చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష | roberry cases.. year imprisonment | Sakshi
Sakshi News home page

చోరీ కేసుల్లో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

Published Fri, Nov 11 2016 2:38 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

roberry  cases.. year imprisonment

భీమవరం టౌ¯ŒS : రెండు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ సెకండ్‌ అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిసే్ట్రట్‌ జి.షణ్ముఖరావు తీర్పు చెప్పారని టూటౌ¯ŒS పోలీసులు గురువారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. మూడు కాసుల బంగారపు బ్రాస్‌లెట్‌ పోయిందని ఈ ఏడాది మే 2న, 12న జరిగిన రెండు చోరీ ఘటనలపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీలకు పాల్పడింది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దొండపల్లి ఏసుకుమార్‌ అని గుర్తించి అరెస్ట్‌ చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రుజువు కావడంతో  ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement