
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దామరచర్ల మండలం నరసాపురం నుంచి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులను 108లో గురజాల ఆసుపత్రికి తరలించారు. మృతులను దామర్లచర్ల మండలం నరసాపురం చెందిన మంజుల(25), పద్మ(27), సక్రి(35), సోని, కవిత(30)గా గుర్తించారు.
చదవండి: భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment