lorry
-
Anakapalle: క్వారీ లారీ ఢీకొని రైల్వే ట్రాక్ ధ్వంసం
-
ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఐదుగురు మృతి
తిరుత్తణి: తమిళనాడులోని తిరుత్తణి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏలూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి
సాక్షి, ఏలూరు జిల్లా: ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.లారీ లోయలో పడి ముగ్గురి మృతిమరో ఘటనలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మద్దిమడుగు ఘాట్ పైన బుధవారం మధ్యాహ్నం లారీ లోయలోకి పడిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. చేపల మేత లోడుతో బెంగళూరు నుంచి ఏలూరుకు వెళ్తున్న లారీ మద్దిమడుగు ఘాట్ పైన నాలుగో మలుపు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అయి అదుపుతప్పి 50 అడుగులున్న లోయలోకి పడిపోయింది.లారీలోని డ్రైవర్ సాంబయ్య, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా.. చక్రాయపేట మండలం కప్పకుంటపల్లెకు చెందిన కె.వివేకానందరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాద తీవ్రత కారణంగా లారీ మూడు ముక్కలుగా విడిపోయి కేబిన్ నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రక్షక్ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందిని, 108 అంబులెన్స్ను పిలిపించి క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. -
విశాఖ ఆర్కే బీచ్ లో ఇసుక లారీ బీభత్సం
-
ఆర్కేబీచ్ రోడ్డులో లారీ బీభత్సం
సాక్షి,విశాఖపట్నం:విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం(ఫిబ్రవరి 18) ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి ఇసుకలారీ దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్,మరొకరికి గాయాలయ్యాయి.బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు ప్రమాదాలు జరగడం గమనార్హం. -
మేడ్చల్లో ఘోర ప్రమాదం.. లారీ బీభత్సం.. ముగ్గురి మృతి
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ చెక్పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురిని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను తీసుకెళ్తుండగా.. అదుపు తప్పిన లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. -
పుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన లారీ
పుణే: ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయాలపాలయ్యారు. మహారాష్ట్రలోని పుణే నగరంలో ఆదివారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అమరావతికి చెందిన కార్మికులు వారి కుటుంబాలతోపాటు రెండు రోజుల క్రితం ఉపాధి కోసం పుణేకు వచ్చారు. వఘోలి ప్రాంతంలోని కెస్నాడ్ ఫటా ఫుట్పాత్పై వీరంతా నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో అదుపు తప్పిన ఓ ట్రక్కు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైగా దూసుకెళ్లింది. ఘటనలో రెండేళ్లలోపు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ గజానన్ టొట్రేను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఘటన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు భావిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
పెట్రోల్బంక్ వద్ద లారీలో మంటలు.. తప్పిన ముప్పు
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా:రాజమండ్రి శివారు దివాన్ చెరువులో ఆదివారం(నవంబర్ 3) పెద్ద అగ్ని ప్రమాదం తప్పింది.పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది.వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటల్లో లారీ పాక్షికంగా దగ్ధమైంది. లారీ కేబిన్లో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. లారీలో నుంచి మంటలు పొగ ఎగిసిపడడంతో స్థానికులు పరుగులు తీశారు.ఇదీ చదవండి: పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం -
ఇసుక లారీలకు డిపాజిట్టా?
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : లక్షలాది రూపాయలు అప్పులు చేసి, లారీ కొనుక్కొని కిరాయికి తిప్పుకుంటున్న తమను ప్రభుత్వం వేధిస్తోందని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాకు తాము ప్రభుత్వానికి ముందస్తుగా ఎందుకు డిపాజిట్ చెల్లించాలని, ఇది ఎవరి నిర్ణయమని నిలదీశారు. పైగా రూ.50 బాండ్ పేపర్పై మైనింగ్ శాఖతో అగ్రిమెంట్ (ఒప్పంద పత్రం) చేసుకుని, లారీని కిరాయికి తిప్పుకోవాలా? అని ప్రశ్నించారు. విజయవాడ విద్యాధరపురంలోని ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీపై ధ్వజమెత్తుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇసుక రీచ్కు లోడు కోసం వెళితే ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. కొన్ని ఊళ్లల్లో స్థానిక కూటమి నాయకులు లోకల్ అంటూ రోజుకు మూడు ట్రిప్పులు తోలుకుంటుంటే తాము అలా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు (విజయవాడ అర్బన్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్), అన్నే చిట్టిబాబు (ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు) సూరెడ్డి సాంబిరెడ్డి (పైపుల రోడ్ శాండ్ లారీ ఓనర్ల అసోసియేషన్), చుక్కాపు రమేష్, రత్తయ్య, తన్నీరు పాపారావు (డిస్ట్రిక్ట్ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు) తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి» కిరాయికి ఇసుక తోలే ట్రాక్టర్కు రూ.1500, 6 టైర్ల లారీకి రూ.3 వేలు, 10 టైర్ల లారీకి రూ.6 వేలు, 12–14 టైర్ల లారీకి రూ.10 వేలు డిపాజిట్ చేయాలనడం దుర్మార్గమైన చర్య కాదా?» ఇసుక రవాణా చార్జిల విషయంలో రవాణా శాఖ, కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు లారీ యజమానులతో చర్చించకుండా వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం లారీ ఓనర్లను మోసం చేయడం కాదా?» లారీ కిరాయి ధరపై జీఎస్టీ విధింపు ఎంత వరకు సమంజసం?» బుక్ చేసుకున్న వారికి లోడును చేరవేయడంలో జాప్యం (ట్రాఫిక్ రద్దీ లేదా లారీ రిపేర్) జరిగితే జరిమానా విధిస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయం?» ఇంతకూ ఇసుక కిరాయి ఎవరు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారు.. ఎక్కడ ఇస్తారు? » వేలకు వేలు ట్యాక్స్లు, డ్రైవర్ జీతభత్యాలు కట్టుకుంటూ ప్రభుత్వ ఆంక్షలు పాటించే కంటే మా లారీలను సర్కారుకే అప్పగిస్తాం.. అలా చేస్తే నెలకు ఎంత ఇస్తారు?ఇసుక ఫ్రీ అని చెప్పి బ్లాక్లో అమ్ముకుంటారా? డాబాగార్డెన్స్: ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ధరలు మరింత పెంచి బ్లాక్లో అమ్ముతూ.. భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొడుతున్న చంద్రబాబు, పవన్కళ్యాణ్ కార్మికులను తీవ్రంగా మోసం చేశారని భవన నిర్మాణ కార్మికులు ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేకపోతే వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేక రోడ్డున పడ్డామంటూ సిటూ ఆధ్వర్యంలో మంగళవారం గొల్లలపాలెం సింగ్ హోటల్ జంక్షన్ వద్ద నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎం.సుబ్బారావు, కె.నర్సింగరావు, చంద్రమౌళి, సిమ్మినాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ గాల్లోకి వదిలేసిందన్నారు. ఇసుక లభించకపోవడంతో వేలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని వాపోయారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఇంతగా రోడ్డున పడినా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. -
తిరుపతి జిల్లాలో లారీ బీభత్సం
-
కూలీలను కబళించిన మృత్యు శకటం
కర్నూలు (హాస్పిటల్): వారంతా కూలీలు. వానలు కురవక.. చేద్దామంటే పనులు దొరక్క పొట్టచేతబట్టుకుని వలసబాట పట్టిన కూలీల్లో ఇద్దరిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆటోడ్రైవర్ సహా 17 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు జిల్లాలో వర్షాభావంతో వ్యవసాయం పడకేసింది. పనులు కూడా దొరకని పరిస్థితుల్లో కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామానికి చెందిన పలువురు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తున్నారు. రోజులాగే గురువారం స్టీరింగ్ ఆటోలో 20 మంది కూలీలు తెలంగాణలోని ఉండవెల్లి మండలం కంచుపాడు బయలుదేరారు. ఆ ఆటోను కర్నూలు –హైదరాబాద్ హైవేపై జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ సమీపంలోని వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు వద్ద వెనుక నుంచి 20 టైర్లు గల భారీ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పైకెగిరి కింద పడింది. ఆటోలో ఉన్న లక్ష్మీదేవి (58) అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన 19 మందిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు మూడు అంబులెన్సుల్లో తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమాదేవి అలియాస్ తెలుగు సుజాత (40) మృతి చెందింది. ప్రియాంక (18), అనిత పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆటో డ్రైవర్ నరసింహులు (40)తోపాటు లక్ష్మీదేవి (60), రాధ (40), మద్దిలేటి (50), వరుణ్కుమార్ (13), కె.వరలక్ష్మి (44), పద్మ (45), రమాదేవి (40), నందు (17), భాస్కర్ (47), పావని (25), లక్ష్మీదేవి (50), లక్ష్మీదేవి (50), చిట్టెమ్మ (60), వరలక్ష్మి(47)తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ కిక్కిరిసిపోయింది. క్షతగాత్రులకు ప్రజాప్రతినిధుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, కోడుమూరు వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ ఆదిమూలపు సతీష్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరిహారం కోసం డిమాండ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడ్డ వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని, ఉపాధి హామీ పనులు కల్పించకపోవడం, పనిచేసిన వారికి 11 నెలలైనా బిల్లులు రాకపోవడం వల్ల పొట్టకూటి కోసం వెళ్లి వారు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పసుపు లోడు లారీని హైజాక్ చేశారు. ఆర్టీఏ అధికారులమంటూ లారీని ఆపిన కేటుగాళ్లు.. డ్రైవర్పై మత్తు మందు చల్లి జన్నేపల్లి వైపు పసుపు లారీని తీసుకెళ్లారు.అక్కడ నుంచి పసుపు లోడును వేరే వాహనాల్లోకి తరలించే యత్నం చేశారు. పోలీసుల ఎంట్రీతో దుండగులు పారిపోయారు. పసుపు విలువ సుమారు రూ. 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్తో కలిసి ట్రక్కులో కాశ్మీర్కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
గద్వాల: లారీ, స్కార్పియో ఢీ.. నలుగురి మృతి
గద్వాల, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఓ స్కార్పియో వాహనం ఢీ కొట్టుకోవడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్-బెంగు జాతీయ రహదారి 44 పై ఎర్రవల్లి చౌరస్తా ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్పాట్లోనే చనిపోగా.. గాయపడిన ముగ్గురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్ట్మార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నెంబర్ ఏపీ 29 జి 5553. కర్నూలు ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలోని వాళ్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ధాటికి వాహన ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ కోసం వచ్చిన లారీ ట్యాంకు ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమయానికి మంటలు అదుపులోకి రాకపోయి ఉంటే.. భారీ నష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. -
ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు
కావలి: ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది. కావలి రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. ఏలూరు వైఎస్సార్ నగర్కు చెందిన కుమార్ (45), జ్యోతి (38), సిరి అలియాస్ రాజీ (38) వన్గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ వ్యాపారం చేస్తుంటారు.వస్తువుల కోసం చెన్నైకి కారులో వెళ్లారు. తిరిగి ఏలూరుకు బయలుదేరిన క్రమంలో బుధవారం తెల్లవారుజామున ముసునూరు టోల్ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కుమార్, జ్యోతి, సిరి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ జిలానీ, కుమారి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్లో వారిని చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
రోడ్డు పాలైన బీర్లు
-
పండుగపూట విషాదం.. అక్కాచెల్లెళ్లు ముగ్గు వేస్తుండగా..
సాక్షి, ఏలూరు జిల్లా: మండపల్లి మండలం కానుకొల్లులో పండగపూట విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం భోగి పండుగ సందర్భంగా ఇంటి ఎదుట ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి సడన్గా ఇటుక లోడుతో వెళుతున్న లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పంగిళ్ల తేజస్విని(16), పల్లవి దుర్గ(18) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
దైవదర్శనానికి వెళ్తూ మృత్యుఒడికి..
ఎల్కతుర్తి/ఏటూరునాగారం: దైవదర్శనం కోసం కారులో వేములవాడ బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట, శాంతినగర్ సమీపంలో హనుమకొండ–కరీంనగర్ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక కారు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రిపూట ప్రయాణంతో... ఎల్కతుర్తి ఎస్సై గోదారి రాజ్కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన కాంతయ్య (72), మంతెన చందన (16)తోపాటు మంతెన రేణుక (55), మంతెన భార్గవ్, మంతెన శ్రీదేవి కలసి కారులో గురువారం రాత్రి ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ నుంచి పెంచికలపేట సమీపంలోకి రాగానే వరంగల్ వైపు వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అవడంతోపాటు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భరత్తోపాటు ఆయన తండ్రి శంకర్, మంతెన కాంతయ్య, ఆయన కుమార్తె చందన అక్కడికక్కడే మృతిచెందగా వెనుక సీటులో కూర్చున్న రేణుక, శ్రీదేవి, భార్గవ్లకు తీవ్ర గాయాలై కారులోనే ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై రాజ్కుమార్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108 వాహనంలో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక మృతిచెందింది. నిద్రమత్తు, అతివేగం, పొగ మంచు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్లు తెలిపారు. హనుమకొండలో షాపింగ్ చేసుకొని.. మంతెన శంకర్, కాంతయ్యలు వరుసకు అన్నదమ్ములు. శంకర్ కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య శ్రీదేవికాగా చిన్న కుమారుడు భరత్ టీఎస్ఎండీసీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా, పెద్ద కుమారుడు భార్గవ్ వాజేడులోని రెవెన్యూ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాంతయ్య కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన భార్య రేణుకకు చాలాకాలం తర్వాత చందన జన్మించింది. అయ్యప్ప మాల ధరించిన శంకర్ చిన్న కుమారుడు భరత్కు మేడారం జాతర ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ కావడంతో దానిలో భాగంగానే శ్రీదేవి అక్క కొడుకుకు చెందిన కారును తీసుకొని కుటుంబ సభ్యులతో కలసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. మార్గమధ్యంలో హనుమకొండలో షాపింగ్ చేసుకొని తిరిగి వేములవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడంపై ములుగు జిల్లాకు చెందిన పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిపారు. -
విశాఖ: స్కూల్ ఆటో-లారీ ఢీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సంగం శరత్ థియేటర్ సమీపంలో బుధవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరార్ కాగా.. క్లీనర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్, లక్ష్య, చార్విక్, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘‘ఉదయం 7గం.30ని. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆటోలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. వీళ్లంతా బేతని స్కూల్కు చెందిన వాళ్లు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’’ అని ఏసీపీ రాజీవ్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థిని పదో తరగతి చదివే హాసినిగా తెలుస్తోంది. మరో ప్రమాదంలో.. కాగా, విశాఖలో ఈ ఉదయం మరో ప్రమాదం జరిగింది. మధురవాడ-నగరం పాలెం రోడ్డులో స్కూల్ ఆటో బోల్తా పడింది. ఆటోలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు, ఆటోడ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. చదవండి: ప్రేమా.. ఇదినీకు న్యాయమా? VIDEO | Eight school children were injured when the auto they were travelling in collided with a lorry in Visakhapatnam earlier today. The incident was captured on CCTV. (Disturbing visuals. Viewers discretion advised) pic.twitter.com/JE7BZiBQi1 — Press Trust of India (@PTI_News) November 22, 2023 -
మెదక్లో పండగపూట విషాదం.. టపాసులు కొనడానికి వెళ్తుండగా..
సాక్షి, మెదక్ జిల్లా: మెదక్లో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీని టిప్పర్ ఢీకొనడంతో పృథ్వీతేజ్(12), ప్రణీత్ తేజ్(12) ప్రాణాలు కోల్పోయారు. తల్లికి అన్నపూర్ణకు గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లితో పాటు కలిసి చిన్నారులు స్కూటీపై వెళ్తుండగా ఘటన జరిగింది. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ హోం గార్డ్.. రెండు సంవత్సరాల క్రితమే ఆయన ప్రమాదంలో మృతి చెందగా, ఇప్పుడు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చదవండి: వీడియో కాల్లో డబ్బులు అడుగుతున్నారా?.. ఇది తెలుసుకోండి.. -
మద్యం లారీ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం
విశాఖపట్నం: నగర పరిధిలోని మద్యం లారీ బోల్తా పడడంతో జనం ఇదే అదనుగా మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. శనివారం ఆనందపురం నుంచి విశాఖ నగరంవైపు వెళ్తున్న మద్యం లారీ ఒకటి మధురవాడ వద్దకు రాగానే బోల్తా పడింది. ఎదురుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ డివైడర్ను ఢీకొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు, పలువురు వాహనదారులు ఒక్కసారిగా మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. -
లారీ టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి..
సాక్షి, కరీంనగర్: లారీ టైర్ పేలి పంక్చర్ వేసే వ్యక్తి మృతిచెందిన ఘటన కరీంనగర్ వన్టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా ఖాజీపూర్కు చెందిన మహమ్మద్ మన్సూర్ అన్సారీ(32) నాలుగేళ్ల క్రితం కరీంనగర్లోని అమెర్నగర్కు వచ్చాడు. ఇక్కడే ఒక పంక్చర్ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఒక లారీ టైర్ పంక్చరై, రావడంతో వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టైర్లో అధికంగా గాలి నింపడంతో ఒక్కసారిగా పేలి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుడి బావమరిది ఎండీ.హుస్సేన్ అన్సారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలుండగా వారు బిహార్లోనే ఉంటున్నారు. ఇవి చదవండి: అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులు.. వివాహిత తీవ్ర నిర్ణయం.. -
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
మహబూబ్నగర్ క్రైం/ జడ్చర్ల టౌన్: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల– పాలమూరు ప్రధాన రహదారిపై జాలీహిల్స్ సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి 43 మంది విద్యార్థులతో వస్తున్న బస్సు పాఠశాలకు సమీపంలో యూటర్న్ తీసు కోగా.. రోడ్డు డౌన్ ఉండటం వల్ల వెనకాల వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. బస్సు బోల్తా పడగానే స్థానికులు వెంటనే గా యపడిన విద్యార్థులను చికిత్స కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9మంది విద్యార్థుల తలల కు గా యాలు కాగా.. మరో 8 మందికి స్వల్ప గాయాల వడంతో వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ సురేశ్ తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కొందరు లారీ డ్రైవర్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. పరామర్శించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ బస్సు ప్రమాదంలో గాయపడి ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటించడంతో పాటు సైన్ బోర్డులు, లైనింగ్స్ పెంచేలా చూస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ కూడా విద్యార్థులను పరామర్శించారు. -
విందుకు వెళ్తూ.. అంతలోనే ఇలా..!
మెదక్: నార్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాలు. నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు పెంటపర్తి బాపురెడ్డి కుమారుని వివాహం ఇటీవలే జరిగింది. ఈమేరకు ఆదివారం రామాయంపేటలోని ఓ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. బాపురెడ్డి తన బావ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేటకు చెందిన సిరికొండ లింగారెడ్డి, తోడల్లుడు సిద్దిపేట జిల్లా వెంకటాపూర్కు చెందిన ముత్యాల వెంకట్రాంరెడ్డితో కలిసి కారులో జంగరాయి నుంచి రామాయంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో జప్తి శివునూర్వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి (55) అక్కడిక్కడే మృతిచెందగా, లింగారెడ్డి (48) రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన బాపురెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రమాదం కారణంగా హైవేపై రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ ప్రమాదాలకు గురైన వాహానాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియక్ చేయించారు. ప్రమాదం విషయం తెలుసుకొని మృతుల బంధువులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకొని విలపించారు. ప్రమాదంలో మృతిచెందిన లింగారెడ్డి బీఆర్ఎస్ అంబర్పేట గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్పోస్ట్ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. -
మెరుపు వేగంతో నిలుచున్న లారీని ఢీకొట్టి..
లక్నో: తమిళనాడులో బుధవారం తెల్లవారుజామున ఘోరం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొట్టింది. సేలం-ఈరోడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో సహా ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. Tragic road accident on Tamil Nadu highway kills 6 people. CCTV video emerges. #TamilNadu pic.twitter.com/grWJeeofoY — Vani Mehrotra (@vani_mehrotra) September 6, 2023 ఈంగూర్కు చెందిన ఎనిమిది మంది సభ్యులు వ్యాన్లో పెరుంతురై వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో రోడ్డుకు పక్కన నిలిచి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టారు. డ్రైవర్ నిద్రలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతితో పాటు ఏడాది వయసున్న చిన్నారిగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఇదీ చదవండి: ఎయిర్ హోస్టెస్ రూపాకేసులో వీడిన మిస్టరీ -
వామ్మో! ఏకంగా.. లారీ పై.. ఎక్కిన విమానం..!
మహబూబ్నగర్: సాధారణంగా విమానం ఆకాశంలో ఎగురుతుంది.. లేకపోతే విమానాశ్రయంలో ఆగుతుంది. కానీ, ఓ విమానం లారీపై ప్రయాణించడంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆదివారం హైదరాబాద్ వైపు నుంచి విమానం తీసుకెళ్తున్న ఓ లారీ జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఆగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రెక్కలు లేని విమానాన్ని ఆసక్తిగా గమనించారు. కర్నూలులో హోటల్ నిర్వహణ కోసం ఈ విమానాన్ని ఢిల్లీ నుంచి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. -
ఉసురు తీసిన లారీ
కర్ణాటక: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు సామాన్యులను బలిగొంటున్నాయి. సగటున నిత్యం 25 నుంచి 30 మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. రక్తసంబంధీకులు, దంపతులు విగతజీవులై కుటుంబానికి తీరని శోకం మిగల్చడం వెనుక భారీ వాహనదారుల నిర్లక్ష్యం ఎంతో ఉంది. అదే కోవలో గుర్తు తెలియని టిప్పర్ లారీ ఒకటి బైక్ను ఢీ కొనడంతో ఆదివారం ఉదయం ఇద్దరు మరణించగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకా తరూరు గ్రామానికి సమీపంలో జరిగింది. తుమకూరు అంతరసనహళ్లికి చెందిన వివాహిత మీనాక్షి (28), ఆమె బంధువు గౌరిబిదనూరు తాలూకా తందళు గ్రామానికి చెందిన యువకుడు శశికుమార్ (23) చనిపోయారు. మీనాక్షి భర్త మదన్కు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లికని వెళ్తుండగా.. మడకశిర నియోజకవర్గంలోని అగళికి బంధువుల ఇంటికి పెళ్లికని ముగ్గురూ ఒకే బైక్పై వెళుతుండగా బడవనహళ్లి రోడ్డులో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ వీరి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మీనాక్షి, శశి కుమార్ అక్కడికక్కడే మరణించారు. కాగా, లారీ వాహనం అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి లారీ కోసం గాలింపు చేపట్టారు. -
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. సంతమాగులూరులోని బాలాజీ హైస్కూల్ వద్ద ఘటన జరిగింది. వినుకొండ నుంచి నరసరావుపేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను నరసరావుపేటకి చెందినవారిగా గుర్తించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా ముఖానికి చున్ని అడ్డువచ్చి .. -
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డీఎస్పీ తండ్రి మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: పలమనేరు మండలం జగమర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో గిరి గౌడ్ (80) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కర్ణాటకలోని ఉనసూర్ ఎక్సైజ్ డీఎస్పీ తండ్రిగా గుర్తించారు. డీఎస్పీ తల్లి తీవ్రంగా గాయపడగా, డీఎస్పీ విజయకుమార్కు రెండు కాళ్లు విరిగాయి. చికిత్స నిమిత్తం వారిని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి ఎక్సైజ్ సీఐ లోకేష్ బయటపడ్డారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు? -
రాంగ్రూట్లో వచ్చిన మృత్యువు
సాక్షి, వరంగల్/వర్ధన్నపేట: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు..ఎప్పటిలా బుధవారం కూడా ఉపాధిని వెతుక్కుంటూ బయలుదేరారు. కానీ ఎప్పటిలా వారు క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఉదయాన్నే వారు ప్రయాణిస్తున్న ఆటోను మృత్యు శకటంలా దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నా రు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 7.12 గంటల ప్రాంతంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఢీకొట్టిన లారీ 30 మీటర్లకు పైగా దానిని ఈడ్చుకెళ్లడంతో ఆటో డ్రైవర్ సహా ఆరుగురు దుర్మరణం చెందారు. శరీరాలు ఛిద్రం కావడంతో ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసి భీతావహంగా మారింది. అతి వేగం, లారీ డ్రైవర్ నిర్ల క్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. ఉపాధి కోసం వెళుతుండగా.. రాజస్తాన్లోని జైపూర్కు చెందిన సురేశ్ కురేరీ కుటుంబం పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చి కర్మన్ఘాట్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అక్కడ డెయిరీ పరిశ్రమల్లో కూలీలుగా పనిచేసే వీరు..కొంతకాలంగా అన్ని ప్రాంతాలు తిరుగుతూ తేనె తుట్టెల నుంచి తేనెను తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల క్రితం వరంగల్లోని ఎల్బీనగర్కు వచ్చిన సురేశ్ కురేరీ కుటుంబం అక్కడ డేరాలు వేసుకొని తేనె అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం వరంగల్ నుంచి తొ ర్రూర్ వరకు వెళ్లిన వీరు ఇల్లంద గ్రామానికి కొంతదూరంలో ఉన్న తేనె తుట్టెల నుంచి తేనెను సేకరించి ఆ హైవేపైనే అమ్మారు. బుధవారం కూడా వరంగల్ బస్టాండ్ వద్ద ఉదయం 6.30 ప్రాంతంలో ఆటో కిరాయికి మాట్లాడుకొని తొర్రూర్కు బ యలుదేరారు. సురేశ్ కురేరి (43) వెంట అతని కుమారులు అమిత్ (23), నితిన్ (11), అమీర్లు, సురేశ్ సోదరి కుమారులు జలావత్ దామి అలియాస్ జాబీర్ (19, రూప్చంద్ దామి (33)లు ఉన్నారు. వరంగల్కు చెందిన బట్టు శ్రీనివాస్ (42) ఆటో నడుపుతున్నాడు. మృత్యువులా ఎదురొచ్చి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం నమీనా జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మదన్లాల్ నాయక్ వైజాగ్ షిప్యార్డులో ఉన్న సరుకును లోడ్ చేసుకుని వరంగల్లో అన్లోడ్ చేయడానికి బయలుదేరాడు. ఈ లారీకి మదన్లాల్ సహా ఇద్దరు డ్రైవర్లు ఉండగా, కో డ్రైవర్ రాకే‹Ùమీనా ఖమ్మం వరకు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మం నుంచి మదన్లాల్ న డపడం ప్రారంభించాడు. లారీ ఇల్లంద సమీపిస్తుండగా అప్పటికే నిద్ర మత్తులో ఉన్న మదన్లాల్ లారీని అతి వేగంగా నడుపుతూ రాంగ్రూట్లో ఎదురొచ్చి ఆటోను ఢీకొట్టాడు. లారీ సు మారు 30 మీటర్ల దూరం ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లింది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వారి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయి. సురేశ్ కురేరి, అమిత్ కురేరి, బట్టు శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన నితిన్ కురేరి, అమీర్ కురేరి, రూప్చంద్, జాబీర్లను ఆస్పత్రికి తరలిస్తుండగా నితిన్ మార్గం మధ్యలోనే మృతి చెందాడు. రూప్చంద్, జాబీర్ వరంగల్ ఎంజీఎంలో మరణించారు. అమీర్ కురేరిని ఎంజీఎం నుంచి మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రికి తరలించారు. అత ని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు ఇల్లందలోని కిరాణ దు కాణం వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఫుటేజీలను పరిశీలించి ప్రమాదం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటనాస్థలిని సందర్శించారు. సురేశ్ భా ర్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అరెస్టు చేశారు. -
సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్..
బెంగళూరు: ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి టమాటాను దోపిడీ చేసిన ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పంటపై ఉండగానే రాత్రికి రాత్రే.. పొలంలోనే టమాటాలను మాయం చేసిన సందర్భాలు కూడా ఎదురయ్యాయి. తాజాగా బెంగళూరులో సినిమాని సీన్ని తలపించే ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన దంపతులు పక్కా స్కెచ్తో యాక్సిడెంట్ కట్టుకథ అల్లి.. రైతు దగ్గర నుంచి రూ. 2.5 లక్షల విలువ చేసే 2.5 టన్నుల టమాటా లారీని హైజాక్ చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని ఉరయూరుకు చెందిన వ్యక్తి మల్లేష్. టమాటా లారీ లోడ్ను జులై 8న కొలార్కు తీసుకువెళ్తున్నాడు. లారీ బెంగళూరుకు రాగానే ఓ దంపతులు లారీని అడ్డగించారు. లారీ తమ కారుకు తాకిందని కట్టుకథ సృష్టించి డబ్బులు డిమాండ్ చేశారు. మల్లేష్ అందుకు నిరాకరించాడు. దీంతో లారీ నుంచి మల్లేష్ను బయటుకు లాగి లారీతో హుడాయించారు. చేసేదేమీ లేక మల్లేష్ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లారీ వెళ్లిన మార్గాన్ని ట్రాక్ చేసి నిందితులను పట్టుకున్నారు. నిందితులను వెల్లూరుకు చెందిన దంపతులు భాస్కర్(28), సింధుజా(26)గా గుర్తించి అరెస్టు చేశారు. వీరు ఓ దారిదోపిడీ దొంగల ముఠాలో సభ్యులుగా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన బస్సు.. క్షణాల్లోనే.. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ఆరుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓబులవారిపల్లె పరిధిలోని జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి Kachidi Fish: కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రూ.3లక్షల 10వేలు!.దీని ప్రత్యేక ఇదే -
వర్షాల ఎఫెక్ట్.. సరుకు రవాణా బంద్.. తమిళనాడులో నిలిచిపోయిన 75వేల ట్రక్కులు
చెన్నై: ఉత్తరభారత దేశంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వానల ధాటికి కాలువలు, వాగులు వంకలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వీటితో పాటు సరుకు రవాణా కూడా బంద్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వేలాది ట్రక్కులు తమిళనాడులో నిలిచిపోయాయి. ఈ ట్రక్కులలో కొబ్బరికాయలు, సజ్జలు, స్టార్చ్, ఆరోగ్య సంరక్షణ మందులలో పదార్థాలుగా ఉపయోగించే ముడి పదార్థాలు, అగ్గిపెట్టెలు, క్రాకర్లు, వస్త్రాలు ఉక్కు మరియు ఇనుము పదార్థాలు వంటివి లోడ్లతో కూడిన 75 వేలకుపైగా ట్రక్కుల సరుకుని ఉత్తరాది రాష్ట్రాలకు రవాణా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ట్రక్కులన్నీ తమిళనాడులోని వివిధ పట్టణాలు, నగరాల్లో ఆగిపోయాయి. ఇవి ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు తమిళనాడుకు రావాల్సిన 25,000కు పైగా ట్రక్కులు ఉత్తరాది రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లు లారీ ఓనర్స్ ఫెడరేషన్-తమిళనాడు అధ్యక్షుడు తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత, ప్రయాణానికి అనుకూలంగా మారిన తర్వాతే తమిళనాడు నుంచి లారీలు బయలుదేరుతాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల వల్ల వస్తువులను ఆర్డర్ పెట్టిన కంపెనీలు, ట్రక్ కంపెనీలతో పాటు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చదవండి: ఇకపై కేదార్నాథ్ ఆలయంలో పిచ్చి పనులు చేస్తే జైలుకే.. -
భార్య మరణాన్ని తట్టుకోలేక.. లారీ కిందకు దూకి భర్త సూసైడ్
సాక్షి, మంచిర్యాల జిల్లా: లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక భర్త లారీ కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం పక్కింటి వాళ్లతో గొడవ పడిన భార్య శరణ్య.. పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఆమె చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. భార్య శవాన్ని ఇంటికి తీసుకువస్తుండగా మధ్య మార్గంలో లక్షిట్ పెట్ ఉత్కూర్ చౌరస్తాలో భర్త మల్లికార్జున్ మనస్తాపంతో లారీ కిందకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. భార్య, భర్తలు ప్రాణాలు కోల్పోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పొవడంతో వారు తీవ్రంగా విలపిస్తున్నారు. చదవండి: సంచలనం... నాగేంద్రబాబు హత్యకు వివాహేతర సంబంధమే కారణం... -
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లు.. ముసాయిదా నోటిఫికేషన్కు నితిన్ గడ్కరీ ఆమోదం!
న్యూఢిల్లీ: రవాణా ట్రక్కుల్లో డ్రైవర్ల క్యాబిన్లకు ఏసీలు అమర్చడాన్ని తప్పనిసరి చేసే ముసాయిదా నోటిఫికేషన్కు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. ఎన్2, ఎన్3 ట్రక్కుల క్యాబిన్లకు ఏసీలను బిగించడం తప్పనిసరి అని ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రహదారి భద్రతలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్లకు సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించడంతో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇది వారి పనితీరును సైతం మెరుగుపరుస్తుందన్నారు. Approved the draft notification to mandate the installation of air-conditioning systems in the cabins of trucks belonging to categories N2 and N3. Truck drivers play a crucial role in ensuring road safety. This decision marks a significant milestone in providing comfortable… — Nitin Gadkari (@nitin_gadkari) July 6, 2023 -
లారీ డ్రైవర్లకు ఇక ఏసీ క్యాబిన్లు.. నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు!
ఆటోమొబైల్ సంస్థలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ట్రక్ క్యాబిన్లలో డ్రైవర్ పక్కన ఎయిర్ కండీషనర్లను తప్పని సరిగా అమర్చాలని సూచించారు. మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ భారతీయ డ్రైవర్లను గౌరవిస్తూ ‘దేశ్ ఛాలక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ..43.. 47 సెల్సియస్ డిగ్రీల వేడిలో విధులు నిర్వహించే ట్రక్ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ట్రక్లలో ఏసీలు ఉండాలన్న నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ కొంతమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లారీల్లో ఏసీ తప్పని సరి అయితే వాహన ధరలు అమాంతం పెరుగుతాయని అంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ట్రక్లలో ఏసీలను అమర్చాలన్న నిబంధనల అమలు ఫైల్పై సంతకం చేసి వస్తున్నా’ అని అన్నారు. ఏసీ క్యాబిన్లతో కూడిన ఆ ట్రక్కులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో మంత్రి ప్రస్తావించలేదు. పలు నివేదికలు మాత్రం 2025 నుండి విడుదల కానున్నట్లు చెబుతున్నాయి. నిద్రలోకి జారుకుంటే లారీల్లో ఏసీ క్యాబిన్లు ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా పరిశ్రమ వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఖర్చు పెరగడంతో పాటు, ఏసీ క్యాబిన్లు ఉండడం వల్ల డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అందుకే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ల నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ఉంటే వోల్వో, స్కానియా వంటి కంపెనీలు తాము తయారుచేసే వాహనాల్లో ఏసీ క్యాబిన్లు అందిస్తుండడం గమనార్హం. చదవండి👉 టోల్ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: అనంతపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు రెండేళ్ల చిన్నారి ఉంది. చదవండి: పెద్దల ముందే నరికి చంపాడు.. -
ఐదుగుర్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం
వడమాలపేట/తిరుమల:టెంపోలో వెళ్తున్న భక్తులను తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వడమాలపేట మండలం పుత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని ఎస్ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరగా.. వారి కార్యాలయంలో పనిచేసే 12 మంది సిబ్బంది టెంపో ట్రావెలర్లో బయలుదేరారు. టెంపో టోల్ప్లాజా దాటి అంజేరమ్మ ఆలయానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న దానిని హెరిటేజ్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 12 మందితోపాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది, టోల్ ప్లాజా అంబులెన్స్లో క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఐరాల మండలానికి చెందిన రేవంత్ (44), ఆర్సీ పురానికి చెందిన గిరిజ (45) మృతి చెందారు. అక్కడి నుంచి క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర నెల్లూరుకు చెందిన హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ డ్రైవర్ శివకుమార్ (57), పాకాల మండలం శ్రీరంగరాజపురానికి చెందిన రేఖ (24), కుప్పానికి చెందిన అజయ్కుమార్ అలియాస్ అంజి (25) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నెల్లూరుకు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లెకి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామిరెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేటకు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే టెంపో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వడమాలపేట పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో రెండు టెంపోలకు బ్రేక్ ఫెయిల్ కాగా, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రెండు టెంపో ట్రావెలర్ వాహనాలకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, చెన్నైకి చెందిన 12 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆదివారం తిరుపతికి తిరిగి వెళుతుండగా.. మొదటి ఘాట్ రోడ్డుపై నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది క్షత్రగాత్రులను అంబులెన్స్లో తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇద్దరిని టీటీ బర్డ్ ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో తిరుపతికి చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమల నుంచి తిరుపతికి దిగుతుండగా 9వ మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిలై రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
చావును టచ్ చేసి.. తృటిలో తప్పించుకున్నారు, లేదంటే తల పగిలేది!
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు ఏ రూపంలో ఎటు నుంచి వస్తాయో ఊహించలేం. అందుకే మన ప్రయాణ సమయంలో కాస్త ఆచితూచి డ్రైవింగ్ చేయడం చాలా ముఖ్యం. ఈ రోడ్డు ప్రమాదాల్లో కొన్ని మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఘటనలు చూసే ఉంటాం. ఇదే తరహాలో ఇద్దరు విద్యార్థినులు చావును టచ్ చేసి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతులు స్కూటీపై వెళ్తుంటారు. ఇంతలో వారి ముందు వెళ్తున్న ప్రైవేటు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ఆ డ్రైవ్ చేస్తున్న యువతి ప్రయత్నిస్తుంది. అయితే ఆ రోడ్డు ఇరుకుగా ఉండడం, ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా మరో లారీ వస్తుంది. దీంతో లారీని ఢీకొట్టడంతో ఆ ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. బస్సు, లారీ మధ్య ఆ స్కూటీ ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో యువతులకు పెద్దగా గాయాలు కాలేదు. వారు ధరించిన హెల్మెట్లు కూడా రోడ్డుపై దొర్లాయి. బస్సులోని ప్రయాణికులు కూడా కిటికీ నుంచి ఈ ప్రమాదాన్ని చూస్తున్న వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
డ్రైవింగ్లోనే గుండెపోటుకు గురై..
రాజేంద్రనగర్: పశువుల దాణా లోడ్తో వస్తున్న ఓ లారీ డ్రైవర్ గుండెపోటుకి గురై స్టీరింగ్పైనే మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన డ్రైవర్ కె.నర్సింహ్మ(49) సోమవారం రాత్రి పశువుల దాణాతో లారీని తీసుకొని నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో తన భార్య నాగలక్ష్మికి ఫోన్ చేసి ఛాతీలో నొప్పిగా ఉందని, వాహనాన్ని నడపలేకపోతున్నానని చెప్పాడు. దీంతో భార్య కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. అలాగేనంటూ వాహనంతో ముందుకు కదిలాడు. గగన్పహాడ్ ఓవర్ బ్రిడ్జి దాటిన అనంతరం ఏజీ వర్సిటీ సబ్ రోడ్డు వద్దకు రాగానే గుండెనొప్పి తీవ్రం కావడంతో స్టీరింగ్పైనే పడి మృతి చెందాడు. లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును ఢీకొట్టి పుట్పాత్పైకి ఎక్కి నిలిచిపోయింది. కారు ఎయిర్బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న డ్రైవర్ రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీర్ల వ్యాన్ బోల్తా
-
ఆలా లారీ లో రాహుల్
-
ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఓల్డ్ నిజాంపేట్కు చెందిన దివ్య, ఆమె స్నేహితులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. చదవండి: కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి -
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల మండలం నరసాపురం నుంచి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో గురజాల ఆసుపత్రికి తరలించారు. మృతులను దామర్లచర్ల మండలం నరసాపురం చెందిన మంజుల(25), పద్మ(27), సక్రి(35), సోని, కవిత(30)గా గుర్తించారు. చదవండి: భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య -
విజయవాడ బెంజి సర్కిల్ లో ప్రమాదం
-
సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
-
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
రద్దీగా ఉన్న రైల్వే ప్లాట్ఫామ్పైకి లారీ.. వీడియో వైరల్
లఖ్నవూ: రైల్వే స్టేషన్ లోపలికి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీగా ఉండి కలుపెట్టే సంధు సైతం ఉండని పరిస్థితులు ఉంటాయి. అయితే, అలాంటి ఓ రద్దీ ప్లాట్ఫామ్పై భారీ ట్రక్కు కనిపించటం అక్కడి ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర్ప్రదేశ్లోని జరిగిన సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ ఆటో రిక్షా ఏవిధంగా అయితే ప్లాట్ఫామ్పైకి వచ్చిందో.. అదే విధంగా ప్లాట్ఫామ్పై నుంచి లారీని నడపటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్లాట్ఫామ్పై ప్రయాణికులు భారీగానే ఉన్నారు. అయితే, ఏ రైల్వే స్టేషన్ అనేది స్పష్టత లేదు కానీ, ప్లాట్ఫామ్ నంబర్ 9 అని వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్స్పైకి వాహనాలను తీసుకురావటమేంటని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు. #UttarPradesh pic.twitter.com/gsfMhakbZJ — HP Live News (@hplivenews1) December 21, 2022 ఇదీ చదవండి: హ్యాట్సాఫ్ యశోధరా.. ‘ఎంబీబీఎస్’ చదువుతూనే ‘సర్పంచ్’గా ఎన్నిక -
నర్సింగ్ కాలేజ్ బస్సు బోల్తా...విద్యార్థులకు గాయాలు
సాక్షి నల్గొండ: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల బస్సు నల్లగొండ జిల్లాలోని తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనుకవైపు నుంచి వస్తున్న లారీ, కాలేజీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాలేజీ బస్సు బోల్తా పడింది. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కాలేజ్ బస్సులో సుమారు 40 మంది విద్యార్థినిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి గాయాలయ్యాయని, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ) -
నడిరోడ్డుపై భర్త దాష్టీకం.. భార్యను లారీ కిందకు తోసి..
చింతామణి(కర్ణాటక జిల్లా): కట్టుకొన్న భార్యను మద్యం మత్తులో లారీ కిందకు తోసేసి హతమార్చిన భర్త ఉదంతం శనివారం చింతామణి పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ వద్ద జరిగింది. వివరాలు.. శిడ్లఘట్ట ప్రాంతానికి చెందిన మునికృష్ణప్ప, చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకా కేదేపల్లె గ్రామానికి చెందిన సుమేరా సుల్తానా∙(38) దంపతులు. కూలీ పనులు చేస్తుంటారు. వీరు కొడుకు బాబాజాన్ (10)తో కలిసి పని మీద చింతామణికి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న మునికృష్ణప్ప భార్యతో గొడవపడి లారీ వస్తుండగా దాని కిందకు ఆమెను తోసేశాడు. చక్రాల కింద పడిన ఆమె తల నుజ్జునుజ్జయి అక్కడే మృతి చెందింది. సీఐ రంగస్వామి సంఘటన స్థలానికి చేరుకుని మునికృష్ణప్పను అదుపులోకి తీసుకొన్నారు. కళ్ల ముందే జరిగిన ఘోరంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. తల్లి మరణించి, తండ్రిని పోలీసులు పట్టుకుపోవడంతో బాలుడు రోదించాడు. చదవండి: ‘రూ.కోటి సిద్ధం చేసుకో లేదా..’ గ్యాంగ్స్టర్ ఫోన్.. చివర్లో అదిరే ట్విస్ట్! -
పైన ఎల్లిగడ్డలు.. కింద పశువులు.. ట్రక్కులో కుక్కి...
సాక్షి, ఎడపల్లి (నిజామాబాద్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు.ఎడపల్లి (బోధన్): ఎవ్వరికీ అనుమానం రాకుండా పైన ఎల్లిగడ్డ సంచులు, కింద అరలో పశువులను ఉంచి తరలిస్తున్న ట్రక్కును నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ట్రక్కులోపల 50 పశువులను కుక్కి కుక్కి పెట్టడంతో అవి తీవ్ర గాయాల పాలయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామానికి ఈ పశువులను తీసుకొచ్చారు. గాయపడిన ఎద్దు సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై పాండేరావు ట్రక్కును, పశువులను స్వా«దీనం చేసుకున్నారు. పశువులను బోధన్ గోశాలకు తరలించారు. కాగా, పశువులతోపాటు ఆవులు ఉన్నాయేమోనన్న అనుమానంతో స్థానిక బీజేపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. పరిశీలించగా ఆవులు కనిపించకపోవడంతో వెనుదిరిగారు. చదవండి: అందం హిందోళం.. అధరం తాంబూలం -
స్కూల్ బస్ మిస్.. బైక్లో తీసుకెళ్తుండగా
వేలూరు(చెన్నై): స్కూల్ బస్సు వెళ్లిపోవడంతో కూతుళ్లను స్కూల్లో దింపడానికి వెళ్తున్న వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. బైక్ మీద పిల్లలను వదలడానికి వెళ్తున్న ఓ తండ్రి గాయపడగా, ఇద్దరు కూతుళ్లు చనిపోయిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. ఆంబూరు సమీపంలోని వీరాన్కుప్పం గ్రామానికి చెందిన దండపాణి, భార్య అనురాధ దంపతులకు జయశ్రీ(17), వర్షశ్రీ(12) ఇద్దరు కుమార్తెలు. వీరు ఆంబూరు సమీపంలోని పుదుగోవిందాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. రోజూ పాఠశాలకు చెందిన బస్సులోనే స్కూల్కు వెళ్లొస్తారు. గురువారం ఉదయం ఇంటి వద్ద ఆలస్యం కావడంతో స్కూల్ బస్సు వెళ్లిపోయింది. దీంతో తండ్రి దండపాణి ఇద్దరు కుమార్తెలను బైకులో ఎక్కించుకుని స్కూల్ వద్ద దింపడానికి వెళ్తుండగా, ఆంబూరు సమీపంలోని ఓఆర్ఏ థియేటర్ వద్ద హోసూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ అతివేగంగా ఢీకొనడంతో బైకుపై ఉన్న జయశ్రీ, వర్షశ్రీ అక్కడిక్కడే మృతిచెందగా దండపాణికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆంబూరు పోలీసులు దండపాణిని చికిత్స నిమిత్తం వేలూరులోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గమనించి లారీ డ్రైవర్పై దాడి చేయడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు లారీడ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆంబూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్కు వెళ్తున్న ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో పాటు భర్తకు తీవ్ర గాయాలైన విషయం తెలిసి అనురాధ కన్నీరు మున్నీరైంది. చదవండి: Dussehra Celebrations: దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్ మండల సమీపంలోని మేనూర్ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునజ్జు అయింది. లారీ కింద ఇరుక్కుపోయిన ఆటోను బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు యత్నిస్తున్నారు. -
రహదారిపై భారీ ట్యాంకు
దొరవారిసత్రం: దొరవారిసత్రం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అతిపెద్ద ట్యాంకు ఓ లారీపై వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ లారీ చెన్నై హార్బర్ నుంచి వారం కిందట వంద అడుగుల పొడవున్న ట్యాంకుతో బయలుదేరింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యంలో దారికడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు తప్పిస్తూ సిబ్బంది నెమ్మదిగా ముందుకు కదలడం కనిపించింది. -
తప్పిన పెనుముప్పు.. లేదంటే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవో!
సాక్షి,ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం): కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఆగి ఉన్న మినీ ట్రాలీలారీని ఆర్డీసీ నాన్స్టాప్ బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు ప్లాస్టిక్ ఫైపులతో వెళ్తున్న మినీ లారీ మరమ్మతులకు గురై కింతలిమిల్లు వద్ద నిలిచిపోయింది. ఇదే సమయంలో విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ నాన్స్టాప్ బస్సు.. లారీని గమనించక ఢీకొట్టింది. బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతినగా, అందులో ఉన్న 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ కుదుపులకు కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులను వేరే బస్సులో కాంప్లెస్కు తరలించారు. లారీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందులోని పైపులు చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత -
కర్ణాటక: రోడ్డు ప్రమాదం.. బస్సు-లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి
Karnataka Road accident: కర్ణాటకలోని హుబ్లి శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం ఉదయం కొల్హాపూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు అదే దారిలో వెళ్తున్న లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా 26 మందికి గాయలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుబ్లిలోని కిమ్స్కి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కొబ్బరి కాదు.. కాలకూటం!
జయపురం(భువనేశ్వర్): కొరాపుట్ జిల్లాలో గంజాయి రవాణా ముఠా రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అధికారుల కళ్లు గప్పి, పెద్ద ఎత్తున సరుకు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల లోడు మధ్య ట్రక్కులో తీసుకు వెళ్తున్న సుమారు 16క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎస్పీ మనోజ్కుమార్ సెఠి ఆదివారం వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ప్రమోద్కుమార్ బంటువ, ఎస్ఐ దిలీప్కుమార్ రథ్తో కూడిన ప్రత్యేక బృందం జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు. వారిచ్చిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దుర్భదల్ బిశ్వాల్, ఆఫీస్ ఇన్చార్జి సంజయ్కుమార్ కండి, ఏఎస్ఐ ఎం.లక్ష్మణరావు, మాధవేశ్ మహంతి, సిబ్బంది జయపురం ఘాట్ రోడ్డులో మాటు వేశారు. అతి వేగంగా వస్తున్న ట్రక్కుని నిలువరించి, సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరి కాయలతో పాటు 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.81 లక్షలు ఉంటుందని వెల్డించారు. ఘటనకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ ప్రభు యాదవ్(35)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. పద్మపూర్లో 3 క్వింటాళ్లు.. రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు రూ.15 లక్షల విలువైన 3క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్కు చెందిన యష్బీర్ సింగ్(60), పన్నాలాల్ బాస్దేవ్(57)ను అరెస్ట్ చేశారు. పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరిడిగుడ వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రాయగడ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందు సరఫరా చేసే డ్రమ్ముల్లో 300 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీతో పాటు డ్రైవర్, హెల్పర్ను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. నలుగురి అరెస్ట్.. మల్కన్గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి మంత్రిపూట్ గ్రామం వద్ద చిత్రకొండ పోలీసులు శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, 253 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిని బీహార్కు తరలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని ఎంవీ–38 గ్రామానికి చెందిన ప్రకాష్ సర్దార్, బీహర్కు చెందిన సునీల్కుమార్, హరేంద్రకుమార్, విజేంద్రకుమార్ లను అరెస్ట్ చేశారు. నిందితులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్డీపీఓ అన్షుమాన్ ద్వివేది తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. -
ఉద్యోగం వచ్చింది కానీ.. అంతలోనే..
మైసూరు(బెంగళూరు): చామరాజనగర తాలూకా, మలెయూరు గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే జిల్లా గుండ్లుపేట తాలూకా నిట్ర గ్రామానికి చెందిన జగదీష్(27) మృతి చెందాడు. ఇతను ఒక కంపెనీలో లారీ డ్రైవర్గా ఎంపికయ్యాడు. లైసెన్స్ కోసం చామరాజనగర్లోని ఆర్టీఓ కార్యాలయానికి బైక్పై వెళ్తుండగా మలెయూరు వద్ద రాళ్లలోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. తీవ్రగాయాలతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. చామరాజనగర గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. కత్తితో దాడిచేసిన విద్యార్థి హోసూరు: విద్యార్థులు గొడవపడి కత్తులతో పొడుచుకున్న సంఘటన జరిగింది. జిల్లాలో కావేరిపట్టణం దగ్గర పన్నిహళ్లిపుదూర్ గ్రామానికి 15 ఏళ్ల విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. సోమవారం మామిడిపండ్లు తింటూ పోట్లాటకు దిగారు. ఓ విద్యార్థి కత్తితో మరో విద్యార్థిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు చికిత్స కోసం కావేరిపట్టణం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చేరుకొని దాడికి పాల్పడిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. చదవండి: Cm Stalin: తమిళనాడులో.. ప్రపంచస్థాయి మేధస్సు -
రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
చింతూరు: ఉత్తరప్రదేశ్కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 530 కిలోల గంజాయిని శనివారం చింతూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ యాదగిరి తమ సిబ్బందితో కలసి స్థానిక పోలీస్స్టేషన్ ఎదుట వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోతుగూడెం వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా గుమ్మడికాయల కింద దాచి రవాణా చేస్తున్న గంజాయి లభ్యమైంది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరవ్కుమార్, ప్రతాప్కుమార్, ఒడిశాకు చెందిన కొర్రా సన్యాసిరావు, కిలో అర్జున్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
గోపవరం: మండలంలోని పి.పి.కుంట సమీపంలో నెల్లూరు– ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది, ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి నెల్లూరు వెళుతున్న పీఎస్ఆర్ ప్రైవేటు ట్రావెల్స్æ బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు ముందు భాగంలో ఉన్న రాజస్థాన్కు చెందిన సురేకుమార్(30) అనే వ్యక్తి అదుపు తప్పి కిందపడటంతో టైరు ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజస్థాన్కు చెందిన జగదీ‹Ù, మల్లికార్జున, వాకాడుకు చెందిన పద్మావతి, కుసుమ, అనంతపురానికి చెందిన విజయబాబులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు అతివేగంగా వెళుతుండటం, డ్రైవర్ నిద్రలోకి జారడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. మరో రెండు నిమిషాల్లో గమ్యం చేరేలోపే.. కాగా మృతి చెందిన సురేకుమార్ పి.పి.కుంట వద్ద గాలిమిషన్లో కూలీ పని చేసుకుంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో రెండు నిమిషాల్లో పి.పి.కుంట స్టేజీ వద్ద దిగేందుకు పుట్బోర్డు మీదకు చేరుకున్న సురేకుమార్ ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో కిందపడి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బద్వేలు రూరల్ ఏఎస్ఐ రాజశేఖర్రెడ్డి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని టైరు కింద ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటికి తీశారు. బస్సు ఢీకొన్న లారీ సిమెంట్ లోడుతో వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. సురేష్కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
బాల్కొండ/నిర్మల్ చైన్గేట్: నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై తెల్లవారు జామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు లారీని ఓవర్టేక్ చేయబోతుండగా అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో ముందు కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న మెండోరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ బస్సు డ్రైవర్ సహా 20 మంది క్షతగాత్రులను అంబులెన్స్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో నిర్మల్ జిల్లా కొరిటికల్కు చెందిన రాజు అనే ప్రయాణికుడికి రెండు కాళ్లు విరిగాయి. ఖానాపూర్కు చెందిన వినోద్కు ఒక కాలు, హిమజ అనే ప్రయాణికురాలికి చెయ్యి విరిగింది. ఈ ముగ్గురిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదస్థలం నుంచి క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మెండోరా ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. కాగా, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా.. లేక ఇతర కారణాలేమయినా ఉన్నాయా అన్న అంశంపై విచారణ చేస్తున్నట్లు ఆయనవెల్లడించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
రోడ్డు దాటుతున్న బాలిక.. అంతలో బీబీఎంపీ లారీ వచ్చి..
శివాజీనగర(బెంగళూరు): రోడ్డు దాటుతున్న బాలికపై బీబీఎంపీ చెత్త లారీ దూసుకెళ్లడంతో మృతి చెందిన దుర్ఘటన నగరంలో హెబ్బాళ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎయిర్పోర్టు రోడ్డులో సోమవారం మధ్యాహ్నం 12:45 సమయంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి వర్షం కురవడంతో అండర్పాస్ నీటితో నిండిపోయింది. దీంతో ప్రజలు రోడ్డు మీదనే అటుఇటు రాకపోకలు సాగించారు. అక్షయ (13) అనే 9వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసి వచ్చి రోడ్డు దాటేందుకు యత్నిస్తుండగా వేగంగా వచ్చిన చెత్త లారీ బాలికపై దూసుకెళ్లి, బైక్ను కారును ఢీకొట్టింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. బైక్లు, కార్లు దెబ్బతిన్నాయి. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. బీబీఎంపీ సిబ్బంది అండర్పాస్లో నీటిని తొలగించకపోవడమే ఘటనకు కారణమని విమర్శలొచ్చాయి. -
వాట్ యాన్ ఐడియా.. లారీ కాదండోయ్.. ఫైవ్ స్టార్ స్టైల్ హోటల్!
సాక్షి, కోదాడరూరల్(నల్గొండ) : వారికొచ్చిన ఓ ఐడియాతో లారీని ఫైవ్స్టార్ లుక్లో హోటల్గా తయారు చేశారు.. ఇద్దరు వ్యక్తులు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన శివ అతని స్నేహితుడు యశ్వంత్ పాత లారీని కొనుగోలు చేసి దానిని ప్రయాణికులను, ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసి హోటల్గా మార్చారు. దానిని హైదరాబాద్ విజయవాడ రహదారిపై తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల క్రాస్రోడ్లో శనివారం ప్రారంభించారు. ప్రస్తుతం టిఫిన్, ఫాస్ట్ ఫుడ్తో పాటు పలు రకాల టీలు, కాఫీలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే రెస్టారెంట్ తరహాలో రూపొందించి అన్ని రకాల తినుబండారాలు అందిస్తామని అంటున్నారు. ఈ హోటల్ రహదారిపై వచ్చిపోయే ప్రయాణికులు వాహనాలను నిలిపి ఆసక్తిగా తిలకిస్తున్నారు. సాధారణంగా ఇప్పటి వరకు చిన్న ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో రోడ్డు వెంట పెట్టి హోటల్స్ నిర్వహించడం చూశాము కానీ ఈ తరహాలో చూడలేదని ప్రయాణికులు అంటున్నారు. -
సడన్ బ్రేక్ వేసిన లారీ డ్రైవర్.. కిందకు దూసుకెళ్లిన కారు.. ఎస్ఐ మృతి
పహాడీషరీఫ్: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ డ్రైవర్.. సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు, ముందున్న లారీ కిందకు దూసుకెళ్లి వాహనాన్ని నడుపుతున్న ఎస్ఐ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున జరిగింది. మహబూ బ్నగర్ జిల్లా ధర్మ పూర్ గ్రామానికి చెందిన పల్లె మాస య్యగౌడ్ కుమారుడు పల్లె రాఘవేందర్ (37) రైల్వే ఎస్ఐగా పని చేస్తు న్నారు. శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుకూ రులోని బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్టులో నివసించే స్నే హితుడు బాబురెడ్డిని కలిసేందుకు మహబూబ్నగర్ నుంచి తన స్విప్ట్ డిజైర్ కారులో బయ లుదేరారు. శనివారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న క్రమంలో తుక్కుగూడ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకాల ఉన్న ఎస్ఐ రాఘవేందర్ తన కారును నియంత్రించ లేకపోవ డంతో ఒక్కసారిగా లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. -
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన లారీ
-
మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్ హీరో అయ్యాడు
తిరువనంతపురం: ఇంట్లో కానీ ప్రయాణిస్తున్న వాహనంలో అనూహ్యంగా మంటలు చెలరేగడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.. ఆ సమయంలో ఏం చేయాలో తోచక టెన్షన్ పడుతుంటారు. అయితే లారీలో మంటలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ప్రమాదాన్ని ఆపడంతో రియల్లో హీరో అనిపించుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం రోజు పశుగ్రాసం(గడ్డి)లోడ్తో వెళుతున్న లారీ రోడ్డుపైన ఉన్న విద్యుత్ తీగలకు తాడకంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వయనాడ్ నుంచి కొడంచేరికి చేరుకునే సమయంలో మంటలు లారీలోని గడ్డి మొత్తానికి చుట్టుముట్టాయి. దీన్ని గమనించిన డ్రైవర్ మధ్యలోనే లారీని నుంచి దిగి పారిపోయాడు. అయితే ప్రమాదాన్ని గమనించిన షాజీ వర్గీస్గా పేర్కొనే ఓ వ్యక్తి హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే లారీ ఎక్కి దానిని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అంతేగాక మంటల్లో కాలిపోతున్న లారీని కూడా రక్షించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాలో బంధించగా.. దీనిని ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రాణాలకు తెగించి వర్గీస్ చేసిన ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. చదవండి: గల్లీలో పల్లీలు అమ్ముకుంటూనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు ఈ ఘటనపై వర్గీస్ మాట్లాడుతూ.. మండుతున్న లోడ్ను కింద పడేయాడానికి జిగ్జాగ్ పద్ధతిలో లారీని నడిపినట్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా తాను హెవీ డ్యూటీ వాహనం డ్రైవర్గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో దేశవిదేశాల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించడంలో అనుభవం ఉందని, అదే ఇప్పుడు ఈ సవాలును ఎదుర్కోవడంలో సహయపడిందని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్నేహితులు, తెలిసిన వారి నుంచి ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. అగ్నిమాపక అధికారులు కూడా వర్గీస్ సాహసాన్ని కొనియాడారు. చదవండి: గాల్లో పక్షిలా చక్కర్లు కొడుతున్న కోడి.. వైరల్ వీడియో View this post on Instagram A post shared by നമ്മൾ കോഴിക്കോട്ടുകാർ (@kozhikottukaarofficial) -
బోర్డర్లో ‘బూడిద’ లొల్లి! 400 లారీల నిలుపుదల.. ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో బూడిద లారీలను నిలిపివేయడం ఆందోళనకు దారితీసింది. రెండు రోజులుగా 400కుపైగా లారీలను ఆపేయడం.. డ్రైవర్ల నిరసనతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. లారీలను వదలాలంటే డబ్బులు చెల్లించాలని ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఓవర్ లోడ్తో వెళ్తుండటంతో ఆపేశామని పోలీసులు చెప్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం జరిమానా వేసి వదిలేయాల్సి ఉన్నా.. రెండ్రోజులు ఆపడం, డ్రైవర్లు నిరసనకు దిగేవరకూ చూడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగింది? రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణా మండలానికి కర్ణాటకతో సరిహద్దు ఉంది. ఆ రాష్ట్రంలోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ (కేపీసీ) విద్యుత్ కేంద్రంలో వెలువడిన బూడిద (యాష్).. ఈ సరిహద్దు మీదుగానే రాష్ట్రంలోని ఇటుక బట్టీలకు సరఫరా అవుతుంది. నారాయణపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీల్లో లైట్ వెయిట్ బ్రిక్స్ తయారీకి ఈ బూడిదను వినియోగిస్తారు. అయితే ఈ బూడిదను రవాణాచేసే లారీలను కృష్ణా చెక్పోస్టు వద్ద రవాణా, పోలీస్ అధికారులు గురువారం నుంచి నిలిపివేశారు. సుమారు 400కుపైగా వాహనాలు రెండు రోజులుగా రోడ్డు పక్కనే నిలిచిపోయాయి. లారీలను పంపాలని, తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని.. వారికి మద్దతుగా రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఓవర్లోడ్తో వస్తే జరిమానా వేసి, మరోసారి ఓవర్ లోడ్తో రావొద్దని చెప్పాలే తప్ప.. ఇలా నిలిపేసి ఇబ్బంది పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో పోలీసు, రవాణా అధికారులు లారీలను వదిలేశారు. ముందు ఓ ఎమ్మెల్యే.. తర్వాత మరో ఎమ్మెల్యే.. బూడిద లారీలను వదిలేయాలంటే ఒక్కోలారీకి రూ.10వేలు ఇవ్వాలని నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టుగా శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత ఓ డ్రైవర్ అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ‘‘మిమ్మల్ని తిప్పలు పెట్టాలని కాదు. ఓవర్ లోడ్తో రోడ్లు దెబ్బతింటున్నయ్.. లెక్క ప్రకారం బూడిదను ట్యాంకర్ వాహనాల ద్వారా సరఫరా చేయాలి. ఓపెన్ లారీల్లో లెవల్కు మించి వేయడంతో గాలికి లేచి కళ్లల్లో పడుతోంది. పరిగికి చెందిన ఓ నాయకుడిది ఓవర్ లోడై ఉంది. అక్కడి పోలీస్ నాటకం చేస్తున్నడు. పైసలు తీసుకుని వదిలిపెడ్తున్నడు. చూస్తున్నా.. ఖతం పెట్టాలని చూస్తున్నా. మీరు దందా చేసి బతకాలి.. నాది గట్లే ఉంటది.. కొంచెం సిస్టంగా రావాలని చూస్తున్నా..’’ అని సంభాషణలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. లారీల విషయంలో ఇలా ఇద్దరు ఎమ్మెల్యేల జోక్యం, ఆరోపణలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
నిజాంసాగర్ (జుక్కల్): వారు దర్గా వద్ద మొక్కులు తీర్చుకొని క్వాలిస్ వాహనంలో ఇంటికి తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యంలో ఆ వాహనం అతివేగంగా వెళ్లి ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఏడు గురు మృత్యువాతపడ్డారు. వీరిలో రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలున్నారు. మరో ఐదుగురు పిల్లలు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం జగన్నాథపల్లిలో సంగారెడ్డి– నాం దేడ్ 161 జాతీయ రహదారిపై శనివారం మధ్యా హ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్నేహితులైన హైదరాబాద్లోని మూసానగర్, వినాయక వీధి ప్రాంతాలకు చెందిన మహమ్మద్ అమీర్తాజ్, మహమ్మద్ హుస్సేన్ తమ కుటుంబాల్లోని మొత్తం 12 మందితో కలసి రెండురోజుల క్రితం క్వాలిస్ వాహనంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఖందార్ దర్గాలో కందురు చేసేందుకు వెళ్లారు. మొక్కులు తీర్చుకొని వస్తుండగా... ఖందార్ దర్గా వద్ద మొక్కులు తీర్చుకుని అమీర్, హుస్సేన్ కుటుంబాలు తిరుగుప్రయాణంలో 110 కిలోమీటర్ల దూరం వచ్చారు. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ జగన్నాథపల్లి దాబా వద్ద రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్ దాబాలోకి వెళ్లేలోపు క్వాలిస్ అతివేగంగా వచ్చి లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో క్వాలిస్ ముం దుభాగం లారీ కిందికి చొచ్చుకెళ్లింది. ఈ ప్రమాదం లో అమీర్ (29), అతని భార్య పర్వీన్ సనా (20) వారి ఇద్దరు పిల్లలు అలియా పాతిమా (18 నెలలు), హన్నన్ ఫాతిమా, అలాగే, హుస్సేన్ (33), తస్లీమ్ బేగం(26) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్సేన్ కూతురు నూర్ బేగం (8) నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ మరణించింది. మరో ఐదుగురు పిల్లలు అజార్ బేగం, సుల్తానా, హరి, హిబా, యాస్మిన్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైనవారిలో నలుగురు హుస్సేన్ పిల్లలు కాగా, మరొకరుసనా పర్వీన్ అక్క కూతురైన యాస్మా బేగం ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి, బిచ్కుంద సీఐ శోభన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను 108 అంబులెన్స్లో బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనాథలైన హుస్సేన్ పిల్లలు ప్రమాదంలో మృతి చెందిన హుస్సేన్(33), తస్లీం బేగం(26) దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కూతుళ్లు హాజరాబేగం, నూర్బేగం, సుల్తానా బేగం, హిబా, కుమారుడు అలీ ఉన్నారు. హుస్సేన్ దంపతులతోపాటు కూతురు నూర్ బేగం మృతి చెందారు. మిగిలిన నలుగురు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. బహుత్ అచ్చా రహ్తె థే: షేక్ జహంగీర్, సనా బంధువు, నిజామాబాద్ మా అన్న కూతురైన సనా, అమీర్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఎంతో ప్రేమతో ఉండే వీరిని రెప్పపాటులో మృత్యువు కబళించింది. ఇద్దరు పిల్లలూ చనిపోయారు. చాలా బాధగా ఉంది. చదవండి: పెళ్లయిన 42 రోజులకే.. నవ వధువు హత్య!.. మూఢనమ్మకాలతో భర్తే అలా చేశాడా? చిన్ననాటి స్నేహితులు... మృతులు మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ అమీర్ చిన్ననాటి స్నేహితులు. హుస్సేన్ వాటర్ప్లాంట్ నిర్వహిస్తుండగా అమీర్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. వీరు ప్రతిఏటా దర్గాకు వెళ్లి వస్తుంటారు. వీరి స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. -
పెళ్లి ఊరేగింపుపై దూసుకెళ్లిన లారీ.. ఒక్కసారిగా ఆనందం ఆవిరైంది
మల్కన్గిరి( భువనేశ్వర్): జిల్లా కేంద్రానికి సమీపంలోని పండ్రీపణి గ్రామం బుధవారం రాత్రి ఓ మృత్యువాహనం దూసుకెళ్లింది. బియ్యం బస్తాలతో వస్తున్న లారీ గ్రామ సర్పంచ్ శివఖేముండు కుమారుడి వివాహ ఊరేగింపు పైకి దూసుకు వచ్చింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శివఖేముండు తన కుమరుడి వివాహం భయపరగూడలో జరిపించి, స్వగ్రామనికి ఊరేగింపుగా తీసుకు వస్తున్నారు. అదే సమయంలో మల్కన్గిరి వైపు వస్తున్న ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీకి బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో ముందుగా ఓ బైక్ను ఢీకొట్టింది. అనంతరం పెళ్లి ఉరేగింపు బృందంపైకి దూసుకు వచ్చింది. ప్రమాదంలో శివఖేముండు, పెళ్లి కుమారుడి మేనమామ సంతోష్కుమార్ సాహు, సునబేడకు చెందిన డప్పు వాయిధ్యకారులు రాజకుమార్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురు గాయాలపాలు కాగా మల్కన్గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మల్కన్గిరి ఐఐసీ రామప్రసాద్ నాగ్ అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే పండ్రీపణి గ్రామస్తులు లారీను అడ్డుకొన్నారు. మల్కన్గిరి–జయపురం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి, టైర్లు కాలుస్తూ నిరసన వ్యక్తం చేశారు. చదవండి: గిటారులో డ్రగ్స్.. అంతా బాగానే కవర్ చేశాడు.. కానీ.. -
టీఆర్ఎస్ కార్యకర్తల టాటా ఏస్ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం
కరీంనగర్: హుజురాబాద్ మండలం రాజపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజారాబాద్లో ఎన్నికల ప్రచారం కోసం తరలిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. టాటా ఏస్లో మొత్తంగా.. 20 మంది మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే.. ట్రాలీలో ఉన్నమహిళలు రోడ్డుపై ఎగిరి పడ్డారు. ఆ ప్రదేశమంతా క్షత గాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటిపోయింది. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో .. వారికి మెరుగైన చికిత్సకోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై ఒకవైపు పూర్తిగా ధాన్యం రాసులు కుప్పగా పోయడం వలన ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
గోనుగొప్పల వాగులో చిక్కుకున్న సిలిండర్ల లారీ
-
మరణంలోనూ వీడని స్నేహం..
సాక్షి,డోన్ టౌన్( కర్నూలు): వారిద్దరూ స్నేహితులు. గౌండా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు. రోజూ కలసి పనికి వెళ్లి వస్తున్న వీరిని సోమవారం మృత్యువు బలి తీసుకుంది. డోన్ పట్టణంలోని జెడ్పీ గెస్ట్ హౌస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మండలంలోని వెంకటనాయునిపల్లె గ్రామానికి చెందిన బోయ చిన్న నాయుడికి ముగ్గురు కుమారులు కాగా రాజశేఖర్ (18) పెద్దోడు. పదో తరగతి వరకు చదివి గౌండా పని చేస్తున్నాడు. అలాగే ఇదే గ్రామానికి చెందిన శంకరమ్మ, శేఖర్ దంపతులకు కుమార్తెతో పాటు కుమారుడు శివకుమార్ (20) ఉన్నాడు. ఆరేళ్ల క్రితం శేఖర్ అనారోగ్యంతో మృతి చెందగా శివకుమార్ కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడేళ్లుగా రాజశేఖర్, శివకుమార్ గౌండా పనికెళ్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. సోమవారం రాజశేఖర్ తన బంధువుకు చెందిన స్పోర్ట్స్ బైక్ తీసుకుని పనికొచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇద్దరూ బైక్పై గ్రామానికి వెళ్తుండగా.. అదే సమయంలో జెడ్పీ గెస్ట్ హౌస్ వద్ద సిమెంట్ దుకాణంలో అన్లోడ్ చేసేందుకు రివర్స్లో వస్తున్న లారీని గమనించక పోవడంతో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం శివకుమార్ను కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరు యువకుల మృతితో వెంకటనాయునిపల్లెలో విషాదం అలుముకుంది. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నగేష్ తెలిపారు. చదవండి: పెళ్లయ్యి ఏడాది కాకముందే.. అబార్షన్ చేయించుకుందని! -
సెలవు కావడంతో సైకిల్ తీసుకుని బయటకు వెళ్లాడు.. అంతలో..
సాక్షి,మద్దికెర( కర్నూలు): పెరవలి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, నరసయ్య దంపతులకు కురవ రంగస్వామి (13) ఒక్కగానొక్క కుమారుడు. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సోమవారం భారత్ బంద్ కారణంగా పాఠశాలకు సెలవు కావడంతో గ్రామ శివారులో ఉన్న ఈద్గా వద్ద సైకిల్ తొక్కుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రంగస్వామిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. సమాచారం అందుకున్న ఎస్ఐ మమత సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ రమేష్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామ సమీపంలో జరుగుతున్న రైల్వే పనులకు మట్టి, కంకర తరలించే టిప్పర్లు అతి వేగంగా వెళ్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రేమ.. యువతి ఆత్మహత్యాయత్నం -
లారీ ఎక్కిన పడవ.. ఆశ్చర్యంగా ఉందే!
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం: సముద్ర జలాల్లో తిరగాల్సిన పడవ లారీ ఎక్కింది. ఇదేంటా... అని అంతా ఆశ్చర్యంగా చూశారు. సీన్ కట్ చేస్తే ఓ పడవను లారీపై జాతీయ రహదారి మీదుగా బిహార్ నుంచి కోల్కతా తరలిస్తున్నారు. ఈ లారీ నాతవలస జాతీయ రహదారిపై గురువారం ప్రయాణం చేయడంతో అటుగా వెళ్లే వారంతా ఆసక్తిగా తిలకించారు. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన తండ్రి -
‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’
మన కళ్ల ముందే కొన్నిసార్లు వింత సంఘటనలు జరగడం చూస్తూ ఉంటాం. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉండొచ్చు. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ లారీ రోడ్డు ప్రమాదానికి గురై రెండు ముక్కలైనప్పటికీ.. లారీ ఇంజన్ భాగం మాత్రం ఆగకుండా ముందుకు వెళ్లిపోయిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. కానీ, 14 సెకండ్ల వీడియోలో ఇద్దరు వ్యక్తులు బురద రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నారు. వారి వెనకవైపునే ఓ లారీ భారీ లోడ్తో వస్తూ మూల మలుపు వద్ద టర్న్ అయ్యింది. రోడ్డు బురదగా ఉండటం, ఒక్క సారిగా టర్న్ కావడంతో అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే లారీ పైభాగం మొత్తం పడిపోయినా.. చక్రాలతోపాటు కింది భాగం అలాగే ఉండి రోడ్డుపై పరుగులు పెట్టింది. లారీలో నుంచి క్షేమంగా బయటపడిన డ్రైవర్కు ఇదంతా అయోమయంగా అనిపించింది. అతను లారీ ఇంజన్ భాగం వెంట పరుగెడుతున్న దృశ్యాలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. లారీ రెండుగా విడిపోయి రోడ్డుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు లేదంటే వారు ప్రమాదం బారినపడేవారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఫన్నీగా ఉన్న ఈ దృశ్యాలపై కొందరు భిన్నంగా స్పందించారు. లారీకి దెయ్యం పట్టిందని అందుకే ఇలా రెండుగా చీలి పరుగులు పెట్టిందని కామెంట్లు చేశారు. మరికొందరేమో అతి అన్నిటికీ అనర్థమే.. భారీ లోడ్ కారణంగా లారీ రెండుగా విరిగిపోయిందని అంటున్నారు. చదవండి: వైరల్: అంతా మ్యాచ్లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో.. కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం शरीर का त्याग करके आत्मा निकल गई #FunKiBaat pic.twitter.com/Iry5vmQNRc — Ashok Kumar ◆ (@ashokism) September 13, 2021 -
వాగులో పడిపోయిన భారీ లారీ
-
అదుపు తప్పి వాగులో పడిన లారీ
అనంతపురం జిల్లా: ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులోకి పడింది. జిల్లెడువాగులో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావటంతో గొల్లపల్లి వద్ద నిన్న కారు వాగులో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు వెళ్తున్నాయి. ఇదే నేపథ్యంలో జిల్లెడువాగు దాటుతూ టెన్ టైర్ లారీ ఒకటి అదుపు తప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఇవీ చదవండి: 6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు సాక్షి ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ సురేష్ ఆచారి సస్పెన్షన్ -
నల్లమల ఘాట్లో కొండను ఢీకొన్న లారీ
ఆత్మకూరు: నల్లమల ఘాట్ ప్రాంతంలో కొండను లారీ ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ విజయేంద్ర సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ లతన్ యోగి ఎడమకాలు విరిగి గాయాలయ్యాయి. రాజస్థాన్కి చెందిన లారీ విశాఖ నుంచి బళ్లారికి ఐరన్ షీట్లు తీసుకుని వెళుతోంది. దోర్నాల– ఆత్మకూరు నల్లమల ఘాట్లోని రోళ్లపెంట వద్ద మలుపు తిరిగే సమయంలో లారీ అదుపు తప్పి కొండను ఢీకొని రోడ్డుపై అడ్డుగా ఉండిపోయింది. దీంతో నల్లమలలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు ఎస్ఐ హరిప్రసాద్, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని, క్లీనర్ను బయటకు తీశారు. అనంతరం ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. కొండను ఢీకొన్న ఐరన్షీట్ లారీ -
భార్య భర్తల మధ్య గొడవ.. మామపై లారీ ఎక్కించి..
సాక్షి, సేలం(తమిళనాడు): భార్యభర్తల మధ్య గొడవకు బంధువు బలయ్యాడు. వివరాలు.. సేలం గాంధీనగర్ చోలపల్లానికి చెందిన సుబ్రమణి (32) లారీ డ్రైవర్. భార్య జీవిత. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జీవిత పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి సుబ్రమణి అత్తారింటికి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరాడు. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహించిన సుబ్రమణి కంటైనర్ లారీతో మామను గుద్దడానికి యత్నించాడు. ఆయన్ను తప్పించే ప్రయత్నంలో జీవిత అత్త కుమారుడు జీవా (26)పై లారీ ఎక్కింది. తీవ్రంగా గాయపడిన జీవాను సేలం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. స్థానికు లు సుబ్రమణికి దేహశుద్ధి చేశారు. దీంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
సాక్షి, కడప: మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారి డి. అగ్రహారం వద్ద శుక్రవారం అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఏడుగురు వ్యక్తులు ఇన్నోవాలో కడపకి వివాహానికి వస్తున్నారు. మరోవైపు చిత్తూరు నుంచి టమాటా లోడుతో మినీ లారీ వెళుతోంది. డి.అగ్రహారం వద్ద స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఇన్నోవా, లారీఎదురెదురుగా ఢీకొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను, మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలపారు. -
రన్నింగ్లో లారీ.. లోపలినుంచి అద్దాలు తుడుస్తుండగా..
శ్రీకాకుళం : కదులుతున్న లారీ అద్దాలు తుడుస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి క్లీనర్ కె.వెంకటరావు గాయపడ్డాడు. ఈ సంఘటన బొంతపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీలో ఉన్న వెంకటరావు లోపల ఉండే అద్దాలు తుడుస్తున్న క్రమంలో అవి ఊడిపోయాయి. దీంతో పట్టుతప్పి రోడ్డుపై పడిపోవడంతో కాలు, తలకు గాయాలయ్యాయి. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి లారీని నిలిపి వేయడంతో క్లీనర్కు ప్రాణాపాయం తప్పింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై లారీ-బొలెరో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులను గుల్ బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని బొలేరో వాహనం లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. -
కాలినడక భక్తులపై దూసుకెళ్లిన లారీ
సాక్షి, చిత్తూరు: వడమాలపేట వద్ద లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
ఆలయం పైకి దూసుకెళ్లిన లారీ : కామారెడ్డి
-
పెందుర్తి జీ వీ ఎంసీ పరిధిలో లారీ భీభత్సం
-
భారీ వాహనం.. బహుదూరపు ప్రయాణం
ఈ భారీ వాహనం ఏదో రాకెట్ను తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తోంది కదా..? కానే కాదు. అది ఆయిల్ ప్లాంట్లో వాడే ఓ భారీ పరికరం. దాన్ని గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి తరలిస్తున్నారు. పరికరం పెద్దది కావడంతో దానికి తగ్గట్లే 106 టైర్లున్న భారీ వాహనంలో తీసుకెళుతున్నారు. 20 రోజుల క్రితం గుజరాత్లో బయల్దేరిన ఈ వాహనం మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించింది. రోడ్డు మీద ఇంత పెద్ద వాహనం కనిపించడంతో అందరూ ఆసక్తిగా చూశారు. కాగా, ఈ భారీ వాహనాన్ని నడిపేందుకు ముగ్గురు డ్రైవర్లు, మరో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
విషాదం: పిల్లల కళ్లెదుటే..
రేగిడి: మండల పరిధిలోని బూరాడ జంక్షన్ వద్ద శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె భర్తతోపాటు ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి బ యటపడ్డారు. కళ్లెదుటే తల్లిని కోల్పోవడంతో వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ అందించిన వివరాల ప్రకారం.. మరడాన తిరుపతిరావు, ఆయన భార్య ఇందిర, ఇద్దరు చిన్నారులు స్కూటీపై రాజాం నుంచి వీరఘట్టం వెళ్తున్నారు. బూరాడ జంక్షన్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి ఇసుక లారీ వచ్చి వాహనాన్ని ఢీకొనడంతో ఇందిర (30) రోడ్డుపై పడిపోయారు. ఆమెపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతిరావు ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడిపోవడంతో చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరగ క ముందు సాయంత్రం 4 గంటల సమయంలో రేగిడి పోలీసులు వీరి బండిని ఆపారు. అయితే వీరఘట్టంలో బంధువులు చనిపోయారని, అక్కడకు వె ళ్తున్నామని చెప్పడంతో మానవతా దృక్పథంతో వా హనాన్ని విడిచిపెట్టారు. అక్కడ నుంచి కొద్ది దూ రం వెళ్లాక ఈ దుర్ఘటన జరిగి ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు. వీరి స్వగ్రామం వంగర మండలం ప టువర్ధనం. బతుకు తెరువు కోసం రాజాంలో స్వీట్ షాపును నడుపుకొని జీవనం సాగిస్తున్నారు. మృత దేహాన్ని రాజాం ప్రభుత్వానికి తరలించి పోస్టుమా ర్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్ కరోనా కాటు: ఒకే కుటుంబంలో ముగ్గురు బలి -
కూలీ పనుల కోసం వెళ్లారు.. అంతలో
చేగుంట (తూప్రాన్): రోడ్డు పక్కన నిలిపిన ఆటోను ఓ లారీ వెనక వైపు నుంచి ఢీకొట్టిన ఘటనలో అందులో కూర్చున్న 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్పేట వద్ద ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. చేగుంట మండలం మక్కరాజ్పేట గ్రామానికి చెందిన మహిళలు మసాయిపేటలోని సీడ్ కంపెనీలో కూలీ పనులకు వెళ్లేందుకు ఆదివారం ఉదయం రోడ్డు పక్కన ఉన్న ఆటోలో కూర్చోగా అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో మైలారం సుశీల, పుట్ట పద్మ, కొరివిపల్లి నర్సమ్మ, శ్యామల, ఆటో డ్రైవర్ పంబల్ల భిక్షపతి, ఎర్రగొల్ల నాగమని, కొరివిపల్లి రేణుక, మైలారం సంతోష, సుశీల, చింతకింది దుర్గమ్మ, లక్ష్మి గాయపడ్డారు. క్షతగ్రాతులను గజ్వేల్లోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో విషమంగా ఉన్న సుశీల, భిక్షపతి, లక్ష్మిలను హైదరాబాద్ తరలించి వైద్యం అందిస్తున్నారు. గజ్వేల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు పరామర్శించారు. బాధితుల ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ( చదవండి: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం ) -
యల్లాపుర వద్ద ఘోర ప్రమాదం
సాక్షి, యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లా, యల్లాపుర తాలూకా అరబైల్ఘట్ట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య బొలెరో వాహనం ఇరుక్కుపోయి ఒక మహిళ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాగలకోటె జిల్లా లోకాపురకు చెందిన 8 మంది గోకర్ణకు బయలుదేరారు. అరబైల్ఘట్ట వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంతో లారీ ఢీకొంది. ఈ వేగానికి బొలెరో ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా తాకింది. రెండు వాహనాల మధ్య బొలెరో ఇరుక్కుపోయి నుజ్జయ్యింది. స్థానికులు వచ్చి బొలెరోలో ఉన్నవారికి బయటకు తీశారు. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను యల్లాపుర ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
-
పశ్చిమ గోదావరిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, పశ్చిమ గోదావరి : జంగారెడ్డిగూడెం బైపాస్లోని శ్రీనివాసపురం జంక్షన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాతపడగా.. 20 మందికి గాయాలయ్యాయి. ఓ ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. గుబ్బలమంగమ్మ ఆలయానికి వెళ్తున్న ట్రాక్టర్ని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యవకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. ఏసీబీకి చిక్కిన సీనియర్ ఆడిటర్ -
వైరల్ వీడియో : యూనిటీ పవర్ ఏంటో చూపించారు
నాగాలాండ్ : ఐకమత్యం ఉంటే ఎంతటి అసాధ్యం అయినా సుసాధ్యం అవుతుంది. నాగాలాండ్లో జరిగిన ఓ సంఘటన సరిగ్గా దీనికి అద్దం పడుతుంది. వివరాల ప్రకారం..నాగాలాండ్లోని ఓ లోయలో ప్రమాదవశాత్తూ ఓ లారీ పడిపోగా పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లతో లారీని బయటకు లాగేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో వందలాది మంది అక్కడికి వచ్చి ఆ లారీని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. వాహనానికి ఇరువైపులా తాళ్లు కట్టి ఎంతో శ్రమతో దాన్ని బయటకు లాగి ఐకమత్యంగా పనిచేస్తే ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయవచ్చు అని నిరూపించారు. ఈ వీడియోను సుప్రియా సాహూ అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. టీం వర్క్ పవర్ ఏంటో నిరూపించారు అంటూ పలువురు నెటిజన్లు నాగాలాండ్ వాసులను అభినందిస్తున్నారు. -
సినిమా షూటింగ్ కాదు! ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి, చెన్నై: తమిళనాడులో శనివారం ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మపురి - సేలం మార్గంలో అతి వేగంతో వచ్చిన లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్తో వెళుతున్న లారీ అదుపు తప్పి వాహనాలపై దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు 15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడినవారిని సేలం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా , సినిమా షూటింగ్ను తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు చూపురులను గగుర్పాటుకు గురి చేశాయి. పలు వాహనాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. -
పట్టుకున్నారు... వదిలేశారు !
తొట్టంబేడు : ఓ లారీలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. ఆ లారీకి ఎస్కార్ట్గా ముందు వెళుతున్న ఇన్నోవా కారునూ పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలనూ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఏమైందో ఏమో గానీ ఉదయానికల్లా లారీ, కారు మాయమయ్యాయి. నెల్లూరు వైపు నుంచి పిచ్చాటూరు మార్గంలో బియ్యం బస్తాల మాటున ఓ లారీలో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందింది. తొట్టంబేడు మండలం లక్ష్మీపురం సమీపంలో మాటు వేసి లారీని సిబ్బంది పట్టుకున్నారు. దాని ముందు ఎస్కార్ట్గా వెళుతున్న ఇన్నోవా కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎస్టార్ట్ వాహనం స్విఫ్ట్ కారు సిబ్బంది కళ్లు కప్పి తప్పించుకుంది. పట్టుబడిన లారీ, కారును తొట్టంబేడు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. లారీలో 10 టన్నులకుపైగా చౌక దుకాణాల బియ్యం, ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. రాత్రి పూట లారీ పట్టుబడినందున రేంజర్ వచ్చాక లోడ్ను పరిశీలించి విషయం తెలియజేయనున్నట్లు అదేరోజు విలేకరులకు తెలిపారు. అయితే మరుసటి రోజు సోమవారం లారీ, కారును పంపేశారు. ఇదేమని అడిగితే సిబ్బంది పొంతన లేని సమాధానాలు తెలిపారు. దీనిపై స్థానిక ఫారెస్ట్ రేంజర్ వెంకటసుబ్బయ్యను వివరణ కోరగా ఈ సంఘటనకు సంబంధించి తనకేమీ తెలియదని, విచారిస్తానని తెలిపారు. -
కడప-కర్నూలు హైవేపై రోడ్డుప్రమాదం
-
ఘోర ప్రమాదం; ఇద్దరు సజీవ దహనం
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని దువ్వూరు మండలం చింతకుంట సమీపంలోని కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. వివరాలు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపు వెళుతున్న సిమెంట్ లారీ రహదారి పక్కన ఉన్న డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ మంటల దాటికి తట్టుకోలేక సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. -
జెఎంజె కాలేజ్ వద్ద లారీ బీభత్సం
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ జిల్లా నగర శివార్లలో శుక్రవారం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. జెఎంజె కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు టెంట్లోకి ఒక లారీ దూసుకెళ్లింది. అయితే ఆ సయయంలో టెంట్లో ఎవరూ లేపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే టెంట్లోకి లారీ దూసుకెళ్లడంతో చెక్పోస్ట్ మొత్తం నేలమట్టమయింది. కాగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటాకా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా మరో ఘటనలో జిల్లాలోని పోరుమామిళ్ల మండలం నాగల కుంట్ల గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ఒక్కసారి కరెంట్ షాక్ కావడంతో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. -
లారీలో 55 మంది కూలీలు
కలకడ : లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్కు తరలిస్తున్న 55 మంది కూలీలు, ఇద్దరు లారీ డ్రైవర్లను కలకడ తహసీల్దార్ చిన్నయ్య, ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. కలకడ సమీపంలోని జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టా రు. తమిళనాడు తిరువూరు నుంచి వస్తున్న లారీని పరిశీలించారు. అందులో 55 మంది కూలీలు ఉన్నట్టు గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్లు నారాయణ్సింగ్యాదవ్, ఉమేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి ని స్థానిక ఆదర్శ పాఠశాలకు తరలించారు. -
జేసీ బ్రదర్స్ కాళ్లబేరం!
అధికారంలో ఉన్నన్నాళ్లూ మా అంతటోళ్లులేరని విర్రవీగిన జేసీ సోదరులు.. ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. వారు చేసిన ఒక్కో అక్రమం వెలుగుచూస్తుండగా జైలు భయంతో అన్నదమ్ములిద్దరూ ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే బీఎస్–3 వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించిన జేసీ సోదరులు.. వాటిని ఇతరులకు అంటగట్టి భారీగా వెనకేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవహారం వెలుగుచూడగా.. బాధితులు కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో జేసీ సోదరులు కాళ్లబేరానికి దిగుతుండటం గమనార్హం. తుక్కులారీల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జేసీ సోదరులు కాళ్ల బేరానికి దిగినట్టు తెలుస్తోంది. కేసులు పెట్టవద్దంటూ తమ నుంచి లారీలు కొన్న వారిని వేడుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా తాము విక్రయించిన తుక్కు లారీలను వెనక్కి తీసుకుని సదరు యజమానులకు లారీకి రూ.14 లక్షల చొప్పున ముట్టచెబుతున్నారు. అంతేకాకుండా తమ మీద కేసులు పెట్టకుండా రూ.100 బాండ్ పేపరు మీద వారితో సంతకాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చదవండి: తిమ్మిని బమ్మిని 'జేసీ'.. మొత్తం 154 వాహనాలు బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి విక్రయించిన ఘటనలో రోజుకో అక్రమ వ్యవహారం వెలుగుచూస్తోంది. కేవలం నాగాలాండ్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కూడా ఈ దందా సాగించినట్లు సమాచారం. మొత్తంగా 154 బీఎస్–3 లారీలను బీఎస్–4గా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొన్ని లారీలను రవాణాశాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా.. మిగిలిన లారీల కోసం వెతుకుతున్నారు. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, చండీఘర్ రాష్ట్రాల రవాణాశాఖ ఉన్నతాధికారులకు కూడా లేఖలు రాశారు. సదరు బీఎస్–3 తుక్కు లారీలు కనపడితే వెంటనే సీజ్ చేయాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో కొనుగోలు వాతావరణంలో కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు అనుగుణంగా బీఎస్–3 వాహనాల రిజిస్ట్రేషన్లను 2017 ఏప్రిల్ 1 నుంచి చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో బీఎస్–3 వాహనాలను విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన బీఎస్–3 వాహనాలను.. బీఎస్–4 వాహనాలుగా పేర్కొంటూ నాగాలాండ్లోని జేసీ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 68 లారీలను స్క్రాప్ కింద తక్కువ ధరకు దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అనంతరం ఇదే విధంగా తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా కాలం వాహనాలు కొనుగోలు చేశారు. మొత్తంగా 154 వాహనాలను తక్కువ ధరకే కొనుగోలు చేసి బీఎస్–4గా పేర్కొంటూ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్ఓసీ తీసుకుని దర్జాగా జిల్లాలో తిప్పారు. జేసీ.. మీదీ బతుకేనా? తుక్కులారీ రూ.20 లక్షలకు విక్రయం తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్ఘడ్లల్లో కూడా బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా మార్చి నకిలీ డాక్యుమెంట్లతో వాహనాలను తిప్పారు. ఇందులో కొన్ని లారీలను పలువురికి రూ.20 లక్షల చొప్పున విక్రయించారు. వాస్తవానికి ఆ లారీలకు మార్కెట్లో రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షల మేర ఉండటంతో తమకు తక్కువ ధరకే వస్తుందన్న భావనతో పలువురు వీరి నుంచి లారీలను కొనుగోలు చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు విచారణ ప్రారంభించి.. మొత్తం వ్యవహారాన్ని బయటకు లాగారు. అంతేకాకుండా ఈ వాహనాలను సీజ్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తమను మోసగించి తుక్కులారీలను విక్రయించారంటూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారిని జేసీ బ్రదర్స్ బతిమలాడుతూ కేసు పెట్టవద్దని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా లారీకి రూ.14 లక్షల చొప్పున వెనక్కు చెల్లించడంతో పాటు.. కేసులు పెట్టబోమని వారి నుంచి రూ.100 బాండు పేపరు మీద సంతకాలు తీసుకుంటున్నారు. తద్వారా తమపై నేరుగా కేసు నమోదు కాకుండా జేసీ సోదరులు తిప్పలు పడుతున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో బలమైన ఆధారాలు ఉండటంతో కేసుల నుంచి తప్పించుకోవడం అంత సులువుకాదని రవాణాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జేసీ సోదరులు.. తోడుదొంగలు.. -
నలుగురి ప్రాణాలు తీసిన నిద్రమత్తు
కొనకనమిట్ల: నిద్రమత్తు.. నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టడంతో కర్ణాటకకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం–పొదిలి జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.40గంటల సమయంలో జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పాటిమీదపాలేనికి చెందిన వెన్నపూస శాంతారామిరెడ్డి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఆయన భార్య సరస్వతి తోబుట్టువు, వారి బంధువులు మరో 9 మంది కర్నాటక రాష్ట్రం బళ్లారి మండలం సిద్దంపల్లి, ఎరెంగలి, ఉద్దట్టి గ్రామాల నుంచి తుఫాన్ వాహనంలో బయల్దేరారు. మరో గంటలో పాటిమీదపాలెం చేరుకోవాల్సి ఉండగా.. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద చెన్నై నుంచి మార్కాపురానికి ఫ్లైవుడ్ లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో తుఫాన్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వాహనం నుజ్జయింది. వాహన డ్రైవర్ మంజు అందులోనే ఇరుక్కుపోగా సిద్దంపల్లి హేమంత్రెడ్డి(62), చెట్ల హంసమ్మ(59), చెట్ల సుగుణమ్మ(58) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి వైద్యశాలకు తరలించగా సునీత(32) చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతుల్లో హంసమ్మ, సునీత తల్లీకూతుళ్లు. చెట్ల శృతి, చెట్ల వీరారెడ్డి, సిద్దంపల్లి రామిరెడ్డి, సురేష్రెడ్డి, తిమ్మారెడ్డి, కవితతోపాటు తుఫాన్ డ్రైవర్ మంజు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృత దేహాలను కందుకూరు ఆర్డీవో ఓబులేసు, దర్శి డీఎస్పీ సూర్యప్రకాశ్రావు పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరనాయక్ తెలిపారు. ఘటనా స్థలంలో మృతదేహాలు, క్షతగాత్రులు -
గ్రానైట్ లారీ బోల్తా, ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. గ్రానైట్ రాళ్ల లోడ్తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిలై డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాళ్లు మీదపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబందించి పూర్తివ వివరాలు తెలియాల్సి ఉంది. -
హెల్మెట్ లేదని లారీ డ్రైవర్కు జరిమానా!
కర్ణాటక,బొమ్మనహళ్లి: సాధారణంగా బైక్పై వెళ్తున్న వారు హెల్మెట్ ధరించకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్ హెల్మెట్ వేసుకోలేదని సదరు డ్రైవర్కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్గా నజీర్ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
సికింద్రాబాద్లో లారీ బీభత్సం
-
ట్రక్కు 6.53 లక్షల జరిమానా
భువనేశ్వర్: ఒడిశాలోని సంభల్పూర్లో శనివారం నాగాలాండ్కు చెందిన ఓ లారీపై రూ.6.53 లక్షల జరిమానా విధించి పోలీసులు కొత్త రికార్డు సృష్టించారు. ట్రాఫిక్ నిబంధనలు ఏడింటిని ఉల్లంఘించారన్న కారణంగా ఇంతటి భారీ జరిమానా వేశారు. ఐదేళ్లుగా రోడ్ ట్యాక్స్ కట్టని కారణంగా ఎన్ఎల్ 08డీ 7079 నెంబరు ఉన్న ట్రక్పై రూ.6.40 లక్షల జరిమానా విధిస్తూ సంభల్పూర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి చలాన్ రాశారు. వాహనాన్ని దిలీప్ కర్తా అనే డ్రైవర్ నడుపారు. యజమాని పేరు శైలేశ్ గుప్తా. దీంతోపాటు రూ.వంద సాధారణ జరిమానాగా, ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.500, వాయు, శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు రూ.1000, సరుకులు రవాణా చేయాల్సిన వాహనంలో ప్రయాణీకులను తీసుకెళుతున్నందుకు రూ.5000, పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000, పర్మిట్ నిబంధనలను పాటించనందుకు రూ.1000 జరిమానా విధించినట్లు రసీదులో ఉంది. -
హోటల్లోకి దూసుకెళ్లిన లారీ, మహిళలు మృతి
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం వద్ద శనివారం విషాదం నెలకొంది. లారీ అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వైపు వస్తున్న తౌడు లారీ చట్టి జంక్షన్ వద్ద అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్ళడంతో హోటల్లో కూర్చున్న ముగ్గురు మహిళలు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారినీ చింతూరు ఏరియా ఆసుపత్రి కి తరలించారు, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. -
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, విజయనగరం : జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి పార్వతిపురం వెళ్తొన్న ఆర్టీసీ బస్సును ఒడిషా నుంచి వస్తోన్న లారీ నెల్లివాడ బ్రిడ్జీపై ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో బొండపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్తో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని విజయనగరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు గాయపడిన వారికి సహయం అందించేలా చర్యలు చేపట్టారు. -
నంద్యాలలో బీరు బాటిల్స్ లోడ్ లారీ దగ్ధం
-
బీరు బాటిల్స్ లోడ్తో వెళుతున్న లారీ దగ్ధం
సాక్షి, కర్నూలు : బీరు బాటిల్స్ లోడ్తో వెళుతున్న ఓ లారీ దగ్ధమైంది. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఉన్నట్టుండి లారీ ఇంజిన్లో నుంచి మంటలు రావడం.. అవి వేగంగా వ్యాపించడంతో చూస్తుండగానే లారీ మొత్తం దగ్ధమైంది. లారీ బీర్ బాటిళ్ల లోడ్ ఉండటంతో మంటలు మరింత చెలరేగాయి. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు మంటలను అదుపు చేసే క్రమంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నంద్యాలలో బీరు బాటిల్స్ లోడ్ లారీ దగ్ధం -
లారీ దొంగలూన్నారు జాగ్రతా..!
పాల్వంచ: లారీ ఓనర్లు, డ్రైవర్లు మీ లారీలను జర జాగ్రత్తగా చూసుకోండి.. ఆదమరచి ఉంటే అంతే సంగతులు.. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో లారీ దొంగలు సంచరిస్తున్నారు.. పార్కింగ్ చేసి ఉంచిన లారీలను, డీజిల్ను చోరీ చేసేందుకు కొన్ని రోజులుగా విఫలయత్నం చేస్తున్నారు. వారం రోజుల్లో మూడు చోట్ల లారీలను చోరీ చేసేందుకు ప్రయత్నించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. కేటీపీఎస్, నవభారత్ కర్మాగారాలు ఉన్న నేపథ్యంలో లారీల ద్వారా ముడిసరుకు తోలకాలు, యాష్ ట్యాంకర్లు నిత్యం తిరుగుతుంటాయి. ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత గంటల కొద్ది వెయిటింగ్లో ఉంటాయి. ఈ క్రమంలో లారీ డ్రైవర్లు లారీలను వదిలి బయటకు వెళుతుంటారు. డ్యూటీలు దిగి మళ్లీ వస్తుంటారు. కొన్ని సమయాల్లో ఆదమరిచి నిద్రిస్తుంటారు. వారి సీరియల్ వచ్చేసరికి లారీల వద్దకు చేరుకుంటుంటారు. ఇదే అదును చేసుకుని కొందరు లారీలను చోరీ చేసేందుకు యత్నిస్తున్నారు. అంతేగాక లారీలకు చెందిన బ్యాటరీలు, డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ తరహా దొంగతనాల పట్ల లారీ యజమానులు కలవరం చెందుతున్నారు. గతంలో ఎక్కడో ఆంధ్ర ప్రాంతం నెల్లూరు కేంద్రంగా దొంగతనాలు జరిగేవని, ఇప్పుడు లారీలను ఎక్కడ నిలిపి వెళ్లాలన్నా భయ మేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో వరస సంఘటనలు జరగడంతో పోలీసులు సైతం అవాక్కవుతున్నారు. వీటిపై నిఘాను తీవ్ర తరం చేశారు. ఈనెల 15వ తేదీన నవభారత్ గేటు వద్ద లోడ్ కోసం టిప్పర్ను ఉంచారు. సీరియల్ వచ్చేసరికి లేటవుతుందని డ్రైవర్ డ్యూటీ దిగిపోయాడు. లారీ ఇంజన్ తాళాలు వేయకుండా బయటి డోర్ తాళాలు మాత్రమే వేసి వెళ్లినట్లు సమాచారం. లారీ కనిపించక పోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మీదేవిపల్లి పరిధిలోని బొమ్మనపల్లి సమీపంలో సుమారు 25 కిలోమీటర్లు తీసుకెళ్లి రోడ్డు పక్కన పెట్టి పరారయ్యారు. లారీలోని డీజిల్, జాకీలు, జాకీ రాడ్లు, బ్యాటరీలు చోరీ చేశారు. టైర్లు తీసేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. లారీ దొరకడంతో యజమాని, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 16వ తేదీ మార్కెట్ ఏరియాలో కూరగాయల లోడ్ కోసం వచ్చిన లారీలో ఉన్న డీజిల్ను దొంగలు చోరీ చేశారు. లారీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 18వ తేదీన కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం వద్ద యాష్(బూడిద) కోసం పాల్వంచకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి ట్యాంకర్ (లారీ) తీసుకెళ్లి అక్కడ వెయిటింగ్లో ఉంచాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఎవరూ లేనిది గమనించి ఓ దొంగ లారీని స్టార్ట్ చేసి బయటకు తీసుకొచ్చాడు. అంతలో గుర్తించి లారీ డ్రైవర్లు వెంట పడ్డారు. ఇది గమనించిన దొంగ లారీని రన్నింగ్లోనే ఉంచి దూకి పరారయ్యాడు. అల్లూరిసెంటర్ వద్ద ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి లారీ ఆగింది. సీసీ కెమెరాల్లో పరిశీలించగా వ్యక్తి ముఖం సరిగా కనిపించక పోవడం గమనార్హం. ఇటీవల మల్లయ్య అనే వ్యక్తి టిప్పర్ కొనుగోలు చేశాడు. బీసీఎం రోడ్లో బజాజ్ షోరూం పక్కన ఉన్న లారీ మెకానిక్ షెడ్లో ఉంచగా టిప్పర్ బ్యాటరీలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ వరుస ఘటనలపై దృష్టి సారించాలని పలువురు లారీ డ్రైవర్లు కోరుతున్నారు. -
లారీపై 102 చలాన్లు
గచ్చిబౌలి: 102 చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ లారీని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం ఉదయం నానక్రాంగూడలోని క్యూసిటీ వద్ద వెళ్తున్న లారీ(ఏపీ 12 డబ్ల్యూ 1445)ని గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ ఖాజాపాషా అడ్డుకుని తనికీ చేయగా 102 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ లారీని సీజ్ చేశారు. పెండింగ్ చలానాలు చెల్లిస్తేనే లారీని విడుదల చేస్తారని డ్రైవర్ జె.రాజుకు సూచించారు. -
నల్లగొండ జిల్లాలో దగ్దమైన బియ్యం లారీ
-
రెండు లారీలు ఢీ.. స్కూటరిస్టు మృతి
వైఎస్సార్ జిల్లా : రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ స్కూటరిస్టు మృతి చెందాడు. ఈ సంఘటన ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం కడప ఎయిర్ పోర్ట్లో సెక్యూరిటీ అధికారిగా మురళీధర్ రెడ్డి(35) పనిచేస్తున్నారు. యర్రగుంట్లలోని తన అత్తమ్మ ఇంటికి బైక్పై బయలుదేరారు. తిప్పలూరు వద్ద వెనకవైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న మరో లారీ ముందుపడిపోయాడు. అనంతరం రెండు లారీలు ఢీకొట్టడంతో, మధ్యలో పడిపోవడంతో మురళీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు పీరాను 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మురళీధర్ రెడ్డి స్వస్థలం పెద్దముడియం. -
ఔటర్ రింగ్ రోడ్డుపై అగ్నికి అహుతైన లారీ
-
డ్రైవర్ లేకున్న 100మీ. ముందుకు కదిలిన లారీ
-
లారీ ఎక్కిన హెలికాప్టర్
సాక్షి, చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం హెలికాప్టర్ను తరలిస్తున్న ఓ లారీ ఆగింది. అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ హెలికాప్టర్ను షిప్లో ఆంధ్రప్రదేశ్ని విశాఖపట్నం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి లారీలో ముంబాయికి తీసుకెళ్తున్నారు. విశ్రాంతి కోసం డ్రైవర్ లారీని అక్కడ ఆపాడు. దీనిని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. పలువురు హెలికాప్టర్తో సెల్ఫీలు దిగారు. -
లారీ - అంబులెన్స్ ఢీ.. నలుగురు మృతి
-
రూపునిస్తారు.. రోడ్డుపైకి తెస్తారు !
ఆటోనగర్(విజయవాడ తూర్పు): లారీ మెకానిక్ బాడీ బిల్డింగ్ పనులకు విజయవాడ ఆటోనగర్ పేరుగాంచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా లారీల యజమానులు వచ్చి ఇక్కడ బాడీ కట్టించుకుంటారు. ఈ ఏడాది పనులు ముమ్మరంగా ఉంటున్నట్లు లారీబాడీ బిల్డింగ్ షెడ్డుల యజమానులు చెబుతున్నారు. గత ఏడాది డీజిల్ ధరలు పెరగడంతో కొత్త లారీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదని, ప్రస్తుతం నిలకడగా ఉండడంతో లారీల కొనుగోలు పెరిగిందని చెబుతున్నారు. ఆటోనగర్లో బాడీ బిల్డింగ్ చేయించుకునేందుకు గాను అధిక సంఖ్యలో కొత్తలారీలు షెడ్లకు వచ్చాయి. దీంతో మరలా లారీబాడీ బిల్డింగ్ పనులు మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా మారింది. రెండు నెలల నుంచి పనులు ఊపందుకుంటున్నాయి. 300 పైగా షెడ్డులు... ఆటోనగర్లో సుమారు 300లకు పైగా లారీ బాడీ బిల్డింగ్ షెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షెడ్డులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే బాడీబిల్డింగ్ పనులు చేసేందుకు గాను కార్మికులు సరిపడా లేరని యజమానులు చెబుతున్నారు. గతంలో కార్మికులు 2 వేల మందికి పైగా ఉండేవారని, పనులు సక్రమంగా దొరకపోవడంతో వారు వేరే పనుల వైపు వెళ్లడంతో ప్రస్తుతం కార్మికుల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. దీంతో గతంలో పనిచేసిన మెకానిక్లు, వేరే కార్మికుల వద్దకు వెళ్లి వారిని బతిమిలాడి తీసుకు రావాల్సి వస్తోందని, అయినప్పటికీ వారు అడ్వాన్స్లు ఇస్తేనే పనులకు వచ్చే పరి స్థితి నెలకొని ఉంది. ఈ పని మినహా వేరొక పని చేయలేమని అందుకే ఈ పనిని వదిలేయకపోతున్నామని షెడ్ల యజమానులు వాపోతున్నారు. స్థలం కొరతతో ఇక్కట్లు... లారీలను పెట్టుకునేందుకుగాను ఇక్కడ స్థలం సరిపడినంత లేకపోవడంతో షెడ్డు యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క లారీకి బాడీబిల్డింగ్ పనులు చేయాలంటే కనీసం 15 నుంచి 30 రోజులు సమయం పడుతుంది. మిగతా లారీలను పెట్టుకునేందుకు స్థలం సరిపోవడంలేదని షెడ్డుల యజమానులు చెబుతున్నారు. ఏమి చేయాలో తెలీక ఒక్కోసారి పని వదులుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం లారీ బిల్డింగ్ పనులకు సరిపోయేంత స్థలం ఇవ్వాలని వారు కోరు తున్నారు. బాడీబిల్డింగ్ ఇలా... లారీ కొనుగోలు చేసినప్పుడు దానికి ఎటువంటి సీటింగ్, బాడీ, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు తదితరాలు ఏమీ ఉండవు.. దానికి కార్మికులు మంచి బాడీ కట్టి, పెయింటింగ్ వేసి, సీటింగ్ అమర్చి, కావాల్సిన లైట్లు ఏర్పరిచి అందంగా ముస్తాబు చేసి ఇస్తారు. దీనికి టింకరింగ్, పెయింటింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్తో పాటు పలు పనులన్నింటిని చేస్తారు. లారీ కంపెనీ వారు బాడీబిల్డింగ్ చేయాలంటే కనీసం మూడు మాసాలు పడుతుంది. అదే ఆటోనగర్లో అయితే 15 రోజుల నుంచి నెలరోజుల్లోపే చేసి యజమానులకు అప్పగిస్తారు. ఒక లారీ బాడీ బిల్డింగ్ పనులు చేయాలంటే రూ.3.80 నుంచి రూ.4 లక్షలు కాంట్రాక్ట్ ఇస్తున్నారని యజమానులు చెబుతున్నారు. -
కంటైనర్ హైజాక్?
చిత్తూరు , గంగవరం: విలువైన పరికరాల లోడుతో ఓ కంటైనర్ మండలంలో గురువారం ఉదయం హఠాత్తుగా ప్రత్యక్షమైంది. వివరాలు.. మండలంలోని పలమనేరు–బెంగళూరు జాతీయ రహదారిలోని అటుకురాళ్లపల్లెకు వెళ్లే దారికి ఆనుకుని అటవీ ప్రాంతం ఉంది. అక్కడ పొదల చాటున సామ్సంగ్ కంపెనీకి చెందిన ఏసీలు, వాషింగ్ మెషిన్ల లోడుతో ఓ కంటైనర్ ఉండటం గ్రామస్తుల దృష్టికి వచ్చింది. లారీ నిండా విలువైన వస్తువులే ఉండటంతో బుధవారం రాత్రి కొందరు దుండగులు హైజాక్ చేసి వస్తువులను అపహరించేందుకు ప్రయత్నించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తుల సమాచారంతో సీఐ, ఎస్ఐలు అక్కడికి స్థలానికి చేరుకుని పరిశీలించారు. కంటైనర్ వెనుక భాగాన ఒక పక్క డోర్కు ఏర్పాటు చేసిన ప్రెసింగ్ లాక్ను కట్టర్తో కట్ చేసి లోపలి వస్తువులను దొంగలించేందుకు యత్నించడంతో నేలపై అవి పడిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. కంటైనర్ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోకపోవడంతో జీపీఎస్ ద్వారా అది ఉన్న ప్రదేశాన్ని యజమానులు గుర్తించారు.అక్కడికి చేరుకున్నారు. పోలీసులను కలిశారు. తమిళనాడు చెన్నై నుంచి సామ్సంగ్ కంపెనీలో వస్తువులను లోడ్ చేసుకుని అహ్మదాదాబాద్కు బుధవారం కంటైనర్ బయలుదేరినట్లు చెప్పారు. లారీ డ్రైవర్ అదృశ్యం కంటైనర్ డ్రైవర్ లేకపోవడంతో ఇది మిస్టరీగా మారింది. పోలీసుల పరిశీలనలో డ్రైవర్ సెల్ ఫోన్, డ్రైవింగ్ లైసెన్స్ కంటైనర్లో ఉండటం గుర్తించారు. లైసెన్స్లో సిద్రామప్ప నారేగల్గా పేరు నమోదైంది. ఒకవేళ అతనే ఇలా కంటైనర్ను దారి తప్పించి, చోరీకి వీలుకాకపోవడంతో వదిలి వెళ్లాడా? లేక మరెవరైనా ముందుగానే స్కెచ్ వేసి, దీనిని హైజాక్ చేసి ఇక్కడికి తీసుకువచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన వేలిముద్రల నిపుణులు, లారీ, కింద పడిన వస్తువులు, ఉపయోగించిన కట్టర్పై వేలిముద్రలు సేకరించారు. పోలీసులు దీని మిస్టరీ ఛేదించాల్సి ఉంది. -
లారీ బోల్తా.. 29 మందికి గాయాలు
సాక్షి, మాచర్ల / వెల్దుర్తి : కడుపులో ఆకలి మంటలు చల్లార్చుకునేందుకు పస్తుల రెక్కలు కట్టుకుని పనులు వెతుక్కుంటూ జిల్లాలు దాటి వెళ్లారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో కొద్ది రోజులు కండలు కరిగించి నాలుగు డబ్బులు దాచుకుని ఆదివారం స్వగ్రామాలైన ప్రకాశం జిల్లాలోని వెంకటరెడ్డిపల్లె, గంగారం ప్రయాణం కట్టారు. మరి కొద్ది గంటల్లో తమ వారిని చూస్తామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న లారీ వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద బోల్తా కొట్టింది. 29 మంది ప్రయాణికుల్లో పది మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు మూల మలుపు వద్ద ఆదివారం సాయంత్రం లారీ బోల్తా కొట్డడంతో 29 మంది వలస కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగాఉండటంతో మెరుగైన వైద్యంకోసం గుంటూరుకు సిఫార్సుచేయగా వారిలో కొందరు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైద్యశాలకు వచ్చిన ఆరుగురిలో ఇద్దరికి ఎముకలు విరిగి తీవ్రగాయాలు కాగా, మరో నలుగురికి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిసింది. మిగిలిన 19 మంది మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నారు. వీరంతా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వెంకటరెడ్డిపల్లె, గంగారం గ్రామాలకు చెందిన వారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని విదిలాబాద్కు కూలి పనుల నిమిత్తం వలస వెళ్లారు. పనులు ముగించుకొని ఆదివారం స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
కుదేలవుతున్న లారీ పరిశ్రమ
చిత్తూరు ,మదనపల్లె సిటీ: దేశీయంగా వస్తువులు, నిత్యావసర సరుకుల చేరవేతకు కీలకమైన రవాణా రంగం దివాలా దిశగా పయనిస్తోంది. పెరుగుతున్న డీజిల్ ధరలు, రోడ్డు ట్యాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్తో కుదేలవుతోంది. పెరుగుతున్న వ్యయాలకు అనుగుణంగా లాభాలు రాక, నష్టాలతో వాహనాలను నడపలేక తుక్కు ఇనుము కింద తెగనమ్ముకునే పరిస్థితులు అనివార్యమవుతున్నాయి. పెరిగిన ధరలతో కుదేలు.. రవాణా రంగంలో లారీలు ప్రధాన పాత్ర పోషి స్తున్నాయి. వీటికి సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం, రోడ్డు ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 2013లో ధర్డ్ పార్టీ ఇన్సూరెన్సు రూ.16,300 ఉండగా ప్రస్తుతం రూ.42 వేలకు చేరింది. టైర్లు, వాహనాల విడిభాగాల ధరలు కూడా 30 శాతం మేర పెరిగాయి. పుండు మీద కారంచల్లిన చందంగా లీటర్ డీజిల్ ధర రూ.80కి చేరింది. వీటితో పాటు జాతీయ రహదారులపై ప్రతి 50 కిలో మీటర్లకు టోల్గేట్లు, జీఎస్టీతో వాహన యజమానులు రోడ్డున పడుతున్నా రు. రాష్ట్ర ప్రభుత్వమైతే యజమానుల దగ్గర సెస్ వసూలు చేసి బలవంతంగా చంద్రన్న బీమా చేయిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 9 నెలల్లో 50 లారీల సీజ్.. జిల్లాలో చిన్న,పెద్దవి కలిపి 23 వేలకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. టమట, మామిడి, బెల్లం, పప్పు, బియ్యం రవాణా తదితర వాటిపై ఆధారపడి వీటిని నడుపుతున్నారు. సరుకు రవాణాలోనే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ పరిశ్రమ వెన్నుదన్నుగా నిలుస్తోంది. పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. రవాణా రంగంలో నెలకొన్న పోటీ తీవ్రత కారణంగా ఐదేళ్ల క్రితం నాటి కిరాయిలే నేటికీ కొనసాగుతున్నాయి. ఇదే తరుణంలో ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. లారీ ట్రిప్పు పోయి వస్తే గతంలో సరుకు విలువలో ఖర్చులు పోను 12 శాతం మిగిలేది. ప్రస్తుతం 7 నుంచి 8 శాతం మాత్రమే మిగులుతోంది. గతంలో వచ్చిన కిరాయిలో డ్రైవర్లకు 2 శాతం కమీషన్ ఇచ్చేవారు. ప్రస్తుతం 5 శాతం ఇవ్వాల్సి వస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే కొంత మంది తమ లారీలు అమ్మకానికి పెట్టారు. మరికొందరు బయటకు వెళ్లలేక అష్టకష్టాలు పడుతూ నెట్టుకొస్తున్నారు. గత తొమ్మిది నెలల కాలంలో ఫైనాన్స్ కట్టలేక దాదాపు 50 లారీలను సీజ్ చేశారంటే యజమానుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. -
తిప్పాలంటే అప్పు చేయాల్సిందే!
విజయనగరం, సాలూరు: రాష్ట్రంలో లారీ పరిశ్రమ మాట వినగానే ఠక్కున గుర్తుకువచ్చేది విజయవాడ, ఆ తర్వాత సాలూరే. పట్టణంలో దాదాపు 1200 లారీలు వున్నాయి. 15వేల కుటుంబాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లారీ పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కొద్దికాలంగా పరిశ్రమ ఒడిదుడుకులకు లోనౌతుండడం లారీ యజమానులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. దీనికి కారణం డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండడమే. ప్రధానంగా సాలూరు లారీ పరిశ్ర మ విశాఖ నుంచి రాయపూర్కు సరకులను తరలిస్తూ, తీసుకురావడంపైనే ఆధారపడి వుంది. రానూపోనూ దాదాపు 1300 కిలోమీటర్ల దూరం వుంటుంది. వెళ్లి వచ్చేందుకు దగ్గరదగ్గరగా 450నుంచి 500 లీటర్ల వరకు డీజిల్ ఖర్చవుతుంది. విశాఖ నుంచి రాయపూర్కు సరుకులను తీసుకువెళ్లి అక్కడ అన్లోడ్ చేసి, తిరిగి అక్కడి నుంచి సరుకులను లోడ్ చేసుకుని, మళ్లీ విశాఖ చేరుకునేందుకు వారంరోజుల సమయం పడుతుంది. డీజిల్ కొనుగోలుకు దాదాపు రూ. 40వేలు ఖర్చుచేయాల్సిరాగా, మరో రూ. 15వేల వరకు డ్రైవర్, క్లీనర్ ఖర్చులు, టోల్ ట్యాక్స్లు, ఇతర ఖర్చులు అవుతున్నట్టులారీ యజమానులు చెబుతున్నారు. ఐతే సరుకుల తరలింపువల్ల వచ్చేది రూ. 60వేల వరకు ఉండగా, ఇక మిగిలేది కేవలం రూ. 5వేలే. అందులోనే లారీ ఫైనాన్స్ చెల్లింపుతోపాటు టైర్ల కొనుగోలు, సిబ్బంది జీతాలు సైతం సమకూర్చాల్సివుంది. నెలకు 4 ట్రిప్పులు జరిగితే మిగిలేది రూ. 20వేలే. ఆదాయం అత్యల్పంగా వుండడంతో చేసేదిలేక అప్పులు చేయాల్సి వస్తోందని లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. డీజిల్ ధరే ప్రధాన భారం డీజిల్ ధరే లారీ పరిశ్రమను కుంగదీస్తోందని లారీ యజమానులు చెబుతున్నారు. ఇష్టారాజ్యంగా ధరను పెంచేస్తుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర ప్రభుత్వం లీటరు డీజిల్పై 2రూపాయల ధరను తగ్గించడంతో లారీ యజమానులు సంబరపడిపోయారు. కానీ ఇంతలోనే ధర తారాజువ్వలా దూసుకుపోతుండడంతో లారీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే లీటరుపై రూ. 4ల భారం(తగ్గించిన ధరలను తీసేస్తేనే) పడడంతో మిగులుతున్న రూ. 5వేలు కూడా డీజిల్కు అర్పించేసి... తిరిగి అప్పులపాలవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. పెట్రోల్ వినియోగదారుడిపైనా భారమే ఇదిలావుండగా పెట్రోల్ వినియోగదారులపైనా భారం మరింత పెరిగింది. ఈ ఏడాది జూలై 1న లీటరు పెట్రోల్ రూ. 81.43లుండగా, ప్రస్తుతం రూ. 85.47లకు ఎగబాకింది. ఇలాగైతే లారీలు నడపలేం ఇదే పరిస్థితి కొనసాగితే రవాణారంగం స్తంభించాల్సిందే. కిరాయి రేట్లు పెంచడంలేదు. కానీ డీజిల్ ధరలు మాత్రం అమాంతం పెంచేస్తున్నారు. దీనివల్ల రూ. లక్షలు పోసి కొనుగోలుచేసిన లారీలను నడిపేందుకు కూడా అత్యధికంగానే ఖర్చుచేయాల్సి వస్తోంది. నెలంతా లారీ తిప్పినా డీజిల్ ధరల పెరుగుదల వల్ల రూపాయి కూడా మిగిలట్లేదు. ఈ విషయాన్ని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి. డీజిల్ ధరల పెంపుతో వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వాలు దృష్టిపెడుతున్నాయే తప్ప, దానివల్ల పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా లారీ పరిశ్రమను కాపాడి, ప్రజలపై పరోక్షంగా నెలకొంటున్న భారాన్ని తొలగించాలి.– ఇండుపూరి నారాయణరావు, సాలూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి -
టోల్ప్లాజా బూత్లను ఢీకొన్న కంటైనర్
-
నాలుగో రోజు కొనసాగుతున్న లారీల బంద్
-
29 ఏళ్ల క్రితం అదృశ్యమైన లారీ ఆచూకీ లభ్యం
-
మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్రూరల్ : కరీంనగర్ సమీపంలోని ఇరుకుల్ల వాగులో 29 ఏళ్ల క్రితం అదృశ్యమైన లారీ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. లారీతో పాటు ముగ్గురి అస్థిపంజరాలు దొరికాయి. ముప్పై ఏళ్ల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన లారీ ఆనవాళ్లు ఇసుక తవ్వకాలతో లభించడంతో అధికారుల అనుమతితో లారీ యాజమాని కుటుంబసభ్యులు శనివారం శకలాలు వెలికితీశారు. వాగులో పది అడుగుల లోతులో తుప్పుపట్టిన లారీని వెలికితీయగా క్యాబిన్లో ముగ్గురి అస్థిపంజరాల అవశేషాలు బయటపడ్డాయి. కుటుంబసభ్యులు, అప్పటి ప్రత్యక్ష సాక్షులు, అధికారుల కథనం ప్రకారం.. 1989 జూలై 23న భారీ వర్షం వరదలతో ఇరుగుల్ల వాగు పొంగిపొర్లింది. ఇరుకుల్ల బ్రిడ్జిపై నుంచి వరద వెళ్లడంతో అప్పట్లో పెద్దపల్లి నుంచి కేశవపట్నంకు వయా కరీంనగర్ నుంచి పశువుల లోడ్తో వెళ్తున్న లారీ కొట్టుకోయింది. లారీలో మొత్తం పది మంది ఉండగా డ్రైవర్ అబ్దుల ఘనితో పాటు మరొకరు మృతి చెందినట్లు అప్పట్లోనే ప్రకటించారు. మల్లేశం, ఎల్లయ్య, సుదర్శనం, మొగిలి ప్రాణాలతో బయటపడగా మరో నలుగురి ఆచూకీ దొరకలేదు. గల్లంతయిన వారిలో శంకరపట్నంకు చెందిన లారీ యాజమాని ఎండి దౌలత్ ఖాన్, అతని సోదరుడు పశువుల వ్యాపారి ముక్తుంఖాన్, పశువుల కాపరి కటికె శంకర్, మరొకరు కల్లెపెల్లి వెంకటస్వామి ఉన్నారు. మరుసటి రోజే క్రేన్తో ప్రయత్నం చేయగా, కొంతభాగం మాత్రమే బయటకు వచ్చింది.1989 జూలైలో జరిగిన ఈ ఘటనపై క్రెమ్ నంబర్ 160/89గా కేసు నమోదు అయ్యింది. ఆ నలుగురి కోసం, లారీ కోసం కుటుంబసభ్యులు రోజుల తరబడి వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో అందరూ మరిచిపోయారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. ఇటీవల వాగులో ఇసుక తవ్వకాల చేపట్టగా లారీ ఆనవాళ్లు బయటపడ్డాయి. క్యాబిన్ ముందుగా బయటపడటంతో 1989 నాటి ఘటనను పేర్కొంటూ ‘సాక్షి’లో వెలువడిన కథనానికి కుటుంబసభ్యులు స్పందించారు. ‘సాక్షి’ పేపర్ క్లిప్పింగ్లతో గల్లంతయిన దౌలత్ఖాన్ కుమారుడు రియాజ్ఖాన్ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అంతకు ముందు మంత్రి ఈటల రాజేందర్ను కలిసి నివేదించడంతో ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. దీంతో తహసీల్దారు రాజ్కుమార్ పర్యవేక్షణలో ఇరుకుల్ల వాగులో శుక్రవారం, శనివారం జరిపిన తవ్వకాలలో లారీని వెలికితీశారు. దీంతో లారీ క్యాబిన్ లో చిక్కుకున్న మూడు ఆస్థిపంజరాల ఆనవాళ్లు, కపాలాలు (పుర్రెలు) బయటపడ్డాయి. రెండు ఆస్థిపంజరాలు ప్రాణాలు కోల్పోయిన దౌలత్ ఖాన్, అతని సోదరుడు ముక్తుంఖాన్ దుస్తులను బట్టి కుటుంబసభ్యులు గుర్తించారు. మరోటి వెంకటస్వామిది కానీ, శంకర్ది గానీ అయి ఉంటుందని చెప్తున్నారు. కాగా సుమారు 30 ఏళ్ళుగా వారికోసం నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులకు చివరికి అస్థికలు లభించడంతో బోరున విలపిస్తు ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి వాగంతా వెతికినా ఆచూకీ లభించలేదని, చివరకు తమకు డెత్ సర్టిఫికెట్ సైతం ఇవ్వకపోవడంతో లారీ ఇన్స్రెన్స్ రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎన్ఏ పరీక్షల తర్వాత వాటిని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. అప్పుడు నేను చిన్నదాన్ని మా నాన్న ఇరుకుల్ల వాగులో లారీ బోల్తాపడి చనిపోయినపుడు నేను చిన్నదాన్ని. నాతోపాటు చెల్లి,తమ్ముడున్నారు. అపుడు శవం కూడా దొరుకలేదు. ఏడాదికే అమ్మ కూడా చనిపోయింది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వాగులో లారీ బయటకు వచ్చిందని తెలిస్తే వచ్చాం. కొన్ని ఎముకలు దొరికితే వాటిలో మా నాన్నది ఉంటుందని అనుకున్నాం. అపుడు ఎట్లాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – సరిత, కటికె శంకర్ పెద్దకూతురు ప్రభుత్వం ఆదుకోవాలి మా నాన్న గొడ్ల వ్యాపారం చేస్తాడు. పెద్దపల్లి అంగడికిపోయి లారీలో తిరిగి వస్తుండగా ఇరుకుల్ల వాగులో కొట్టుకపోయింది. అప్పటి నుంచి మా నాన్న అచూకీ దొరుకలేదు. మా నాన్న లేకపోవడంతో అమ్మ ఎంతో కష్టపడింది. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సాయం రాలేదు. మాది బాగా పేద కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలి. – గోపి, మృతుడు వెంకటస్వామి కొడుకు ‘సాక్షి’ కి రుణపడి ఉంటాం మా నాన్న దౌలత్ఖాన్ లారీ ఓనరు, పెద్ద నాన్న మగ్ధంఖాన్ గొడ్ల వ్యాపారం చేస్తాడు. అపుడు నేను చిన్న పిల్లగాన్ని. పదిరోజుల క్రితం సాక్షి పేపర్లో ఇరుకుల్లవాగులో 30 సంవత్సరాల కిందట పడిపోయిన లారీ ఇసుక తవ్వుతుండగా బయటకు వచ్చినట్లు వార్త రావడంతో మాకు తెలిసింది. సర్పంచును కలిస్తే పోలీసులను కలువమన్నారు. పోలీసులు మాతో కాదని కలెక్టర్ను కలువమని చెప్పితే రంజాన్ పండుగ కావడంతో కలువలేదు. మంత్రి ఈటల రాజేందర్ను కలిసి చెప్పగా రెవెన్యూ అధికారులకు చెప్పితే తహశీల్దార్ను కలిసి పర్మిషన్ తీసుకుని జేసీబీతో తవ్వకాలు చేపట్టాము. – రియాజ్ఖాన్, లారీయజమాని దౌలత్ఖాన్ కొడుకు -
షాకింగ్ : 34 ఏళ్లపాటు ఇసుకలోనే!
సాక్షి, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం ఇరుకుల్ల వాగులో దాదాపు మూడు దశాబ్దాల క్రితం భారీ వర్షాలతో గల్లంతైన లారీ కోసం శుక్రవారం సాయంత్రం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులు జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో లారీ విడిభాగాలతో పాటు మూడు మృతదేహాలకు సంబంధించిన ఎముకలు(అవశేషాలు), ఒక పుర్రె లభించింది. ఈనెల 12న సాక్షి దినపత్రికలో ‘34 సంవత్సరాల క్రితం గల్లంతైన లారీ లభ్యం’శీర్షికన వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. 1984లో భారీ వర్షాలకు ఇరుకుల్ల వాగు వంతెనపై నుంచి వరద వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో వంతెన దాటేందుకు యత్నించిన లారీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. లారీ బయటపడిందని వార్త కథనంతో కేశవపట్నంలో ఉంటున్న మృతుల కుటుంబ సభ్యులు గురువారం తహసీల్దార్ రాజ్కుమార్ను కలిసి వాగులో నుంచి లారీని తవ్వి తీసేందుకు అనుమతి కోరారు. శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులు జేసీబీతో తవ్వకాలు చేపట్టగా లారీ విడిభాగాలు లభించాయి. మూడు మృతదేహాలకు సంబంధించిన పుర్రె, ఎముకల అవశేషాలు బయటపడ్డాయి. అవశేషాలకున్న బట్టల ఆధారంగా కేశవపట్నానికి చెందిన దౌలత్ఖాన్, ముక్దుం ఖాన్గా కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే వీరిద్దరు సొంత అన్నదమ్ములు కాగా ముక్దుంఖాన్ అవశేషానికి ఉన్న బట్టల ఆధారంగా మరో మృతుడు కటిక శంకర్గా కుటుంబ సభ్యులు పేర్కొనడంతో మృతుల గుర్తింపుల్లో స్పష్టత లేదు. ప్రమాదంలో గల్లంతైన మరో మృతుడు వెంకటస్వామి మృతదేహం ఆనవాళ్లు లభించలేదు. భారీ వర్షంతో పాటు రాత్రి కావడంతో తవ్వకాలను నిలిపివేశారు. శనివారం ఉదయం మృతుల బంధువుల సమక్షంలో మృతదేహాల అవశేషాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తహసీల్దార్ రాజ్కుమార్ తెలిపారు. -
లారీని ఢీకొట్టిన బస్సు,10మందికి గాయాలు
-
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు
నల్లగొండ : నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాముల వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఏలూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 32 మంది ప్రయాణికుల్లో పదిమందికి గాయాలయ్యాయి. హైవేపైనే లారీలు నిలపడం వల్ల ఈ ప్రమాదం జరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికితోడూ బస్సు వైపర్ పని చేయకపోవడంతో బస్సు డ్రైవర్ కి రోడ్డు కనిపించక లారీని ఢీకొట్టాడని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంలో బస్సు ఎడమభాగం ధ్వంసం అయ్యింది. దీంతో బస్సు ఎంట్రీ భాగం మూతపడటంతో ప్రయాణికులు బస్సులోనే 20 నిమిషాల వరకు ఉండి పోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఐటి పాముల గ్రామస్తులు లేచి బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి నిచ్చెనల సహాయంతో ప్రయాణికులను కిందకి దింపారు. 108 సహాయంతో నక్రేకల్, కామినేని ఆస్పత్రులకు క్షతగాత్రులను తరలించారు. -
నేటి నుంచి లారీల బంద్
సాక్షి, బెంగళూరు: రకరకాల బాధలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరో సమస్య. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు, లారీల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంలను భారీగా పెంచిందని ఆరోపిస్తూ సోమవారం నుంచి కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా లారీలు, ట్రక్కుల యజమానులు సమ్మెకు సిద్ధమయ్యారు. కర్ణాటకలోనున్న తొమ్మిది లక్షల లారీలు, ట్రక్కులతో పాటు దేశవ్యాప్తంగా సుమారు కోటి లారీలు, ట్రక్కులు ఎక్కడిక్కడ నిలిచిపోనున్నాయి. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్లు తగ్గించాలంటూ అనేకసార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నట్లు లారీ, ట్రక్కు ఓనర్స్ అసోసియేన్స్ ప్రతినిధులు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అప్పటి వరకు రూ.27 వేలుగా ఉన్న థర్డ్పార్టీ ప్రీమియమ్ను ధరను ఒకేసారి రూ.48 వేలకు పెంచడంతో లారీల యజమానులపై తీవ్రభారం పడుతోందన్నారు. డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోందని అఖిల భారత లారీ సరుకు సేవా వాహనాల యజమానుల సంఘం,రాష్ట్ర లారీ యజమానుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇంధన ధరలు, థర్డ్ పార్టీ ప్రీమియమ్ ధరలు తగ్గించే వరకు లారీల సమ్మె కొనసాగుతుందని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు లారీల స్ట్రైక్తో పాలు, బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులతో పాటు పెట్రోల్,డీజిల్ రవాణా నిలిచిపోయే ప్రమాదముంది. ఆదివారం నుంచే అనేక నగరాలు, పట్టణాల్లో పెట్రోల్ బంకుల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె సాకు చూపి అధిక ధరలతో దోచుకోవడానికే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు తగిలించారంటూ ప్రజలు పెట్రోల్ బంకుల యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి లారీ సమ్మె కారణంగా పెట్రోల్ కోసం ఆదివారం మధ్యాహ్నం నుంచి పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. -
లోయలో పడ్డ లారీ, 10 మంది మృతి
-
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కుప్పం రూరల్: చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దవంక అటవీ ప్రాంతం సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడటంతో తమిళనాడుకు చెందిన ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడు వేలూరు జిల్లా కల్లనరసంబట్టు గ్రామానికి చెందిన 31 మంది కూలీలు మామిడి కాయలు కోసేందుకు కుప్పం మండలం విజలా పురం గ్రామానికి వచ్చారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మామిడి కాయలు కోసి లారీలోకి నింపి అదే వాహనంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఓ వైపు జోరు వర్షం.. చిమ్మచీకట్లోనే లారీ వేలూరుకు ప్రయాణమైంది. కుప్పం మండలం పెద్దవంక సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఘాట్ వద్ద లారీ అదుపు తప్పి సుమారు 50 అడుగుల లోయలోకి బోల్తా కొట్టింది. మామిడికాయలతో పాటు కూలీలు లోయలోకి పడిపోయారు. ఈ ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి.. తమిళనాడు, ఏపీ పోలీసులకు సమాచారం అందించాడు. అడవిలో మిన్నంటిన ఆర్తనాదాలు.. రోజంతా కష్టపడి అలసి సొలసి లారీలోనే కునుకుతీస్తున్న కూలీలు.. లారీ అదుపు తప్పిన విషయం తెలుసుకునే లోపే లోయలోకి జారిపోయారు. అర్ధరాత్రి అడవిలో కూలీల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీ, మామిడికాయల కింద వున్న కూలీలను ఒక్కొక్కరిని వెలికి తీస్తున్నారు. అందులో ఏడుగురు మరణించినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. క్షతగాత్రులను తమిళనాడులోని వేలూరు, కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్బాబు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షించారు. -
విద్యుత్ వైర్లు తగిలి అగ్నికి ఆహుతైన పత్తి
-
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
లారీపై స్టీమర్
అర్వపల్లి (తుంగతుర్తి) : ఎప్పుడూ నీటిలో తిరిగే స్టీమర్ రోడ్డుపై కనిపిస్తే ఆశ్చర్యమే కదా.. అయితే సోమవారం అర్వపల్లిలో రోడ్డుపై ఈ దృశ్యం కనిపించింది. గుజరాత్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరానికి ఓ స్టీమర్ను లారీపై తరలిస్తున్నారు. సూర్యాపేట–జనగామ 365బీ జాతీయ రహదారిపై ఉన్న అర్వపల్లి మీదుగా ఆ లారీ వెళ్లింది. సముద్రంలో తిరిగే స్టీమర్ రోడ్డుమార్గంలో లారీపై కనిపించడంతో స్థానిక ప్రజలు, రోడ్డుపై వెళ్లే వివిధ వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. -
34ఏళ్లకు బయటపడ్డ లారీ
సాక్షి, కరీంనగర్రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు. అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
-
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
సాక్షి, జయశంకర్ భూపాల్పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. -
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: జాల్లాలోని నందిగామ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. కర్నూలు జిల్లా ఎమిగనూరు నుంచి హైదరాబాద్కు ఉల్లి లోడుతో వస్తున్న లారీ నందిగామ తాండ బైపాస్ రోడ్డు వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. బాధితులను షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని రామలక్ష్మి, లారీ క్లీనర్ నాగరాజుగా గుర్తించారు. -
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, సూర్యాపేట: జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోమరబండ బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారు సత్యనారాయణ(35), మాధురి(21)గా గుర్తించారు. సత్యనారాయణకు రావులపాలెంలో ఉంటున్న వాళ్ల అమ్మకు సీరియస్గా ఉందని కబురు వచ్చింది. దీంతో ఆయన ఓలా క్యాబ్ మాట్లాడుకొని హిమయత్నగర్ నుంచి తన భార్య సౌజన్య, మరదలు మాధురితో కలిసి రావులపాలెం బయలుదేరారు. -
కరీంనగర్ జిల్లాలో లారీ-ఆర్టీసీ బస్సు ఢీ
-
కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. ఘటనా స్థలం భీతావహంగా ఉంది. గాయపడిన వారు బస్సులో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసేందుకు అధికారులు, స్థానికులు శ్రమించాల్సి వచ్చింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు మృతులను అధికారులు గుర్తించారు. గీసుకొండకు చెందిన అయిలేని నాగరాజు, ముషీరాబాద్కు చెందిన జహీర్ హుస్సేన్లుగా తేలింది. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. చెంజర్ల ప్రమాదం గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రమాద సంఘటన స్థలానికి చేరిన మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించిన ఆయన.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారి వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
శామీర్పేటలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం
మేడ్చల్ జిల్లా : శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి శంషాబాదు ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సత్తవ్వ(35) , శ్రావణ్(10) , షాలిని(12)తో డ్రైవర్ రాజ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సత్తవ్వ భర్త ఖతార్ నుంచి ఇండియాకు వస్తుండటంతో ఆయనకు కుటుంబసభ్యులు స్వదేశీ ఆహ్వానం పలికేందుకు ఎయిర్ పోర్టుకు బయలు దేరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అందరూ చనిపోవడంతో బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురిని బలిగొన్న క్వారీ లారీ
దేవరపల్లి : క్వారీ లారీ ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను బలిగొంది. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వంతెన వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నల్ల్లజర్లకు చెందిన ఉప్పాటి సురేష్ (38), భార్య లక్ష్మీదుర్గ (34), కుమారుడు ఉప్పాటి ప్రేమసాగర్ (2), సురేష్ మేనకోడలు లిఖిత మోటార్ బైక్పై రాజమండ్రి వెళుతుండగా అనంతపల్లి వద్ద ఎర్రకాలువ సమీపంలో ఎదురుగా వస్తున్న క్వారీలారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మీదుర్గ, ప్రేమసాగర్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా కొనఊపిరితో ఉన్న సురేష్, తీవ్రంగా గాయపడిన లిఖితను చికిత్స కోసం 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేష్ మృతి చెందాడు. లిఖిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. నల్లజర్లకు చెందిన సురేష్ కుటుంబం ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. అప్పుడప్పుడు నల్లజర్ల వచ్చి కుటుంబ సభ్యులను కలిసి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నల్లజర్ల వచ్చి వెళుతుండగా క్వారీలారీ రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో లక్ష్మీదుర్గ, ప్రేమసాగర్ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జయ్యాయి. నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ ప్రమాదస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని తానావడ్డెపల్లి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇన్నోవా కారును లారీ ఢీకొట్టి జాతరకు వెళ్తున్న కళాకారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. మృతులు నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లె వాసులుగా గుర్తించారు. కళాకారులు డప్పు వాయిస్తూ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. వరుడి తల్లి మృతి
సాక్షి, అనంతపురం : పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన జిల్లాలోని ఓడీసీ మండలం గాజుకుంటపల్లి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలివి.. పెళ్లి ట్రాక్టర్ దిగువపల్లి నుంచి కదిరికి వెళ్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ పెళ్లి ట్రాక్టర్ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వారిలో ఓ మహిళ సహా ముగ్గురు చిన్నారులు మృతి చెందటం స్థానికంగా విషాదం నింపుతోంది. మరో పది నిమిషాల్లో పెళ్లి మంటపానికి ఈ బృందం చేరుకునేది. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది. రేపు ఉదయం గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయం లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికొడుకు తల్లి లక్ష్మమ్మ, సమీప బంధువులైన చిన్నారులు నాగేశ్వరి(12) మంజునాథ్(10) కార్తీక్(12)లు మృతి చెందారు. -
ఇసుక లారీ ఢీకొని ఉపసర్పంచ్ మృతి
సాక్షి, పెద్దపల్లి/మంథని : పెద్దపల్లి జిల్లాలో మరో నేరెళ్ల ఘటన పునరావృతమైంది. ఇసుక లారీ మరో ప్రాణం బలిగొనడంతో రగిలిపోయిన గ్రామస్థులు తిరగబడ్డారు. దాదాపు 200 ఇసుక లారీలపై దాడికి దిగారు. పెద్దపల్లి–మంథని ప్రధాన రహదారిపై దాదాపు ఐదుగంటల పాటు జరిగిన ఆందోళనతో 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. వివరాలిలా ఉన్నాయి..పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ ఎస్సీ కాలనీ సమీపంలో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆదివారంపేట ఉపసర్పంచ్ ఎరువాక రాజయ్య మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లడంతో, కొద్దిదూరంలో పట్టుకున్న స్థానికులు ఆ లారీ అద్దాలు, లైట్లను ధ్వంసం చేశారు. ఆగ్రహంతో వెనుక ఆగి ఉన్న సుమారు 200 లారీల అద్దాలు, లైట్లను కూడా ధ్వంసం చేశారు. మృతదేహంతో బైఠాయించి ఐదు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి.. రాజాపూర్కు చెందిన రాజయ్య(65 ) గ్రామ ఉప సర్పంచ్. మరో వ్యక్తితో కలసి ద్విచక్ర వాహనంపై బేగంపేట వైపు పొలం వద్దకు బయలు దేరాడు. అదే సమయంలో మంథని నుంచి వస్తున్న ఇసుక లారీ వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రాజయ్య తలకు బలమైన గాయౖ మె అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన వెంట ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. లారీలను నియంత్రించాలని, మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లిం చాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.