![Hyderabad Shankarpalli Road Accident Students Dead - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/19/Hyderabad-Shankarpalli-Road-Accident.jpg.webp?itok=7gnFYJeY)
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను ఓల్డ్ నిజాంపేట్కు చెందిన దివ్య, ఆమె స్నేహితులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment