ఆటోను ఢీకొట్టిన లారీ | lorry hits auto 2 died | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొట్టిన లారీ

Published Fri, Jan 19 2018 7:16 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

lorry hits auto 2 died - Sakshi

పాలకుర్తి(రామగుండం): పాలకుర్తి మండలం కన్నాల బస్టాండ్‌ సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్ద ఫోర్‌లేన్‌ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. కమాన్‌పూర్‌ మండలం సిద్దిపల్లి గ్రామానికి చెందిన జాబు సరోజన(55), తోటికోడలు జాబు కొమురమ్మ, కొడుకు సదయ్య, కోడలు నిర్మల(28), మనుమడు రాహుల్‌లు ఆటోలో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని బంధువుల ఇంటికి  వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి కన్నాల రైల్వేగేట్‌ వద్ద ఆటో రోడ్డుదాటుతుండగా బసంత్‌నగర్‌ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న రాహుల్‌ మినహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.  

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
చికిత్స నిమిత్తం హెచ్‌కేఆర్‌ టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సరోజన మృతిచెందింది. మిగితా ముగ్గురిని కరీంనగర్‌కి తరలించారు. చల్మెడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిర్మల మృతిచెందింది. పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. మృతుల బంధువు జాబు నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement