స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు గడువు పెంపు | schloarship application date extended | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు గడువు పెంపు

Oct 2 2016 12:36 AM | Updated on Sep 15 2018 4:12 PM

కేంద్ర ప్రభుత్వం ఏటా మైనారిటీ విద్యార్థులకు అందించే ఉపకార వేతన (2016–17) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు.

కర్నూలు(ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వం ఏటా మైనారిటీ విద్యార్థులకు అందించే ఉపకార వేతన (2016–17) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు మైనారిటీ కార్పొరేషన్‌ ఈడీ మహ్మద్‌ అంజాద్‌ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సంబంధిత పాఠశాల, కళాశాలలో సమర్పించాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల్లోపుండి, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు కలిగిన  మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను వెబ్‌సైట్‌(టఛిజిౌl్చటటజిజీpట.జౌఠి.జీn)లో నమోదు చేసుకోవాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement