ప్రయాణికురాలి నుంచి రూ. 48 వేలు చోరీ | Rs. 48 thousand theft | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలి నుంచి రూ. 48 వేలు చోరీ

Jul 20 2016 5:31 PM | Updated on Mar 28 2018 11:26 AM

ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 48 వేలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వికారాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది.

వికారాబాద్‌ రూరల్‌: ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 48 వేలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన వికారాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన భామిని సుజాత స్థానికంగా బ్యాంగిల్‌ స్టోర్‌ నిర్వహిస్తోంది. మంగళవారం వికారాబాద్‌ బంద్‌ నేపథ్యంలో ఆమె సామగ్రి కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఉదయం 11.30 గంటలకు వికారాబాద్‌ బస్టాండ్‌కు చేరుకుంది. 11.40 గంటలకు బస్సులో ఎక్కిన ఆమె కొద్దిసేపటికి తన బ్యాగ్‌లోని పర్సు కోసం చూడగా కనిపించలేదు. దీంతో షాక్‌కు గురైన సుజాత బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు విషయం తెలిపింది. పర్సులో రూ. 48 వేల నగదుతో పాటు, ఒక సామ్‌సంగ్‌ సెల్‌ఫోన్‌ ఉందని బాధితులు కన్నీటిపర్యంతమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement