
ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలో నిర్వహించిన 'యువభేరి'లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
లక్ష్మునాయుడు: నేను డిగ్రీ సెకండియర్ అయిపోయింది. చదువుకోడానికి కూడా డబ్బులేక వైన్ షాపుల్లో గుమాస్తాగా పనిచేస్తున్నాం. ఆ షాపులు కూడా మాకు లేకుండా.. ప్రభుత్వమే నడిపిస్తామంటోంది. ఎమ్మెల్యేలు, మంత్రులే తీసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం మేం ప్రాణత్యాగానికి కూడా సిద్ధం. కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఈ హోదా కోసం ముందుకు రావాలి
వైఎస్ జగన్: మనం ఒత్తిడి తెస్తే చంద్రబాబు కిందకు దిగిరాక తప్పదు, మంత్రులు రాజీనామా చేయక తప్పదు