ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
Published Fri, Aug 5 2016 12:53 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
నల్లగొండ క్రైం : గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన పట్ణ శివారులోని చర్లపల్లిలో గురువారం వెలుగుచూసింది. వివరాలు.. అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించారు. మిషన్ ఓపెన్ కాకపోవడంతో అందులోని వైర్లను తగులబెట్టి వెళ్లిపోయారు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో టూటౌన్ సీఐ రవీందర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Advertisement
Advertisement