్యాంకు అయినా హామీ కావాలంటే వారందరికీ నేనే హామీ ఇస్తా.. జిల్లాలో ఏ ఒక్క పేద కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా రుణాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఏ బ్యాంకుకు హామీ కావాలన్నా వారంతా హామీ పత్రం తీసుకువస్తే క్షణాల్లో సంతకం చేస్తానని చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా బ్యాంకర్లు వ్యవహరిస్తున్నారని వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ చేసినప్పటికీ రుణాలివ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రుణాలు పొందిన వారిలో 93 శాతం ప్రజలు నిజాయితీగా తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకర్లకు జమ చేశారని, కేవలం 7 శాతం మంది మాత్రమే తీసుకున్న రుణాన్ని చెల్లించలేదన్నారు. హామీ కావాలని కోరిన చింతలపూడి చైతన్య గ్రామీణ బ్యాంకు, జంగారెడ్డిగూడెం సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచి మేనేజర్లను సాయంత్రం 5 గంటల్లోగా హామీ పత్రాలు తీసుకుని తనను కలవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఝాన్సీరాణి పాల్గొన్నారు. వారానికి ఐదు పాఠశాలలు తనిఖీ చేస్తా ఏలూరు సిటీ : జిల్లాలో అమలు చేస్తోన్న అన్ని విద్యాభివృద్ధి కార్యక్రమాలు యథాతథంగా అమలు చేయాలి. ప్రభుత్వ బడుల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఈవో డి.మధుసూదనరావును ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏ–1, 2 గ్రేడుల్లో కేవలం 6.7 శాతం మందే ఉన్నారని, కనీసం పుస్తకం తీసి చదవలేని విద్యార్థులు 37 శాతం మంది ఉన్నారన్నారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎంతో మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు. తాను వారానికి ఐదు పాఠశాలలు తనిఖీలు చేస్తానని, 5వ తరగతి పిల్లలను 4వ తరగతికి సంబంధించిన పాఠాల్లోని అంశాలను అడుగుతానని, విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోతే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేడు గురువులకు సత్కారం
ఏలూరు సిటీ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ సేవలు అందిస్తోన్న జిల్లాలోని 56 మంది ఉపాధ్యాయులను ఉత్తమ గురువులుగా సత్కరించనున్నారు. ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కాటంనేని భాస్కర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు చేతులమీదుగా అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు : నంబూరి రాంబాబు, ఎస్జీటీ, బూరాయిగూడెం(ఏలూరు మండలం), ఎం.సుధాకర్, ఎస్జీటీ, పూళ్ల(భీమడోలు మండలం), టీఎల్.నరసింహమూర్తి, ఎస్ఏ, అర్థవరం(గణపవరం మండలం), సీహెచ్ విజయలక్ష్మి, హెచ్ఎం, భీమలాపురం(ఆచంట మండలం), ఎస్.సాల్మన్రాజు ఎల్ఎఫ్ఎల్(రిటైర్డ్), కలవచర్ల(నిడదవోలు). వీరు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సీఎం, విద్యామంత్రి గంటా చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. జిల్లా ఉత్తమ గురువులు వీరే : ప్రధానోపాధ్యాయులు– పి.రాము( జెడ్పీహెచ్ఎస్, పెన్నాడ), ఆర్.కేజీయమ్మ(జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), బీఎస్ కాళహస్తీశ్వరుడు(జెడ్పీహెచ్ఎస్, పైడిపర్రు), కేఎన్వీ గణేష్ (జీహెచ్ఎస్, గోపన్నపాలెం), కేఎల్ఎన్ సింగ్(జెడ్పీహెచ్ఎస్, వీరమ్మకుంట), టి.సత్యనారాయణ మూర్తి (జెడ్పీహెచ్ఎస్, చినమిరం), రోస్లీన్ (జెడ్పీహెచ్ఎస్, కొవ్వలి), టి.గుణరామ్ (జెడ్పీహెచ్ఎస్, వైవీ లంక), జి.శిఖామణి (జెడ్పీహెచ్ఎస్, జీ.పంగిడిగూడెం), పీఎస్ఆర్ చౌదరి (రిటైర్డ్ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, కొమ్ముగూడెం), స్కూల్ అసిస్టెంట్స్ : వీవీ సుబ్బారావు (జెడ్పీహెచ్ఎస్, తాడిపర్రు), పి.సాయిబాబు (జెడ్పీహెచ్ఎస్, భీమడోలు), పీవీఎస్ రవి ప్రసాద్ (జెడ్పీహెచ్ఎస్, వడలూరు), సీహెచ్ శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్, కొడమంచిలి), ఐ.శ్రీనివాసరావు (జీహెచ్ఎస్, ఏలూరు), కేఎస్వీఎస్ రాజ్కుమార్ (జెడ్పీహెచ్ఎస్, విజయరాయ్), సీహెచ్ శేషావతారం (ఎంపీయూపీ, కావలిపురం), పీఎస్ నాగేశ్వరరావు (జెడ్పీహెచ్ఎస్, రావిపాడు ), జి.విజయకుమార్ (జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), కె.విల్సన్రాజు (జెడ్పీహెచ్ఎస్, అడవికొలను), జి.సత్యనారాయణ (జెడ్పీహెచ్ఎస్, కొప్పాక), పీవీ నాగమౌళి (ఎంపీయూపీ, పుట్లగట్లగూడెం), జేఎస్కే బాలాజీ(జెడ్పీహెచ్ఎస్, విజయరాయి), బి.నరసమ్మ (జీహెచ్ఎస్,పోలవరం), ఎంవీ సుబ్బరాజు(ఎంపీయూపీ, స్కిన్నెరపురం), ఎస్వీఎస్ సోమయాజులు(సుబ్బమ్మదేవీ స్కూల్, ఏలూరు), వీఎం రాధాకృష్ణ(పీఎస్ఎంజీఎస్, నరసాపురం), రాధాకృష్ణ (జెడ్పీహెచ్ఎస్, బ్రాహ్మణగూడెం), టి.రామకృష్ణ(జెడ్పీహెచ్ఎస్, వెస్ట్ విప్పర్రు), లీలాకుమార్ (జెడ్పీహెచ్ఎస్, జి.పంగిడిగూడెం), పి.భోగేశ్వరి (సిద్ధార్థ హైస్కూల్, వట్లూరు), జి.శ్యామల (సెయింట్ థెరిస్సా హైస్కూల్), ఎం.సుబ్బారావు(జెడ్పీహెచ్ఎస్, బుట్టాయిగూడెం), ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం : కాజా శేషుబాబు (జెడ్పీహెచ్ఎస్, జంగారెడ్డిగూడెం), కె.ఆదినారాయణ మూర్తి(ఎంపీపీఎస్, కొత్త పట్టిసీమ), జీవీ సూరపరాజు (ఎంపీపీఎస్, ఎస్.పేట), కె.వాజునందన్(ఎంపీపీఎస్, ఈస్ట్ఎడవల్లి), డి.పద్మావతి(ఎంపీపీఎస్, వేములపల్లి). ఎస్జీటీ : జీవీఎస్ బాలేశ్వరి(ఎంపీపీఎస్, కైకరం), ఎన్.సురేష్బాబు(ఎంపీపీఎస్, ఎలమంచిలి), జి.రాజారత్నం (ఎంపీపీఎస్, తాళ్లపూడి), పీవీఆర్ మోహనరావు (ఎంపీపీఎస్, గుండుగొలను), ఎస్.వెంకటప్పయ్య (ఎంపీపీఎస్, లింగపాలెం), ఎన్.తిరుపతి (ఎంపీపీఎస్, ఆచంట), టీఎస్ రత్నకుమారి (ఎంపీపీఎస్, లక్ష్మీపురం), బి.శ్రీనివాసరావు (ఎంపీపీఎస్,దువ్వ), కె.రమేష్(ఎంపీపీఎస్,బల్లిపాడు), వోఎన్ఎస్ ప్రసాద్ (ఎంపీపీఎస్,రౌతుగూడెం), ఎంవీ కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్,వెలగదుర్రు), కె.లలిత కుమారి (ఎంపీపీఎస్,నిడమర్రు), ఎన్.ఆనంద్ (ఎంపీపీఎస్,కొమ్ముగూడెం), సీహెచ్ నరసింహరావు (ఎంపీపీఎస్,గణపవరం), బాలాజీ (ఎంపీపీఎస్,వకలగరువు), కె.మంగతాయారు (ఎంపీపీఎస్,ఉండి), ఎన్.అన్నపూర్ణమ్మ(ఆర్సీఎం, తెడ్లం), ఎస్.భాస్కర్(జీహెచ్ఎస్, కొవ్వూరు). -
నేడు గురువులకు సత్కారం
ఏలూరు సిటీ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ సేవలు అందిస్తోన్న జిల్లాలోని 56 మంది ఉపాధ్యాయులను ఉత్తమ గురువులుగా సత్కరించనున్నారు. ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కలెక్టర్ కాటంనేని భాస్కర్, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు చేతులమీదుగా అవార్డులు అందజేస్తారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు : నంబూరి రాంబాబు, ఎస్జీటీ, బూరాయిగూడెం(ఏలూరు మండలం), ఎం.సుధాకర్, ఎస్జీటీ, పూళ్ల(భీమడోలు మండలం), టీఎల్.నరసింహమూర్తి, ఎస్ఏ, అర్థవరం(గణపవరం మండలం), సీహెచ్ విజయలక్ష్మి, హెచ్ఎం, భీమలాపురం(ఆచంట మండలం), ఎస్.సాల్మన్రాజు ఎల్ఎఫ్ఎల్(రిటైర్డ్), కలవచర్ల(నిడదవోలు). వీరు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో సీఎం, విద్యామంత్రి గంటా చేతులమీదుగా అవార్డులు అందుకోనున్నారు. జిల్లా ఉత్తమ గురువులు వీరే : ప్రధానోపాధ్యాయులు– పి.రాము( జెడ్పీహెచ్ఎస్, పెన్నాడ), ఆర్.కేజీయమ్మ(జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), బీఎస్ కాళహస్తీశ్వరుడు(జెడ్పీహెచ్ఎస్, పైడిపర్రు), కేఎన్వీ గణేష్ (జీహెచ్ఎస్, గోపన్నపాలెం), కేఎల్ఎన్ సింగ్(జెడ్పీహెచ్ఎస్, వీరమ్మకుంట), టి.సత్యనారాయణ మూర్తి (జెడ్పీహెచ్ఎస్, చినమిరం), రోస్లీన్ (జెడ్పీహెచ్ఎస్, కొవ్వలి), టి.గుణరామ్ (జెడ్పీహెచ్ఎస్, వైవీ లంక), జి.శిఖామణి (జెడ్పీహెచ్ఎస్, జీ.పంగిడిగూడెం), పీఎస్ఆర్ చౌదరి (రిటైర్డ్ హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, కొమ్ముగూడెం), స్కూల్ అసిస్టెంట్స్ : వీవీ సుబ్బారావు (జెడ్పీహెచ్ఎస్, తాడిపర్రు), పి.సాయిబాబు (జెడ్పీహెచ్ఎస్, భీమడోలు), పీవీఎస్ రవి ప్రసాద్ (జెడ్పీహెచ్ఎస్, వడలూరు), సీహెచ్ శ్రీనివాస్ (జెడ్పీహెచ్ఎస్, కొడమంచిలి), ఐ.శ్రీనివాసరావు (జీహెచ్ఎస్, ఏలూరు), కేఎస్వీఎస్ రాజ్కుమార్ (జెడ్పీహెచ్ఎస్, విజయరాయ్), సీహెచ్ శేషావతారం (ఎంపీయూపీ, కావలిపురం), పీఎస్ నాగేశ్వరరావు (జెడ్పీహెచ్ఎస్, రావిపాడు ), జి.విజయకుమార్ (జెడ్పీహెచ్ఎస్, తాడేపల్లిగూడెం), కె.విల్సన్రాజు (జెడ్పీహెచ్ఎస్, అడవికొలను), జి.సత్యనారాయణ (జెడ్పీహెచ్ఎస్, కొప్పాక), పీవీ నాగమౌళి (ఎంపీయూపీ, పుట్లగట్లగూడెం), జేఎస్కే బాలాజీ(జెడ్పీహెచ్ఎస్, విజయరాయి), బి.నరసమ్మ (జీహెచ్ఎస్,పోలవరం), ఎంవీ సుబ్బరాజు(ఎంపీయూపీ, స్కిన్నెరపురం), ఎస్వీఎస్ సోమయాజులు(సుబ్బమ్మదేవీ స్కూల్, ఏలూరు), వీఎం రాధాకృష్ణ(పీఎస్ఎంజీఎస్, నరసాపురం), రాధాకృష్ణ (జెడ్పీహెచ్ఎస్, బ్రాహ్మణగూడెం), టి.రామకృష్ణ(జెడ్పీహెచ్ఎస్, వెస్ట్ విప్పర్రు), లీలాకుమార్ (జెడ్పీహెచ్ఎస్, జి.పంగిడిగూడెం), పి.భోగేశ్వరి (సిద్ధార్థ హైస్కూల్, వట్లూరు), జి.శ్యామల (సెయింట్ థెరిస్సా హైస్కూల్), ఎం.సుబ్బారావు(జెడ్పీహెచ్ఎస్, బుట్టాయిగూడెం), ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం : కాజా శేషుబాబు (జెడ్పీహెచ్ఎస్, జంగారెడ్డిగూడెం), కె.ఆదినారాయణ మూర్తి(ఎంపీపీఎస్, కొత్త పట్టిసీమ), జీవీ సూరపరాజు (ఎంపీపీఎస్, ఎస్.పేట), కె.వాజునందన్(ఎంపీపీఎస్, ఈస్ట్ఎడవల్లి), డి.పద్మావతి(ఎంపీపీఎస్, వేములపల్లి). ఎస్జీటీ : జీవీఎస్ బాలేశ్వరి(ఎంపీపీఎస్, కైకరం), ఎన్.సురేష్బాబు(ఎంపీపీఎస్, ఎలమంచిలి), జి.రాజారత్నం (ఎంపీపీఎస్, తాళ్లపూడి), పీవీఆర్ మోహనరావు (ఎంపీపీఎస్, గుండుగొలను), ఎస్.వెంకటప్పయ్య (ఎంపీపీఎస్, లింగపాలెం), ఎన్.తిరుపతి (ఎంపీపీఎస్, ఆచంట), టీఎస్ రత్నకుమారి (ఎంపీపీఎస్, లక్ష్మీపురం), బి.శ్రీనివాసరావు (ఎంపీపీఎస్,దువ్వ), కె.రమేష్(ఎంపీపీఎస్,బల్లిపాడు), వోఎన్ఎస్ ప్రసాద్ (ఎంపీపీఎస్,రౌతుగూడెం), ఎంవీ కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్,వెలగదుర్రు), కె.లలిత కుమారి (ఎంపీపీఎస్,నిడమర్రు), ఎన్.ఆనంద్ (ఎంపీపీఎస్,కొమ్ముగూడెం), సీహెచ్ నరసింహరావు (ఎంపీపీఎస్,గణపవరం), బాలాజీ (ఎంపీపీఎస్,వకలగరువు), కె.మంగతాయారు (ఎంపీపీఎస్,ఉండి), ఎన్.అన్నపూర్ణమ్మ(ఆర్సీఎం, తెడ్లం), ఎస్.భాస్కర్(జీహెచ్ఎస్, కొవ్వూరు). -
పేద విద్యార్థుల అభ్యున్నతి లక్ష్యం
ఏలూరు సిటీ : ‘జిల్లా విద్యారంగాన్ని గాడిలో పెట్టి పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు బేస్మెంట్ తరహా పరీక్షలు పెట్టాం తప్ప సొంత అజెండా కానీ, ఉపాధ్యాయులను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనా కాని లేదు’ అని జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక డీఈవో కార్యాలయంలోని ఆయన చాంబర్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయటంతోనే గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యారంగంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో చేపట్టిన సర్వేలో 6వ తరగతి విద్యార్థులకు సైతం అక్షరాలు, కూడికలు రాని పరిస్థితి ఉందని తేలిందని, దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్య అందించాలని.. విద్యార్థుల కనీస అభ్యసనా సామర్థ్యాలను మదింపు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో 1,14,590 మందికి కామన్ పరీక్ష నిర్వహిస్తే వారిలో 72,717 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 36.54 శాతం విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని గుర్తించామన్నారు. మొత్తంగా సీ, డీ గ్రేడుల్లో 58 శాతం మంది విద్యార్థులు ఉన్నారని వీరి కోసమే బేస్మెంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. బడిగంటల కార్యక్రమం ద్వారా పాఠశాలల్లోని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి.. పదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంటే, ప్రై వేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయని డీఈవో తెలిపారు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు ఆకర్షించి, ఉపాధ్యాయులపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామని డీఈవో చెప్పారు. గత పదేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 1.70 లక్షల మంది పిల్లలు ప్రై వేట్ పాఠశాలలకు Ðð ళ్లిపోయారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 10 మంది కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 113 వరకూ ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలు బలహీనం కాకూడదనే సంకల్పంతోనే కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, నిపుణులైన ఉపాధ్యాయులు ఉండటంతో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నామని డీఈవో మధుసూదనరావు వివరించారు. -
కొనసాగుతున్న ఉపాధ్యాయులదీక్షలు
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. దీక్షా శిబిరాన్ని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వీబీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ ప్రారంభించారు. దీక్షలకు మద్దతుగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేఏసీ చైర్మన్ ఎల్.విద్యాసాగర్, ఎన్జీవో జిల్లా కార్యదర్శి కె.హరినాథ్, ఐలూ నాయకులు కె.సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనలో భాగస్వామి అవుతానని హెచ్చరించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ సోమవారం ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. రెండో రోజు దీక్షల్లో పి.ఆంజనేయులు, ఎం.పోతురాజు, ఎన్.శ్రీనివాసరావు, ఎం.రామకృష్ణ, వి.కనకదుర్గ, కె.శ్రీదేవి, బి.సుభాషిణి, జీఎంఎన్ పద్మజ, డి.పూర్ణశ్రీ, డి.పద్మావతి, ఎస్కే బాబావలి, ఎం.జయరాజు, బీజేపీ పుష్పరాజు, జీవీ రంగమోహన్, టీఆర్ రవికుమార్, కె.సత్యనారాయణ, ఎస్.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి రూ. 720 కోట్లు
ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.720 కోట్లు కేటాయించినట్టు ఎమ్మెల్సీ ఎంఎ.షరీఫ్ చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం మైనార్టీస్ రుణమేళా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా రాష్ట్రంలో మైనార్టీలు బాగా వెనుకబడి ఉన్నారని అటువంటి వారి జీవనస్థితిగతులు మెరుగుపరచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మైనార్టీలకు రూ.1,200 కోట్లు నిధులు కేటాయించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. మైనార్టీ టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం చేయూత అందించాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్షా 50 వేల సబ్సిడీతో రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తుందని చెప్పారు. జేసీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మైనార్టీలు ప్రభుత్వం అందించే పథకాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని అన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ హురియాఖానమ్, ఎంపీపీ రెడ్డి అనురాధ పాల్గొన్నారు. -
స్కూల్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి
ఏలూరు సిటీ : ఉపాధ్యాయులను బోధనేతర పనులకు, ఆన్లైన్ నమోదు కార్యక్రమాలకు వినియోగించకూడదని, స్కూల్ క్యాలెండర్ మేరకే పరీక్షలు, పాఠశాల సమయాలు ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక గాంధీ జాతీయ మహావిద్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938, ఏపీయూఎస్, ఆప్టా, వైఎస్సార్ టీఎఫ్, ఎంబీటీఎస్, పీఈటీ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాఠశాల విద్య శాఖ స్కూల్ క్యాలెండర్ జారీ చేసిందని, ఈ క్యాలెండర్కు భిన్నంగా బేస్మెంట్ పరీక్షలు నిర్వహించటం, పరీక్షల మార్కులు ఆన్లైన్ చేయటం, బడిగంటలు వంటి అదనపు కార్యక్రమాలతో బోధనా సమయం వృథా అవుతుందని తెలిపారు. బోధనా సమయం తగ్గిపోయి పరీక్షించే గంటలు పెరిగిపోవటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న నిర్వహించే ధర్నాలో పాల్గొనే ఉపాధ్యాయుల వివరాలు అందించాలని, ఏ సంఘం నుంచి ఎంతమంది పాల్గొంటున్నారో వివరాలు ఇవ్వాలనడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కె.రాజ్కుమార్, వి.ధర్మరాజు, ఎంఎన్ శ్రీనివాస్, బి.మనోజ్కుమార్, జి.వెంకటేశ్వరరావు, వి.కనకదుర్గ, బి.సుభాషిణి, వీబీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్.రవికుమార్ తదితరులు ఉన్నారు. -
కదం తొక్కిన ఏఐవైఎఫ్ శ్రేణులు
ఏలూరు (సెంట్రల్): దేశంలో విద్యా, వైద్య, ఉపాధి రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, యువత దృష్టిని ఈ అంశాల నుంచి మరల్చడానికి దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై హిందూత్వ వాదులు దాడులు చేస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 20వ మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.లెనిన్బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తిరుమలై మాట్లాడారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యువత కీలక నిర్ణయాలు తీసుకోవాలని, ఆ దిశగా పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ముందుగా స్థానిక టూబాకో కల్యాణ మండపం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సంగీత దర్శకుడు వందేమాతం శ్రీనివాస్ సభ ప్రాంగణం వద్ద విప్లవ గేయాలను ఆలపించారు. ఏఐవైఎఫ్ నాయకులు ఐ.బయ్యన్న, బొద్దాని నాగరాజు, బి.కష్ణకిషోర్, యు.హేమశంకర్, ఎం.సుబ్బారావు, జె.విశ్వనాథ్, రెడ్డి శ్రీనివాస్, డాంగే ప్రజా నాట్యమండలి నాయకులు ఎం.గని, చంద్రానాయక్ పాల్గొన్నారు. -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : గ్రంథాలయాల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మరింత మెరుగుపడతాయని రాష్ట్ర గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ నియామక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాల్లో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను తీసుకువచ్చి అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని, ఈ సౌకర్యాన్ని విద్యార్థులతో పాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రై వేట్ రంగంలో కూడా అత్యధిక వేతనాలు లభిస్తున్నందున యువత వాటివైపు కూడా దష్టి సారించి ప్రై వేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఏసీ పఠన (రిఫరెన్స్) విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఈ విభాగంలో చదివిన అనేకమంది ఆయా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందారన్నారు. సొంత భవనాలు లేని గ్రంథాలయాలకు దాతల సహకారంతో సొంత భవనాలు నిర్మించడానికి కషి చేస్తున్న గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జయ్యవరపు శ్రీరామమూర్తిని అమె అభినందించారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రాము సూర్యారావు, కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు, మాగంటి రాంజీ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సీహెచ్ మదారు తదితరులు పాల్గొన్నారు. -
కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి
ఏలూరు సిటీ : ఉమ్మడి సర్వీస్ రూల్స్ త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఉపాధ్యాయులకు పదోన్నతులు రాబోతున్నాయని, విద్యావ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు తెలిపారు. స్థానిక ఎన్ఆర్ పేటలో పీఆర్టీయూ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ రాము సూర్యారావు పాల్గొన్నారు. శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగ్గించి ఒత్తిడి లేకుండా చేయాలని కోరారు. అనవసర పనిభారాన్ని తగ్గించి విద్యాబోధనపై దృష్టిసారించేలా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలన్నారు. ఏలూరు నగర పాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గతేడాది లాగే ఈ ఏడాది కూడా నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు అవార్డులు బహూకరిస్తామని తెలిపారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తె కమలాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు, కేవీవీ సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శులు పి.ఆంజనేయులు, ఏవీ కాంతారావు, కె.కృష్ణకుమార్ పాల్గొన్నారు. -
తాడిపూడి ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకానికి పంట బోదెల ఏర్పాటు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ వెల్లడించారు. శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 11 మండలాల్లో ఏర్పాటు చేయనున్న ఫీల్డ్ ఛానల్స్, మిగిలిన పనులను త్వరగా చేపట్టి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పంట బోదెలను ఆయా గ్రామ రెవెన్యూ బ్యాప్లపై గుర్తించాలని, ప్రతి గ్రామంలోనూ పూర్తిస్థాయిలో పంట బోదెలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు రైతులు కొత్త చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారని కొందరు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఒకసారి అవార్డు పాసైన తరువాత పాత వారికి కొత్త చట్టం ప్రకారం సొమ్ముల చెల్లించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుకాదని స్పష్టం చేశారు. అవార్డు పాసైన తేదీ నాటికి ఉన్న నిబంధనల మేరకు మాత్రమే నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జేసీ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో ప్రభాకరరావు, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్, నరసాపురం సబ్కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో షాన్మోహన్, ఆర్డీవోలు నంబూరి తేజ్భరత్, శ్రీనివాసరావు, లవన్న, పోలవరం కుడికాలువ ఎస్ఈ శ్రీనివాస యాదవ్, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రణాళిక జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక 15 రోజుల్లో రూపొందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏలూరు దత్తాశ్రమం వద్ద తమ్మిలేరుపై బ్రిడ్జి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం తదితర పట్టణాల్లో రోడ్ల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. అందుకోసం ప్రత్యామ్నాయ రహదారి వ్యవస్థకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. ఏలూరులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు శనివారపుపేట దత్తాశ్రమం నుంచి తమ్మిలేరుపై రూ.23 కోట్లతో వంతెన నిర్మిస్తామని, దీని ద్వారా శనివారపుపేట వైపు వచ్చే ట్రాఫిక్ను మేడిశెట్టివారిపాలెం రోడ్డు వైపునకు మళ్లిస్తామని కలెక్టర్ చెప్పారు. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డు పరిధిలో ఆరు ఇంటర్నెల్ రహదారుల కనెక్టవిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని, భీమవరంలో బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు రోడ్లను విస్తరిస్తామన్నారు. జేసీ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జేసీ షరీఫ్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకు సత్వరమే రుణాలివ్వాలి
ఏలూరు (ఆర్ఆర్ పేట): ఆర్థికావసరాల నిమిత్తం ప్రావిడెంట్ ఫండ్లో దాచుకున్న మొత్తానికి సంబంధించి ఉపాధ్యాయులకు రుణాలు మం జూరు చేయాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు కో రారు. జిల్లా పరిషత్ పీఎఫ్ రుణాల మం జూరులో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బుధవారం నిరాహార దీక్షను ఆయన ప్రారంభించారు. సకాలంలో రు ణాలు మంజూరు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించిన జేఏసీ చైర్మన్ ఎల్వీ సాగర్ మాట్లాడుతూ రుణాలు మం జూరులో వివక్షత చూపుతున్న సూపరింటెండెంట్ను విధుల నుంచి తొలగించి పీఎఫ్ రుణాల మంజూరులో ప్రక్షాళన తీసుకురావాలని డి మాండ్ చేశారు. సంబంధిత సూపరింటెండెంట్ను బాధ్యతల నుంచి తొలగించినట్టు, రుణా లు మంజూరుకు ఆదేశాలు ఇచ్చామని మధ్యాహ్నం జరిగిన చర ్చల్లో జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తెలిపారన్నారు. ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామకృ ష్ణ, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎం.రామకృష్ణ, పి.జయకర్, పీవీ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : కానిస్టేబుల్, జైల్ వార్డెన్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ ఎంఎ.షరీఫ్, టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఇగ్బాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఉద్యోగాల్లో 4 శాతం మైనార్టీలకు రిజర్వేషన్ ఉందని వారికి వయోపరిమితి కూడా 5 సంవత్సరాల సడలింపు ఇచ్చినట్టు తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూట్ అధికారి కార్యాలయంలో మైనార్టీ అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకుని ఉచిత శిక్షణ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు . -
ఏలూరులో ఏపీ బాడీబిల్డింగ్ రాష్ట్రస్థాయి పోటీలు
రాష్ట్ర కార్యదర్శి అడ్డూరి వెంకటరమణమూర్తి రాజమహేంద్రవరం సిటీ : రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు ఈనెల 21న ఏలూరులో రఘులక్ష్మి ఫిట్ జోన్, పశ్చిమగోదావరి జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి అడ్డూరి వెంకటరమణ మూర్తి తెలిపారు. తొమ్మిది వివిధ కేటగిరిల్లో, ఒక వికలాంగ విభాగంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ టోర్నమెంట్లో చాంపియన్ ఆఫ్ చాంపియన్కు రూ.15 వేల నగదు, ట్రోఫీ అందజేయనున్నట్టు తెలిపారు. అన్ని విభాగాల్లో మొదటి మూడు శ్రేణుల్లో విజేతలకు నగదు, ట్రోఫీలు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలు నవంబరులో కర్ణాటక జిల్లా బెల్గాంలో జరిగే అఖిల భారతస్థాయి సతీష్ సుగర్ క్లాసిక్స్ బాడీబిల్డింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతినిధులుగా వెళతారని వెంకటరమణ మూర్తి తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ :98495 79603ను సంప్రదించాలన్నారు. -
ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (యూటీఎఫ్) 17వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా యూటీఎఫ్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిందన్నారు. విద్యాహక్కు చట్టం కోసం పోరాటాలు పార్లమెంట్లో చట్టం ఆమోదించేలా కృషి చేసిందన్నారు. విద్యాహక్కు చట్టం అమలుకు జాతీయస్థాయిలో కేంద్ర బడ్జెట్లో 10 శాతం, రాష్ట్రస్థాయిలో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించి ప్రధానమంత్రికి అందిస్తామని, ఈ మేరకు నవంబర్ 29న చలో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పీవీ నరసింహరావు, అసోసియేట్ అధ్యక్షులు వి.కనకదుర్గ, ఆడిట్ కమిటీ కన్వీనర్ జీవీ. సూరపరాజు, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్ఎస్. బేగం బీబీ, నగర నాయకులు కెవీ. అప్పారావు, జీ.సాయిశ్రీనివాస్, స్వర్ణలత, రూరల్ మండల నాయకులు నంబూరి రాంబాబు, డి.లింగేశ్వరరావు, మాణిక్యాలరావు పాల్గొన్నారు. -
కూచిపూడి కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 23న వెయ్యిమంది యువ కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు సెట్వెల్ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ బృందంలో నాట్యం చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఇతర వివరాలకు మురళీమోహన్ 8008889845 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
‘పోలవరం’ నిర్వాసితులకు వృత్తి నైపుణ్య శిక్షణ
ఏలూరు (మెట్రో) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు పది వృత్తుల్లో నాణ్యమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు శిక్షణ శిబిరాలను త్వరలో ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రగతి తీరుపై కలెక్టర్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిరాశ్రయులయ్యే 514 గిరిజనేతర కుటుంబాలకు జంగారెడ్డిగూడెం సమీపంలో కాలనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వారంతా వివిధ వృత్తుల్లో నైపుణ్యం సాధించేందుకు అనువుగా జంగారెడ్డిగూడెం ఐటీఐ కేంద్రంలో, కెఆర్ పురంలో ప్రత్యేక శిక్షణ కోర్సులు అందిస్తున్నామన్నారు. విస్తరణ కాకుండానే రూ.200 కోట్ల పన్ను వసూలా? జిల్లాలో ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టకుండానే ప్రజల నుంచి టోల్గేట్ పన్ను నాలుగేళ్లలో రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేశారని, ఈ సొమ్మును రికవరీ చేసి జిల్లా అభివృద్ధికి ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు. రానున్న సీజన్ నాటికి ఎర్రకాలువ పనులు పూర్తి కావాలని, తమ్మిలేరు అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రభుత్వానికి అందించామని తెలిపారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి డిజైన్లను ఆమోదించడంలో ఇరిగేషన్ శాఖ సీడీవో గిరిధర్రెడ్డి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వారం రోజల్లో డిజైన్లకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. భీమవరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సర్వే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించాలని ఆర్అండ్బీ అధికారులను భాస్కర్ ఆదేశించారు. -
అధికారుల పెత్తనాన్ని ఊరుకోం
ఏలూరు (మెట్రో): జిల్లాలోని అన్ని మండలాల్లో, పంచాయతీల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కాదని అధికారులు పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ అధికారాలను హరించే 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను నిరోధించి స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ కలెక్టర్ కె.భాస్కర్కు బాపిరాజు ఆధ్వర్యంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ మండలాల స్థాయిలో ఏ పథకాన్ని ఏ లబ్ధిదారునికి అందించాలనే విషయం స్థానిక ప్రజాప్రతినిధులకే తెలుస్తుందని చెప్పారు ఈ విషయంలో అధికారులు తామే చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు కేటాయిస్తూ మండల పరిషత్లను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నారనే విషయాలను కలెక్టర్కు విన్నవించుకున్నామని చెప్పారు. జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటరమణ, జెడ్పీటీసీలు చలపతిరావు, గంటా సుధీర్బాబు పాల్గొన్నారు. -
చలో కలెక్టరేట్ కరపత్రాలు విడుదల
ఏలూరు(సెంట్రల్): ‘నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి’ నినాదంతో ఈనెల 10న కౌలురైతుల చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్టు కౌలురైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక అన్నే భవన్లో బుధవారం చలో కలెక్టరేట్కు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. భూ యజమానుల అంగీకారంతోనే కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధమని, జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 2.98 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చామని అధికారులు ప్రకటిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు. అనర్హులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారని, జిల్లాలో 95 శాతం మంది భూయజమానులు పంట రుణాలు తీసుకుంటున్నారని శ్రీనివాస్ అన్నారు. పంట బీమా కౌలురైతులకే వర్తింపజేయాలని, ఈ–క్రాప్ బుకింగ్లో కౌలురైతుల పేర్లనే నమోదు చేసి, ఇటీవలే కురిసిన వర్షాలకు నారుమళ్లు, నాటు వేసిన పొలాలు దెబ్బతిని నష్టపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం నాయకులు పల్లపోతు రెడ్డియ్య, పైడిపాటి భాస్కరరావు, బండి రత్తయ్య పాల్గొన్నారు. -
ఏఐవైఎఫ్ కార్యకర్తల కవాతు
ఏలూరు(సెంట్రల్): అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర 20వ మహాసభలను జయపద్రం చేయాలని కోరుతూ కార్యకర్తలు శుక్రవారం నగరంలో కవాతు నిర్వహించారు. తొలుత స్ఫూర్తిభవన్ వద్ద కవాతును సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ జెండ ఊపి ప్రారంభించారు. మతోన్మాద శక్తులను అణిచివేస్తాం.. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షిస్తాం అనే నినాదంతో కార్యకర్తలు ఎరచొక్కాలు ధరంచి రమామహాల్, విజయవిహార్, ఫైర్స్టేషన్ సెంటరు మీదుగా కొత్తబస్టాండ్ వరకు కవాతు నిర్వహించారు. ప్రభాకర్ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ 58 ఏళ్ల ఉద్యమాలతో దేశ రాజకీయ సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు, ఉపాధి హక్కుల సాధనకు పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆగష్టు 29,30,31 తేదీల్లో ఏలూరులో జరిగే సభల విజయవంతానికి సహకరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు బొద్దాని కృష్ణకిషోర్, ఉప్పులూరి హేమశంకర్, తొర్లపాటి బాబు, బాడిశ రాము, టి.అప్పలస్వామి, సీపీఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాసడాంగే, పుప్పాల కన్నబాబు, కె.కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. -
31న చెస్ టోర్నమెంట్ పోటీలు
ఏలూరు రూరల్ : ఈ నెల 31వ తేదీన అబ్రహం, గ్యారీ కాస్పరోవ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించనున్నామని అకాడమీ డైరెక్టర్ జి.యోహానాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సిద్ధార్థ విద్యాలయ ఆవరణలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 3.00 గంటల వరకు అండర్–7, 9, 11, 13, 15 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తామని చెప్పారు. వివరాలకు 9705306076లో సంప్రదించాలన్నారు. -
సీపీవోకు సత్కారం
ఏలూరు (మెట్రో): జిల్లా సీపీవో కె.సత్యనారాయణ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా ప్రాధాన్యతా రంగాలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్ కె.భాస్కర్ బుధవారం ఆయన్ను దుశ్శాలువాతో సత్కరించారు. సత్యనారాయణ సీపీవోగా సమర్థవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని అదనపు జేసీ ఎంహెచ్ షరీఫ్ చెప్పారు. కలెక్టర్ చేతులమీదుగా సన్మానం పొందడం అదృష్టంగా భావిస్తున్నానని సీపీవో సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ అధికారులు దుర్గేష్, విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, మత్స్యశాఖ డీడీ ఎంఏ యాకూబ్ పాషా, మార్క్ఫెడ్ అధికారి నాగమల్లిక పాల్గొన్నారు.