vikarabad
-
రైల్వే.. నోవే!
నవాబుపేట: మండలంలోని ఏడు గ్రామాల ప్రజలకు రైల్వే ట్రాక్, చిన్నపాటి బ్రిడ్జిలు పెద్ద సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాదాపు 25 కిలో మీటర్ల మేర ఉంటుంది. దానికి సమీపంలో మూసీనది 20 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ రెండింటి కారణంగా పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం గొల్లగూడ.. చిట్టిగిద్ద గ్రామాల్లో పర్యటించిన అప్పటి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ వినయ్కుమార్ త్రిపాఠికి రైల్వే ట్రాక్, బ్రిడ్జి విస్తరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు సమర్పించారు.కానీ ఇప్పటి వరకు రెండు సమస్యలూ పరిష్కారం కాలేదు. ఇటీవల వికారాబాద్కు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్కు సైతం ఎమ్మెల్యే యాదయ్య సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. ఈ సారైనా బ్రిడ్జి విస్తరణ పనులకు నిధులు మంజూరవుతాయని మండల ప్రజలు ఎంతో ఆశగా ఉన్నారు. మండలంలోని చించల్పేట, గంగ్యాడ, ముబారక్పూర్ గ్రామాల వద్ద మాత్రమే మూసీ నదిపై బ్రిడ్జిని నిర్మించారు.గొల్లగూడ రైల్వే స్టేషన్ వద్ద మాత్రమే రాకపోకలకు గేటు ఉంది. మండలంలోని ఏడు గ్రామాలు మూసీ నది, రైల్వే ట్రాక్కు ఇవతలి వైపు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు మండల కేంద్రంతోపాటు మిగతా 27 గ్రామాలకు రాకపోకలు సాగించాలంటే గొల్లగూడ రైల్వే గేటు, చించల్పేట, గంగ్యాడ, ముబారక్పూర్ వద్ద మూసీనదిపై ఉన్న బిడ్జీలే దిక్కు. మరో చోటు నుంచి రాకపోకలకు అవకాశం లేదు.చిన్న బ్రిడ్జిలతో ఇబ్బందులు మండల పరిధిలోని ముబారక్పూర్, ఎల్లకొండ, గొల్లగూడ, పులుమామిడి, లింగంపల్లి, నారేగూడ, అక్నాపూర్, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, చించల్పేట, గేట్ వనంపల్లి గ్రామాల వద్ద గత అవసరాల మేరకు బ్రిడ్జిలు నిర్మించారు. ప్రస్తుతం రవాణా సదుపాయం పెరిగింది. భారీ వాహనాలు రావాలంటే వీలుపడటం లేదు. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వంతెనలను విస్తరించి సీసీ రోడ్లు వేయాలని మండల ప్రజలు పలుమార్లు స్థానిక, రైల్వే శాఖ అధికారులకు విన్నవించారు. కానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు. రైల్వే జీఎం చొరవ చూపాలి రైల్వే బ్రిడ్జి, ట్రాక్ విస్తరించాలని ఇది వరకే సంబంధిత మంత్రి, అధికారులకు ఎమ్మెల్యే యాదయ్య, స్థానిక ప్రజలు వినతి పత్రాలు సమర్పించాం. కానీ మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. చాలా కాలంగా రవాణా పరమైన ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే సమస్యలు పరిష్కరించాలి. – విమలమ్మ, మాజీ సర్పంచ్, పులుమామిడి ఓ వైపు మూసీ.. మరో వైపు ట్రాక్మా గ్రామం మూసీ నది, రైల్వే ట్రాక్ల మధ్యన ఉంది. గ్రామంలోకి రావాలంటే ప్రధాన రోడ్డుకు రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంది. దీన్ని దాటడానికి ఏళ్ల క్రితం చిన్నపాటి బ్రిడ్జి నిర్మించారు. అందులో పెద్ద వాహనాలు రావడానికి వీలు లేదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. బ్రిడ్జిని విస్తరించాలి. – బాలమణి, మాజీ సర్పంచ్, ముబారక్పూర్ నిధుల కేటాయింపు లేదు చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట, శంకర్పల్లి మండలాల్లో మూసీ నది ప్రవహిస్తుంది. రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఈ రెండు మండలాల్లో కేవలం మూడు రైల్వే గేట్లు మాత్రమే ఉన్నాయి. మూసీ నదిపై నాలుగు బ్రిడ్జిలే ఉన్నాయి. పలు గ్రామాల ప్రజలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ట్రాక్పై మరో నాలుగు గేట్లు ఏర్పాటు చేయాలని గతంలో సంబంధిత మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్కు విన్నవించాం. వారు సానుకూలంగా స్పందించారే తప్ప నిధులు మాత్రం కేటాయించలేదు. – కాలె యాదయ్య, ఎమ్మెల్యే -
ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన..
బషీరాబాద్, వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో (Navalga Village) జరిగింది. పోలీసులు, హతుడి కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. నవల్గాకు చెందిన మాల శ్యామప్ప (39) గ్రామ గేటు సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు బషీరాబాద్ (Basheerabad) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డు తొలగిస్తే.. ఆస్తి దక్కుతుందని.. నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (39), శ్యామమ్మ సంతానం. అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, శనివారం అడ్వాన్స్గా రూ.10 వేలు అందజేసింది. ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు. సోమవారం సాయంత్రం బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజ్లు తీసుకున్నారు. మద్యం తాగేందుకని రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారులోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు. హత్య సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ హత్య తీరును పరిశీలించారు.చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..హతుడి తల్లి మల్లమ్మ, సోదరి శ్యామమ్మను విచారించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. అనుమానం వచ్చిన పోలీసులు వదిన సుగుణను ఠాణాకు తరలించి విచారించారు. హత్యకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని సీఐ మీడియాకు తెలిపారు. -
పరిగిలో బెట్టింగ్ పావురాల కలకలం
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు. -
నీ వెంటే వస్తున్నా బిడ్డా..!
కుల్కచర్ల(వికారాబాదు జిల్లా) : కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. ఓ తల్లి గుండె ఆగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే.. కుమారుడి శవం పక్కనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పీఎస్ పరిధిలోని చౌడాపూర్ మండలం లింగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే ఊరికి చెందిన బాల్రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మృతిని జీర్ణించుకోలేని తల్లి వెంకటమ్మ (52) కొడుకు శవం వద్ద రోదస్తూ కింద పడిపోయింది. అక్కడున్నవారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్రాజ్, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. పోలీసులకు సవాల్గా మారిన విజయ హత్య కేసు -
‘లగచర్ల’లో మళ్లీ భూసేకరణ..నోటిఫికేషన్ విడుదల
సాక్షి,వికారాబాద్: లగచర్లలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. శుక్రవారమే లగచర్లలో ఫార్మాసిటీ భూసేకరణ రద్దు చేసిన ప్రభుత్వం మరుసటి రోజే అక్కడ మల్టీపర్పస్ పారిశ్రామిక పార్క్ కోసం భూ సేకరణ నోటీస్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.2013 చట్టం సెక్షన్ 6(2) కింద భూసేకరణను నోటిఫికేషన్ ఇచ్చారు.కాగా,వికారాబాద్ లగచర్లలో ఫార్మాసిటీ భూ సేకరణకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించిన విషయం తెలిసిందే. భూ సేకరణ విషయమై గగ్రామానికి వచ్చిన జిల్లా కలెక్టర్పై దాడికి యత్నించడం సంచలనంగా మారింది.ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వం లగచర్లలో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిందని అంతా భావించారు. అయితే ఇంతలోపే మళ్లీ భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడం చర్చకు దారి తీసింది.ఇదీ చదవండి: లగచర్ల ‘ఫార్మా’ రద్దు -
పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ను క్వాష్ చేయాలని నరేందర్రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్ రోహిత్రెడ్డి
సాక్షి,హైదరాబాద్:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 16) ఈ విషయమై రోహిత్రెడ్డి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లే ఫినిష్ అయ్యారు -
లగచర్ల ఘటనపై సమీక్ష.. పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
-
కలెక్టర్పై దాడి కేసు.. బీఆర్ఎస్ నేత నరేందర్రెడ్డికి రిమాండ్
సాక్షి,రంగారెడ్డిజిల్లా: వికారాబాద్ కలెక్టర్పై కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జరిగిన దాడి కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి బుధవారం(నవంబర్13) కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫార్మా కంపెనీ భూ సేకరణ జరుపుతున్న క్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్ సోమవారం లగచర్ల వెళ్లారు.ఈ సమయంలో కలెక్టర్పై పలువురు గ్రామస్తులు దాడి చేశారు. దాడి నుంచి కలెక్టర్ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ దాడి ఘటనలో వెనుక ఉండి నడిపించింది బీఆర్ఎస్ నేత నరేందర్రెడ్డి అనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో కోర్టు నరేందర్రెడ్డికి ఈనెల 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్కు తరలించిన పోలీసులు బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.ఇదీ చదవండి: పట్నం నరేందర్రెడ్డి అరెస్ట్.. అప్డేట్స్ -
కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి
హైదరాబాద్, సాక్షి: వికారబాద్ ఐఏఎస్పై దాడి కేసీఆర్,కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని అన్నారు. -
లగచర్ల దాడి కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్లోని లగచర్లలో కలెక్టర్పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ దాడి కేసులో ఏ1గా బోగమోని సురేష్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నట్టు రిపోర్టులో పోలీసులు తెలిపారు.కలెక్టర్పై దాడి కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టు ఇలా.. ఈ దాడికి సంబంధించి బూంరాస్పేట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. 153/2024 క్రైం నెంబర్ కేసు.. సెక్షన్ 61(2), 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద కేసులు నమోదయ్యాయి. అలాగే.. హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కూడా కేసులు నమోదు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ దాడి కేసులో మొత్తం 46మందిని నిందితులుగా చేర్చారు.ఇదీ చదవండి: నరేందర్ రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్రఎఫ్ఐఆర్లో బోగమోని సురేష్ను ప్రధాన నిందితుడుగా(ఏ1) పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16మందిని అరెస్ట్ చేయగా.. మరో 30 మంది పరారీలో ఉన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. దాడి కేసులో నిందితుడు సురేష్ కీలకంగా మారాడు. సురేష్ ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను లగచర్లకు తీసుకెళ్లాడు’ అని పోలీసులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: లగచర్ల ఘటన: మార్నింగ్ వాక్లో పట్నం అరెస్ట్ -
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
-
కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి,హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగిచర్లలో కలెక్టర్పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్బాబు మంగళవారం(నవంబర్ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్బాబు ఆరోపించారు.కాగా కలెక్టర్పై దాడి ఘటన మీద జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.ఘటన వివరాలను శ్రీధర్బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని డీజీపీ, సీఎస్ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్.. అధికారులపై దాడి -
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలి మృతి
యాలాల: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఉపాధ్యాయురాలు చికిత్స పొందుతూ మృతి చెందారు. మండల పరిధిలోని బెన్నూరు ఉన్నత పాఠశాలలో దూది సవిత(47) స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ బోధిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె 20 రోజులుగా పాఠశాలకు సెలవు పెట్టి చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందారు. సవిత భర్త శివప్రసాద్ పెద్దేముల్ మండలం కందనెల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉపాధ్యాయుడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలో సవిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అకాల మరణం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని పీఆర్టీయూ యాలాల మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణారెడ్డి, రాములు అన్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. -
లగచర్ల ఘటన: ‘కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేత’
వికారాబాద్, సాక్షి: దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. దాడికి కారణమైన బీఆర్ఎస్ నేతలతో పాటు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వికారాబాద్ వెళ్లాళని ఏడీజీ మహేశ్ భగవత్కు రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. దాడి ఘటనపై మహేశ్ భగవత్ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘‘లగచర్ల ఘటనలో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నాం. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నాం. అధికారులపై దాడి చేసిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు సురేష్ కీలకంగా వ్యవహరించారు. రాజకీయ కోణం ఏదైనా ఉందా? అని విచారణ చేస్తున్నాం. సురేష్ వెనక ఎవరు ఉన్నారనేది విచారణలో తేలుతుంది. కలెక్టర్పైకి దూసుకువచ్చే దృష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దాడిలో పలువురి అధికారులకు గాయాలయ్యాయి’’ అని అన్నారు. కలెక్టర్ ఘటన నేపథ్యంలో ఇవాళ.. దుద్యాల, కొడంగల్, బోంరాస్పేట మండలాల్లో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు.మరోవైపు.. లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో నిన్న(సోమవారం) ఫార్మా రైతుల ప్రజాభిప్రాయం సేకరణకు వచ్చిన అధికారులపై దాడి ఘటనకు సంబంధించి అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అక్కడ పోలీసు బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి.లగచర్ల ఘటన ప్రభావం మిగతా చోట్ల పడేలా కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం గణేష్ పహాడ్లో ఉన్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. వికారాబాద్ కలెక్టర్ ఘటన నేపథ్యంలో అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనతో లగచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో 250 మందికిపైగా పోలీసు సిబ్బందిని మోహరించారు.ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. -
Vikarabad: కలెక్టర్పై దాడి చేసిన రైతులు
-
TG: కలెక్టర్పై దాడి.. ప్రభుత్వం సీరియస్
సాక్షి,హైదరాబాద్:వికారాబాద్ జిల్లా కలెక్టర్పై లగచర్ల గ్రామంలో సోమవారం(నవంబర్ 11) ఉదయం జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ మీద దాడి జరగడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్,డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది.కాగా, కలెక్టర్పై దాడి ఘటన మీద సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్జైన్తో సీఎస్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఘటనపై నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎస్ ఆదేశించారు. కాగా, ఫార్మా కంపెనీల కోసం భూ సేకరణ విషయమై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్ లగచర్ల వెళ్లినపుడు గ్రామస్తులు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. ఇదీ చదవండి: వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత -
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత
వికారాబాద్, సాక్షి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు. లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం. ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా పోలీసులు మోహరించారు. -
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా గుర్తించారు. ఓ ఇద్దరు యువకులు, ఓ బాలుడు కలిసి బైక్పై పూడూరు నుంచి మేడికొండ వైపు వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న ర్టీసీ బస్సు.. బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మేడికొండ, ఒకరు గొంగుపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దామగుండం రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన రాజ్నాథ్ (ఫొటోలు)
-
రాడార్ ప్రాజెక్ట్ పై అపోహలు వద్దు ఏదైనా ప్రమాదం ఉంటే..
-
‘రాడార్’కు అనుమతులిచ్చింది వారే : సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేస్తోందని, డిఫెన్స్, ఆర్మీ విభాగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక స్థానంలో ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ ఏర్పాటు చేయనున్న వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు మంగళవారం(అక్టోబర్15) శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ‘వీఎల్ఎఫ్ స్టేషన్ పై కొందరు అపోహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి స్టేషన్ ఏర్పాటు చేసి 34 ఏళ్లు అవుతున్నా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. వివాదం చేసే వాళ్ళు దేశ రక్షణ కోసం ఆలోచన చేయాలి. అసలు బీఆర్ఎస్ హయాంలోనే రాడార్ స్టేషన్కు అనుమతులిచ్చారు. దేశ రక్షణపై వివాదాలు సృష్టించే వారికి కనువిప్పు కలగాలి. నేను, స్పీకర్ ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తున్నాను. కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా... నేను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే. వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది’అని రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఓ వైపు మరణశాసనం..మరోవైపు సుందరీకరణ ఎలా: కేటీఆర్ -
ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య
ధారూరు: ఓ వివాహిత ఇద్దరు ప్రియులతో నెరపిన వివాహేతర సంబంధం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలీ తాలూకా కుంచావరం పీఎస్ పరిధిలోని జడి మల్కాపూర్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. ధారూరు సీఐ భీంకుమార్, కోట్పల్లి ఎస్ స్రవంతి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలం కౌంకుట్ల గ్రామానికి చెందిన అనితకు 15 ఏళ్ల క్రితం కోట్పల్లి మండలం అన్నాసాగర్కు చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈమె వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఏడాది క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అన్నాసాగర్కు చెందిన శ్రీకాంత్(27), చౌట మల్లేశంతో ఒకరికి తెలియకుండా మరొకరితో అనిత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఇద్దరినీ చంపేస్తానంటూ ఆమెను బెదిరించాడు. వివాహితుడైన శ్రీకాంత్ను వదిలించుకోవాలని భావించిన అనిత మనల్ని చంపేస్తానంటున్నాడని మల్లేశంకు చెప్పింది. దీంతో మల్లేశం తన మిత్రులైన జిన్నారం గ్రామానికి చెందిన మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, కోట్పల్లికి చెందిన అంజప్పతో కలిసి శ్రీకాంత్ హత్యకు పథకం వేశారు. సెప్టెంబర్ 25న శ్రీకాంత్ను అనిత, మల్లేశం అతని మిత్రులు లింగంపల్లి చౌరస్తాకు రప్పించారు.తమ కారులో అందరూ కలిసి జడి మల్కాపూర్ జలపాతానికి చేరుకున్నారు. శ్రీకాంత్కు ఫుల్గా మద్యం తాగించి మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని జలపాతంలో పడేసి వెళ్లిపోయారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు ఎస్ స్రవంతి దర్యాప్తు చేపట్టారు. కోట్పల్లి బందయ్య సమాచారం మేరకు అనుమానితులైన మల్లేశం అతని మిత్రులు మొల్ల బందెళ్లి, బంటూ బందెళ్లి, అంజప్పలను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను జలపాతం వద్దకు తీసుకెళ్లి శవం వెతికించినా వరద ప్రవహానికి లభ్యమవ్వలేదు. అనిత పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
జస్ట్ మిస్.. లేదంటే..!
-
వీకెండ్@ వికారాబాద్
మహానగరానికి దగ్గరగా.. కాలుష్యానికి దూరంగా.. పచ్చని రంగేసినట్లుండే కొండలు, వనాన్ని తలపించే వృక్షాలతో నిండిన అటవీ ప్రాంతం.. ఉదయం, సాయంత్రం పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, వందలాది పక్షిజాతులు.. కొండలు, గుట్టలు ఎక్కాలని కోరుకునే వారికి ట్రెక్కింగ్ ట్రాక్.. భక్తితో కొలిచే వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న అనంతపధ్మనాభ స్వామి దేవాలయం.. ఇవన్నీ అనంతగిరి అటవీ ప్రాతం సొంతం. మరో అడుగు ముందుకేస్తే సరదా బోటింగ్.. కోట్పల్లి జలాశయంలో కాయాకింగ్ సదుపాయం.. ప్రకృతి ప్రేమికులకైనా.. వారాంతంలో సేదతీరేందుకు టూర్ ప్లాన్ చేసుకునే వారికైనా వికారాబాద్ తొలిప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఒక్కరోజులో ఎంజాయ్ చేసిరావచ్చు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం నవాబుల కాలం నుంచి పర్యాటక ప్రాంతంగా, ఔషధ వనమూలికలు కలిగిన వృక్షాలకు నిలయంగా ప్రసిద్ధి. అనంతగిరి గుట్టపైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యాటక శాఖ హరిత రిస్సార్ట్ నిర్మించింది. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్, ప్లే ప్లేస్, గార్డెన్, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రాత్రికి ఫైర్ క్యాంప్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుండటంతో ఇక్కడ స్టే చేయడం కోసం ముందస్తుగా గదులు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.వారాంతంలో అప్పటికప్పుడు స్టేయింగ్ దొరకాలంటే కష్టం. అటవీ శాఖకు చెందిన గెస్ట్ హౌస్ ఇక్కడే ఉంటుంది. సిబ్బందిని సంప్రదిస్తే ఉదయం ట్రెక్కింగ్కు తీసుకెళతారు. అడవిలో నలుదిక్కులు తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ సీజన్(వర్షాకాలం)లో అనంతగిరి కొండల్లో జలపాతాలు పర్యాటకులను కనువిందుచేస్తాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతగిరి గుట్టపై వ్యూ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అడవి మొత్తాన్ని చూడొచ్చు. ఈ ట్రిప్కి ఒక్కొరికీ రూ.3000 నుంచి రూ.5000 వరకూ ఖర్చు అవుతుంది.ఆధ్యాతి్మకంగానూ.. అనంతగిరిలో వెలసిన అనంతపధ్మనాభస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్త్ర ప్రజలు గట్టిగా నమ్ముతారు. సుమారు 5వేల సంవత్సరాల క్రితం మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజుల్లో వేల సంఖ్యలో ఉంటారు.ఎలా వెళ్లాలి..హైదరాబాద్ నుంచి వికారాబాద్కు 65 కిలోమీటర్లు. మొయినాబాద్, చేవెళ్ల మీదుగా హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిలో మన్నెగూడ దగ్గర వికారాబాద్ వైపు తిరగాలి. గచి్చ»ౌలి, కూకట్పల్లి, పటాన్చెరువు, తదితర ప్రాంతాల ప్రజలు శంకర్పల్లి మీదుగా రావచ్చు. సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి మీదుగా రైలు సదుపాయం ఉంది.బోటింగ్..అనంతగిరి కొండల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కోట్పల్లి జలాశయం ఉంటుంది. ఇక్కడ బోటింగ్(కాయాకింగ్) చేయవచ్చు. వారాంతాలు, సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. బోటింగ్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒక్కరికి రూ.250, పెయిÆŠḥకి రూ.450 ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ బోటింగ్కు అనుమతిస్తారు. -
కొత్తపల్లిలో చిరుత కలకలం
-
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం
-
వాగులో కొట్టుకుపోయిన కారు
-
Ranga Reddy: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
కాంగ్రెస్లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్పర్సన్పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్కు రేవంత్ బర్త్ డే విషెస్ -
నేవీ రాడార్ స్టేషన్ కోసం అటవీ భూములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికారాబాద్ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ (రాడార్) స్టేషన్ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలి శారు. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్ డీఎఫ్వో, నా వల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే రెండోది భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు, క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ దిశగా ముందడుగు పడింది. 2027లో పూర్తి దామగూడెంలో నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు పూర్తి కానుంది. -
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
రోడ్డు కనబడక చెరువులోకి దూసుకెళ్లి..
అనంతగిరి: సరదాగా విహారయాత్ర కోసం బయలుదేరిన వారిని పొగమంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో రోడ్డు సరిగా కనబడక.. కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురిలో నలుగురు ఈదుకుంటూ బయటికిరాగా.. ఒకరు నీట మునిగి మృతి చెందారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి వెళదామని బయలుదేరి.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్ (24), వైజాగ్కు చెందిన సాగర్, రఘుపతి, చిత్తూరు జిల్లాకు చెందిన పూజిత, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్ ఐదుగురూ స్నేహితులు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి అనంతగిరి గుట్టలకు విహారయాత్ర కోసం బయలుదేరారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ చెరువు వద్ద ప్రయాణిస్తున్న సమయంలో పొగ మంచు దట్టంగా అలుముకుని ఉంది. దీనితో రోడ్డు సరిగా కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈత వచ్చిన రఘు నీట మునిగిపోతున్న సాగర్ను బయటికి తీసుకువచ్చాడు. కారు నడుపుతున్న మోహన్, పూజిత కూడా సురక్షితంగా బయటికి రాగలిగారు. గుణశేఖర్ నీటిలో మునిగిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను వికారాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. కారు చెరువులో పడిన సమయంలో తమను కాపాడాలని కేకలు వేసినా.. ఒడ్డున ఉన్న కొందరు సెల్ఫోన్లలో వీడియో తీసుకుంటూనే నిలబడ్డారని బాధితులు పేర్కొన్నారు. సుదీర్ఘ గాలింపు తర్వాత.. గజ ఈతగాళ్లతో గుణశేఖర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలిసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలను వేగిరం చేయాలని సూచించారు. సుమారు 11 గంటలపాటు గాలించిన తర్వాత సోమవారం సాయంత్రం గుణశేఖర్ మృతదేహం లభ్యమైంది. -
పొగ మంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
-
'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్చైర్స్ పంపిణీ
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీటీఏ)సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దివ్యాంగులకు ట్రై సైకిల్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ను రినోవేషన్ చేశారు. అధునాతన హంగులతో స్కూల్ను అందంగా తీర్చిదిద్దారు. టీటీఏ ఆధ్వర్యంలో అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా.విజయపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి సహాకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్, పరిగి ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు రానున్న రెండు ఏళ్లలో 100శాతం మందికి వారికి అవసరమైన సహాయం టీటీఏ చేస్తుందని తెలిపారు. కాగా టీటీఏ సేవలను స్కూల్ టీచర్లు, గ్రామస్థులు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించి, మెమెంటోలు అందించారు. -
Thandur: నారాయణ స్కూల్ బరితెగింపు
‘‘అడిగినంత కట్టకపోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో చేర్చుతాం.. కంప్లయింట్ చేస్తారా?.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’.. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ స్కూల్ యాజమాన్యం తీరు ఇది. అధిక ఫీజులతో వేధింపులకు పాల్పడుతుండడం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. దీంతో విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సదరు నారాయణ స్కూల్ యాజమాన్యం నిబంధనల్ని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న తీరూ బయటపడింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై నిబంధనలు ఉన్నా పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ పాఠశాల యాజమాన్యం బరితెగింపునకు దిగింది. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై వేధింపులకు గురిచేస్తుంది. నిబంధనలుకు విరుద్ధంగా ఫీజులు కట్టాలని ఒత్తిడికి పాల్పడుతుంది. ఫీజులు కట్టక పోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్టులో పెడతామని తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతోంది. తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి.. అధికారులు మమల్ని ఏమీ చేయలేరంటూ జులుం ప్రదర్శిస్తోంది. పాఠశాల యాజమాన్యం తీరుపై విసుగెత్తిపోయిన తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసి మరీ.. పిల్లలకు అంగీకరించిన ఫీజుల కంటే ఎక్కువ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. తల్లిదండ్రులు కట్టమని చెబితే.. దుర్భాషలాడుతున్నారని, పిల్లల విద్యాసంవత్సరం నష్టపోయేలా చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫీజుల విషయంలో నిబంధనలు పాటించని నారాయణ స్కూల్ పిన్సిపాల్. యాజమాన్యంపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే స్కూల్కు అపాలజీ నోటీసు ఇవ్వడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ స్కూల్కు ఏడవ తరగతి వరకే అనుమతి ఉండగా.. పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తోంది. ఈ విషయంపై అధికారులు స్పందన దాటవేయడం గమనార్హం. -
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దు: కేసీఆర్
సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారని.. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని సీఎం కేసీఆర్.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అవుతుందని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, పైలట్ రోహిత్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు కోసం 7500 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు 2 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రూ.200 ఉన్న పింఛను రూ. 2వేలు చేశామని, రైతుల బాగోగుల కోసం రైతు బంధు ప్రవేశపెట్టామని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతు బీమా డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ‘ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం వస్తుంది. కాంగ్రెస్ భూమాతను ప్రవదిశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుంది. ఒకప్పుడు ప్రభుత్వం చేతిలో రైతుల బతుకు ఉండే. ఇప్పుడు మీ బొటనవేలు పెడితేనే భూ యజమాన్యం మారుతది. ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదు. ప్రభుత్వం మీకు ధారపోసిన ఆ అధికారాన్ని పొడగొట్టుకుంటారా..? కాపాడుకుంటారా..? అనేది మీరే నిర్ణయించుకోవాలి. చదవండి: TSRTC: ఉద్యోగుల జీతాలు కట్.. ఈసీని కలిసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ కరవు, వలసలతో గత కాంగ్రెస్ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అలాంటి పరిస్థితులు నేడు తెలంగాణలో లేవు. నీటిపన్ను రద్దు చేశాం. కత్తి ఒకరికి ఇచ్చియుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదు కదా..? రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉండే వారి చేతిలో కత్తి పెడితేనే వాళ్లు మిమ్మల్ని కాపాడుతారు. 24 గంటల కరెంట్ ఉంటది రోహిత్ రెడ్డి గెలిస్తేనే లేదంటే కరెంట్ ఆగమైపోతది. కాబట్టి మీరు రోహిత్కు ఓటేయాలి. బీజేపీ నాయకులు నాయకులు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. వారిని పైలట్ రోహిత్రెడ్డి పట్టించారు. అందుకే ఆయన ఏ పనులు అడిగినా వెంటనే నిధులు మంజూరు చేశాను. 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారు. దాని వల్ల తాండూరు పరిధిలోని ప్రజలు చాలా మంది లబ్ధి పొందుతున్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్లో బంజారా భవన్ నిర్మించాంజ’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కేసీఆర్ మామకు మద్దతిద్దాం
వికారాబాద్: ఎట్టి పరిస్థితిల్లోనూ సంకీర్ణ సర్కారు రానివ్వం.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మామకు మద్దతిద్దాం.. ఆర్ఎస్ఎస్ అన్న రేవంత్రెడ్డిని ఇంట్లో కూర్చోబెడదామని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో జరిగిన ముస్లింల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్గాందీ, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదేశాలతోనే రేవంత్ ముందుగా టీడీపీలోకి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారని ఆరోపించారు. అందుకే అతన్ని కొడంగల్ ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో గోషామహల్లో తమ సపోర్టు వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో తమకున్న సత్సంబంధాల వల్లే సపోర్టు చేశామని ఓవైసీ తెలిపారు. బీజేపీకి లాభం జరగకూడదనేదే తమ ప్రధాన ఉద్దేశమనీ, తమ అంతిమ లక్ష్యం ఆర్ఎస్ఎస్ను నిలువరించడమేనని స్పష్టం చేశారు. గోషామహల్లో బీజేపీ గెలుపునకు దోహదం చేస్తోంది కాంగ్రెస్సేనని ఆరోపించారు. తాను బీజేపీ, కేసీఆర్ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయానని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మీరే జైలుకు పంపారని కాంగ్రెస్ నేతలనుద్దేశించి విమర్శించారు. వారి కోరిక మేరకే.. అప్పట్లో తాను జైలుకు వెళ్లి జగన్తో రాయబారం చేశానని, ఆయన మీతో కలిసేందుకు ఒప్పుకోలేదని వివరించారు. ఆ రోజు మీరు నాకెన్ని డబ్బులు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. సిద్ధాంత పరంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. పాతబస్తీ ఏమైనా బండి జాగీరా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఓవైసీ ఆరోపించారు. అది ఎప్పటికీ జరగనివ్వమని స్పష్టం చేశారు. కర్ణాటకలో బుర్ఖా వేసుకుని పోటీ పరీక్షలకు హాజరుకావద్దని ఆర్డర్ ఇచ్చారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందనీ, అందుకే ముస్లింలు కేసీఆర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాతబస్తీలో సర్జికల్ స్టైక్ చేయిస్తాం అంటాడు.. పాత బస్తీ ఏమైనా నీ జాగీరా? అని ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ముస్లిం మైనార్టీలను కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబ్దుల్ ఆది, హఫీజ్, మీర్మహేమూద్, రఫీ, తాహెర్అలీ, ఉస్మాన్, మోయిజ్, ఇబ్రహీ, షరీఫ్, అలీమొద్దీన్ పాల్గొన్నారు. -
వికారాబాద్: అవ్వ మిస్సింగ్, చివరకు..
సాక్షి, వికారాబాద్: ఆ అవ్వ ఆయుష్షు గట్టిదే. ప్రమాదవశాత్తూ ఓ పెద్ద కాలువలో పడినా.. రోజంతా అక్కడే గడిపి క్షేమంగా ప్రాణాలతో బయటపడింది. వికారాబాద్ తాండూరు మున్సిపల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ మున్సిపల్ పరిధిలోని గీతా మందిర్ సాయిపూర్ ప్రాంతానికి చెందిన కోస్గి భారతమ్మ (75) ఆదివారం మధ్యాహ్నాం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె మనవడు పట్టణంలో అంతా వెతికాడు. బస్టాండ్, రైల్వే స్టేషన్ అంతా గాలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఉదయం ఇంటి దగ్గర్లో ఉన్న ఓ మురుగు కాలువపై అతనికి అనుమానం వచ్చింది. రోడ్డు వెడల్పు కోసం చేపట్టిన నిర్మాణం అది. వెంటనే మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను పిలిపించి అందులో వెతికించాడు. సోమవారం సాయంత్రం పెద్ద నాలాలో కింద మూలుగుతూ కూర్చున్న భారతమ్మ అతని మనవడికి కనిపించింది. మున్సిపల్ కార్మికుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి. దగ్గర్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించగా.. ఆమె ప్రమాదవశాత్తు అందులో పడిందని మనవడు చెబుతున్నాడు. మరోవైపు.. అవ్వ మిస్సింగ్ కథ సుఖాంతం కావడంతో మృత్యువును జయించిదంటూ స్థానికులు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. -
ఇక్కడి బడి, గుడి నేను కట్టించినవే: రేవంత్ రెడ్డి
వికారాబాద్: కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కట్టిన బడి, గుడి, తాగునీరు తాను తీసుకొచ్చినవేనని చెప్పారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వికారాబాద్ జిల్లా దౌలతాబాద్లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు.. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.' రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12 వేలు అందిస్తాం. ఇల్లు లేని పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం.' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే.. -
ఇలాంటి పాలకులు అవసరమా?
వికారాబాద్: ‘అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే.. డిసెంబర్ 9న లాల్బహదూర్ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణం స్వీకారం చేయటం ఖాయం. ఆ రోజే ఆరు గ్యారంటీ స్కీంలపై తొలి సంతకం చేసి, తెలంగాణ ప్రజ లకు సోనియమ్మ, మల్లికార్జున ఖర్గే ఇచ్చిన హామీలను నేరవేరుస్తాం..’అని పీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగం కోసం చదివి చదివి వేసారిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. అసలు ఆమె దరఖాస్తే చేసుకోలేదని నిందలు వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఆడబిడ్డపైన నిందలేయటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పాలకులు అవసరమా? మనకు అని ప్రజలను ప్రశ్నించారు. సోమవారం రాత్రి వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిండా ముంచారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర ప్రారంభించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని రేవంత్ గుర్తుచేశారు.. అందుకే తాము కూడా ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచార శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తే.. మనం వికారాబాద్ నుంచి విజయోత్సవ సభలు మొదలు పెడుతున్నామని అన్నారు. కేసీఆర్కు హుస్నాబాద్ కలిసొస్తదో.. కాంగ్రెస్కు వికారాబాద్ కలిసొస్తదో తేల్చుకుందాం అని సవాలు విసిరారు. అమరుల త్యాగాలకు చలించిపోయిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. నాడు వైఎస్సార్ ప్రాణహిత ప్రాజెక్టును డిజైన్ చేసి ప్రారంభించడంతో పాటు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారని, కేసీఆర్ మాత్రం ప్రాజెక్టు డిజైన్ మార్చేసి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తామని కల్లబోల్లి మాటలతో కాలయాపన చేయడం తప్ప ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతానికి ఏమైనా ఆంధ్రోడు సీఎంగా ఉన్నా డా? లేక పక్క రాష్ట్రపోడు సీఎంగా ఉన్నాడా? అని ధ్వజమెత్తారు. తొలుత ఎన్నెపల్లిలోని సయ్యద్ యాసిన్, మాణెమ్మ, యాదయ్య ఇళ్లకు వెళ్లిన రేవంత్ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. తెల్ల రేషన్కార్డు ఉన్న పేదలందరికీ వీటిని వర్తింపజేస్తామని తెలిపారు. మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్కుమార్, ఎ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్రెడ్డిలు పాల్గొన్నారు. -
Anu Emmanuel: వికారాబాద్ లో సినీ తార అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫోటోలు)
-
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు..
సాక్షి, వికారాబాద్: స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పడంతో పేరెంట్స్, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 40 మంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్కు చెందిన మినీ బస్సు ప్రమాదానికి గురైంది. సుల్తాన్పూర్ వద్ద ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నీటిలో ఉన్న బస్సులోకి నుంచి స్థానికులు.. విద్యార్థులను కాపాడారు. ఇక, సదరు బస్సును న్యూ బ్రిలియంట్ స్కూల్కు చెందిన వాహనంగా గుర్తించారు. కాగా, బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం -
అనంతగిరి అడవుల్లో రేసింగ్ పై స్పందించిన పోలీసులు
-
అనంతగిరి అడవుల్లో రేసింగ్పై స్పందించిన పోలీసులు
సాక్షి, వికారాబాద్: అనంతగిరి అడవుల్లో రేసింగ్పై పోలీసులు స్పందించారు. రేసింగ్ నిర్వహించిన వారిలో కొందరిని గుర్తించామని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మిగిలిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం బందోబస్తులో ఉండటంతో రేసింగ్కు పాల్పడ్డారని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ అన్నారు. అనంతగిరి అడవుల్లో జరిగిన కార్, బైక్ రేసింగ్ విన్యాసాలకు సంబంధించిన ప్రాంతానికి వెళ్లి అటవీ శాఖ విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వివరాలు సేకరించారు ఒక కారు నంబర్ ను గుర్తించిన అధికారులు.. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్గనైజర్లు, 40 మందితో 16 కార్లు, రేసింగ్ బైకులు తీసుకొచ్చి విన్యాసాలు చేసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అనంతగిరి అడవుల్లోకి వీరిని ఎవరు తీసుకొచ్చారు. ఎవరు సహకరించారనే విషయాలపై విచారణ చేపట్టారు. రేసింగ్లో పాల్గొన్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు. చదవండి: 9 నంబర్లు వస్తే.. లిఫ్ట్ చేయొద్దు -
కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్లోకి చంద్రశేఖర్ను ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలకాలి. తెలంగాణకు కేసీఆర్ చీడపీడ. సీనియర్ నేత చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం. కేసీఆర్ లక్ష కోట్ల విలువైన పదివేల ఎకరాల భూమి కాజేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుదని ఆశించారు.. కానీ, అలా జరగకపోవడంతో బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖర్ కాంగ్రెస్లో చేరడానికి అంగీకరించారు. ఈనెల 18న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల యాజమాన్య పట్టాలు ఇవ్వడానిఇక హక్కులు ఇవ్వాలని చంద్రశేఖర్ కోరారు. భవిష్యత్తులో దీనిపై డిక్లరేషన్ చేస్తాం. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చు లేకుండా పంచాయితీ తెంచుతాం అని తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పొలిటికల్ వార్ -
తెలంగాణ బీజేపీకి షాక్.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రాజీనామా
సాక్షి, వికారాబాద్: జిల్లాలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలం అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. పార్టీలో పనిచేసే వారిని ప్రోత్సహించడం లేదని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్లోకి చేరనున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పనిచేసిన చంద్రశేఖర్.. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లనున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఆయన.. 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. చదవండి: 17 తర్వాత ఎప్పుడైనా.. బీఆర్ఎస్ జంబో లిస్ట్ -
టీచర్ మందలించారని.. తండ్రి తిట్టారని..
తిరుమలాయపాలెం (ఖమ్మం జిల్లా)/ తాండూరు (వికారాబాద్ జిల్లా): బాగా చదువుకోవాలని టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థి, చెడు సావాసాలకు వెళ్లొద్దంటూ తండ్రి హెచ్చరించడంతో అవమానంగా భావించిన ఓ టెన్త్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో వేర్వేరు చోట్ల శనివారం జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని హైదర్సాయిపేటకు చెందిన గుగులోత్ కృష్ణ – రమి కుమారుడు విష్ణు(17) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేరాడు. ఈనెల 7న టీసీ, ఇతర సర్టిఫికెట్ల కోసం తండ్రి కృష్ణతో కలిసి పదో తరగతి చదివిన పాఠశాలకు వచ్చాడు. ఈ క్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ పదో తరగతిలో ప్రవర్తన సరిగ్గా లేదని చెబుతూ ఇంటర్లోనైనా బాగా చదువుకోవాలని విష్ణును మందలించారు. తండ్రి, ఉపాధ్యాయుల ముందే తనను అవమానించారని భావించిన విష్ణు మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన గడ్డి మందు తాగాడు. కాసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. వైద్యం చేసినా లాభం లేదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి ఖమ్మం తీసుకురాగా ఆరోగ్యం విషమించి శనివారం మృతిచెందాడు. తండ్రి మందలించాడని... తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి గ్రామానికి చెందిన కంబంలి నర్సింలు, యాదమ్మల కుతూరు(15).. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంటి పక్కనే ఉండే ఓ బాలుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన తండ్రి.. పాఠశాలకు వెళ్లి అందరిముందూ బాలికపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన బాలిక ఇంట్లో ఉన్న మాత్రలు మింగింది. అస్వస్థతకు గురైన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మొక్కజొన్న సాగుతో మంచి లాభాలు మరియు డిమాండ్ ఎక్కువ
-
వికారాబాద్: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్!
సాక్షి, క్రైమ్: వికారాబాద్ మోమిన్ పేట్ లచ్చానాయక్ తండాలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలను పోలీసులు వెల్లడించారు. తమ ఆధిపత్యానికి అడ్డు రావడమే కాకుండా.. పొలం విషయంలో అడ్డుపడుతున్నాడనే కోపంతో ఓ వ్యక్తిని చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే ఎట్టకేలకు ఈ కేసును చేధించినట్లు జిల్లా ఎస్పీ కోటి రెడ్డి మీడియాకు గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లచ్చానాయక్ తాండకు చెందిన విఠల్ ఈ నెల(జులై) 2న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే.. మృతుడి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తూ మోమిన్ పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ తాండాకే చెందిన అన్నదమ్ములు మేఘావత్ పవన్, మోతిలాల్, నరేందర్ లు మరో ఐదు మంది కలిసి ఈ నెల 2న సదాశివ పేట్ నుంచి వస్తుండగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లి సమీపంలో తుపాన్ వాహనంతో గుద్ది హత్య చేశారు. సదరు వాహనం కర్నాటక రిజిస్ట్రేషన్ నెంబర్ గలదని ఎస్పీ వెల్లడించారు. ఇక విచారణలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ హత్య కోసం కందికి చెందిన మహ్మద్ సల్మాన్ కు లక్ష రూపాయల సుఫారి ఇచ్చారని, ఈ నేరంలో పాల్గొన్న మేఘావత్ రాంచందర్, మేఘావత్ మోతిలాల్, మేఘావత్ నరేందర్, మహ్మద్ సల్మాన్, బానోవత్ జైపాల్, జంజు రాజు, మంగలి నరేష్, దేవాసు రమేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారాయన. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను తెలిపి.. నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఘటన జరిగిన స్థలంలో సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్లనే ఈ కేసు సాల్వ్ అయ్యిందని వెల్లడించారాయన. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పిందని సజీవ సమాధి చేశాడు -
శారీరక సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదనే శిరీష హత్య
సాక్షి, వికారాబాద్:సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు. శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్కు దురాలోచన ఉంది. అయితే శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్లలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్లో కోపం పెరిగింది. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు.. బావ అనిల్కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్ ఆమెతో గొడపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు. జరిగింది ఇదే.. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తిచేసింది. వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్ హైదరాబాద్లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్కు ఫోన్ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్ వచ్చిన అనిల్.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదీ చదవండి: భర్తతో విడిపోయినవాళ్లే ఆ బాబా టార్గెట్ -
కొలిక్కి వచ్చిన వికారాబాద్ శిరీష మృతి కేసు.. ఆ ఇద్దరే హంతకులు!
సాక్షి, వికారాబాద్: నర్సింగ్ విద్యార్థిని శిరీష అనుమానాస్పద కేసును పోలీసులు చేధించారు. శిరీషను హత్య చేసింది ఆమె బావ అనిల్, అతని స్నేహితుడు రాజుగా పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. కాగా మొదటి నుండి బావ చుట్టే కేసు తిరుగుతున్నప్పటికీ గత మూడు రోజులుగా అనిల్ పోలీసుల ఎదుట నోరు మెదపలేదు. చివరికి అనిల్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు అతని స్నేహితుడినిసైతం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బావ అనిల్, అతని స్నేహితుడు కలిసి శిరీషను అత్యంత దారుణంగా హతమార్చినట్లు తెలిసింది. చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో బావ అనిల్ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదే సమయంలో మరో రూంలోకి వెళ్ళి శిరీష ఆత్మహత్యాయత్నం చేయగా.. గది గడియ విరగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చిన అనిల్.. ఆమెపై చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆమె బావ పరిగి వెళ్ళిపోయాడు. మనస్థాపానికి గురైన యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె సోదరుడు శ్రీను.. అనిల్కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రుడితో కలిసి ఫుల్గా మద్యం సేవించిన అనిల్.. మరో బీరు తీసుకొని ఫ్రెండ్తో కలిసి కాడ్లాపూర్ బయలుదేరాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించడంతో ఆగ్రహంతో ఆమెపై అనిల్ చెయ్యి చేసుకున్నాడు. అంతేగాక అతని ఫ్రెండ్ రాజు, శిరీషను అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్తో తల పగల గొట్టి కళ్ళల్లో గుచ్చినట్లు సమాచారం. తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా క్రూరులు వదల్లేదని, మోకాలు లోతు నీళ్ళున్న కుంటలో ఆమెను ఇద్దరు కలిసి విసిరేసినట్లు తెలిసింది. శిరీష చనిపోయే వరకు ఆమె దేహంపై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్లు తెలుస్తోంది. చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఎవరి దారిన వారు వెళ్లి మళ్ళీ శిరీష కోసం వెతికినట్లు నాటకం ఆడారు. కాగా ఇద్దరు నిందితులు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించనున్నారు. చదవండి: లండన్లో హైదరాబాద్ యువతి దారుణ హత్య -
శిరీషది హత్యా.. ఆత్మహత్యా?.. తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం
పరిగి, సాక్షి న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థి శిరీష మృతిపై మిస్టరీ వీడలేదు. యువతిది హత్యా.. ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాళ్లాపూర్ శివారులోని నీటి కుంటలో ఆదివారం మధ్యాహ్నం శిరీష (19) మృతదేహం లభ్యమైంది. ఒంటిపై పలు చోట్ల గాయాలు ఉండటం, రెండు కళ్లనూ పొడిచి ఉండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. పలువురు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం గ్రామానికి చేరుకున్న వైద్యులు శిరీష మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహించారు. యువతి శరీరంపై గాయాలు ఉన్నట్లు ధ్రువీకరించారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతురాలి తండ్రి జంగయ్య, బావ అనిల్పై వారు మండిపడ్డారు. శిరీష మృతికి వారే కారణమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కల్పించుకుని త్వరలోనే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. తన చెల్లిని చంపిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని మృతురాలి తమ్ముడు శ్రీకాంత్ కోరాడు. పోలీసుల అదుపులో మరో ఇద్దరు శిరీష అంత్యక్రియలు ముగిసిన తర్వాత తండ్రి జంగయ్య, బావ అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి జగయ్యను పోలీసులు వదిలేయగా.. బావ అనిల్ను విచారిస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. కేసు దర్యాప్తులో ఉందని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. మూడు రోజుల్లో రిపోర్టు పంపండి: తెలంగాణ డీజీపీకి మహిళా కమిషన్ ఆదేశం శిరీష దారుణ హత్యను జాతీయ మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. స్క్రూ డ్రైవర్తో బాలిక కళ్లు పీకి, బ్లేడ్తో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటనపై ఢిల్లీలోని ఎన్సీడబ్ల్యూ సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. అంతేగాక మూడు రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను పంపించాలని తెలంగాణ డీజీపీకి సూచించింది. తెలంగాణలో బాలికలు, యువతులు, మహిళలపై పెరిగిపోతున్న నేరాలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు
సాక్షి, వికారాబాద్: కాండ్లాపూర్ నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసు మిస్టరీగా మారుతోంది. యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించి కూడా పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఈ క్రమంలో కాండ్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు శిరీష తండ్రిపైనా దాడి చేశారు. శిరీషను హత్య చేసిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయని, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయలు ఉండడంతో పోలీసులు దాడిగా అనుమానిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాల నేపథ్యంలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం శిరీష ఇంటికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్ వైష్ణవి నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇందులోనూ పోలీసులు ఏం తేల్చలేదు. ‘‘యువతి కళ్లకు కట్టెలు లేదంటే రాళ్లు గుచ్చుకుని ఉండొచ్చు. పరీక్ష రిపోర్టును ఎఫ్ఎస్ఎల్(FSL)కు పంపించాం. రిపోర్టు రావాలి’’ అని డాక్టర్ వైష్ణవి తెలిపారు. అయితే అత్యాచారం జరిగిందా? అనే ప్రశ్నకు ఆమె స్పష్టత ఇవ్వలేదు. రిపోర్ట్ వస్తేనేగానీ తెలియదు చెప్పారు. ఈ క్రమంలో ఆమె అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోగా.. గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేసే యత్నం జరుగుతుందని ఆరోపిస్తూ శిరీష బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ‘‘మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. రేపు మా వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాదని గ్యారెంటీ ఏంటి?. కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామ’’ని గ్రామస్తులు అంటున్నారు. శాంతింపజేసిన పోలీసులు శిరీష కేసులో ఆందోళన చేపట్టిన కాండ్లాపూర్ గ్రామస్తుల్ని పోలీసులు శాంతింపజేశారు. నచ్చజెప్పడంతో వాళ్లు నిరసనను ఆపినట్లు తెలుస్తోంది. నోరు విప్పని బావ ఇక శిరీష హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శిరీష బావ అనిల్ నోరు విప్పలేదు. ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులకు అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే చేతిపై, గొంతు దగ్గర కోసుకుని తనను, ఆమె తండ్రిని బెదిరించిందని అనిల్ చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆమె ఫోన్ లాక్కున్నాడని, ఆమె బయటి నుంచి గడియ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు అనిల్ పోలీసులకు చెప్పాడు. ఆపై ఆమె ఊరు శివారులో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే కళ్లు పొడిచి ఉండడం, కాళ్లు చేతులకు గాయాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. ఇంట్లో గొడవ జరిగితే శిరీష తండ్రి మాత్రం పొంతన లేని సమాధానం చెప్తుండడం, మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఇంట్లో గొడవలకి కారణాలేంటన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: అప్సర మొదటి భర్త ఆత్మహత్య.. కార్తీక్ తల్లి సంచలన ఆరోపణలు -
శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని గ్రామస్థుల ధర్నా
-
వికారాబాద్లో దారుణం.. పాపం శిరీష..
సాక్షి, పరిగి: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నిన్నటి నుంచి కనిపించని యువతి శిరీష(19) హత్యకు గురై నీటికుంటలో రక్తపు మరకలతో మృతదేహం కనిపించింది. గుర్తు తెలియని దుండగులు యువతి కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. వివరాల ప్రకారం.. పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో శిరీష దారుణ హత్యకు గురైంది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శిరీష తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు టెన్షన్ పడ్డారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని నీటికుంటలో రక్తపు మరకలతో శిరీష మృతదేహం కనిపించింది. కాగా, గుర్తు తెలియని దుండగులు శిరీషను దారుణంగా హత్య చేశారు. ఆమె కనుగుడ్డుపై బలమైన ఆయుధంతో దాడి చేసి, కాళ్లు, చేతి నరాలను కత్తితో కోశారు. దుండగలు యువతిని హత్య చేసి నీటికుంటలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక, శిరీష ఇంటర్మీడియట్ పూర్తి చేసి వికారాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల బాలిక తల్లికి గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తల్లి అనారోగ్య సమస్య కారణంగా శిరీష రెండు నెలల క్రితం చదువు మానేసింది. ఈ క్రమంలో ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్న శిరీషపై ఆమె అక్క భర్త అనిల్ చేయిచేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో, పోలీసులు అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. శిరీష గొంతుపై పోలీసులు గాట్లను గుర్తించారు. శిరీష తండ్రి, తమ్ముడికి కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, శిరీషను అక్క భర్త అనిల్ కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
పేపర్ లీక్.. టెన్త్ పరీక్షలు వాయిదా?.. పాఠశాల విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, వికారాబాద్: తాండూర్లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్ వాట్సాప్లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నాపత్రం లీకైందంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో మిగతా పరీక్షల నిర్వహణపై సందిగ్దం నెలకొంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన క్లారిటీ ఇచ్చారు. రేపటి పదో తరగతి పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని తెలిపారు. టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ బహిర్గతం కావడంపై జిల్లా కలెక్టర్, వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చట్టం 25/1997, CrPC సంబంధిత సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. ‘సెంటర్ నెం. 24033, గవర్నమెంట్, హైస్కూల్ నెం.1, తాండూరు, వికారాబాద్ జిల్లాలోని ఇన్విజిలేటర్ బందెప్ప పరీక్ష ప్రారంభమైన తర్వాత ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మరో ఉపాధ్యాయుడు సమ్మప్పకు ఉదయం 9.37 గంటలకు పంపినట్లు గుర్తించాం. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం 9.30 తర్వాత బయటి వ్యక్తిని కేంద్రంలోకి రాలేదు. కేంద్రం నుంచి బయటకు ఎవరూ వెళ్లలేదు. పరీక్షా నిర్వహణ విషయంలో రాజీపడలేదు. విచారణ తర్వాత ఇది కేవలం ఇన్విజిలేటర్ బందెప్ప దుర్వినియోగమేనని నిర్ధారించాం’ అని చెప్పారు.. సస్పెండ్ అయ్యింది వీళ్లే.. 1. శివ కుమార్, GHM, ZPHS, ముద్దాయిపేట, యాలాల్(M) (చీఫ్ సూపరింటెండెంట్) 2. K. గోపాల్, SA, Govt., No.1 ఉన్నత పాఠశాల, తాండూరు (డిపార్ట్మెంట్ అధికారి) 3. S. బండప్ప, SA(BS), Govt., No. 1 ఉన్నత పాఠశాల, తాండూరు. (ఇన్విజిలేటర్) 4. సమ్మప్ప, SA(PS), ZPHS, చెంగోలు, తాండూరు మండలం (ఇన్విజిలేటర్) చదవండి: టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. -
టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్.. వారిపై వేటు
సాక్షి, వికారాబాద్: తాండూర్లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. సెల్ఫోన్ను లోపలికి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్వశ్చన్ పేపర్ లీకేజ్పై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు సస్పెండ్ పేపర్ లీక్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ బందప్ప, మరొకరిపై వేటు వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పేపర్ను వాట్సాప్ గ్రూప్లో లీక్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. 2017లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పాఠశాల గదిలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. బందప్ప భార్య అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది. కేసు నమోదు టెన్త్ పేపర్ బయటకు పంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అయితే పేపర్ ఎక్కడా లీక్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. పరీక్ష మొదలైన తర్వాతే పేపర్ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ను మీడియా గ్రూప్లో పెట్టిన్నట్లు గుర్తించారు. ఉదయం 9:30 గంటలకు పదో తరగతి పరీక్ష ప్రారంభమవ్వగా.. 9:37 గంటలకు పేపర్ను వాట్సాప్ గ్రూప్లో షేర్చేశారని పోలీసులు తెలిపారు. ఎగ్జామ్ హాల్నుంచి పేపర్ పంపినందుకు ఇన్విజిలేటర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. టెన్త్ పేపర్ లీక్ కలకలం ఆదివారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పేపర్ బయటకు లీక్ కావడం, వాట్సప్లో వైరల్ కావడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసు శాఖతోపాటు విద్యాశాఖ విచారణ ప్రారంభించింది. -
Tenth Class Exam Paper Leak: వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ పేపర్ చక్కర్లు.. లీక్?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేపర్ లీక్ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీస్తోంది. పేపర్ ఎలా లీక్ అయ్యింది అని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫొటో తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Vikarabad: ‘లేడి కానిస్టేబుల్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు అవసరం లేదు’
సాక్షి, వికారాబాద్: న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తొండుపల్లికి చెందిన కుర్వ శ్రీశైలం హైదరాబాద్లోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మిట్టకోడూరు గ్రామానికి చెందిన అనితతో నవంబర్ 2021న వివాహం జరిగింది. శ్రీశైలం విధులు నిర్వహించే కార్యాలయంలో ఓ లేడీ కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను పట్టించుకోవడంలేదని భార్య అనిత ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టినా తీరులో మార్పురావడం లేదని అన్నారు. సోమవారం కూడా మరోసారి పంచాయితీ పెట్టి మాట్లాడగా ‘లేడి కానిస్టేబుల్ను ప్రేమిస్తున్నాను. . నువ్వు అవసరం లేదు’అని చెప్పడంతో ఇంటి ఎదుట ఆందోళనకు దిగినట్లు అనిత తెలిపారు. తనకు న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేదిలేని భీష్మించి భర్త ఇంటి ఎదుట బైఠాయించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల గర్భవతిని అని, ఇబ్బందులకు గురి చేస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చదవండి: నిమ్స్లో నర్సుల మెరుపు సమ్మె.. నిలిచిపోయిన వైద్య సేవలు -
Viral Video: భయపెట్టిన వడగండ్ల వాన.. రండి బాబు రండి.. రూ. 100 కిలో!
-
వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన (ఫొటోలు)
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల వడగండ్ల వాన
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణశాఖ తెలిపిన విధంగా ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురుస్తోంది. ఇక, హైదరాబాద్లో గురువారం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నగరంలోని నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, మలక్పేట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇక, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్, నల్లగొండ, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా జిల్లాలో వడగండ్ల వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా అల్పపీడన ద్రోణి కారణంగా గంటకు 40 కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో, వాతావరణ శాఖ నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జహీరాబాద్లో వడగళ్ల వాన#Telangana #Zaheerabad #TelanganaRains #HyderabadRains @HiHyderabad #Rain pic.twitter.com/NLT1R7vasY — Mothe Vikramreddy (@MVRBRS) March 16, 2023 #Hyderabad #HyderabadRains pic.twitter.com/PS9AR84u9i — R Rajinikanth (@RRajinikanthGo2) March 16, 2023 Hailstorm reported in Kohir, Sangareddy district with -
Vikarabad: ‘టీచర్ కొట్టడం వల్లే మా బిడ్డ చనిపోయాడు!’
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం చిలాపూర్లో ఓ చిన్నారి మృతి కేసు వివాదాస్పదంగా మారింది. స్థానికంగా ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని టీచర్ కొట్టడంతోనే మృతిచెందాడని తల్లిదండ్రులు, అటువంటిదేం లేదని స్కూల్ యాజమాన్యం పరస్పరం ఆరోపణలకు దిగారు. చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే పిలగాడు మూడో తరగతి చదువుతున్నాడు. హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యాడతను. సమాచారం అందుకుని చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సాత్విక్ కన్నుమూశాడు. అయితే ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కొడుకు మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సాత్విక్ తండ్రి. అయితే.. అటువంటిదేం లేదని, బెడ్ పైనుంచి పడడంతో అతని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారని, ఆ తర్వాతే చనిపోయాడని కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం చెబుతోంది. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. చిన్నారి సాత్విక్ స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామం. -
ప్రతి కూలీకి ఉపాధి పని కల్పిస్తాం
యాచారం: జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పిస్తామని డీఆర్డీఓ పీడీ ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎన్ని గంటలకు పనులకు వస్తున్నారు, పనులు ప్రారంభించే సమయంలో, పనులు చేసే సమయంలో ఫొటోలు తీస్తున్నారా.. నింబంధనల ప్రకారం పనులు చేస్తున్నారా.. రికార్డుల నమోదు, కూలీల సంఖ్యపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా వారానికి మూడు రోజుల పాటు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోజూ 7 వేల మందికి పైగా కూలీలకు ఉపాధి పనులకు వస్తున్నారని తెలిపారు. రాబోయే వారం, పది రోజుల్లో ప్రతి గ్రామంలో 250కి మించి కూలీలు ఉపాధి పనులు చేసేలా చైతన్యం కల్పిస్తామన్నారు. కూలీలకు వారం, వారం డబ్బులు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య, ఈసీ శివశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలల హక్కులు కాపాడుదాం
వికారాబాద్ అర్బన్: ప్రతి ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ దేవయ్య అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ, పోక్స్ చట్టం అమలు, జిల్లా స్థాయి బాలల హక్కుల పరిరక్షణ విభాగం పనితీరు బాగుండాలన్నారు. బాలల ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. బాలికలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురికాకుండా పోక్సో చట్టం కఠినంగా అమలు చేయాలన్నారు. చట్టాలపై పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రత్యేకంగా యువత, ఆటో డ్రైవర్లు వంటి వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాలని సూచించారు. బాలికలపై అత్యాచారాలు జరిగితే వెంటనే విచారణ చేపట్టి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వసతి గృహంలో, పాఠశాలల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున బాల్యవివాహాలు కూడా అధికంగా అవుతున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ అశోక్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, డీఈఓ రేణుకాదేవి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోటాజీ, వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మల్లేశం, అడిషనల్ ఎస్పీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంలో దోమ ఎస్ఐ!
దోమ: భూ వివాదంలో ఎస్ఐ విశ్వజన్ తలదూర్చారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ పట్టణానికి చెందిన యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. నవాబుపేట మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఎస్ఐ విశ్వజన్కు యాదగిరితో పరిచయం ఏర్పడింది. ఎక్కడైనా భూమి ఉంటే చెప్పండి కొనుగోలు చేస్తానని ఎస్ఐ రియల్లర్ను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో నవాబుపేట మండలం కేశవపల్లిలో రైతు హన్మంతుకు చెందిన 21 గుంటల పొలం కొనేందుకు ఎస్ఐ రూ. 32 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా రూ. 9 లక్షలు ఇచ్చి తన స్నేహితుడిపై అగ్రిమెంట్ చేయించాడు. మిగత డబ్బు ఆరు నెలల తర్వాత నేరుగా రైతు అకౌంట్లో వేసి ఎస్ఐ తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇదిలా ఉండగా సదరు రైతు నవాబుపేటలో ఓ ప్లాట్ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం రియల్టర్ యాదగిరిని సంప్రదించాడు. రూ. 18 లక్షలకు ఆ ప్లాట్ను రైతుకు ఇప్పించేందుకు యాదగిరి ఒప్పందం కుదుర్చాడు. ఇందులో భాగంగా ఎస్ఐ ఇచ్చిన రూ. 9లక్షలతో పాటు రైతు వద్ద మరో రూ. రెండు లక్షలు తీసుకొని ప్లాట్ యజమానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా రైతు ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ విషయమై రియల్టర్ యాదగిరి అడగ్గా తన వద్ద డబ్బు లేదని తాను ఇచ్చిన రూ. 11 లక్షలు తిరిగి ఇప్పించాలని కోరాడు. ఇదే విషయాన్ని రియల్టర్ ప్లాటు యజమానికి తెలిపాడు. అయితే పాట్లు యజమాని తన వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదని రైతు ఇచ్చిన రూ.11 లక్షల్లో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడు. ఈ డబ్బును ఎస్ఐ స్నేహితుడి అకౌంట్లో వేసినట్లు రియల్టర్ తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ విశ్వజన్ను వివరణ కోరగా.. నవాబుపేటలో 20 గుంటల భూమిని తన స్నేహితుడికి రియల్టర్ యాదగిరి రూ.32 లక్షలకు ఇప్పించాడు. అందులో రూ. 8 లక్షలు రైతుకు ఇస్తానని తీసుకున్న రియల్టర్ తన స్నేహితుడిపై భూమి అగ్రిమెంట్ చేయించాడు. అగ్రిమెంట్ చేయించిన తర్వాత ఆరు నెలలైన తన స్నేహితుడికి భూమిని రిజిస్ట్రేషన్ చేయించలేదు. తన వద్దకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి రైతును తాను ప్రశ్నించగా తనకు రియల్టర్ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు. అగ్రిమెంట్కు ఇచ్చిన డబ్బులను రియల్టర్ యాదగిరి తన సొంత అవసరాలకు వాడుకొని రైతుకు ఇవ్వలేకపోయాడు. ఇట్టి విషయం గట్టిగా రియల్టర్ను అడుగగా రూ. 8 లక్షల్లో కొన్ని రైతుకు ఇచ్చాడు. మిగత రూ.3 లక్షల 50 వేలు ఇవ్వలేకపోయాడు. అట్టి డబ్బులను మీరు ఇప్పించండి అంటూ రైతు ఎస్ఐని కోరి భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగత డబ్బులు రోజులు గడుస్తున్న రియల్టర్ ఇవ్వకపోవడంతో రైతు తనకు, తన స్నేహితుడికి కాల్ చేయడం ప్రారంభించాడు. దీంతో తాను ఈ విషయంపై రియల్టర్ను గట్టిన ప్రశ్నించానని ఎస్ఐ విశ్వజన్ తెలిపారు. -
‘సాక్షి’ సేవలు అభినందనీయం
కుల్కచర్ల: విద్యార్థుల సౌకర్యార్థం సాక్షి దినపత్రిక అందిస్తున్న పదో తరగతి మోడల్ టెస్ట్ పేపర్స్ ఎంతో ఉపయోగకరమని కుల్కచర్ల కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల ప్రత్యేకాధికారి దేవి అన్నారు. శుక్రవారం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు మోడల్ ప్రశ్న పత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల సౌకర్యార్థం సాక్షి దినపత్రిక ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టడం ఉపయోగకరమన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ఇవ్వాలి బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా గౌరవాధ్యక్షుడు కృష్ణయ్య కొడంగల్ రూరల్: గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా గౌరవ అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పంచాయతీ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. టీచర్పై ఫిర్యాదు వికారాబాద్ అర్బన్: పట్టణంలోని భృంగీ ఇంటర్నేషనల్ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థులను సైన్స్ టీచర్ చితకబాదినట్లు పిల్లల తల్లిదండ్రులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లలపై టీచర్ ఇష్టానుసారంగా కొట్టినట్లు వాపోయారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పవద్దని పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం పిల్లలను బయపెట్టినట్లు తెలిపారు. వేల రూపాయల ఫీజు తీసుకుంటున్న పాఠశాల యాజమన్యాం పిల్లల రక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత టీచర్పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్వర్ణ రుద్రాక్ష మాల బహూకరణ షాద్నగర్ టౌన్: పట్టణంలోని శివమారుతీ ఆలయంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామికి శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన మంజుల, ప్రతాప్కుమార్ దంపతులు స్వర్ణ రుద్రాక్ష మాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్, సునీల్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గోలెపు చంద్రమౌళి, బసప్ప, విశ్వం, రాఘవేందర్, చింటు, ప్రవీణ్, ముత్యాలు, రాజావరప్రసాద్, హర్షవర్ధన్ గౌడ్, శశికుమార్, శ్యాం, శ్రీకాంత్, చరణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆనకట్ట.. ఒట్టిమాటేనా?
ధారూరు: మండలంలోని దోర్నాల్ గ్రామ సమీపంలో పెద్ద వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మూడేళ్ల క్రితం మంత్రి సబితారెడ్డి ఇందుకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భూగర్భ జలాలు వృద్ధి కోసం ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించారు. ఉద్దేశం మంచిదే అయినా పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. 2020 జూన్ 11న మండలంలోని పెద్ద వాగుకు అడ్డంగా ఆనకట్ట నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి అరవై ఒక్క లక్షాయాభై వేల రూపాయలు మంజూరు చేసింది. వాగు అవతల ఉన్న పొలాలకు దారి సౌకర్యంతో పాటు భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని రైతులు భావించారు. కాంట్రాక్టర్ పునాది స్థాయిలో పనులు చేస్తుండగా వాగు ప్రవాహ కారణంగా పనులు ఆపేశాడు. 2 సంవత్సరాలు అవుతున్నా తిరిగి పనులు చేపట్టలేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఎలాంటి పనులు మొదలుపెట్టలేదు. అయితే ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు పూర్తవుతాయని రైతులు భావించడం, ఆ తర్వాత నిరాస చెందడం పరిపాటిగా మారింది. -
మొక్కల రక్షణ గాలికి..!
పెద్దేముల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారుతోంది. ఏటా ప్రభుత్వం గ్రామాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి.. వాటి సంరక్షణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రధాన రహదారులపై నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. అంతేకాకుండా నాటిన గుంతల్లోనే మళ్లీ మొక్కలు నాటి లెక్కలు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మండల అధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా మండలంలోని 37 గ్రామ పంచాయతీల్లో 37 వన నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో 5 వేల మొక్కలకు తగ్గకుండా పెంచుతున్నారు. ఇందుకోసం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు సంరక్షణ గ్రామ పంచాయతీ అధికారులకు అప్పగించారు. కానీ పంచాయతీ అధికారులు మొక్కలు నాటడంపై చూపుతున్న శ్రద్ధ వాటి సంరక్షణపై పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దేముల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద నాటిన మొక్కలు ఎండిపోయాయి. వాటి రక్షణ కోసం ఏర్పాటు చేసిన జాలీలు పడిపోయినా పట్టించుకునే నాథులే కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల వద్దే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని హైదరాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రధాన రహదారులపై, మంబాపూర్, ఇందూరు, కందనెల్లి, మన్సాన్పల్లి, ఆత్కూర్ గ్రామాల్లో నాటిన మొక్కలకు నీరు అందక ఎండిపోతున్నాయి. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణ, ప్రధాన రహదారులు, ప్రభుత్వ భూములు, ఆలయ స్థలాల్లో మొక్కలు నాటారు. వీటి బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది పలు గ్రామాల్లో రూ. 150నుంచి రూ.180 వరకు వెచ్చించి ఒక్కో మొక్కను కొనుగోలు చేసి రోడ్ల పక్క నాటారు. కానీ ఎక్కడా మొక్కలు పెరిగిన దాఖలాలు లేవు. ఈ విషయమై ఎంపీడీఓ లక్ష్మప్పను వివరణ కోరగా మొక్కలు ఎండిపోతే పంచాయతీ కారదర్శులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
కుల్కచర్ల: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షాద్నగర్ పట్టణానికి చెందిన క్షీరసాగర తారాబాయి కుమారుడు విజయ్కుమార్ ముజాహిద్పూర్కు చెందిన బొడికె నర్సుబా యిని వివాహం చేసుకొని ఇల్లరికం వచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు. విజయ్కుమార్ ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయాడు. తన కొడుకు కో డలు తరచూ గొడవ పడేవారని, కు మారుడి మరణంపై అనుమానం ఉందని తల్లి తారబా యి పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు. -
రాష్ట్రంలో బీజేపీదే అధికారం
బంట్వారం: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బంట్వారం, కోట్పల్లి మండలాల్లోని బస్వాపూర్, తొర్మామిడి, సల్బత్తాపూర్, రాంపూర్ గ్రామాల్లో శక్తి కేంద్ర కార్నర్ సమావేశాలునిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అస్సెంబ్లీ పాలక్, సినీ నటి జీవితతో కలిసి మాట్లాడారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టపడిన వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. యువత చేతిలోనే దేశ భవిత ఉందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వికారాబాద్ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, సీనియర్ నాయకులు బసిరెడ్డి పాల్గొన్నారు. -
భూ వివాదంలో 15 మందిపై కేసు
పరిగి: భూ వివాదంతో 15 మందిపై కేసు నమోదయ్యింది. ఈ సంఘటన పూడూర్ మండలం చన్గోముల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి కథనం మేరకు.. చన్గోముల్ గ్రామ సర్వే నంబర్ 3 6లో 4 ఎకరాల భూమిని సంగారెడ్డికి చెందిన గడీల శ్రీనివాస్గౌడ్ గ్రామానికి చెందిన కమాల వీరమణి, కమల సోమలింగం వద్ద కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన పొలం చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. అయితే గ్రామానికి చెందిన ఎండీ అజీం, అజారుద్దీన్, రహీస్ ఖాన్, జహీర్ఖాన్, నజీబ్ ఖాన్, కొంగి సత్తయ్య, కొమ్ము కృష్ణ, సిరాజుద్దీన్ ఫెన్సింగ్ను తొలగించారు. దీంతో బాధితుడు శ్రీనివాస్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రయోగాత్మక విద్యతో లాభాలు కొత్తూరు: ప్రయోగ్మాతకంగా విద్యాబోధన చేపడితే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంఓ) కృష్ణయ్య సూచించారు. మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామ జెడ్పీహెచ్ఎస్లో పీఅండ్జీ పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమ ఆర్థిక సహకారంతో మైండ్ స్పార్క్ సంస్థ సమకూర్చిన కంప్యూటర్ మోడల్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు దృశ్య, వీక్షణ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తే వారికి విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు చాలాకాలం వరకు గుర్తుంటాయన్నారు. కరోనా కారణంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఇలాంటి బోధన ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో మైండ్ స్పార్క్ సంస్థ ప్రతినిధి విశ్వనాథ్, ఎంఈవో కృష్ణయ్య, పాఠశాల హెచ్ఎం పాల్గొన్నారు. -
స్పేస్ సదస్సుకు మహేశ్వరం విద్యార్థులు
మహేశ్వరం: స్థానిక ప్రభుత్వ మోడల్ స్కూల్ నుంచి తొమ్మిది మంది విద్యార్థులకు అమెరికా టెక్సాస్ నగరంలో నిర్వహించే ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్కు ఆహ్వానం రావడం గర్వించదగ్గ విషయమని మంత్రి సబితారెడ్డి అన్నారు. అమెరికా నుంచి ఆహ్వానం అందుకున్న విద్యార్థులు శుక్రవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆహ్వానం అందడం అభినందనీయమని, సర్కారు బడుల్లో నాణ్యతతో కూడిన విద్య అందుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బాబు, మాజీ ప్రిన్సిపాల్ బి. ధనుంజయ్, కేసీ తండా సర్పంచ్ మోతిలాల్ నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ రవి నాయక్, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. -
రెండు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
చేవెళ్ల: అనుమతులు లేకుండా గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తున్న రెండు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి మండల కేంద్రంలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. సిద్దార్థ క్లీనిక్ పేరుతో హోమియోపతి డాక్టర్ హైమావతి నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో గర్భిణులకు స్కా నింగ్పరీక్షలు, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో దాడులు చేశారు. క్లినిక్లో 12 మంది గర్భిణులు స్కానింగ్ కోసం రావడాన్ని అధికారులు గమనించారు. అనుమతులులేకుండా స్కానింగ్ చేసినందుకు మిషన్లను సీజ్ చేశారు. మరో ప్రైవేటు ఆస్పత్రి అయిన ప్రజావైద్యశాలలో కూడా ఇదేరకమైన స్కానింగ్ పరీక్షలు జరుగుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆకస్మిక తనిఖీల్లో వైద్యఅధికారులు రాకేశ్, శ్రీనివాస్రెడ్డి, దామోదర్లు, సీహెచ్ఓ గోపాల్రెడ్డి, చేవెళ్ల ఎస్ఐ హయ్యూం, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. -
నువ్వా.. నేనా
తాండూరు టౌన్: తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. పట్టణంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6గంటల లోపు ఫలితాలు వెల్లడిస్తారు. 2023– 25 సంవత్సరానికి గాను విడుదలైన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారు. శుక్రవారం ఉప సంహరణ గడువు ఉండగా ఎవరూ తమ నామినేషన్ను వెనక్కి తీసుకోలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అబ్దుల్ గని, చిక్కాల శ్రీనివాస్ తుది పోరులో నిలిచారు. గనికి టైరు గుర్తు, శ్రీనివాస్కు పాన గుర్తును కేటాయించారు. అసోసియేషన్లో గుర్తింపు పొందిన 261 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సభ్యులందరూ తప్పకుండా అసోసియేషన్ జారీ చేసిన గుర్తింపు కార్డుతో రావాలని, ఎన్నికల నిబంధనలు పాటించని వారిని ఓటు వేసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి, బీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అడ్వకేట్ గోపాల్ తెలిపారు. తమను గెలిపిస్తే లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థులిద్దరూ సభ్యులను కోరారు. -
మెరుగైన సేవలకే అటెండెన్స్ యాప్
వికారాబాద్ అర్బన్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే జిల్లాలో అటెండెన్స్ యాప్ను ప్రవేశపెట్టామని, ఇందులో అధికారులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఎంతమాత్రం లేదని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ రెగ్యులర్గా విధులు నిర్వహించి ప్రజలకు సత్వర సేవలు అందిస్తే జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపే అవకాశం ఉంటుందన్నారు. టాప్– 5 సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. సోమవారం నుంచి వందశాతం మంది అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు వేయాలని కోరారు. ఇరవై రోజులుగా ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించినప్పటికీ ఇంకా కొన్ని శాఖల సిబ్బంది యాప్ను డౌన్లోడ్ చేసుకోలేదని, ఇది క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని హెచ్చరించారు. పలువురు అధికారులు స్పందిస్తూ షిప్టింగ్ డ్యూటీలు, ఇతర టెక్నికల్ సమస్యల కారణంగా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదని కలెక్టర్కు వివరించారు. -
బడిలోనే ‘ఆధార్’
వికారాబాద్ అర్బన్: విద్యాశాఖలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలు, వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. పాఠశాల స్థాయిలో కూడా ఈ పద్ధతిని కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతీ విద్యార్థికి ఆధార్ నంబర్ ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా, మధ్యాహ్న భోజనం పథకంలో పిల్లల హాజరు శాతాన్ని ఎక్కువ చూపకుండా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 50 శాతం మందికిపైగా విద్యార్థులకు ఆధార్ లేకపోవడంతో బయోమెట్రిక్ మిషన్లలో వేలిముద్రలు పడటం లేదు. కొందరికి ఆధార్ ఉన్నా పుట్టిన తేదీ, ఇంటి పేరు తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలు నెలకొన్నాయి. వీటిని సరిచేసేందుకు గాను విద్యార్థుల సౌకర్యార్థం ఆధార్ నమోదు, సవరణ, వేలిముద్రల అప్డేట్ కోసం పాఠశాలల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మండలానికో ఆపరేటర్ చొప్పున నియమించారు. వీరి ద్వారా జిల్లాలోని అన్ని స్కూళ్లలో విద్యార్థుల బయోమెట్రిక్ వివరాలు స్వీకరిస్తున్నారు. ప్రయోజనాలివే.. బయోమెట్రిక్ హాజరు ద్వారా పాటు, పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా చూడటం, మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చేసి చూపే అవకాశం ఉండదు. సంక్షేమ వసతి గృహాల్లో పారదర్శకత పెరుగుతుంది. సరిచేసుకునే అవకాశం జిల్లాలో మొత్తం 1,030 పాఠశాలలు ఉండగా అందులో 91,898 మంది విద్యార్థులు చదువుతున్నారు. తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో మొదటి ఆధార్ తీసుకున్న సమయంలో చాలా వరకు తప్పుడు సమాచారం నమోదైంది. ప్రస్తుతం పాఠశాలలో నమోదు చేసిన, ఆధార్లో నమోదైన పుట్టిన తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. కొందరు విద్యార్థుల వేలి ముద్రలు కూడా సరిపోలడం లేదు. వీరు రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టళ్లలో చేరేందుకు వెళితే ఆధార్ వివరాలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటిని సరిచేసుకోవాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిసినా దగ్గర్లో ఆధార్ కేంద్రాలు లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి తోడు చాలా మంది విద్యార్థులకు అసలు ఆధార్ కార్డే లేకపోవడం గమనార్హం. ఫలితంగా వీరు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. విద్యార్థుల వివరాలను నమోదు చేయడం ఉపాధ్యాయులకు సైతం సమస్యాత్మకంగా మారింది. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలల్లో ఆధార్ నమోదు డ్రైవ్ చేపట్టింది. కార్డు లేనివారికి ఉచితంగా ఆధార్ అందించడంతో పాటు, ఇప్పటికే ఉండి తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం విద్యార్థులు, తల్లిదండ్రుల వేలిముద్రలు, ఐరిస్ వంటి వివరాలు సేకరిస్తున్నారు. -
పర్వతారోహణలో శిక్షణకు తరలిన విద్యార్థులు
వికారాబాద్ అర్బన్: కళాశాల, వసతిగృహాల్లో చదువుతున్న వంద మంది విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ ఇచ్చేందుకు శుక్రవారం భువనగిరి ఖిల్లాకు పంపించామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు బస్సుల్లో విద్యార్థులను తరలించినట్లు తెలిపారు. పర్వతారోహణలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, వారి నైపుణ్యం ఆధారంగా ప్రోత్సహిస్తామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. వాహనాల పన్నుచెల్లించండి వికారాబాద్ అర్బన్: జిల్లాలోని వాహనదారు లు సకాలంలో పన్ను చెల్లించాలని జిల్లా రవా ణా శాఖ అధికారి శుక్రవారం వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 4,769 వాహనాలు పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ట్లు పేర్కొన్నారు. పట్టుబడితే అపరాధ రుసుముతో మొత్తం రూ.300 చెల్లించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. జిల్లాలో సుమారు రూ.3, 50,23,190 పన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. పెద్దఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తనిఖీలు చేపడుతూ వాహన పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు. వాహనాల వేలం పూర్తి వికారాబాద్ అర్బన్: వదిలివేయబడిన, క్లెయి మ్ చేయలేని వాహనాలను వేలం వేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ బహిరంగ వేలానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. బహిరంగ వేలంలో 11 త్రిచక్ర వాహనాలు, 18 ద్విచక్ర వాహనాలను వేలం వేశామన్నారు. వేలంలో పొందిన వాహనాలను ఉపయోగించకూడదని, డీమాలిష్ చేసి తీసుకెళ్లాలని తెలిపారు. పాతూరులో పశువైద్య శిబిరం వికారాబాద్ అర్బన్: పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయని పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచందర్రావు తెలిపారు. పాతూరులో శుక్రవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ టి.ఉష ఆధ్వర్యంలో సుమారు వంద మూగజీవాలకు చికిత్సలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్లీనరీకి యూసుఫ్కు ఆహ్వానం కొడంగల్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ జిల్లాలో నిర్వహించను న్న కాంగ్రెస్ పార్టీ ప్లీన రీ సమావేశానికి రావా లని కొడంగల్కు చెందిన పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఆయనకు ఫోన్ చేశారు.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి యూసుఫ్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు.కొడంగల్లో మైనార్టీ నేతగా ఎదిగారు. ఈ మేరకు కాంగ్రెస్, మైనార్టీ నాయ కులు యూసుఫ్కు అభినందనలు తెలిపారు. గొర్రెలమందపైవీధికుక్కల దాడి30 గొర్రెపిల్లల మృతి ఆమనగల్లు: పోలెపల్లిలో శుక్రవారం సాయంత్రం గొర్రెల మందపై వీధికుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో 30 గొర్రెపిల్లలు మృత్యువాతపడ్డాయి. రైతు ఎట్టయ్యయాదవ్ తన పొలం వద్ద గొర్రెలను ఉంచగా అదే సమయంలో కుక్కలు దాడిచేశాయి. మందలో ఉన్న 30 గొర్రెపిల్లలు మృతి చెందాయి. -
కదిలిన యంత్రాంగం
దోమ: కొత్త కలెక్టర్గా నారాయణరెడ్డి విధుల్లో చేరిన రోజునుంచి అధికారుల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేప డుతున్న పనులను శుక్రవారం ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం దోమ మండలంలో పర్యటించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమై యంత్రాంగం విధుల్లో చురుగ్గా పాల్గొంటోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై కిందిస్థాయి సిబ్బంది సైతం దృష్టిసారించారు. పనుల పురోగతికి ప్రత్యేక చర్యలు దోమ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ పర్యటించారు. పల్లెల్లో చేపట్టాల్సిన పనులపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. అర్ధంతరంగా ఆగిపోయిన పనుల వివరాలు సేకరించడంతో పాటు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దోర్నాల్పల్లిని సందర్శించిన కలెక్టర్ నర్సరీ నిర్వహణ, పల్లె ప్రకృతి వనంపై అసహనం వ్యక్తంచేయడంతో అధికారులు పనులు చేపట్టారు. నర్సరీలో ఎండిన మొక్కలను తొలగించి నూతన మొక్కలు నాటించారు. పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలకు నీరందించి, కొత్త మొక్కలు నాటారు. ప్రజల సౌకర్యార్థం బెంచీలు, కుర్చీలు, రోడ్లు వేయాలని ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఐనాపూర్, మోత్కుర్, దోమ, పాలేపల్లి, దిర్సంపల్లి, మల్లేపల్లి తదితర గ్రామాలను సందర్శించి నర్సరీ, పల్లె ప్రకృతివనం,డంపింగ్యార్డు, శ్మశానవాటిక పనులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. నర్సరీ నిర్వహణను అశ్రద్ధ చేయొద్దని సిబ్బందిని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలను పార్కుల్లా సుందరీకరించాలన్నారు. -
టెంకాయల విక్రయాలకు వేలంపాట
కుల్కచర్ల: పాంబండ ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నట్లు దేవస్థానం ఆలయ చైర్మన్ రాములు, ఈఓ సుధాకర్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ దేవాలయం వద్ద టెంకాయలు, తలనీలాల వేలం పాటలను నిర్వహించారు. ఉగాది సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో టెంకాయలు అమ్ముకునేందుకు రూ.5 లక్షల 51వేలకు కుర్వ వెంకటయ్య అనే వ్యక్తి దక్కించుకున్నారు. బ్రహ్మోత్సవాలతో పాటు సంవత్సర కాలానికి గానూ తలనీలాల వేలం పాటను రూ. 2లక్షల 44వేలకు అంగులురు పోలేరు అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఏడాదిపాటు టెంకాయలు అమ్ముకునేందుకుగాను రూ. 5లక్షల 42వేలకు శివప్రసాద్ అనే వ్యక్తి హక్కులను పొందారు. కార్యక్రమంలో తాండురు భద్రేశ్వర స్వామి ఆలయ ఈఓ శేఖర్ గౌడ్, ఆలయ పాలకవర్గ సభ్యులు సంజీవ్, లక్ష్మయ్య, ఆలయ అర్చకులు పాండు శర్మ తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులకు సేవలు మరింత చేరువ డీసీసీబీ జిల్లా సీఈఓ శ్రీనివాస్ మోమిన్పేట: ఖాతాదారులకు సేవలు మరింత చేరువ చేసేందుకు నూతన బ్యాంకు భవన నిర్మాణం చేపట్టనున్నట్లు డీసీసీబీ జిల్లా సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతన బ్యాంకు భవన నిర్మాణం చేపట్టేందుకు స్థల పరిశీలన చేశారు. నాబార్డు ద్వారా బ్యాంకు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. స్థలం అప్పగించిన వెంటనే భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. మోమిన్పేట పీఏసీఎస్ నూతన భవనం, గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపనచేశామన్నారు.ఆదే విధంగా డీసీసీబీ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టామన్నారు. స్వల్పకాల రుణాల వడ్డీలను వసూలు చేయాలన్నారు. దీర్ఘకాలిక రుణ వాయిదా బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించా రు.ఆయన వెంట డీసీసీబీ, నాబార్డు అధికారులు,తహసీల్దార్ కిరణ్కుమార్ తదితరులు ఉన్నారు. బాలిక కిడ్నాప్ కేసులో ముగ్గురిపై పోక్సో కేసు కుల్కచర్ల: బాలికను అపహరించిన ఘటనలో ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ గిరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఇప్పాయిపల్లికి చెందిన బాలిక(17)ను ఈ నెల 20న రాంపూర్కు చెందిన షేక్ సర్వర్ అనే యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయిని అపహరించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ చేసింది షేక్ సర్వర్ అని ఫిర్యాదు చేశారు. విచారణను చేపట్టిన పోలీసులు బుధవారం బాలికను అపహరించిన షేక్ సర్వర్ను, అతనికి సహకరించిన నంచర్ల మల్లేశ్, నూకపోతు మల్లేశ్లను పట్టుకుని వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను పరిగి సబ్ జైలుకు రిమాండ్ చేశారు. బాలికను సఖి సెంటర్కు తరలించామని పోలీసులు తెలిపారు. మరో మూడు నామినేషన్లు సాక్షి, సిటీబ్యూరో: మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి బుధవారం ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. లింగిడి వెంకటేశ్వర్లు, ఎస్.విజయ్కుమార్, కాంటే సాయన్నలు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు అందజేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. ప్రచారంలో బిజీ.. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జేఎన్టీయూ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వినయ్ బాబును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాల్లో ప్రచా రం నిర్వహించారు. -
Vikarabad: ‘ప్రియురాలిలో అమ్మా నాన్నల ప్రేమను చూశా.. కానీ’
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి వివాహం చేసుకుంటుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలప్పడ్డాడు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ గ్రామానికి చెందిన కటిక కృష్ణాజీ కుమారుడు ప్రవీణ్కుమార్ (26) బీఈడీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సరూర్నగర్ శ్రీనివాస కాలనీలోన ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. బీఈడీ చదివే సమయంలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. నాలుగు సంవత్సరాలుగా వీరు కలిసిమెలసి ఉంటున్నారు. అయితే కొంత కాలంగా తనను కాదని వేరే యువకుడిని యువతి ప్రేమిస్తుండటంతో ప్రవీణ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున ఒక సెల్ఫీ వీడియా తీసి, సూసైడ్ నోట్ రాసుకున్నాడు. సెల్ఫీ వీడియోను తన స్నేహితులు, బంధువులకు పంపంచి..వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. అనంతరం నైలాన్ తాడుతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. వాట్సాప్ స్టేటస్లో వీడియో చూసిన స్నేహితులు ప్రవీణ్ ఉండే గదికి చేరుకుని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్ను స్వా«దీనం చేసుకున్నారు. తనతోనే జీవితం ఊహించుకున్నా ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. బీఈడీలో పరిచయం అయిన యువతిని మనసారా ప్రేమించాను. ఇద్దరం నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. అమ్మ, నాన్నల ప్రేమను తాను చూపించింది. నా జీవితం మొత్తాన్ని తనతో ఊహించుకున్నాను. ఆ అమ్మాయి లేకుండా బతకలేను. వేరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా. నన్ను క్షమించండి. మిస్ యూ ఫ్రండ్స్...నా చివరి చూపు చూసేందుకు రండి..బై.’ అని ప్రవీణ్కుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. చదవండి: Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం -
నిజాయితీ అధికారికి బదిలీ బహుమానమా?
సాక్షి, వికారాబాద్: అధికారులు అవకాశవాదులుగా మారి.. ప్రజాప్రతినిధులు, బడా వ్యక్తుల అడుగులకు మడుగులొత్తుతున్న సమయంలో నిజాయితీగా ఉండటం సవాలే.. నిజాయితీగా వ్యవహరిస్తే అవార్డులు, రివార్డులు ఏమో గానీ బదిలీ.. లేక సస్పెన్షన్ వేటో తప్పదన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం డీఎఫ్ఓ విషయంలో కూడా ఇదే రుజువయ్యింది. అయిన వచ్చీ రాగానే అక్రమార్కులకు సింహస్వప్నమయ్యారు. వారి గుండెల్లే రైళ్లు పరిగెత్తేలా చేశారు. కానీ వచ్చిన అనతికాలంలోనే అనేక మార్పులకు నాంది పలికిన ఆయన అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా మారారు. ఎవరు చెప్పినా... హెచ్చరించిన లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అలాంటి జిల్లా ఫారెస్టు అధికారి జిల్లా డీఎఫ్ఓగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్రెడ్డి ఐదు నెలల్లోనే బదిలీ కాకా తప్పలేదు. సంస్కరణలకు శ్రీకారం డీఎఫ్ఓ వెంకటేశ్వర్రెడ్డి అనేక మార్పులకు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏళ్లుగా ఆక్రమణలకు నోచుకున్న వాటిని బయటకు తీసి రుజువులతో సహా కోర్టు ముందుంచారు. వికారాబాద్, తాండూరు సమీపంలో కాంట్రాక్టర్లు ఫారెస్టు భూముల్లో తవ్వకాలు జరిపి రూ. వందల కోట్ల విలువగల ఖనిజ సంపద తరలిస్తున్నారని గుర్తించి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ఫారెస్టు భూములు కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయించారు. వారు కోర్టులకు వెళ్తే కౌంటర్ ఫైల్ వేశారు. అనుమితి లేని సా మిల్లులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కలప రవాణాను అడ్డుకోవటం, అక్రమ కలప కొనుగోలు దారులకు రూ.లక్షల్లో ఫైన్లు వేయటం, అనుమతిలేకుండా ఫారెస్టు భూముల్లోంచి రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఫైన్లు వేయటం లాంటి అనేక విషయాల్లో ఆయన ఉక్కుపాదం మోపారు. ఇక వారి ఆటలు సాగవని భావించి కొందరు ప్రజా ప్రతినిధులపై వత్తిడి తెస్తూ వచ్చారు. ఎట్టకేలకు నిజాయితీగా వ్యవహరించిన అధికారిని సాగనంపారు. -
శివస్వాముల అరెస్ట్.. పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా
సాక్షి, వికారాబాద్: పరిగి సబ్ జైల్ వద్ద హైడ్రామా నెలకొంది. మూడు రోజుల క్రితం యాలాల్ మండలం దేవనూరులో జరిగిన గొడవలో ఐదుగురు శివస్వాములను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. శనివారం ఉదయం ఆ శివ స్వాములను రిమాండుకు తరలించేందుకు పరిగి సబ్ జైలుకు తీసుకొచ్చారు తాండూరు పోలీసులు. ఈ క్రమంలో అక్కడ హైడ్రామా నెలకొంది. శివ స్వాములు మాలలు తీసి వేస్తేనే జైల్లోకి అనుమతి ఇస్తామని జైలు సిబ్బంది తాండూరు పోలీసులకు తేల్చి చెప్పారు. దీంతో.. స్వాములను మళ్ళీ జైలు బయటకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే.. మాయమాటలు చెప్పి తమను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని శివ స్వాములు చెప్తున్నారు. శివమాలలు తీయబోమని స్వాములు చెప్పడంతో.. పోలీసులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. మీడియాతో సహా జైలు ఆవరణలో ఎవరినీ ఉండకుండా పంపించేస్తున్నారు పోలీసులు. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు.. నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. హన్మకొండ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్గా బదిలీ. అలాగే హైదరాబాద్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు ► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ రవి.. మహబూబ్నగర్ కలెకర్ట్గా బదిలీ. ► ప్రస్తుత మహబూబ్నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ. ► జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి సంతోష్.. మంచిర్యాల కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజార్షి షా.. మెదక్ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు జగిత్యాల ఇన్చార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు. ► ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి.. నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీ ► ప్రస్తుత కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్.. ఆదిలాబాద్ కలెక్టర్గా బదిలీ ► ప్రస్తుత మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్.. వనపర్తి కలెక్టర్గా బదిలీ కలెక్టర్ల బదిలీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి -
ఈతకు వెళ్లి నలుగురు యువకులు మృతి
-
విషాదం మిగిల్చిన ఈత సరదా
ధారూరు: ఈత సరదా విషాదంగా మారింది. నలుగురు వ్యక్తులు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ విషాదం నింపిన ఈ ఘటన సోమవారం వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కోట్పల్లిలో చోటుచేసుకుంది. సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన బాయికని పెంటయ్య కుమారులు లోకేశ్ (28), వెంకటేశ్(25), వీరి బాబాయి బుచ్చయ్య కొడుకు జగదీశ్(24), మేనత్త కొడుకు రాజేశ్ (24).. తమ కుటుంబ సభ్యులైన మరో 9 మందితో కలసి కోట్పల్లి ప్రాజెక్టుకు వచ్చారు. అక్కడి పరిసరాలను, అడవి అందాలను వీక్షించారు. అనంతరం సేదతీరేందుకు నీటి ఒడ్డుకు చేరుకున్నారు. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ఈత వచ్చిన లోకేశ్, జగదీశ్ నీటిలోకి దిగారు. వీరిని చూసి వెంకటేశ్, రాజేశ్ కూడా నడుములోతు వరకు వెళ్లి నీటిలో ఆడుకోవడం ప్రారంభించారు. కాగా, లోకేశ్, జగదీశ్ జలాశయంలో కొద్ది దూరంలో ఉన్న బండరాయి వద్దకు వెళ్లి వెనుదిరుగుతున్న సమయంలో ఈతరాని వెంకటేశ్, రాజేశ్లు వీరికి ఎదు రుగా వెళ్లేందుకు ప్రయత్నించి నీటిలో ముని గారు. వీరిని కాపాడేందుకు లోకేశ్, జగదీశ్లు ఒక్కొక్కరిని పట్టుకున్నారు. అయితే ఆందోళనకు గురైన వెంకటేశ్, రాజేశ్ వారిని గట్టిగా పట్టుకుని ఈత కొట్టే వీలులేకుండా చేశారు. దీంతో నలుగురూ నీటిలో మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న ఇతర కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో ఉన్న బోటింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిలో మునిగిన వారి కోసం గాలించారు. అయితే అప్పటికే వారు మరణించడంతో మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బుచ్చయ్య కొడుకు జగదీశ్ స్వగ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. లోకేశ్ హైదరాబాద్లోని కూకట్పల్లి కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెంకటేశ్, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. లోకేశ్, వెంకటేశ్, రాజేశ్ తమ కుటుంబాలతో హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. సంక్రాంతి పండుగ కోసం వీరంతా సొంతూరు మన్నెగూడకు వచ్చారు. (చదవండి: కి‘లేడీ’ ప్లాన్.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్) -
పండగ పూట విషాదం.. ఆడుకుంటూ వెళ్లి బకెట్లో పడటంతో
సాక్షి, వికారాబాద్: వికారాబాద్లో పండుగ పూట విషాదం నెలకొంది. అంబాడుతూ వెళ్లిన ఏడాది బాలుడు బకెట్లో పడి మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి.. అనంతగిరి పట్టణంలోని పాత శిశు మందిరం సమీపంలో నివాసముండే దశరథ్, భాగ్యలక్ష్మికి ఇద్దరు సంతానం. వీరిలో చిన్నవాడు విఖ్యాత్ (1). పండుగ సందర్భంగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఎవరి పనుల్లో వారుండగా.. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి బాత్రూంలోని బకెట్లో ఇరుక్కున్నాడు. తలకిందులుగా పడటంతో బకెట్లోనే ప్రాణాలు వదిలాడు. అరగంట తర్వాత బాబు కోసం చూడగా ఉలుకుపలుకు లేకుండా బకెట్లో పడి కనిపించాడు. దీంతో తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లోని ఓ షోరూంలో సెల్ ఫోన్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్తూ వికారాబాద్ స్టేషన్లో రైలు ఎక్కాడు. ఇంటి నుంచి ఫోన్ రావడంతో తిరిగివచ్చి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదిలా ఉండగా గత నెల 24న విఖ్యాత్ తొలి పుట్టిన రోజు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. ఆ తీపి జ్ఞాపకాలు మరువకముందే చిన్నారి మృతి చెందడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచింది. చదవండి: Mukarram Jah: చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. -
పట్టాలు తప్పిన ట్రైన్.. వికారాబాద్ స్టేషన్లో నిలిచిపోయిన రైళ్లు
బెంగళూరు: కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గుడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్ఆర్ బెంగళూరు, యశ్వంత్పూర్, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులను తాండూరు మీదుగా నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పండగ సమయం కావడం, గంటలపాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులను అధికారులు తాండూర్ తరలిస్తున్నారు. చదవండి: శరవేగంగా ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణానికి ముందస్తు పనులు: ఎన్వీఎస్ రెడ్డి -
వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత
-
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు.. బైరి నరేష్ అరెస్ట్
సాక్షి, వికారాబాద్/వరంగల్: అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్లో బైరి నరేష్ను అదుపులోకి తీసుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి శనివారం తెలిపారు. నరేష్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించాలని కోరారు. ఇప్పటికే బైరి నరేశ్పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు కోటిరెడ్డి తెలిపారు. అయితే పరారీలో ఉన్న నరేష్ వీడియోలు పోస్టు చేయగా... సోషల్ మీడియా ద్వారా అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా అయ్యప్ప స్వామిపై నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్లో నిర్వహించిన సభలో దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. నరేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: Hyderabad: నుమాయిష్కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే! -
చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ఆరోపణ
సాక్షి, వికారాబాద్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని ఓ వ్యక్తి బుధవారం మీడియా ఎదుట ఆరోపించాడు. ఇందుకు సంబంధించి అతడి వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం మీర్జాపూర్లోని సర్వే నంబర్ 20లో పదెకరాల భూమిని గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. తాతల కాలం నుంచి ఈ భూమిలో తామే కబ్జాలో ఉన్నామని చెప్పాడు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దొరసాని రాములమ్మ నుంచి తమ పెద్దలు ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సైతం ఉన్నాయని వెల్లడించాడు. 2004 వరకు సదరు భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరునే నమోదై ఉందని తెలిపారు. అయితే 2005లో దొరసాని సంబంధీడైన నర్సింహారెడ్డి అప్పటి తహసీల్దార్ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన కడీలను నగర మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి తొలగించేయిస్తున్నారని, అడిగితే చంపేస్తామని గన్తో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై మేయర్ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్కు రిప్లై ఇచ్చిన రాష్ట్రపతి భవన్ -
అనంతగిరిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పద్మనాభ స్వామి!
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన, ఆళ్వార్ల రచనల్లో ప్రస్థావించబడిన, లక్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు సంబందించిన దివ్య దేశాలు 108 కాగా ఇందులో భారత్లో ఉన్నవి 105 మాత్రమే, ఒకటి నేపాల్ లో ఉండగా మిగతా రెండు ఈ భూలోకంలో కాదు అక్కడెక్కడో, అల వైకుంఠపురంలో ఉన్నాయంటారు. ఇందులో ఎక్కువ కెక్కువ ఉన్నది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్లో నున్న రెండు ఆలయాలు తిరుమల, అహోబిలంలు. భారత్లోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ పెరుమాళ్ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ లెక్కలోకి రాకున్నా హైదరాబాద్కు 75 కిమీ దూరంలో వికారాబాద్ అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణంలో మనకూ ఒక అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు. నిజాం ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగా ( 18931901)పనిచేసిన నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా బహదూర్ జాగీర్ కావడం వల్ల దీనికి ’వికారాబాద్’ అన్న పేరు వచ్చిందట. అంతకు పూర్వం ఇది గంగవరంగా పిలువబడిందట. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టింది వికారాబాద్ అడవుల్లోనే. వికారాబాద్ చల్లటి ప్రాంతం కావడం, అక్కడ లోయలు, కొండలతో మంచి అడవి ఉండడం, వర్షా కాలంలో అందమైన జలపాతాలు ప్రత్యక్ష మవడం వల్ల నిజాం నవాబులు ఆ రోజుల్లోనే దీన్ని విశ్రాంతి కేంద్రంగా వాడుకున్నారట. ఇక్కడున్న వనాలు వాటిలోని ఔషద గుణాలు గమనించి 1946లోనే ఇక్కడ క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ఒక టీబీ సానెటోరియం పెట్టడం విశేషం. ఓ సారి అడవుల్లోకి వేటకు వచ్చి అలసిసొలసి పడుకున్న నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ) కలలోకి వచ్చిన స్వామి తన ఆలయాన్ని పునరుద్దరించమన్నాడని, ఆ ఆదేశాన్ని రాజు గారు పాటించారని చెబుతారు. -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ! -
బీఆర్ఎస్ టికెట్ నాకే.. గెలిచేది నేనే: పట్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వికారాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నేనే’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ టికెట్పై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారన్నారు. 1994 నుంచి నాయకులు, కార్యకర్తలు తన వెంటే నడుస్తున్నారన్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలలో ముందుండి నడిచానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఓటర్లకు దూరం కాలేదన్నారు. తాండూరు అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ నిధులతో పాటు ఎమ్మెల్సీ గ్రాంటు నిధులను స్థానిక ప్రజా ప్రతినిధులకు కేటాయించామన్నారు. పార్టీలోకి కొందరు వస్తుంటారు.. పోతుంటారు. వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోయారని అలాంటి వారి గురించి పట్టించుకొనే అవసరం లేదన్నారు. తాండూరు రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్ల నిధులను తీసుకువచ్చానన్నారు. ఇప్పటికీ ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగకుండా తాండూరు–వికారాబాద్ రోడ్డుకు రూ.60 కోట్లు, తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ఔటర్ రోడ్డుకు రూ.100 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. ప్రస్తుతం ఔటర్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు కాగ్నా బ్రిడ్జి, బుద్దారం, గాజిపూర్, మన్సన్పల్లి, కందనెల్లి, జీవన్గిలలో బ్రిడ్జీల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని వాటితో గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు, ఎంపీటీసీలు ముందుండి పనులు పూర్తి చేయాలన్నారు. -
ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం
బుధవారం ఉదయం 6 గంటలు.. అది హైదరాబాద్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ ప్రాంతం.. ఆకాశం నుంచి ఏదో భారీ వస్తువు.. మెల్లగా ఖాళీ ప్రదేశంలో దిగింది. చూస్తుంటే ఏదో వ్యోమనౌకలా ఉంది. ఆదిత్య 369 సినిమాలోని ‘టైమ్ మెషీన్’లా ఉందని కొందరు.. ఏదో గ్రహాంతర నౌక కావొచ్చని కొందరు.. ఒక్కసారిగా కలకలం రేగింది. అదేమిటో చూద్దామని పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చారు. మరి అక్కడ ల్యాండ్ అయింది ఏమిటో తెలుసా..? అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చే స్పేస్ క్యాప్సూల్. అది ఇక్కడెందుకు దిగింది? మనకు ఏమిటి సంబంధం? ఆ వివరాలు మీకోసం.. సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/మర్పల్లి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేపుతున్న స్పేస్ టూరిజం అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు స్పెయిన్లోని మాడ్రిడ్కు చెందిన హాలో స్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో, సులువుగా కొన్ని గంటల పాటు అంతరిక్షంలో తిరిగి వచ్చేందుకు వీలుగా హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్ను రూపొందించింది. సుమారు ఎనిమిది మనుషులు, కొంత సామగ్రి దీనిద్వారా ఆకాశంలో సుమారు 40 కిలోమీటర్ల ఎత్తుకు పంపవచ్చు. అక్కడే ఐదారు గంటల పాటు మెల్లగా ప్రయాణిస్తూ.. భూమి అంచులను, దిగువన మేఘాలను, వందలు–వేల కిలోమీటర్ల కొద్దీ దూరాలను వీక్షించవచ్చు. టీఐఎఫ్ఆర్ కేంద్రం నుంచి.. హైదరాబాద్లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) సహకారంతో హాలో స్పేస్ సంస్థ తమ ప్రయోగాన్ని చేసింది. మంగళవారం సాయంత్రం టీఐఎఫ్ఆర్లోని నేషనల్ బెలూన్ ఫెసిలిటీ నుంచి హాలో స్పేస్ హాట్ ఎయిర్బెలూన్ క్యాప్సూల్ను ప్రయోగించారు. అది అంతరిక్షంలో చాలా ఎత్తుకు చేరి, చక్కర్లు కొట్టిన తర్వాత.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగిద్ద గ్రామ శివార్లలో బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ల్యాండ్ అయింది. అలా పెద్ద పరికరం ఆకాశం నుంచి వస్తుండటంతో మొగిలిగిద్దతోపాటు సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు. చాలా మంది తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు కూడా. శాస్త్రవేత్తలు వచ్చి రికవరీ చేసుకుని.. హాట్ ఎయిర్ బెలూన్ స్పేస్ క్యాప్సూల్ను ప్రయోగించిన హాలోస్పేస్, టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్తలు దానిని నిరంతరం పరిశీలిస్తూ వచ్చా రు. భూమి నుంచి ఎంత ఎత్తుకు వెళ్లింది, ఎలా సంచరించినదీ ప్రత్యేక పరికరాలతో ట్రాక్ చేశారు. లక్ష్యం మేరకు ప్రయాణం పూర్తయ్యాక నిర్జన ప్రదేశంలో ల్యాండ్ చేశా రు. సాధారణంగా ఈ క్యాప్సూల్లో మనుషు లు వెళ్లవచ్చు. అయితే ఇది ప్రయోగాత్మక పరిశీలన కావడంతో వెయ్యి కిలోల బరువున్న వస్తువులను పెట్టి ప్రయోగం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం కావడంతో క్యాప్సూల్ 10 కిలోమీటర్లకుపైగా ఎత్తులో 40 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి ల్యాండ్ అయిందని వివరించారు. స్పేస్ క్యాప్సూల్లోని పరికరాల డేటాను విశ్లేశించాల్సి ఉందని.. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించాయా? అంత ఎత్తులో క్యాప్సూల్లో పరిస్థితి ఎలా ఉంటుంది, మనుషులను పంపేందుకు ఏమేం మార్పులు అవసరం అనేది తేల్చుతామని వెల్లడించారు. తొలి ప్రయోగం మన వద్దే.. హాలో స్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు కార్లోస్ మీరా. స్పేస్ క్యాప్సూల్ రూపకల్పన, ప్రయోగాలకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కాస్ట్రిల్లో ఆధ్వర్యంలోని 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంస్థ అంతరిక్ష పర్యాటక రంగంలో తనదైన ముద్ర వేసే దిశగా ప్రయోగాలు చేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన స్పేస్ క్యాప్సూల్ను తొలిసారిగా హైదరాబాద్లోనే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తించే డేటా ఆధారంగా మరింతగా అభివృద్ధి/ మార్పులు చేస్తారు. తర్వాత స్పెయిన్లో మరో ప్రయోగం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతేఅంతరిక్షంలోకి మనుషులను పంపుతామని వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.కోటిపైనే.. హాలో స్పేస్ క్యాప్సూల్ 800 కిలోల బరువుతో 5 మీటర్ల వ్యాసం, 3.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ సాయంతో అంతరిక్షంలోకి ఎగుస్తుంది. దీనికితోడుగా ప్యారాచూట్ సాయంతో ల్యాండ్ అవుతుంది. స్పేస్ క్యాప్సూల్కు చుట్టూ పెద్ద పెద్ద గాజు అద్దాలను బిగించారు. ఇందులో ప్రయాణించేవారు చుట్టూరా అంతరిక్షాన్ని, భూమిని వీక్షించవచ్చు. ఇందులో మొత్తంగా ఎనిమిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ ప్రయాణించవచ్చు. అత్యవసర సామగ్రి, ఆక్సిజన్, రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో ప్రయాణించేందుకు ఒక్కొక్కరికి లక్ష నుంచి రెండు లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.కోటి నుంచి రూ.2 కోట్లు) ఖర్చవుతుందని హాలో స్పేస్ సంస్థ చెప్తోంది. 2025లో వాణిజ్యపరంగా పర్యటనలను ప్రారంభిస్తామని పేర్కొంది. 2029 నాటికల్లా 400 అంతరిక్షల యాత్రలతో 3 వేల మందిని అంతరిక్షంలోకి తీసుకెళతామని అంటోంది. ఇందులో టూరిస్టులు ఆరు గంటల పాటు ప్రయాణించే వీలుంటుందని హైదరాబాద్ నేషనల్ బెలూన్ ఫెసిలిటీ టెక్నికల్ టీం లీడర్ ప్రసాద్ తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్తో ఎలా? వేడిగాలి చల్లటి గాలి కంటే తేలికగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో పైకి వెళ్తుంది. ఈ సూత్రం ఆధారంగానే హాట్ ఎయిర్ బెలూన్ పనిచేస్తుంది. భారీ బెలూన్లో వేడి గాలిని నింపి, ఆ వేడిని నియంత్రిస్తూ ఉండటం వల్ల.. ఆకాశంలోకి వెళ్లే ఎత్తు, ప్రయాణాన్ని నియంత్రించవచ్చు. నాణ్యమైన, భారీ బెలూన్లు వందల కిలోల బరువును అంతరిక్షంలోకి కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లగలవు. తర్వాత బెలూన్లో గాలిని చల్లార్చడం, తగ్గించడం ద్వారా మెల్లగా కిందికి దిగివచ్చేలా చేయవచ్చు. హాలో స్పేస్ క్యాప్సూల్ ఈ విధానంలోనే పనిచేస్తుంది. మన హైదరాబాదే ఎందుకు? హాలో స్పేస్ సంస్థ రూపొందించిన క్యాప్సూల్ హాట్ ఎయిర్ బెలూన్ సాయంతోనే అంతరిక్షంలోకి వెళుతుంది. అంత ఎత్తులోకి బెలూన్లను ప్రయోగించగల సదుపాయం ఆసియా ఖండం మొత్తంలో మన హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడి బెలూన్ ఫెసిలిటీ సెంటర్లో మాత్రమే ఉంది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ఈ కేంద్రం ఉంది. మన దేశంతోపాటు వివిధ దేశాల వాతావరణ, భూసమీప అంతరిక్ష ప్రయోగాల కోసం ఈ ఫెసిలిటీని వినియోగించుకుంటారు. -
వికారాబాద్: వింత పరికరంపై వీడిన మిస్టరీ
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత పరికరం మిస్టరీ వీడింది. అదేంటో చూసేందుకు జనం ఎగబడి పోయారు. అయితే.. ఆ పరికరం స్పెయిన్ దేశానికి చెందిందిగా ధృవీకరించారు సైంటిస్టులు. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. స్పెయిన్ టూరిజంలో జనాలను తరలించే పరికరంగా దీనిని గుర్తించారు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు రూపొందించిన ప్రయోగం దినివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా భారత ప్రభుత్వం సహాకారంతో నిర్వహించిన ప్రయోగం. ఇక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ దేశంలో టూరిజం లో భాగంగా జనాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది. బెలున్ సహాయంతో ప్రయోగించాం. దీనిని పూర్తిగా ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేయడంతో జనాలు లేనివద్దనే దీగేలా చూశాం అని సైంటిస్టులు ప్రకటించారు. -
బీజేపీ, టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు
వికారాబాద్: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, దీంతో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ను ఖతం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతుసమస్యలపై నిర్వహించిన ధర్నాలో రేవంత్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఢిల్లీలో ఉన్నోడు.. గల్లీలో ఉన్నోడు కూడబలుక్కొని డ్రామాలాడుతున్నరు.. ప్రచార మాధ్యమాల్లో ప్రజాసమస్యలపై చర్చ రాకుండా చేస్తున్నారు’ అని అన్నారు. కేంద్రం నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే టీఆర్ఎస్ ఓటేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేవెళ్ల– ప్రాణహిత ప్రాజెక్టు కింద రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అందులో రూ. 8 వేల కోట్లు రంగారెడ్డి జిల్లాలోనే ఖర్చు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో డిజైన్ మార్చి పాలమూరు పథకాన్ని పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలతో నాటకాలు ఈడీ, సీబీఐ, సిట్ల పేరుతో దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటూ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఈడీ నోటీసులిస్తే, వ్యవస్థలను గౌరవించి వెళ్లి సమాధానాలు చెప్పి రాలేదా అని పేర్కొన్నారు. మరి బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు ఇస్తే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని, కవితకు సీబీఐ నోటీసులు ఇస్తే ఇంట్లో కూర్చొని సమాధానమిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్కు కాంగ్రెస్ ఉసురు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న కేసీఆర్.. ఇప్పుడు తన వరకు వచ్చే సరికి ఏడుస్తున్నారని రేవంత్ విమర్శించారు. నాడు రూ.30 కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డి.. నేడు మారు బేరంలో వంద కోట్లిస్తే అమ్ముడు పోకుండా ఉంటాడా? అని నిలదీశారు. తనను జైళ్లో పెట్టినప్పుడు కూతురు నిశ్చితార్థం కోసం ఒక్కరోజు బెయిల్ గురించి ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకోవటం నిజం కాదా? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయన కూతురు వరకు వచ్చే సరికి గగ్గోలు పెట్టడమెందుకని అన్నారు. మీడియా సామాజిక బాధ్యతను మరచిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్కుమార్ పాల్గొన్నారు. ఆ రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యత కామారెడ్డి జిల్లాలో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి ఉరేసుకున్న ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ట్వీట్ చేశారు. ‘రైతును కాపాడేందుకు సమ యం ఉన్నా స్పందించని యంత్రాంగం. కేసీఆర్ పాలనలో మొద్దుబారిన వ్యవస్థల దుర్మార్గానికి నిదర్శనం ఇది’ అని ట్వీట్లో ధ్వజమెత్తారు. -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్ను బస్టాప్లో దింపేందుకు వెళ్తుండగా.. -
వైరల్ వీడియో : కుక్కపిల్లలను కాటేసిన కసాయి నాగు
-
అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా
అనంతగిరి: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ధారూరు క్రిస్టియన్ జాతర నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఎన్టీఆర్ చౌరస్తాలో బస్సు ఎక్కారు. 70 మంది ప్రయాణికులతో బస్సు బయలు దేరింది. అనంతగిరి ఘాట్ రోడ్డు దిగుతున్న క్రమంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో చివరి ఘాట్ వద్ద ముందు వస్తున్న వాహనాలను తప్పించబోయి కుడి వైపు ఉన్న రోడ్డు కిందికి దూసుకుపోయి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సికింద్రాబాద్ రసూల్పురాకు చెందిన స్వరూప (36) అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన విషయాన్ని డ్రైవర్ ప్రయాణికులకు చెప్పడంతో భయాందోళనకు గురైన పలువురు బస్సులోంచి దూకేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. మరికొందరు బస్సులోనే ఉండిపోయారు. మానవత్వం చాటుకున్న ఎంపీ, ఎమ్మెల్యే ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ క్రిస్టియన్ జాతరకువెళ్తున్నారు. విషయం తెలిసిన వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. గాయపడ్డ వారిని అంబులెన్స్లు, ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. -
‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు!
సాక్షి, వికారాబాద్: తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇంకా స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు టికెట్ ఎవరికనే చర్చ అధికార పార్టీలో జోరుగా జరుగుతోంది. గతంలో తాండూరు స్థానం నాదంటే.. నాది అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి బాహాటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ‘ఎర’ అంశం ఎవరికి అనుకూలంగా మారుతుందనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఘటన జరిగిన నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా స్పష్టత రావడంలేదు. ప్రస్తుతం వారి రాజకీయ భవిష్యత్పై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య పోటీ తీవ్రం తాండూరులో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోహిత్రెడ్డిల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. స్వల్ప ఆధిక్యతతో రోహిత్రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా విజయం సాధించాక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తన అనుచరులను సైతం వెంట తెచ్చుకొన్నారు. పదవుల విషయంలోనూ.. తాండూరు అసెంబ్లీ స్థానం కోసం పట్నం మహేందర్రెడ్డితో పాటు పైలెట్ రోహిత్రెడ్డి ఆశిస్తున్నారు. రోహిత్రెడ్డి టీఆర్ఎస్లో చేరినా మహేందర్రెడ్డి వర్గానికి చెందిన నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వచ్చారు. మరోవైపు పార్టీ, నామినేట్ పదవుల విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. తాండూరు అసెంబ్లీ టికెట్ సీఎం కేసీఆర్ తమకే ఇస్తారని ఇద్దరు నేతలు ప్రకటిస్తూ వచ్చారు. మరోవైపు రాజకీయంగా, అధికారికంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పైచేయిగా నిలిచారు. కలిసొచ్చేది ఎవరికో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందనేది తాజాగా చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపునకు బీజేపీ నాలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగడం.. కథ అడ్డం తిరిగి మధ్య వర్తులు జైలు పాలవడం నాలుగు రోజుల వ్యవధిలో చకచక జరిగిపోయాయి. అయితే ఇందులో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కీలకంగా వ్యవహరించారని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కాగా ఈ వ్యవహారం తాండూరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరి రాజకీయ భవిషత్ను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్రావు -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్కు చెందిన యువతి (20)తో దాదాపూర్కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
Photo Feature: బతుకమ్మ చీరలను మూటలు కట్టేందుకు వాడుతున్న మహిళలు
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను లబ్ధిదారులు వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు. కొంతమంది పంట పొలాల్లోకి అడవి పందులు రాకుండా చేల చుట్టూ కడుతుండగా.. మరికొందరు మూటలు కట్టేందుకు వాడుతున్నారు. శనివారం ధారూరు సంతకు వచ్చిన ఓ మహిళా రైతు బతుకమ్మ చీరల్లో ఆకు కూరలు మూట కట్టి తీసుకువచ్చింది. ఇదేమని ప్రశ్నించగా.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాలిస్టర్ చీరలు కట్టుకునేలా లేవని, మూడేళ్లుగా వీటిని పొలం వద్ద బెదుర్లు పెట్టేందుకే వినియోగిస్తున్నామని తెలిపారు. – ధారూరు (వికారాబాద్) -
నాటి ప్రళయంలో అంతమవని ‘తొండ’!
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం.. ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొని ప్రళయం సంభవించింది. అప్పట్లో భూమిపై జీవిస్తున్న సరీసృపాల (పాకే జంతువులు)లో 83 శాతం వరకు అంతరించిపోయాయి. రాక్షస బల్లులూ అంతమయ్యాయి. కానీ తొండలా ఉండే ఓ జీవి మాత్రం ఆ పరిస్థితిని తట్టుకుని.. న్యూజిలాండ్, అర్జెంటీనా ప్రాంతాల్లో బతకగలిగింది. క్రమంగా అర్జెంటీనాలోనూ కనుమరుగైన ఆ జీవులు న్యూజిలాండ్లోని పలు ద్వీపాల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ జీవుల పేరు స్పినోడాన్.. న్యూజిలాండ్లో వాటిని టువాటరా అని పిలుస్తారు. అయితే ఇప్పుడు అమెరికా కేంద్రంగా వెలువడే సైన్స్ జర్నల్ ‘వెర్టిబ్రేట్ పేలియంటాలజీ’ కొత్త విషయాన్ని ప్రపంచం ముందుంచింది. నాటి ప్రళయం నుంచి తెలంగాణలోని నష్కల్ ప్రాంతంలోనూ స్పినోడాన్ బతికి నిలిచింది. సెప్టెంబర్ 26న తమ ఆన్లైన్ ఎడిషన్లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. వచ్చే నెలలో ఈ జర్నల్ ప్రింట్ ఎడిషన్ విడుదల కానుంది. వెన్నుపై ముళ్లలాంటి నిర్మాణాలతో.. చూడటానికి తొండలా కనిపించే స్పినోడాన్లు రింకోసెఫాలియా ప్రజాతికి చెందినవి. వీటికి మొసలిలాంటి తోక, మందమైన చర్మం, శరీరంపై పొలుసులు, తల నుంచి తోక చివరిదాకా పైభాగంలో ముళ్లలాంటి భాగాలు ఉంటాయి. కోట్ల ఏళ్లుగా పెద్దగా రూపాంతరం చెందకుండా ఉండటంతో వీటిని బతికున్న శిలాజాలు (లివింగ్ ఫాజిల్స్)గా అభివర్ణిస్తుంటారు. భూమిని భారీ గ్రహశకలం ఢీకొన్న తర్వాత న్యూజిలాండ్, అర్జెంటీనాలలో తప్ప మరెక్కడా ఈ ప్రజాతి జీవులు బతికిలేవని ఇంతకుముందు జరిగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కానీ తెలంగాణలో వికారాబాద్కు సమీపంలోని నష్కల్లోనూ బతికాయని ఇటీవల గుర్తించారు. మరోసారి వార్తల్లోకి.. నష్కల్లో మూడు దశాబ్దాల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. నాటి శాస్త్రవేత్తలు అనంతరామన్, చకిలం వేణుగోపాల్లతో కూడిన బృందం తవ్వకాలు జరిపి.. సరీసృపాలు, క్షీరదాలకు చెందిన ఎన్నో శిలాజాలను గుర్తించింది. అందులో సూక్ష్మ క్షీరదాల శిలాజాలు ఉన్నట్టు నిర్ధారించడంతో ప్రపంచ పరిశోధకుల దృష్టి నష్కల్పై పడింది. ఇప్పుడు మరో విశిష్టతనూ సొంతం చేసుకుంది. శిలాజాల్లోని ఓ జీవికి చెందిన దవడ, ఇతర భాగాలపై.. అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జి.డీమర్ జూనియర్, గ్రెగరీ పి.విల్సన్ మాంటిల్లా, జెఫ్రీ ఎ.విల్సన్ మాంటిల్లాలతోపాటు మన దేశ శాస్త్రవేత్తలు ఎస్.అనంతరామన్, ఆర్.శివకుమార్, దిలీప్ చంద్ర దస్సారామ్లతో కూడిన బృందం పరిశోధనలు చేసింది. అది స్పినోడాన్ శిలాజమని, గ్రహశకలం ఢీకొన్న చాలా కాలం తర్వాతది అని తేల్చింది. అంటే గ్రహశకలం ఢీకొన్న తర్వాత కూడా ఈ ప్రాంతంలో స్పినోడాన్ జీవులు తిరుగాడినట్టు నిర్ధారించింది. శాస్త్రవేత్తలు దీనికి యాక్రా స్పినడాంటియాగా నామకరణం చేశారు. నష్కల్ ప్రాంతాన్ని కాపాడాలి నష్కల్ చాలా విలువైన ఆధారాన్ని అందించింది. ఇప్పుడు ప్రపంచ పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ పరిశోధనలు కొనసాగిస్తే మరెన్నో అద్భుత విషయాలను గుర్తించవచ్చు. ఇంత ముఖ్యమైన ప్రాంతాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి. – చకిలం వేణుగోపాల్, ఆధారాలు సేకరించిన శాస్త్రవేత్తల బృందం సభ్యుడు -
పంట చేలకు పరదాలుగా బతుకమ్మ చీరలు
సాక్షి, వికారాబాద్: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను రైతులు పంటల చుట్టూ పరదాలుగా కడుతున్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో ఓ రైతు గ్రామంలో ఒక్కో బతుకమ్మ చీరను రూ.50 చొప్పున కొని పంటలకు అడవిపందుల నుంచి రక్షణకు పొలం చుట్టూ కట్టాడు. బషీరాబాద్ మండలానికి 11,316 చీరలు వస్తే రేషన్ డీలర్ల దగ్గర ఇప్పటి వరకు 20 శాతం మహిళలే తీసుకువెళ్లారు. దీంతో డీలర్ల దగ్గర చీరలు కుప్పలుగా మిగిలి పోయాయి. -
Vikarabad: కొడుకు ప్రశ్నించాడని.. భోజనంలో విషం కలిపి
సాక్షి, వికారాబాద్: కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న తండ్రిని ప్రశ్నించినందుకు కొడుకునే హత్య చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన మోమిన్పేట మండల పరిధిలో ఎన్కతల గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్కతలకు చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మలు దంపతులు. వారికి వెంకటేశం, కృష్ణ ఇద్దరు కుమారులు. పెంటయ్య ఎద్దులు, మేకల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుండేవాడు. భార్య గోవిందమ్మ కుమారులను చేరదీసి ఉన్న ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల భూముల ధరలు విపరీతంగా పెరగడంతో భూమిని అమ్ముదామని ఇంట్లో గొడవ పడుతుండేవాడు. అవసరం లేనిది భూమి అమ్మడం దేనికని కుమారులిద్దరూ అడ్డుపడుతున్నారు. ఈ నెల 24న ఉదయం పెద్ద కుమారుడు వెంకటేశం భోజనం చేసే సమయంలో అన్నంలో తండ్రి విషం కలిపాడు. తెలుసుకోకుండా భోజనం చేసిన వెంకటేశం అస్వస్థకు గురి కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్నంలో విషం కలిపారని తెలపడంతో తల్లి గోవిందమ్మ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటేశం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపారు చదవండి: అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్లో ఆందోళన -
పాలమూరు పూర్తి ఎప్పుడో అడిగే దమ్ముందా?
వికారాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగే దమ్ము ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలకు ఉందా? అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కనీసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపే ధైర్యం కూడా లేదన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం వికారాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో పాటు స్థానిక ఎమ్మెల్యే అక్రమాలు, ఆక్రమణలను ఎండగట్టారు. రాష్ట్రంలో నాటి వైఎస్సార్ పాలన తీసుకొచ్చేందుకే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పేదలకు పక్కా ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, 108 లాంటి చరిత్రాత్మక పథకాలతో వైఎస్ ప్రజల గుండెల్లో దేవుడయ్యారని తెలిపారు. ఐదేళ్లలోనే ఇన్ని పనులు చేస్తే ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ ఇంకెంత చేయాలని ఆమె ప్రశ్నించారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగభృతి, దళితబంధు, గొర్రెల పంపిణీ ఇలా ఏ పథకం చూసినా..నీరుగారి పోయినవేనని విమర్శించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి వికారాబాద్ జిల్లాకు 50 టీఎంసీల నీళ్లు వైఎస్ కేటాయిస్తే కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు డిజైన్ మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా..? అని ఆమె ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. -
‘ట్రీ వాక్’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!
ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు. మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు. అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే... మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్ కొల్లి, సాధన రాంచందర్. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు. ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్. కదిలించిన వార్త ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు. అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్లైన్ పిటిషన్ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్ హైవే అథారిటీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు. తరలింపు సరైనదేనా?! రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్ (ఎన్హెచ్ఎ) వాళ్లను కలిశాం. కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం. అవగాహన అవసరం చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్ హెరిటేజ్గా మార్చాలన్నది మా ప్రయత్నం. కొన్నిసార్లు నెమ్మది అవసరమే! ‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!) ఈ యేడాది జూన్లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్లైన్లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు. అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం. – నిర్మలారెడ్డి -
మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు
సాక్షి, వికారాబాద్: వికారబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లోని మద్యం దుకాణాల యజమానులు ధనార్జనే ధ్యేయంగా మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం ప్రియులకు ఏది అసలో ఏది కల్తీనో తెలియని పరిస్థితి. టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆలోచనతో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం కల్తీ చేసే వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుగా దంగా చేస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి అందులో చీప్ లిక్కర్, నీటిని కలిపి మల్లీ యథావిధిగా సీల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రాండ్లన్నీ కల్తీమయం జిల్లా ఎక్సైజ్ పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 59 వైన్ షాపులు, ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు గ్రామాలు, తండాల పరిధిలోని ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కవ ధర ఉన్న బాటిళ్లలో స్టిక్కర్లు, లేబుళ్లను మార్చుతూ విక్రయిస్తున్నారు. ప్రధానంగా పరిగి నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన తాండూరు, కొడంగల్ లోనూ కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పెరిగిన మద్యం ధరలతో ఈ కల్తీ ప్రక్రియ మరింత ఎక్కువగా సాగుతోంది. చదవండి: హైదరాబాద్లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు వేసిన సీల్ వేసినట్లే.. అధిక ధరలున్న మద్యం సీసాల లేబుళ్లను, స్టిక్కర్లను ఏమాత్రం తేడా లేకుండా ఓపేన్ చేసి మళ్లీ సీల్ వేసేందుకు కొన్ని వైన్షాపుల యజమానులు స్థానికేతరులను, కల్తీ చేయడంతో అనుభవం ఉన్నవారిని తీసుకువస్తున్నట్లు సమాచారం. వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి మద్యాన్ని ఇష్టానుసారంగా కల్తీ చేయిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలో 25శాతం మద్యాన్ని బయటకు తీస్తూ బదులుగా నీటిని కలుపుతున్నారు. లేదంటే తక్కువ ధరకే లభ్యమయ్యే చీప్ లిక్కర్ ఇతర మందులను కలుపుతూ కల్తీ చేస్తున్నారు. దీంతో వైన్స్ యజమానులు మూడు పువ్వులు, ఆరుకాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బెల్టు షాపుల్లోనూ ఈ తరహా వ్యాపారమే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లాలో ఇంత భారీగా మద్యం కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తుల్లో జోగుతూ కల్తీ మద్యం తయారీకి వత్తాసు పలుకుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మద్యం షాపుల్లో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా కేటుగాళ్లు తయారయ్యారు. ప్రమాదకర, విషపూరిత రసాయనాలు కలిసి అసలు ఏదో.. నకిలీ ఏదో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పెద్ద రిస్కే తీసుకుంటున్నారు. ఆయన దేశ ప్రధానిని ఉద్దేశించి వికారాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీనే శత్రువు అని ప్రకటించడం ఆషామాషీ విషయం కాదు. కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ఆయా అంశాలలో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతుండడం సహజంగానే జరుగుతుంటుంది. కేంద్రంలోను, రాష్ట్రాలలోను ఒకే పార్టీ అధికారంలో ఉన్నా, కొన్ని సందర్భాలలో విధానపరంగా తేడా రావచ్చు. అయితే , పార్టీ అధిష్టానం పెద్దలు సంప్రదింపుల ద్వారా వివాదాన్ని చల్లబరుస్తుంటారు. చదవండి: కాంగ్రెస్లో ట్విస్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన మర్రి శశిధర్ రెడ్డి కానీ కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ ఉన్నప్పుడు విబేధాలు వస్తే అవి క్రమేపి సీరియస్ రూపం దాల్చుతాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్న పోరాటం అలాగే రూపాంతరం చెందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పవర్లో ఉన్న టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్దం హద్దులు దాటిపోయింది. ఎవరైనా ఎన్నికల రాజకీయాలలో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు నరేంద్ర మోదీ, కేసీఆర్లు స్నేహభావంతోనే ఉండేవారు. ఈ ఎనిమిదేళ్ల మోదీ పాలనలో చేసింది ఏమీ లేదని, దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శిస్తున్న కేసీఆర్ గతంలో పలు చట్ట సవరణలకు కాని, కేంద్రం చేసిన నిర్ణయాలకు కాని మద్దతు ఇచ్చారు. ఉదాహరణకు మోదీ నోట్ల రద్దు ప్రకటించిన్పుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశంలోనే ప్రశంసించారు. జీఎస్టీ వంటివాటికి మద్దతు ఇచ్చారు. రెండో టరమ్ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి ఇద్దరి మధ్య తేడా వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు ఆరంభించడం, దానిని టీఆర్ఎస్ తిప్పికొట్టడానికి పూనుకోవడం సాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్తో పోల్చితే అంతగా బలం లేని బీజేపీ కొంత పుంజుకుంటే విపక్ష ఓట్లు చీలి తమ గెలుపు సునాయాసం అవుతుందని కేసీఆర్ భావించారు. అందుకే ఆయన తొలుత కాంగ్రెస్పై కన్నా, బీజెపిపైనే అధిక విమర్శలు ఎక్కపెట్టడం ఆరంభించారు. కానీ అవి నానాటికి పెరిగిపోయి రెండు పార్టీల మధ్య నువ్వా?నేనా అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని టీఆర్ఎస్ మొదట ఊహించలేదు. కాలం ఎప్పుడూ ఒకేమాదిరిగా ఉండదు. అందులోను రాజకీయాలు హాట్గా మారుతున్నప్పుడు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ఎంతకాదన్నా కేంద్రానికి విశేష అధికారాలు ఉంటాయి. అలాగని రాష్ట్రాలకు ఏమీ ఉండవని కాదు. కాని కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం పెద్ద సమస్య కాదు. దానిని ఎండగట్టడానికి కేసీఆర్ ఈ మధ్యన ఎక్కడా వెనుకాడడం లేదు. దానికి కారణం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో అనూహ్యంగా టీఆర్ఎస్ ఓటమిపాలై, బీజేపీ గెలవడం, హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకోవడం, దాంతో బీజేపీ ఇక తమదే అధికారం అన్నంతగా సవాళ్లు విసురుతుండడంతో టీఆర్ఎస్ అప్రమత్తమవుతోంది. ఈ లోగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామాతో రాబోతున్న ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కాబోతోంది. ఈ ఫలితం వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ బీజేపీపైన, నేరుగా ప్రధాని మోదీపైన విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్న కేసిఆర్కు పరిస్థితులు కలసి రావడం లేదు. ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో జత కట్టడం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్న సూత్రానికి కేసిఆర్ వచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఆయన మోదీపైన మాటల ఘాటు పెంచారు. మోదీని ఏకంగా తెలంగాణకు శత్రువు అని ప్రకటించి పెద్ద రిస్క్ చేశారు. ఈ వ్యాఖ్య సహజంగానే బీజేపీకి మరింత కోపం తెప్పిస్తుంది. టిఆర్ఎస్ పైన బీజేపీ దాడి మోతాదు పెంచుతుంది. ప్రభుత్వపరంగా కూడా మరిన్ని వైరుధ్యాలు ఏర్పడవచ్చు. కేసీఆర్పై కాళేశ్వరం అవినీతి అని, కుటుంబ పాలన అని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్తో కాస్త సంబందాలు ఉన్న రాజకీయేతర వ్యక్తులపై ఐటి, ఈడి వంటి సంస్థలు దాడులు చేస్తున్నాయన్న వార్తలు వచ్చాయి. అప్పులకు సంబంధించి కూడా ఆర్బిఐ పలు ఆంక్షలు పెట్టింది. వీటన్నిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ముందస్తు ప్రణాళిక అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం పనితీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ, అదే సమయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి కేసీఆర్ సంకల్పించారు. తెలంగాణకు నిధులు సరిగా ఇవ్వడం లేదని, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల జాప్యానికి కేంద్రమే కారణమని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను అన్యాయం చేస్తోందని తదితర విమర్శలు చేస్తున్నారు. ప్రాజెక్టుల ఆలస్యానికి కేంద్రం ఎలా కారణం అవుతుందో తెలియదు. కృష్ణా జలాల వాటా తేల్చలేదని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చి వెంటనే తేల్చాలని అంటోంది. అలాగే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, సబ్సిడీ చెల్లించవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పుడు రైతులకు ఏ రకంగా నష్టం అవుతుందో అర్థం కాదు. ఉచిత స్కీములను వ్యతిరేకిస్తూ మోదీ కాని, కేంద్రం కాని వ్యక్తపరిచిన అభిప్రాయాలను కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారు. అయితే అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాన్ని కొంత బిగించినట్లే కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తదితర అంశాల ఆధారంగా కేసీఆర్ విమర్శలు చేశారు. కేంద్రంపై ఈ తరహా దాడి చేసిన ప్రాంతీయ పార్టీల నేతల పట్ల బీజేపీ సావధానంగా ఉంటుందని అనుకోవడానికి వీలు లేదు. మున్ముందు టీఆర్ఎస్ ప్రముఖులపై కేంద్ర ఏజెన్సీలు దాడులు అధికంగా చేయవచ్చని భావిస్తున్నారు. కేసీఆర్ జోలికి నేరుగా వెళ్లకుండా, ఆయన చుట్టూ ఉన్న ప్రముఖులను ఈ సంస్థలు ఇబ్బంది పెట్టవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసి, ఓటమి తర్వాత పూర్తిగా సరెండర్ అయ్యారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్రంపైన హోరాహోరీ పోరాడినా, ఆమె మంత్రివర్గ సభ్యుడు పార్ధ చటర్జీపై ఈడీ జరిపిన దాడిలో ఏభై కోట్ల నగదు పట్టుబడడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలకు హాజరు కావడం గమనించదగిన అంశం. ప్రస్తుతం కేసీఆర్ కేంద్రంలో మోదీ ఏర్పాటు చేసే సమావేశాలకు హాజరు కావడంలేదు. రాష్ట్రానికి మోదీ వచ్చినా స్వయంగా స్వాగతం పలకడం లేదు. మరో వైపు రాష్ట్రంలో కాంగ్రెస్ను ప్రత్యర్థిగా చూస్తున్నా, ఢిల్లీ స్థాయిలో మాత్రం కాంగ్రెస్తో పాటు ఆయా వేదికలను పంచుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీని దెబ్బకొట్టడానికి, బీజేపీ భవిష్యత్తులో కేంద్ర ఏజెన్సీలను వినియోగించినా, ప్రజలలో ఆ పార్టీపై వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా ఉంది. అల్టిమేట్గా మునుగోడులో విజయం సాధించడం, తద్వారా వచ్చే శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్కు ఎదురు లేదన్న భావన కల్పించడం కోసం కేసీఆర్ ఈ రిస్క్ తీసుకున్నట్లుగా ఉంది. ఇది కాలిక్యులేటెడ్ రిస్కు అవుతుందా?లేక డేంజరస్ రిస్క్ అవుతుందా అన్నది చెప్పడానికి మరికొంత సమయం పడుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మన శత్రువు మోదీనే.. వికారాబాద్ సభలో కేసీఆర్ ఆగ్రహం..
మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలి. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కథ అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలి. – కేసీఆర్ వేగంగా పురోగమిస్తున్న తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన శత్రువుగా మారారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధిని జీర్ణించుకోలేక అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యొద్దట. మోటార్లకు మీటర్లు పెట్టాల్నట. సింగరేణి బొగ్గున్నంక కూడా మోదీ చెప్పిన సావుకార్ల కాడ కొనాల్నట. కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టాల్నట..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి రోజురోజుకూ దిగజారుతోందని, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, నిరుద్యోగమూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఇవన్నీ ప్రశ్నించినందుకేనా తెలంగాణపై కుట్ర చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రభుత్వం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి..’ అంటూ ప్రజలను కోరారు. కేంద్రంలో రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమ ప్రభుత్వం రావాలని, అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. మళ్లీ మోసపోతే గోస పడతామని, ఈ దుర్మార్గులు, దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం వికారాబాద్లో నూతన కలెక్టరేట్, సమీకృత కార్యాలయ భవనాన్ని, టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. మెడికల్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. నెత్తికి రుమాలు కట్టుకొని గాలిమాటలు చెప్పిండు ‘నిన్నటి ప్రధాని ప్రసంగంలో (స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా) పస ఏమీ లేదు. ప్రధాని ఏదో చెబుతారని దేశ ప్రజలు ఎదురుచూశారు. కానీ నెత్తికి రుమాలు కట్టుకుని గాలి మాటలు చెప్పిండు. భవిష్యత్తులో ఉజ్వల భారతదేశం నిర్మాణం దిశగా మనం కంకణ బద్ధులం కావాలి. లేకుంటే సమాజం వెనుకబడతది. సమైక్య పాలనలోని బాధలు మళ్లీ రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టి, రైతులకు కేంద్రం శఠగోపం పెడుతోంది. మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండి..’ అని సీఎం ప్రశ్నించారు. మోసపోతే.. గోస పడుతం ‘మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం. వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలి. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కత అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలి. 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, చావు అంచుదాకా పోయి తెలంగాణ తెచ్చుకున్నం. ఇప్పుడు తెలంగాణలో మంచినీళ్లు, కరెంటు బాధ లేదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీళ్లిస్తున్నం. అన్ని రంగాలకూ 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. 26 లక్షలకు పైగా మోటార్లకు ఉచిత కరెంటు ఇస్తున్నం. దేశంలోనే అత్యధికంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నం. ఐటీ, పారిశ్రామిక రంగాలను గొప్పగా అభివృద్ధి చేసుకున్నం. తెలంగాణ ఆదాయం అద్భుతంగా పురోగమిస్తున్నది. కానీ కేంద్రంలో ఉన్నవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతున్నరు. నేడు ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండు. ఎన్ని అడ్డంకులెదురైనా పరిగి, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలకు సాగు నీళ్లందిస్తాం..’ అని హామీ ఇచ్చారు. భూముల రేట్లు పడిపోతాయన్నారు.. ‘తెలంగాణ వస్తే భూములు రేట్లు పడిపోతాయని అపోహ సృష్టించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాటి సమైక్యవాద తొత్తులు తెలంగాణకు అడ్డు పడ్డరు. కానీ నేడు తెలంగాణ వచ్చినంక, భూముల రేట్లు విపరీతంగా పెరిగినయి. ఉద్యమ సమయంలోనే వికారాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేస్తా అని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం. తెలంగాణ రాకపోతే వికారాబాద్ జిల్లా ఏర్పాటు అయ్యేదా? వికారాబాద్కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ వచ్చేవా?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ‘ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నం. వ్యవసాయానికి ఉచిత కరెంటు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ తదితర అనేక పథకాలను అమలు చేయాలని పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కోరుతున్నరు. గూడు చెదిరి చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిన రైతులను కాపాడుకోవాలనే సంకల్పం తీసుకొని అనేక రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నం. రైతు బంధు పథకంతో ఎకరాకు ఏటా రూ.10 వేల సాయం అందిస్తున్నం. ఒక గుంట భూమి ఉన్న రైతు దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నం. నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నయి. భవిష్యత్తులో రైతులకు ఇంకా ఎంతో చేస్తం. ప్రపంచంలోనే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు లేవు. ప్రజలు ఆలోచించాలె.. చర్చ పెట్టాలె..’ అని కోరారు. కర్ణాటక పోయి చూడండి ‘పక్క రాష్ట్రం కర్ణాటక పోయి చూడండి. ఎట్లున్నదో తెలుస్తది. అక్కడి పరిస్థితి ఏంది.. ఇక్కడి పరిస్థితి ఏందో తెలుస్తది. వికారాబాద్లో ఇంతమంచి కలెక్టరేట్ భవనం వస్తదని అనుకున్నమా? 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నం. ఇందుకేనా కేసీఆర్ బస్సుకు బీజేపీ వోళ్లు జెండాలు అడ్డం పెట్టేది?..’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ఎంపీ రంజిత్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, కొప్పుల మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన తెలంగాణ -
గత పాలనకు ఈ పాలనకు తేడాని ప్రజలు గమనించాలి: సీఎం కేసీఆర్
-
బీజేపీ జెండా పట్టుకొని నా బస్కు అడ్డం వస్తారా?: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోందన్నారు. చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. సిద్ధించిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే రాష్ట్రం బాగుంటేనే సరిపోదని, దేశం కూడా బాగుండాలని ఆకాంక్షించారు. వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు కర్ణాటకకు మించి భూముల ధరల పెరిగాయన్నారు. కర్నాటక కన్నా వికారాబాద్లో భూముల ధరలు ఎక్కువని, ఇక్కడ ఒక ఎకరం అమ్మితే అక్కడ మూడు ఎకరాలు కొనొచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. వికారాబాద్కు మెడికల్, డిగ్రీ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు తెలంగాణలో ఉన్నాయి. రైతు బీమాతో రైతు కుటుంబాలకు అండగా ఉంటున్నాం. రైతాంగాన్ని కాపాడుకోవాలి, పల్లె సీమలు కళకళలాడాలనేదే మా ఉద్ధేశం. నీటి బకాయిలు కూడా మాఫీ చేశాం. తెలంగాణ పల్లెలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలను ఉచితాలంటూ కేంద్రం ప్రచారం చేస్తోంది. ఉచిత పథకాలు రద్దుచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెబుతోంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. చదవండి: వికారాబాద్లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం మోదీ 8 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు. సాక్ష్యాత్తు ప్రధాన మంత్రే తెలంగాణకు శత్రువు అయ్యారు. సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్లకు నింపుతున్నారు. ప్రధాని నిన్న గంట మాట్లాడారు. అంతా గ్యాసే. నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప ఏముంది. డైలాగులు తప్ప దేశానికి మంచిమాట ఉందా. బీజేపీ జెండా పట్టుకొని నా బస్కు అడ్డం వసార్తా?. వికారాబాద్కు నేనేం తక్కువ చేశానో ప్రజలు చెప్పాలి. బీజేపీని నమ్ముకుంటే మనకు మళ్లీ పాత రోజులే వస్తాయి. వికారాబాద్, తాండూరు, చేవెళ్లకు కృష్ణా నీళ్లను తెస్తాం. కేంద్రం తీరు వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. రాష్ట్రాలకు మేలు చేయకపోగా పథకాలను రద్దు చేయాలంటున్నారు. గ్యాస్, పెట్రోల్ ధర గతంలో ఎంత.. ఇప్పుడు ఎంత ఉంది. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలి. కేంద్రంలోనూ రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
వికారాబాద్లో సీఎం కేసీఆర్.. కలెక్టరేట్, టీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం
సాక్షి, వికారాబాద్: వికారాబాద్లో పర్యటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత ఉస్మానియా మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. శాఖలన్నీ ఒకే గూటికి.. వాస్తవానికి కలెక్టరేట్ భవనం ఏడాది క్రితమే పూర్తయ్యింది. సీఎంకు సమయం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం కోసం ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తాజాగా రూ.42 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టరేట్ భవనంలో కేవలం డజన్ శాఖలు మాత్రమే ఉండగా కీలక శాఖలన్నీ బయటే కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: Hyderabad: పోలీసు ఫోన్ నెంబర్లు మారాయి.. కొత్త నెంబర్లు ఇవే -
75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. రోడ్డుకు నోచుకోని తండాలు
సాక్షి, వికారాబాద్: స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నా గిరిపుత్రులు నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. తండాలు పంచాయతీలుగా మారినా వాటి దుస్థితి మారలేదు. రోడ్డు సౌకర్యంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ కనీసం అంబులెన్స్లు కూడా రాలేని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. బషీరాబాద్ మండలంలోని ఐదు గిరిజన తండాలకు నేటికీ రవాణా వ్యవస్థ లేకపోవడంతో కాలినడకనే దిక్కవుతోంది. మండలంలోని బోజ్యానాయక్తండా, బాబునాయక్ తండా, హంక్యానాయక్ తండా, వాల్యానాయక్తండా, పర్శానాయక్, తౌర్యనాయక్తండాలకు రోడ్డు సౌకర్యాలు లేవు. ప్రభుత్వం 2018లో ఎస్టీఎస్డీఎఫ్ (గిరిజన సొసైటీ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ.4.28 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీఓ 369 విడుదల చేసింది. అయితే ఆ యేడాదిలో వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ పనులకు సంబంధించిన టెండర్లు వాయిదా పడుతూవచ్చాయి. తీరా 2020 మేలో పనులకు టెండర్లు పిలువగా అప్పట్లోనే ఇద్దరు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో 2020 జూన్ 5న మంత్రి సబితారెడ్డి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండు నెలల్లో రోడ్లువేసి బస్సు సర్వీసులు కూడా నడిపిస్తామని అప్పట్లో మంత్రి గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే వాల్యానాయక్తండా రోడ్డు తప్ప నేటికీ మిగతా ఐదు తండాలకు రోడ్డు పనులు ప్రారంభించలేదు. స్వాతంత్య్రం వచ్చి వజ్రోత్సవాలు ఒకవైపు జరుపుతుండగా గిరిజన తండాల రోడ్లకు మోక్షం లభించడంలేదని తండావాసులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఈ తండాలకు చెందిన గిరిజనులు బషీరాబాద్కు రావాలంటే రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే. ప్రాణాలు పోతున్నా పట్టింపులేదు మాసన్పల్లి అనుబంధ గ్రామం తౌర్యనాయక్తండాకు రోడ్డు సౌకర్యంలేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సకాలంలో ఆస్పత్రికి చేరుకోక ప్రాణాలు కోల్పోయారు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు రోడ్డు వేయాలని ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదు. – భీమప్ప, సర్పంచ్, మాసన్పల్లి కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు మండలంలోని బోజ్యానాయక్, బాబునాయక్, హంక్యానాయక్, తౌర్యానాయక్, వాల్యానాయక్తండాలకు రూ.4.28 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులు మంజూరు అయ్యాయి. ఈ పనులకు 2020లోనే అగ్రిమెంట్లు పూర్తిఅయ్యాయి. వాల్యానాయక్తండా పనులు పూర్తి అయ్యాయి. తౌర్యానాయక్తండా రోడ్డులో కల్వర్టు పనులు చేశాం. అయితే నిధులులేమి కారణంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడంలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – వంశీ కృష్ణ, ఏఈ, పీఆర్ గిరిజన భావాలకు అక్షరమేదీ? బొంరాస్పేట: గిరిజన తెగళ్లోని లంబాడీ, గోండు, ఎరుకల వారికి ఇప్పటికీ లిపి లేకపోయింది. ఈ తెగల వారు మాతృభాషలో మాట్లాడుకోవడం తప్ప అక్షరాలు రాయలేని పరిస్థితి. మాతృభాష ఒకటి, చదువు నేర్చేది మరో భాష కావడంతో తోటి విద్యార్థులతో తగినంత ప్రతిభ కనబర్చలేకపోతున్నారు. వివిధ మండలాల్లో గోండు, నాయకి, పర్జీ, గదవ వంటి మాృభాష కలిగిన వారున్నారు. లంబాడీ, ఎరుకల, బుడగజంగం తెగల వారికి లిపి లేదు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కంటే బొంరాస్పేటలో అత్యధికంగా 70కిపైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన పిల్లలు మాతృభాషను మాట్లాడుకోవడానికే పరిమితమవుతున్నారు. చదువుకోవడంలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై ఆధారపడాల్సి వస్తోంది. గిరిజన విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి గిరిజన తెగల మాతృభాషలకు లిపి కల్పించాలని కోరుతున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ పలువురి అభిప్రాయాలు ఇలా.. లిపి రూపొందించాలి జనాభాలో 25 శాతానికిపైగా గిరిజన తెగల వారు ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. లంబాడీ భాషలో మాట్లాడే వారికి తెలుగులో చదవడం ఇబ్బంది ఏర్పడుతోంది. తోటి విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారు. లంబాడీతోపాటు గిరిజనుల భాషకు లిపి రూపొందించాలి. – విజయలక్షి, గిరిజన ఉపాధ్యాయురాలు తోటివారితో పోటీపడలేక.. మాతృభాష లంబాడీని సునాయాసంగా మాట్లాడుతున్నాం. తెలుగు, ఇతర భాషల్లో అంతగా మాట్లాడలేక పోతున్నాం. లంబాడ యాసలో మాట్లాడితే నవ్వుకుంటున్నారు. చదువులో ఇంకా ఇబ్బందిగా ఉంది. మిగతా విద్యార్థులకు మాతృభాష, చదువుకునే భాష ఒకటేకావడంతో చురుకుగా ఉన్నారు. – శాంతి, గిరిజన విద్యార్థిని, బాపల్లి -
లైన్మెన్తో గొడవ, రైతుకు షాకిచ్చిన విద్యుత్ సిబ్బంది, ఏకంగా రూ.65వేల బిల్లు
సాక్షి, వికారాబాద్: ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్ వ్యవసాయ కూలీ.. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్ నంబర్ 58లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతినెల విద్యుత్ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్మెన్.. రెడ్యానాయక్తో మీటర్ బాగాలేదు వేరే మీటర్ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్మెన్కు రూ.2వేలు ఇచ్చాడు. డబ్బులిచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్ బిగించకపోవడంతో రెడ్యానాయక్ గత నెల (జూన్)లో లైన్మెన్ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు లైన్మెన్ వచ్చే నెల చూడు నీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65,240 బిల్లు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచక రైతు విద్యుత్ ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే కాలుస్తేనే అంత బిల్లు వస్తదిగా అని నిర్లక్షంగా సమాధానం ఇచ్చారు. ఎన్నడూ రానంతగా ఇంతమొత్తంలో విద్యుత్ బిల్లు వస్తే ఎం చేయాలని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతినెల రూ.100లోపు బిల్లు వచ్చేదని దానిని నిర్ణీత గడువులోపు చెల్లిస్తూనే ఉన్నాని.. లైన్మెన్ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ ఖజాను వివరణ కోరగా 2014నుంచి రైతు మినిమం బిల్లును ప్రతి నెల కడుతున్నాడని అందుకే రీడింగ్ జామ్ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. -
రాంచరణ్ సినిమా షూటింగ్ను అడ్డుకున్న బీజేపీ
సాక్షి, వికారాబాద్: సరూర్నగర్లో రాంచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ను బీజేపీ అడ్డుకుంది. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంలో మంగళవారం సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీవాణి తన అనుచరులతో వచ్చి షూటింగ్ను అడ్డుకున్నారు. తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్లకు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అనాథ పిల్లల పేరు మీద జేబులు నింపుకునేందుకే షూటింగ్లకు అనుమతి ఇస్తున్నారని ఆరోపించారు. చదువుకునే పిల్లలందరినీ రెండు గదుల్లో పెట్టి పాఠశాలను సినిమా షూటింగ్కి ఇవ్వడం ఏమిటని, తరగతి గది పక్కనే సినిమా షూటింగ్ నిర్వహిస్తే చదువుకునేది ఎలా అని నిలదీశారు. ఒకరోజు షూటింగ్కు రూ.3 లక్షల వరకు అద్దె రూపంలో తీసుకుంటున్నారని.. ఈ డబ్బంతా వీఎంహోం అభివృద్ధికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. -
వానల ఎఫెక్ట్: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్ బంద్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వికారాబాద్, పూడూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. మూసీవాగు, కాగ్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. గత 24 గంటల్లో అత్యధికంగా కందవాడలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 4.95 సెం.మీ. నమోదైంది. ప్రధాన ప్రాజెక్టులు శివసాగర్, నందివాగు, జుంటుపల్లి, కోట్పల్లి, లఖ్నాపూర్, సర్పన్పల్లి తదితర ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిండి అలుగు పారు తున్నాయి. తాండూరుకు అన్ని వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కలెక్టర్ కార్యాలయం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. కాగా, భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థలు అన్నింటికీ కలెక్టర్ నిఖిల బుధవారం సెలవు ప్రకటించారు. కాగా, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల పంటపొలాలు, ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో అధికారులు గండిపేట్, ఉస్మాన్సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇది కూడా చదవండి: అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ -
కుమ్మేసిన వరణుడు.. హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కుండపోత
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్/మొయినాబాద్: రాష్ట్ర రాజధానిని జడివానలు వీడటంలేదు. హైదరాబాద్తోపాటు వికారాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జనజీవనం అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా ఎడ తెరిపిలేకుండా కుంభవృష్టి కురియడంతో నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు, రెండువందలకు పైగా బస్తీలు పూర్తిగా నీటమునిగాయి. ఇళ్లు, అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు కాలనీలు, బస్తీలవాసులు నానా అవస్థలు పడ్డారు. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. వరద నీరు పోటెత్తడంతో జంట జలాశయాలు, హుస్సేన్సాగర్ సహా పలు నాలాలు, చెరువులు, కుంటలు ఉప్పొంగుతున్నాయి. జీహెచ్ఎంసీ, జలమండలి అత్యవసర బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నాయి. హిమాయత్సాగర్ ఆరు గేట్లు ఎత్తివేత భారీగా కురుస్తున్న వర్షాలకు ఈసీ వాగు ఉప్పొంగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్, శ్రీరాంనగర్, అమ్డాపూర్, బాకారం, నాగిరెడ్డిగూడ గ్రామాల వద్ద వాగు ఉప్పొంగి పంటపొలాలన్నీ నీటమునిగాయి. చేవెళ్ల మండలం కందవాడలో 12.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హిమాయత్సాగర్ జలాశయంలోకి భారీగా వరద రావడంతో 6 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 3,910 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్సాగర్ జలాశయంలో 10 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 6,090 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బైకర్ను కాపాడిన పోలీసులు రాజేంద్రనగర్: వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండలం దూబ్చెర్ల గ్రామానికి చెందిన గౌనీ అరవింద్గౌడ్ (20) హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో అరవింద్ కంచన్బాగ్లోని బాబాయ్ ఇంటికెళ్లి అక్కడే చదువుకునేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో తన బైక్పై పుస్తకాలు, ఒక కుర్చీ తీసుకుని అప్పా చౌరస్తా నుంచి హిమాయత్సాగర్, రాజేంద్రనగర్ మీదుగా వెళ్తున్నాడు. హిమాయత్సాగర్ గేట్లు తెరవడంతో ఔటర్ సబ్రోడ్పైనుంచి వరద ప్రవహిస్తోంది. బాబాయ్ ఇంటికి వెళ్లి చదువుకోవాలనే పట్టుదలతో ఉన్న అరవింద్ బైక్ను ముందుకుపోనిచ్చాడు. వరద ఉధృతికి వాహనం రెయిలింగ్ వద్దకు కోట్టుకుపోగా దానిని పట్టుకుని, కాపాడాలంటూ వేడుకున్నాడు. 45 నిమిషాలపాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన అతడిని రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ బేగ్ తన సిబ్బందితో ట్రాఫిక్ వాహనాన్ని తెప్పించి వాహనంతోసహా అరవింద్ను కాపాడారు. తర్వాత అరవింద్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తోంటే.. అతడు తడిచిపోయిన పుస్తకాలను సరిచేసుకుంటూ తనకు చదువే ముఖ్యంగా కనిపించిందని పోలీసులకు చెప్పాడు. అరవింద్ వరద నీటిలో చిక్కుకోవడంతో ఔటర్పై వెళ్తున్న వాహనాదారులతోపాటు స్థానికులు తమ సెల్ఫోన్లలో ఈ దృశ్యాన్ని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్ను ఫ్రిజ్లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. జంట నగరాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల నీటి తొలగింపు సమస్యగా మారి.. ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. వికారాబాద్, శంకర్పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. Today - Moderate Rains During Evening/Night Time. Tomorrow - Heavy Rains Likely from Afternoon -Early Morning. — Hyderabad Rains (@Hyderabadrains) July 26, 2022 గరిష్టంగా వికారాబాద్లో 12 సెం.మీ, నగరంలో హస్తినాపురంలో వర్షపాతం నమోదు అయ్యింది. మూసారంబాగ్-గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట్ రైల్వే స్టేషన్ కింద నీరు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నారు. #StayAway from power transformers, power poles & wires. #Heavy_rain #Massive_floods #rain #HyderabadRains #flood #floods #StayAlert.@TelanganaDGP @CommissionrGHMC @TelanganaCOPs @hydcitypolice @cyberabadpolice @TS_SheTeams @ts_womensafety @Rachakonda_tfc @sheteams_rck pic.twitter.com/L5dR4SpkfB — Rachakonda Police (@RachakondaCop) July 26, 2022 Mallepally area of #Hyderabad at night due to heavy #Rains pic.twitter.com/zArxpOaIMc — Sandeep Dhar (@sandeepdhar10) July 26, 2022 #ALERT Next 2hrs forecast ⚠️#HeavyRain continue all over #Vikarabad #Hanmakonda #Jangaon #Peddapalli #Mancherial #Adilabad #Gadwal . RAINS in Nizamabad, Kamareddy, Medak, Karimnagar, Mahabubnagar, Narayanpet, Sircilla, Asifabad and Jagitial districts Less rains in #Hyderabad pic.twitter.com/aEXSivW651 — Praja Sangram Yatra 3 (@sandeep_muttagi) July 26, 2022 -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. కొత్తగా 13 మండలాలు
సాక్షి, హైదరాబాద్: పాలనాసంస్కరణల్లో భాగంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో నూతన జిల్లాలను, రెవిన్యూ డివిజన్లను, మండలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగు ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కింద పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని రెవిన్యూ డివిజన్ల పరిధిల్లో కొత్తగా ఏర్పాటైన మండలాలు : ► నారాయణ పేట జిల్లా/ రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్, కొత్తపల్లె మండలాలు ► వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ మండలం ► మహబూబ్ నగర్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..కౌకుంట్ల మండలం ► నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో..ఆలూర్, డొంకేశ్వర్ మండలాలు ► నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవిన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం ► మహబూబాబాద్ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో..సీరోల్ మండలం ► నల్లగొండ జిల్లా/రెవిన్యూ డివిజన్ పరిధిలో...గట్టుప్పల్ మండలం ► సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ రెవిన్యూ డివిజన్ పరిధిలో...నిజాంపేట్ మండలం ► కామారెడ్డి జిల్లాలోని, బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. డోంగ్లీ మండలం ► జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిధిలో.. ఎండపల్లి మండలం ► జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిధిలో, భీమారం మండలం చదవండి: తెలంగాణకు అతిభారీ వర్షాల హెచ్చరిక -
డిటెన్షన్ సెంటర్ @ వికారాబాద్!
సాక్షి, హైదరాబాద్: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ‘విదేశీయుల’ వేధింపులు తప్పనున్నాయి. తమ సొంత దేశాలకు బలవంతంగా తిప్పి పంపాల్సిన (డిపోర్టేషన్) వారిని ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉంచేందుకు ఉద్దేశించిన డిటెన్షన్/డిపోర్టేషన్ సెంటర్ వికారాబాద్కు మారనుంది. కనిష్టంగా 40 మందిని ఉంచేలా దీన్ని నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోర్టు వంటి ఆఫ్రికన్ దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ వస్తున్నారు. వీరిలో అనేక మంది వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవాళ్లు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇలాన చేసేవాళ్లు. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్కు అవకాశం ఉండేది కాదు. బెయిల్పై బయటకు వచ్చే వాళ్లు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న వీరి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. ఇది గమనించిన నగర పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో అనేక ఘట్టాలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరి గుర్తింపులు, ఢిల్లీ కార్యాలయం నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పట్టే రెండు నెలల కాలంలో వీరిని డిపోర్టేషన్ సెంటర్ ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేష¯న్ సెంటర్గా మారింది. కేవలం అయిదుగురిని మాత్రమే ఉంచడానికి సరిపోయే జైలు గదినే దీనికి వాడుతున్నారు. దీంతో పాటు వారికి అనువైన ఆహారం అందించలేకపోవడంతో ఆయా విదేశీయులు చేసే రాద్ధాంతంతో సీసీఎస్ పోలీసులకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిపోర్టేషన్ సెంటర్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వికారాబాద్లో డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్తో సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మిస్తున్నారు. కనిష్టంగా 40 మందికి సరిపోయేలా రూపొందుతోంది. (చదవండి: తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం.. రైతన్నలకు డ్రోన్లు) -
వికారాబాద్ టీఆర్ఎస్ పార్టీలో రచ్చకెక్కిన వర్గపోరు
-
వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి
సాక్షి, తాండూరు(వికారాబాద్): తన భార్యకు పిల్లలు పుట్టడంలేదని, రెండో పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని మోసం చేసిన వీఆర్వోపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పట్టణ సీఐ రాజేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందిన బోయ కార్తీక్ పెద్దేముల్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇంతకుముందే వివాహం కాగా, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తన భార్యకు సంతానం కలగడంతో, సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ కార్తీక్తో పాటు అతని కుటుంబ సభ్యులు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. -
'48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్ షేర్ చేస్తా'
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు దొరిశెట్టి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పోలీసులు వైఫల్యంతో తన భార్య ఆచూకీ లభించడం లేదని ఆరోపిస్తున్నారు. తన భార్య అన్నపూర్ణ అదృశ్యమై మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మనోవేదనకు గురై తన పిల్లలతో సహా అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లుగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనిపెట్టకపోతే తమ శవాల లొకేషన్ షేర్ చేస్తానని సెల్ఫీ వీడియోలో హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: (రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ) -
బురద నీటిలో పెళ్లి బస్సు!.. రాత్రంతా అక్కడే ఉండటంతో
సాక్షి, వికారాబాద్: పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బురద నీటిలో ఇరుక్కుపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం బర్వాద్ గ్రామానికి చెందిన పెళ్లి బృందం వారు హైదరాబాద్లోని బోరబండకు వెళ్లారు. వివాహం ముగిసిన తర్వాత తిరుగుప్రయాణంలో రాత్రి 11గంటలకు మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. వంతెన కింది నుంచి బస్సు తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికే భారీ వర్షం కువరడంతో బ్రిడ్జి కింద వరద చేరింది. బస్సు టైర్లు బురదలో కూరుకుపోవడంతో ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన పెళ్లివారు నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడి నుంచి ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో బస్సును అలాగే వదిలేశాడు. తెల్లారేసరికి మరింత వర్షం కురవడం, ఊట నీరు సైతం బ్రిడ్జి కిందకు చేరడంతో సగ భాగానికి పైగా బస్సు నీటిలో మునిగిపోయింది. ఉదయాన్నే అక్కడకు చేరుకున్న బస్సు యజమాని, డ్రైవర్, క్లీనర్, గ్రామస్తుల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గతేడాది సైతం ఇవే కష్టాలు గతేడాది వర్షాకాలంలోనూ మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. ఈ రూట్లో నాలుగైదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. వీరికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం బ్రిడ్జి పనులైనా వేగంగా పూర్తిచేయడం లేదు. వంతెన కింద వరద నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనిపించని హెచ్చరిక బోర్డులు వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న చోట హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలేదు. ఈ విషయాన్ని అటు కాంట్రాక్టర్ ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కొత్తగా ఎవరైనా ఈ రూట్లో వస్తే ప్రమాదం బారిన పడక తప్పదు. గత వర్షా కాలంలో ఇక్కడే ఇరుక్కుపోయిన ఓ లారీ మూడు రోజులుగా అక్కడి ఉండిపోయింది. -
Tomato Prices: ట‘మాట’ వినదే!
సాక్షి, వికారాబాద్ అర్బన్: గత రెండు నెలలుగా టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రకాల కూరగాయల ధరలు కాస్త తగ్గినా టమాటా ఏమాత్రం దిగిరావడం లేదు. ఆదివారం వికారాబాద్ మార్కెట్లో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయించారు. నాసిరకం టమాటా రూ.80 వరకు పలికింది. జూన్ మొదటి వారంలోనైనా ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారుల ఆశలు నెరవేరలేదు. శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలోకి ఆశించిన స్థాయిలో సరుకు రావడం లేదని పేర్కొంటున్నారు. కర్నూల్, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. సకాలంలో వర్షాలు పడితే ఆగస్టులో ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా టమాటా కొనుగోలు చేసేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజలు సాహసం చేయలేదు. చదవండి: మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ.. -
అదృష్టం తలుపుతట్టి అంతలోనే అదృశ్యం
వికారాబాద్ అర్బన్/దస్తురాబాద్/మంథని: అదృష్టలక్ష్మి తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైంది. కోటీశ్వరులం అయ్యామనే ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైంది. వికారాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లోని పలువురు హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు అకౌంట్లలో అప్పనంగా రూ. కోట్లు జమయ్యాయి. టెక్నికల్ సమస్య వల్లే డబ్బులు జమ అయ్యాయని తెలుసుకున్న బ్యాంకు అధికారులు వెంటనే ఆ ఖాతాలను స్తంభింపజేశారు. వికారాబాద్లోని సెవెన్ హిల్స్ మొబై ల్స్ యజమాని వెంకట్రెడ్డికి హెచ్డీఎఫ్సీ స్థానిక బ్రాంచ్లో కరెంట్ అకౌంట్ ఉంది. ఆదివారం రాత్రి తన అకౌంట్లో రూ.18.52 కోట్లు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. మరునాడు ఉదయం బ్యాంకు అధికారులకు విషయం చెప్ప డంతో వెంటనే అతడి ఖాతాను స్తంభింపజేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటకి చెందిన వంగల సాయి అనే యువకుడికి నిర్మల్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. రూ.1,27,07,978 జమ అయినట్లు ఫోన్కు సమాచారం రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నిజమా కాదా అనే అనుమానంతో ఖాతా నుంచి రూ.లక్ష మరో ఖాతాకు బదిలీ చేశాడు. ఆ వెంటనే బ్యాంకు ఖాతా స్తంభించిపోయింది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇల్లందుల సాయి అనే మొబైల్ షాపు నిర్వాహకుడికి స్థానిక హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఖాతా ఉంది. ఆయన ఖాతాలో రూ.5.68 కోట్లు జమ అయినట్లు ఆదివారం మెసేజ్ వచ్చింది. 6 గంటల అనంతరం అవి వెనక్కి వెళ్లాయి. పెద్ద మొత్తంలో డబ్బు జమ కావడంతో మొదట ఆనందం వేసినా.. ఆ డబ్బు ఎవరైనా కావాలనే వేశారా..? అని భయపడ్డానని సాయి తెలిపాడు. -
వికారాబాద్ జిల్లాలో HDFC ఖాతాలోకి భారీగా డబ్బు జమ
-
జాక్పాట్: అకౌంట్లో పడిన 18 కోట్లు.. ఖాతాదారుడు ఏం చేశాడంటే?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా రూ. 18కోట్లు జమయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాకైన సదరు బ్యాంక్ ఖతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం.. వికారాబాద్కు చెందిన వ్యాపారి వెంకట్రెడ్డికి జాక్పాట్ తగిలింది. అతడి HDFC బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు జమయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి.. బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. నిన్న(ఆదివారం) కూడా తమిళనాడులో HDFC బ్యాంకుకు చెందని పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: కేజీఎఫ్ కోటలో కలకలం -
వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్ చుట్టి..
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అన్నను తమ్ముడు మట్టుబెట్టినట్లు నిర్ధారణ అయ్యిందని, నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ రషీద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. శనివారం కొడంగల్లోని హైవే పోలీస్స్టేషన్ ఆవరణలో ఉన్న సీఐ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బొంరాస్పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సొంత అన్నను తమ్ముడు హత్య చేశాడని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని శనివారం రిమాండ్కు తరలించారు. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏర్పుమల్ల గ్రామానికి చెందిన పూజారి గోపాల్, పూజారి శ్రీను అన్నదమ్ములు. పూజారి శ్రీను భార్యతో తన అన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో గత ఏడాది నవంబర్ 15న గోపాల్ గొంతును టవాల్తో బిగించి చంపాడు. ఇతరులకు అనుమానం రాకుండా మృతదేహాన్ని ఊరు చివర ఉన్న దోసలకుంట (నీటి కుంట)లో పడేశాడు. రెండు రోజుల తర్వాత శవం పైకి తేలడంతో మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు పూజారి శ్రీను నిందితుడిగా గుర్తించారు. శనివారం రోజు రిమాండ్కు తరలించారు. అనంతరం ఏఎస్పీ రషీద్ మాట్లాడుతూ సమాజంలో వివాహేతర సంబంధాలే హత్యలకు దారి తీస్తున్నాయని అన్నారు. అవి మంచివి కావన్నారు. ఏదో ఒకరోజు విషయం తెలిసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ప్రాణాలు తీసిన వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదన్నారు. దీని వల్ల రెండు కుటుంబాల వారు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కొడంగల్ సీఐ ఇప్తికార్ అహ్మద్, కొడంగల్ ఎస్ఐ రవి పాల్గొన్నారు. చదవండి: Tequila Pub: పబ్పై రైడ్స్.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్ గర్ల్స్, కస్టమర్లు -
పీహెచ్సీల్లో ఆరోగ్యశ్రీ
వికారాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ (పీహెచ్సీలు) ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రజారోగ్య శాఖ డైరెక్ట ర్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 53 రకాల సేవ లు అందించేలా ఏర్పాట్లు చేస్తోందన్నారు. శుక్రవా రం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా ధారూరు, రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. తర్వాత మద్గు ల్ చిట్టెంపల్లి డీపీఆర్సీ భవనంలో వైద్యులు, వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ అధికారులతో సమావేశమై ఆస్పత్రుల పనితీరుపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ చేరే ప్రతి రోగి తరఫున పీహెచ్సీకి ప్రభుత్వం రూ.2,100 చెల్లిస్తుం దన్నారు. ఇందులో 35 శాతం డబ్బును పీహెచ్సీలో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ఇస్తుందని, మిగిలిన 65 శాతం నిధులను ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పీహెచ్సీలు నిధుల కొరతను అధిగమించి బలోపేతం అవుతాయన్నారు. వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్: క్షేత్రస్థాయి లో పీహెచ్సీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీనివాసరావు చెప్పారు. 750 ఎం బీబీఎస్ వైద్యుల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుందని తెలిపారు. పీహెచ్సీల్లో చేసే ప్రతి సాధారణ కాన్పుకు ప్రభుత్వం రూ.3 వేలు అందజేస్తుందని, ఈ మొత్తం వైద్యులు, సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో చెల్లిస్తుందన్నారు. దీంతో వైద్యుల్లో ఉత్సాహం పెరిగి నాణ్యమైన సేవలు అం దుతాయన్నారు. వైద్యులు స్థానికంగా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. స్థానికంగా ఉంటున్నారా..? లేదా నగరానికి వెళ్లి వస్తున్నారా..? అనే వివరాలు తెలుసుకునేందుకు వైద్యుల వాహనాలకు జీపీఆర్ఎస్ అమరుస్తామని చెప్పారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు వైద్యులు, సిబ్బంది పని తీరును పర్యవేక్షించేలా ప్రతి పీహెచ్సీలో 3 సీసీ కెమెరాలు అమరుస్తామని తెలిపారు. ఏడాదిలో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు మెడికల్ ఆఫీసర్లకు వెహికల్ అలవెన్స్ ఇవ్వనున్నట్టు చెప్పారు. గడిచిన మూడు నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు 40 లోపు కేసులే నమోదవుతున్నాయని చెప్పారు. -
వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే..
సాక్షి, వికారాబాద్: పెళ్లి అయిన 20 రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోమిన్పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్ప్రకాశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మైపాల్(28)కు ఈ నెల 6న శిరీషతో వివాహమైంది. కాగా ఈ నెల 25న మైపాల్ భార్య శిరీష, తమ్ముడు అనిల్తో కలిసి భోజనం చేశాడు. అనంతరం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తలుపు గడిపెట్టుకోవాలని చెప్పాడు. రాత్రి 11గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో తమ్ముడు ఫోన్ చేశాడు. బస్టాండ్ వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాడు. తర్వాత ఫోన్ చేసినా స్పందించలేదు. గురువారం ఉదయం బేగరి మల్లేశం వారి పొలానికి వెళ్లగా మైపాల్ తన పొలంలోని వేపచెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. దీంతో మల్లేశం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి అప్పులు ఉన్నాయని వాటిని ఎలా తీర్చాలని బాధపడుతుండే వాడని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి.. -
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు
-
ఇంకా డోలాయమానంలోనే.. కొండా ఏదీ జెండా!.. విశ్వేశ్వర్ దారేటు?
సాక్షి, వికారాబాద్ : కొండా విశ్వేశ్వర్రెడ్డి అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నా ఏ పార్టీలో చేరుతారనే విషయం దాటవేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ విధానాలను గట్టిగా వ్యతిరేకిçస్తూ వస్తున్న ఆయన కాంగ్రెస్, బీజేపీల విషయంలో సమాన దూరాన్ని పాటిస్తున్నారు. ఇటీవల బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఏ పార్టీలో చేరతాననే విషయం చెబుతానని ఇటీవల ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంతో ఆయన ప్రాబల్యం, అనుచరగణం ఎక్కువగా ఉన్న జిల్లాలో మరోసారి చర్చకు దారి తీసింది.. 2021 మార్చిలో అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్రెడ్డి మూడునెలల పాటు నిరీక్షిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేకసార్లు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఎలాంటి పొలిటికల్ స్పష్టత ఇవ్వకుండానే ముగించడం ఆయన క్యాడర్ను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ వస్తోంది. టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీతోనే.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే ఆయన బీజేపీలో చేరుతారనే చర్చ జరిగింది. అనంతరం పలు మార్లు ఆయన టీఆర్ఎస్ను బీజేపీ గట్టిగా ఎదుర్కోనుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్లో కొందరు నాయకులు అమ్ముడు బోయిండ్రు అంటూ విమర్శిస్తూనే.. కేసీఆర్తో గట్టిగా ఫైట్ చేసే పీసీసీ నాయకుడొస్తే కాంగ్రెస్లో చేరాలా? లేక తటస్తులు పార్టీ పెడితే వారితో కలవాలా అంటూ గతంలో అస్పష్ట ప్రకటనలు చేశారు. దీంతో కొండా దారెటు అనే విషయం ఆయన క్యాడర్తో పాటు జిల్లా రాజకీయాల్లో నానుతోంది. కొండా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ ఎలాంటి రాజకీయ దుమారం చేస్తారా? అని రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ రేపుతుండగా ఆయన మాత్రం చర్చకు ఇంకా తెరదించటంలేదు. కొండా ఇచ్చే స్పష్టత కోసం ఆయన అనుచరగణంతో పాటు రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. బీజేపీలో చేరుతారంటూ ప్రచారం ఇటీవల కొండా.. బీజేపీలో చేరుతారనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆ విషయంలో అధికారపార్టీతో పోరాడుతానని చెప్పారే తప్ప ఆయన స్పష్టత నివ్వలేదు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రగులుతున్న రాజకీయ వేడితో ప్రజలు, కేడర్ కంటే ఆయా పార్టీల నేతల్లోనే కొండా పయనంపై ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం. ఒకవేళ బీజేపీలో చేరితే ఎవరికి పోటీగా మారతారని చర్చసాగుతోంది. పరిగి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే తమ పరిస్థితి ఏమిటని అక్కడి నేతలు భావిస్తుండగా చేవెళ్ల ఎంపీగా పోటీ చేస్తే మరోసారి కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వనున్నారనే ఊహాగానాలు ఇటీవల ఊపందుకున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి జెండా, ఎజెండాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డోలాయమాన వ్యూహాన్ని వీడటంలేదు. ఏడాది కాలంగా తటస్తంగా ఉంటూ వస్తున్న ఆయన ఏ పార్టీలోచేరుతారనే విషయంలో స్పష్టతనివ్వడంలేదు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కొండా దారెటో అనే విషయం జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రజలు, కేడర్ మరిచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మీడియాలో తళుక్కుమంటూ మళ్లీ తెరచాటుకు వెళ్తుండటం గమనార్హం. -
బాలికకు మద్యం తాగించి లైంగిక దాడి
సాక్షి, వికారాబాద్: బాలికపై ఒకరు లైంగిక దాడికి పాల్పడగా.. మరొకరు యత్నించారు. ఈ ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది. పరిగి సీఐ వెంకటరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మీర్జాపూర్కు చెందిన బాలిక (17) ఇంటి వద్ద ఉండగా అదే గ్రామానికి చెందిన కుర్వ ప్రవీణ్ (19) పొలంలోకి లాక్కెళ్లాడు. బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇది గమనించిన మరో యువకుడు చాకలి రవి (29) అక్కడికెళ్లడంతో ప్రవీణ్ అక్కడి నుంచి జారుకున్నాడు. అదే అదనుగా భావించిన రవి.. బాలికపై లైంగికదాడికి పాల్పడుతుండగా ప్రతిఘటించి బాలిక ఇంటికి చేరుకుంది. విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బాలికపై ఏడాదిగా లైంగిక దాడి.. గర్భం దాల్చడంతో -
ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి, మెదక్(ధారూరు/బంట్వారం): ఈత సరదా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. ఈ ఘటన కోట్పల్లి ప్రాజెక్టులో శనివారం జరిగింది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన మేరకు.. మేడ్చల్ జిల్లా రాంపల్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఏడుగురు యువకులు శనివారం సరదాగా గడిపేందుకు ముందుగా అనంతగిరిగుట్టకు వచ్చారు. సాయంత్రం సమయంలో కోట్పల్లి ప్రాజెక్ట్కు వచ్చారు. ప్రాజెక్టు కట్ట వెనుక ఉన్న నీటిలో అందరూ కలిసి ఈత కొట్టడానికి దిగారు. వీరిలో సాయికుమార్రెడ్డి (28) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు వెంటనే అతడిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు సాయికమార్రెడ్డి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ తిరుపతిరాజు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. కేసును కోట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: పేదోడి ఫ్రిడ్జ్కు భలే గిరాకీ!) -
కొన్నది ఎకరం.. కొట్టేసింది 4.35 ఎకరాలు.. వాహనం ఆపి సోదా చేయగా..
సాక్షి, మోమిన్పేట(వికారాబాద్): ఓ మహిళా రైతును మోసం చేసి.. ఆమెకు తెలియకుండా 4.35 ఎకరాల భూమిని కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన సంఘటన మోమిన్పేటలో గురువారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి.. దేవరంపల్లికి చెందిన మ్యాదరి అంజమ్మకు గ్రామంలోని సర్వే నంబర్లు 97, 99లో ఐదెకరాల 35గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఒక ఎకరా భూమిని చీమల్దరి గ్రామానికి చెందిన గొర్లకాడి క్రాంతికుమార్, అతని స్నేహితులకు విక్రయించింది. ఎకరం కొనుగోలు చేసిన కాంత్రికుమార్.. అంజమ్మ పేరున ఉన్న 5.35 ఎకరాల మొత్తం భూమిని డిసెంబరు 10, 2020 రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎకరా అమ్మగా వచ్చిన డబ్బును తన కూతుళ్లకు సమానంగా ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించుకుంది. మిగిలిన నాలుగెకరాల భూమిని కుమారులకు పంచాలని భావించింది. అయితే తన పాసు పుస్తకంలోని మొత్తం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే మోసాన్ని ఆలస్యంగా గుర్తించి.. సదరు వ్యక్తులను నిలదీసింది. చదవండి: కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు ఈ విషయమై కొంతమంది సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో అంజమ్మ భూమిని తిరిగి రిజిస్ట్రేషన్ చేసేందుకు కాంత్రికుమార్, అతని స్నేహితులు ఒప్పుకొన్నారు. కాలం గడుస్తున్నాకొద్ది విషయాన్ని దాటవేస్తూ వచ్చారు. ఇక లాభం లేద నుకున్న అంజమ్మ తనకు జరిగిన అన్యాయంపై ఇటీవల పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా క్రాంతికుమార్ గురువారం మధ్యాహ్నం మేకవనంపల్లి వైపు వెళ్లున్నట్లు సమాచారం తెలుసుకొన్న సీఐ వెంకటేశం, ఎస్ఐ విజయ్ప్రకాశ్ తమ సిబ్బందితో వెళ్లి కారును చేజ్ చేసి పట్టుకున్నారు. వాహనాన్ని ఆపి సోదా చేయగా రూ.3.08లక్షలు నగదుతో పాటు ఒక తల్వార్ను స్వాధీనం చేసుకున్నారు. తల్వార్ ఎందుకు ఉపయోగిస్తున్నావని ప్రశ్నించగా.. తాను భూముల క్రయవిక్రయాలు చేస్తుంటానని, ప్రాణ రక్షణ కోసం కారులో తల్వార్ పెట్టుకున్నానని సీఐకి చెప్పాడు. దీంతో అతనిపై అక్రమంగా మారణాయుధాలు కలిగిన నేరంతో పాటు మోసం చేసిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నేరచరిత్రే.. క్రాంతికుమార్పై గతంలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. 2007, 2013, 2020లో మూడు, 2022లో రెండు కేసులు బుక్ అయ్యాయి. ఇందులో అక్రమంగా భూమి క్రయవిక్రయాలు, మర్డర్ కేసు, ప్రస్తుత చీమల్దరి సర్పంచుపై బెదిరింపులకు పాల్పడటం వంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. -
వికారాబాద్ బాలిక ఘటన అసలు ఏం జరిగిందంటే...?
-
వికారాబాద్ విద్యార్థిని హత్యాచారం కేసు.. ప్రియుడే హంతకుడు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య చేసింది ప్రియుడు మహేందరేనని పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టినట్లు, ఆపై హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ఈ మేరకు విద్యార్థిని హత్యాచారం ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన పదిహేనేళ్ల విద్యార్థినితో.. నిందితుడు మహేందర్కు ఏడాదిగా పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ఇద్దరు కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఇద్దరూ సోమవారం ఉదయం బయట కలుసుకున్న క్రమంలో.. శారీరకంగా కలవాలని బాధితురాలిపై మహేందర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ పెనుగులాటలో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను బలంగా నెట్టడంతో పక్కనే ఉన్న చెట్టుకు తల తగిలి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై శరీరంలో చలనం లేకపోవడంతో విషయం బయటపడుతుందని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తనకేమీ తెలియనట్లు ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ కేసులో క్లూస్ టీం, పోలీసుల విచారణ, డాక్టర్ల ఒపీనియన్ ఆధారంగా ఘటన జరిగిన 48 గంటల్లోనే కేసును చేధించాం. విచారణను పూర్తి చేసి నిందితుడిని బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెడతాం’ అని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. చదవండి: ప్రేమ వివాహం.. భార్యను బతికుండగానే పూడ్చిపెట్టాడు -
వికారాబాద్ లో టెన్త్ విద్యార్థిని హత్య కేసులో పురోగతి
-
వికారాబాద్ హత్యాచారం కేసు.. మద్యం మత్తులోనే!
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ విద్యార్థిని కేసులో పురోగతి కనిపిస్తోంది. పదో తరగతి విద్యార్థినిపై ఆమె స్నేహితుడే హత్యాచారానికి పాల్పడినట్లు దాదాపుగా నిర్ధారణ అయ్యింది. ప్రధాన నిందితుడు మహేందర్ అలియాస్ నాని నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాగిన మైకంలో లైంగిక వాంఛ తీర్చమని సదరు విద్యార్థినిని నిందితుడు బలవంత పెట్టాడు. అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో తెల్లవారు ఝామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తలను చెట్టుకు బాది.. ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. కీలక ఆధారాలతో పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. వికారాబాద్ పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లిలో సోమవారం ఉదయం 16 ఏళ్ల విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు సంచలన సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా పడి ఉంది. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నించారు. నిందితుడు ఒక్కడేనా? లేదా జరిగింది సామూహిక హత్యాచారమా? అన్నది ఇవాళ్టి పోలీసుల ప్రెస్ మీట్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. -
వికారాబాద్ పూడూర్ హత్యాచారం కేసులో ట్విస్ట్
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం అంగడి చిట్టంపల్లి గ్రామంలో పదో తరగతి చదివే అమ్మాయి హత్యాచారం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం ఆరుగురు అనుమానితులను మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన అమ్మాయిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన సంచలనం సృష్టించగా.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఆమె స్నేహితుడిపైనే కుటుంబ సభ్యులు తొలుత అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో విద్యార్థిని ప్రియుడు నోరు మెదపడం లేదంటూ, అలాగే తల్లి పాత్రపై అనుమానాలంటూ కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆరుగురిని కేవలం అనుమానంతోనే విచారిస్తున్నామని ఎస్పీ తెలిపారు. అయితే విచారణలో బాధితురాలి తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండడంతో.. ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకానీ.. ఈ కేసులో ఇంతవరకు ఎవరిని కూడా అధికారికంగా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ సాయంత్రానికి ‘టెక్నికల్ ఎవిడెన్స్’ లభ్యమయ్యే అవకాశం ఉందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సంబంధిత వార్త: వికారాబాద్లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య -
వికారాబాద్ లో దారుణం..విద్యార్థినిపై అత్యాచారం
-
విద్యార్థిని హత్యాచార ఘటన.. ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్న నిందితులు?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని పూడురు మండలం అంగడి చిట్టంపల్లిలో 16 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సోమవారం ఉదయం 5.30 నిమిషాల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి 500 మీటర్ల నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించిందన్నారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలిక దుస్తులు చెల్లా చెదురుగా పడి ఉండటంతో అత్యాచారం చేసి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే బాలిక అరుపులు కూడా ఎవరికీ వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో సామూహిక అత్యాచారం? కాగా ఈ కేసులో ఇదే గ్రామంలో ఉండే ముగ్గురు యువకులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసముండే మహేందర్ అలియాస్ నాని అనే యువకుడిపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న క్రమంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నానితో పాటు అశోక్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నాని నివాసంలో ఆదివారం రాత్రి పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో తెల్లవారుజామున వరకు మద్యం సేవించి మద్యం సేవిస్తూ ఉన్నారని, మద్యం మత్తులోనే యువకులు బాలికపై సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంబంధిత వార్త: వికారాబాద్లో విద్యార్థినిపై అత్యాచారం, ఆపై హత్య ఇదిలా ఉండగా హత్యకు గురైన మైనర్ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలిక మృతదేహాన్ని చిట్టంపల్లి గ్రామానికి తీసుకొని వచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దోషులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మహేందర్ అలియాస్నాని పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఆయన తండ్రి లక్ష్మయ్య వాదన మరో విధంగా ఉంది. చదవండి: తండ్రి కళ్లెదుటే ఘోరం.. ప్రేమతో కొనిచ్చిన స్పోర్ట్స్ బైక్ మీదే ప్రాణం పోయింది నా కొడుకు అమాయకుడు తన కొడుకు అమాయకుడని తెలిపారు. బాలిక ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండే వాడని, అవసరం ఉన్నపుడు సహాయం కోసం వాళ్ళు పిలుస్తారని పేర్కొన్నారు. ఆ అమ్మాయికి తన కొడుక్కి పరిచయం ఉందని తెలిపిన లక్క్ష్మయ్య.. అయితే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసిందన్నారు. కానీ ఈ విషయం తనకు ముందు తెలీదన్నారు. ఉదయం సంఘటన జరిగినపుడు కొడుకు తమ ఇంట్లోనే ఉన్నాడని, రాత్రి ఇంట్లో ఫంక్షన్ జరిగిందన్నారు. తన కొడుకు గొడవలు పడే మనిషి కాదని, ఇలాంటి తప్పుడు పనులు చేయడని తెలిపారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి ఉరిశిక్ష పడాలని తెలిపారు.