భోగాపురం(విజయనగరం): ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అమనాం జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కార్పియో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో..
Published Sun, Jun 5 2016 7:08 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
Advertisement
Advertisement