Dead
-
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని..
లింగాలఘణపురం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని, ఆయన తండ్రి అంత్యక్రియలకు కుల స్తులు దూరంగా ఉన్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురంలో గురువారం జరిగింది. విష యం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దయ్యాల భిక్షపతి (60) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.అతడి కొడుకు అనిల్ ఆరు నెలలక్రితం నెల్లుట్లకు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకొని జన గామలో ఉంటున్నాడు. కొంతమంది పాలి వారు, కుల పెద్దలు కొడుకు తలకొరివి పెట్టవద్దని, మృతుడి భార్య పెడితేనే వస్తామని చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించలేదు. విషయం తెలుసు కున్న ఎస్సై వారి వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా కొంతమంది మాత్రం అంత్యక్రియలకు హాజరయ్యారు. -
ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి!
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్నగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
మాజీ సీఈసీ నవీన్ చావ్లా ఇకలేరు
న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) నవీన్ చావ్లా(79) కన్నుమూశారు. అపొలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని మరో మాజీ సీఈసీ ఎస్వై ఖురేషి తెలిపారు. పది రోజుల క్రితం కలిసినప్పుడు బ్రెయిన్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరనున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అయిన చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. అనంతరం 2009 ఏప్రిల్ నుంచి 2010 జులై వరకు సీఈసీగా పనిచేశారు. కమిషనర్గా ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్లు బీజేపీ ఆరోపించింది. 2006లో లోక్సభలో అప్పటి ప్రతిపక్ష నేత ఎల్కే అడ్వాణీ 204 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ఆరోపణలపై 2009లో అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి కమిషనర్ బాధ్యతల నుంచి చావ్లాను తొలగించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారు. ఈ విషయమై బీజేపీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దేశ 16వ సీఈసీ నవీన్ చావ్లా హయాంలో కీలక ఎన్నికలు సంస్కరణలు అమలయ్యాయి. స్త్రీ, పురుషతోపాటు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ఇతరులు’అనే కేటగిరీని తీసుకురావడం అందులో ఒకటి. సీఈసీతో సమానంగా కమిషనర్లను అభిశంసించాలన్నా పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యేలా రాజ్యాంగ సవరణ తేవాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కాగా, నవీన్ చావ్లా 1992లో మదర్ థెరిసా జీవిత చరిత్రను రాశారు. 1997లో ప్రచురితమైన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మదర్ థెరిసా అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. -
ఈ వారం కథ.. వైతరిణికి ఈవల
నేను చనిపోయాను రాత్రి రెండుగంటలప్పుడు నీళ్లు తాగటానికని లేచి, తాగి పడుకున్నాను. సరిగ్గా అరగంట తర్వాత నేను చనిపోయాను. నేనేమీ ముసలోణ్ణి కాదు ఆయుష్షు తీరిపోవటానికి. యాభై ఐదు మొన్ననే దాటింది. అయినా అదికాదు నేనాలోచించేది. నేను మందు ముట్టను. సిగరెట్టు తాగను. మాంసం పెద్దగా తినను. పేకాట ఆడను. ప్రతిరోజు వాకింగ్, యోగా చేస్తాను. సంవత్సరంలో దాదాపు మూడొందల రోజులు ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కానీ ఎందుకిలా జరిగింది? ఏమో తెలీదు. ప్రస్తుతానికి నన్నెవరూ చూడలేదు కాబట్టి కారణం తెలీదు. శరీరం మాత్రం ఇంకా మంచం మీదే వుంది నా భార్య ఉదయం కాస్త లేటుగా నిద్ర లేస్తుంది. అప్పటివరకూ నేను చనిపోయానన్న విషయం ఎవరికీ తెలీకపోవచ్చు. ఒక మనిషి పుట్టుక అతడి తలరాతని బట్టి వుంటుందట. మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా? ఒకవేళ చేసినా అవన్నీ చిన్నవా? లేక అనుభవించాల్సింది ఇంకా ముందు ముందు మిగులుందా?మందు, విందు లాంటి బయటికి కనపడేవే చెడ్డ అలవాట్లు, పాపాలుగా పరిగణిస్తే .. నేను అవి చేసి వుండకపోవచ్చు. మరి అవతలి వాళ్ళను పరోక్షంగా బాధపెట్టటం, అసూయగా ఆలోచించటం, ఒంటరిగా వున్నప్పుడు మనసులో కలిగే చీకటి ఆలోచనలు/ అలవాట్లు పాపాలు కాదా? తెలిసో తెలియకో నేను ఎగ్గొట్టిన డబ్బులు, నా వల్ల బాధపడిన మనుషులు, నేను ఈర్ష్యపడేట్టు చేసిన నా స్నేహితులు (పదప్రయోగానికి క్షమించాలి.. బంధువుల, స్నేహితుల ఉన్నతికి నేను పడిన ఈర్ష్య అసూయలు) మరి ఇవన్నీ తప్పులు కావా? అసలు తప్పులకి, పాపాలకి సంబంధం ఉందా? ఉదాహరణకి నేనో పామునో, కప్పనో చంపితే అది చెడ్డ పనా? తప్పు పనా? దాన్ని తప్పుగా భావించి దేవుడు నాకు శిక్ష వేస్తాడా? లేక, పోయిన జన్మలోనో, వచ్చే జన్మలోనో.. దానికీ నాకూ ఉన్న సంబంధాన్ని బట్టి అది అలా జరగాలని రాసి వుంటుందా? మరైతే ఒకపని చేసేటప్పుడు అది ఇప్పటిదా లేక పోయిన జన్మలో చేసిన దాని పర్యవసానమా అనేది ఎలా తెలుస్తుంది?అన్నట్టు పాపం అంటే గుర్తొచ్చింది. నా కొడుకు విడాకులనాడు మా వియ్యంకురాలు నన్ను తిట్టిన తిట్లమాటేమిటి? తన కూతురికి అన్యాయం చేసినందుకు ఆ పాపం ఊరికే పోదనీ, నాకు నా కుటుంబానికి ఆ పాపం తగులుతుందని, దాని వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని శాపం కూడా పెట్టింది. మరి నా కొడుకు చేసిన పనిలో/ పాపంలో నాకు కూడా భాగస్వామ్యం ఉంటుందా? ఒకరి పాపపుణ్యాల్లో మరొకరికి వాటా ఉంటుందా? అసలలా జరిగే వీలుంటుందా? ఏమో.. ఈసారి స్వర్గంలోనో, నరకంలోనో.. ఎవరైనా ప్రవచనకర్త కనిపిస్తే అడగాలి.సమయం కొంత గడిచి, ఉదయం ఐదున్నర అయింది. నా భార్య నిద్రలేచింది. కళ్ళు మూసుకునే దేవుడికి దణ్ణం పెట్టి తర్వాత తాళి కళ్ళకద్దుకుంది. మా పెళ్ళైనప్పటినించీ నిద్ర లేచాక ఆమె చేసే మొదటి పని అదే. పక్కనే ఉన్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. రోజూ ఐదింటికల్లా వాకింగ్కి వెళ్లే నేను ఈ రోజు ఇంకా నిద్ర కూడా లేవకపోవటం చూసి పడిన ఆశ్చర్యం అది. చిన్నగా తట్టి ‘ఏమండీ..’ అంది. శరీరం అటు ఇటు కాస్త కదిలిందే తప్ప చలనం లేదు. దగ్గరకొచ్చి ‘ఏమండీ..’ అని తోసినట్టు గట్టిగా కుదిపింది. ఉలుకు లేదు పలుకు లేదు. మొదటిసారి ఆమెకు అనుమానం వచ్చింది. రెండో నిమిషంలో అది రూఢి అయింది. ఇంకో గంటకి.. అక్కడ వందమంది దాక గుమికూడారు. వాళ్ళందరూ నేనెంత మంచివాణ్ణో(?) మాట్లాడుకుంటున్నారు. చిత్రమేమిటంటే.. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది వాళ్లెవరో కూడా నాకు తెలీదు.ఒక మహానుభావుడు చెప్పినట్టు ‘నువ్వు హాస్పిటల్లో వున్నప్పుడు, కనీసం వందమంది నిన్ను పరామర్శించాలని నువ్వు భావిస్తే, ఆ వందమందికి బాలేనప్పుడు నువ్వెళ్ళి పరామర్శించి ఉండాలి’. కానీ, నేనా బాపతు కాదు. ఎవరినైనా పరామర్శించాల్సి వస్తే నేను వెళతాను కానీ, వాళ్లొచ్చి మళ్ళీ నా దగ్గిర అటెండె¯Œ ్స వేయించుకోవాలి అని నేనెప్పుడూ ఎదురుచూడను. చూడలేదు. అసలలాంటి ఆలోచన నేనెప్పుడూ చెయ్యను కూడా. అంతదాకా వస్తే నేనెప్పుడూ ఎవరితో ఎక్కువగా మాట్లాడింది లేదు. అవతలి వాళ్ళతో రాసుకు పూసుకు తిరిగింది లేదు. తిరగాలన్న కోరిక కూడా నాకెప్పుడూ ఉండేది కాదు. అలా తిరగటం తప్పని నా ఉద్దేశం కాదు. ఎవరి జీవన విధానం వాళ్ళది. ఎవరి ఆలోచనలు, పద్ధతులు వాళ్ళవి. నా ఆలోచనలన్నీ నా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండేవే తప్ప.. ఇతరులు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలన్న కుతూహలం నాకెప్పుడూ లేదు. జీవితం పట్ల నా దృక్పథం వేరు. నా ఆలోచన, జీవన విధానమే వేరు. ఇలా ప్రతి ఒక్కరూ నేను వేరు అనుకుంటారేమో.. నాకు తెలీదు.ఇంకో అరగంటకి.. పూలమాలలు తెచ్చారు. బాడీని మంచం మీద నించి ఒక చిన్న బల్ల మీదకు మార్చారు. తర్వాత ఏం చెయ్యాలో, ఎలా చెయ్యలో దాని కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికి తోచిన సలహాలు వాళ్లిస్తున్నారు. ‘పిల్లలకి ఫోన్ చేశారా?’ అని ఎవరో అడుగుతుంటే, ‘చేశాం. రాత్రికల్లా వస్తాం అన్నారు’ అంటున్నారు మరెవరో.అన్నట్టు చెప్పటం మరిచా. నాకు ఒక కొడుకు, కూతురు. కొడుకు బెంగళూరులో, కూతురు పుణెలో వుంటారు. నా పిల్లల్ని నేను కాలు కదపనీయకుండా.. అడుగు కింద పెట్టనీయకుండా.. లాంటివి కాదు కానీ ఉన్నంతలో బాగానే పెంచాను. వాళ్ళు అడిగినవి, అవసరమైనవి కొనివ్వగలిగాను. ఒక తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా చేశాను. అలాని వాళ్ళకెప్పుడూ నేను ఆదర్శాలు వల్లించలేదు. నీతి సూక్తులు చెప్పలేదు. ధర్మం తప్పకుండా జీవించమని ఉద్బోధించనూ లేదు. పిల్లలు మనం చెప్పేదానికంటే, చేసేది చూసి నేర్చుకుంటారని చాలామంది మనస్తత్వ శాస్త్రవేత్తలు, కౌన్సెలర్లు చెప్పగా విని, పాటించాను. ఒక అనుభవం.. అది మంచైనా, చెడైనా వాళ్ళు దాన్నించి నేర్చుకోవాలనేది నా సంకల్పం. ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు.నిజం చెప్పొద్దూ ఆమెను చూస్తే నాకు జాలేసింది. ఏమీ చెప్పకుండా సడన్గా నేనిలా వచ్చేస్తే.. తను ఎలా బతుకుద్ది? ఆ భారం తను మోయగలదా? ఆస్తులంటే ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ, ఏ బ్యాంకులో ఎంత డబ్బుంది, ఎవరికి ఎంత అప్పుంది.. లాంటి డబ్బు సంబంధమైన విషయాలు నేనెప్పుడూ తనతో కనీసం చర్చించింది కూడా లేదే. మరిప్పుడెలా?పెళ్ళైనప్పటినించీ నేనే లోకంగా బతికింది. తను నన్ను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్క మా అబ్బాయి పెళ్లి మాత్రం తనిష్టప్రకారం తనకు తెలిసిన వాళ్ళ అమ్మాయితో జరిపించాలంది. తెలిసిన వాళ్ళైతే సర్దుకుపోతారనేది తన ఆలోచన. ఆ ప్రకారమే తనూ మావాడూ ఇద్దరూ ఇష్టపడ్డ అమ్మాయితోనే మావాడి పెళ్ళిచేసింది. ఆ సంసారం నాలుగైదేళ్లు సజావుగా సాగింది. ఏమైందో ఏమో గాని మనస్పర్థలు మొదలయ్యాయి. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో కేవలం భగవంతుడికే తెలుసు. అటువైపు నించీ, మా వైపు నించీ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి అది విడాకుల దాకా వెళ్ళింది. విడాకులు మంజూరైన రోజు.. మా వియ్యపురాలు నన్నూ, నా కుటుంబాన్నీ తిట్టని తిట్టులేదు. తెలిసిన వాళ్ళని పిల్లనిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంది. నడిరోడ్డు మధ్యలో అలా వదిలేసి వెళితే తమ పరిస్థితేంటని నిలదీసింది. అభం శుభం తెలియని ఆడపిల్లని ఇలా అర్ధాంతరంగా బయటికి గెంటేస్తే .. ఆ పాపం ఊరికే పోదనీ, దాని ఉసురు కచ్చితంగా తగులుతుందని శపించింది. చివరగా.. నీక్కూడా ఒక కూతురుందనీ దానికి కూడా ఇలాంటిది జరిగితే అప్పుడు తండ్రిగా ఆ బాధేమిటో తెలుస్తుందని దుమ్మెత్తి పోసింది. ఐతే అదృష్టవశాత్తూ అలాంటివేం జరగలేదు. కానీ, ఆ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో అంత వేదన అనుభవించటం అది రెండోసారి (మొదటిసారి.. శ్రుతిలయతో నేను విడిపోయినప్పుడు జరిగింది). చేయని తప్పుకి శిక్ష అనుభవించాలా? అయినా తప్పెవరిదో కూడా నిర్ణయించే పరిస్థితి లేనప్పుడు కేవలం నా కుటుంబాన్ని ఆడిపోసుకోవడం న్యాయమా? ఏదైతేనేం.. జరగకూడనిది జరిగిపోయింది. పచ్చని సంసారం పెటాకులైపోయింది. ఎదో దిగులు. మానసిక వ్యథ. కాస్తో కూస్తో పరువుగా బతుకుతున్న వాళ్ళం. ఎందుకిలా జరిగింది? సమాజం మారిందనటానికి ఇవన్నీ రుజువులేమో. కావొచ్చు కానీ ఎక్కడో జరిగితే మనం దానిమీద చర్చించొచ్చు, సులభంగా తీర్మానం చెయ్యొచ్చు. కానీ అది మనింట్లోనే జరిగితే..? మనసు ఏ పని మీదా లగ్నం కావటం లేదు. నిద్ర రాదు. ఆకలి వేయదు. ఒకటే అంతర్మథనం. దాదాపు మూడు నెలలు. మానసికంగా కుంగిపోయాను. ఆలోచించే కొద్దీ ఎవరో రెండు అరచేతుల మధ్యకి నా గుండెని తీసుకుని ఒత్తిన ఫీలింగ్. కాలమే అన్ని గాయాల్ని మాన్పుతుందన్నట్టు కొన్నాళ్ళకు నేను తేరుకున్నాను.. తేరుకుని చూస్తే.. మా ఆవిడ తమ్ముడు ఫ్రీజర్ బాక్స్ తెచ్చి సర్దుతున్నాడు. నా మనసెందుకో కీడు శంకించింది. ఇప్పటివరకూ లేని ఒక చిన్న జలదరింపు. నేనూహించినట్టుగానే నలుగురైదుగురు కలిసి ఆ బాడీని ఎత్తి ఫ్రీజర్లో పెడుతున్నారు. మొట్టమొదటిసారిగా ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యింది. శరీరం ఆ చల్లటి వాతావరణానికి అలవాటు పడుతుంది. కానీ నేనే బయట ఉండలేకపోతున్నా. అప్పటివరకూ అది నేనే, ఆ శరీరం నాదే అన్న ఆలోచన నన్ను ఏమీ ఆలోచించనీయలేదు కానీ ఇప్పుడు తొలిసారిగా నన్నూ, నా శరీరాన్నీ విడదీస్తున్నారన్న భావన. పావుగంటలో ఆ బాడీని లోపల సర్దేసి అందరూ చుట్టూ కూర్చున్నారు. నేను బయట బిక్కుబిక్కుమంటూ బిగుసుకుపోయాను. ‘మనిషి శరీరాన్ని వీడిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తచ్చట్లాడుతుంటుంది. తిరిగి తన శరీరంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ ఒకసారి శరీరాన్ని వీడాక మళ్ళీ అందులోకి వెళ్ళటం అన్నది సృష్టి విరుద్ధం కాబట్టి అక్కడక్కడే తిరుగుతూ కర్మలన్నీ ముగిశాక ఇక ఏ దారీ లేక అక్కణ్ణించి నిష్క్రమిస్తుంది’ నా స్నేహితుడు రవి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మరి.. ఇప్పుడు నా పరిస్థితేంటి? మొదటిసారిగా నాకు భయం వేసింది. ఫ్రీజర్ బాక్స్ చుట్టూ చేరి అందరూ మాట్లాడుకుంటున్నారు. నాతో వాళ్లకున్న జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు. అవన్నీ నా చెవికెక్కడం లేదు. నాకు తిరిగి ఆ బాడీలోకే వెళ్లాలని వుంది. కానీ దాన్ని ఫ్రీజర్లో పెట్టి ఆ చల్లదనం బయటికి పోకుండా చుట్టూ గ్లాసులతో బిగించేశారు. లోపలికి వెళ్లే మార్గమే కనపడటం లేదు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేక పోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా?ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. అప్పటివరకూ మూగి వున్న జనం నిదానంగా పలుచబడటం మొదలయ్యింది. నా దగ్గరి స్నేహితులు కొంతమంది, నా భార్య మాత్రమే ఇప్పుడు మిగిలారు. అప్పడు.. మొదటిసారిగా నాకు అనుమానం కలిగింది. ఇకమీదట నేను తిరిగి ఆ శరీరంలోకి చేరలేనేమో! తిరిగి నేను మనిషిని కాలేనేమో! ఒక్కసారిగా భయం వేసింది. ఏదైనా ప్రయత్నం చెయ్యాలని వుంది. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ‘ఆ శరీరం నాది. నన్ను అందులోకి వెళ్లనివ్వండి’ అని గొంతెత్తి అరవాలనుంది. కానీ మాట పెగలటం లేదు. శబ్దం బయటికి రావటం లేదు. నాకేమీ పాలుపోవటం లేదు. ఇక ఇంతేనా? నేను నా శరీరంతో వేరైపోయానా? ఇక మీదట నాకు ఆ శరీరంతో ఏ సంబంధమూ లేదా? ఇలా నాకొక్కడికేనా? సృష్టిలో ప్రతి ఒక్కరికీ ఇలానే జరుగుతుందా? మరైతే రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు.. వీళ్లందరినీ ప్రజల సందర్శనార్థం కోసం అలానే గంటల తరబడి ఉంచుతారే? వీలయితే రోజుల తరబడి కూడా ఉంచుతారే మరి వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఎంతగా క్షోభించి ఉంటుంది? నా ఈ మానసిక క్షోభకి కారణం నేను చేసిన పాపాలేనా? మరణం మాత్రం అతడి పాపపుణ్యాలని బట్టి వుంటుందట. ఇప్పటి వరకూ నేను ప్రశాంతంగానే వున్నాను. అంటే నేను పుణ్యకార్యాలు చేసినట్టేనా? నిజంగా అంతేనా? నేనేమీ పాపాలు చెయ్యలేదా?పాపం అనగానే నాకు శ్రుతిలయ గుర్తొచ్చింది.శ్రుతిలయ నా కాలేజ్మేట్. మనిషి అందంగా ఉండేది. ఇష్టానికి, ప్రేమకు అందమే తొలిమెట్టు ఐతే.. నేనామెను ఇష్టపడ్డా. విజాతి ధ్రువాలు ఆకర్షించుకున్నట్టు ఆమె కూడా నన్నిష్టపడింది. ఎన్నో ఉత్తరాలు.. ఎన్నెన్నో కబుర్లు.. సమయం తెలిసేది కాదు. మొదటి సంవత్సరంలో మొదలైన మా పరిచయం చివరి సంవత్సరానికొచ్చింది. పెళ్లి ప్రాతిపదికగా మేమెప్పుడూ ఒకరొకర్ని ఇష్టపడలేదు. అందువల్ల ఆ టాపిక్ ఎప్పుడూ మా మధ్య రాలేదు. కేవలం అభిప్రాయాలు, ఆలోచనలు కలవటం వల్లనే మా మధ్య బంధం మొదలైంది. ఆ బంధాన్ని ఒక అనుభూతిగా, తీయని జ్ఞాపకంగా, మధురస్మృతిగా వుంచుకోవాలనుకున్నామే తప్ప కలిసి జీవించాలని ఎప్పుడూ అనుకోలేదు. బహుశా ఇష్టంలో, బంధంలో, ప్రేమలో ఉన్న అందం పెళ్ళిలో రాదేమో! అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. చివరిరోజు ఇద్దరం కాలేజీ గ్రౌండ్లో.. ఒకరికొకరం రాసుకున్న ఉత్తరాలను వెనక్కి ఇచ్చేసుకున్నాం. డైరీలు చింపేసుకున్నాం. అనుభూతులు, అనుభవాలు చెరిపేసుకున్నాం. చెరిపేసుకోవడానికి ఇక ఏమీ మిగిలి లేవనుకున్నాం. కాని, జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఆ జ్ఞాపకాలను తలుచుకున్నప్పుడల్లా గుండెల్లో గాయమైనట్టు ఒకటే బాధ. ఎర్రగా కాల్చిన కర్రుతో గుండెల్లో ఎవరో కెలుకుతున్న భావన. చెరుకు మిషన్లో గుండెను పెట్టి తిప్పినంత నొప్పి. అంత మానసిక క్షోభ అనుభవించటం అదే మొట్టమొదటిసారి నాకు ( రెండోసారి మా వాడి విడాకులప్పుడు). కొన్నాళ్ళు అలా గడిచాయి. ఆ తర్వాత తను ఏమైందో, ఎక్కడుందో కూడా ఆచూకీ లేదు. ఆ విధంగా ఆ ప్రేమకథ ముగిసింది. కాని, అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వచ్చే జ్ఞాపకాలు నన్ను నిలువెల్లా దహించి వేస్తుంటాయి సరిగ్గా ఇప్పుడీ బాధలాగానే. ఇంత బాధలోనూ నాకు శ్రుతిలయ గుర్తొచ్చిందంటే మా బంధం ఏపాటిదో మీకు అర్థమయ్యేవుంటుంది. జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి చూస్తే చీకటిపడి ఎంతసేపయ్యిందో. తల దగ్గర దీపం వెలుగుతోంది. నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలుతుంది. కాసేపటికి మా పిల్లలు వచ్చారు. మా మనవళ్లు, మనవరాళ్లు వాళ్లతో వున్నారు. నా భార్య వాళ్ళని దగ్గరకు తీసుకుంది. నా కూతురి కళ్ళు ఉబ్బి వున్నాయి. ఎంతగా ఏడ్చివుంటుందో. రాగానే నా శరీరం మీదపడి వెక్కివెక్కి ఏడుస్తున్నారు. నా గుండె బరువెక్కింది. వాళ్ళు ఏడ్చేది నాకోసమైనా నాకు బాధగా వుంది. నా కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోతున్నాను. అయినా ఇదేమిటీ నాకోసం మరొకరు బాధపడటం, ఏడవటం నాకు నచ్చదు కదా? నేనేమంత గొప్ప పని చేశానని.. నా కోసం ఈ ఏడుపులు? చరిత్ర గతిని మార్చిన గొప్పగొప్ప వాళ్ళు తమ ఆనవాలు వదిలివెళతారు. వాళ్ళకోసం వుంచుకోమ్మా నీ కన్నీళ్లు. అల్పుడినైన నా కోసం ఎందుకు వృథా చేసుకుంటావు? అని నా కూతుర్ని, కొడుకుని బుజ్జగించాలని వుంది. కానీ, వీలవడం లేదు.దేవుడా! ఎందుకయ్యా నాకీ కష్టాలు? ఓ దేవా.. మనుషుల మధ్య ఈ బంధాలు, పాశాలను ఎందుకు సృష్టించావు? ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయం అన్నట్టు.. మనుషుల మధ్య ఈ బంధాలన్నీ పూర్వజన్మలో తీరని ఋణం వల్ల ఏర్పడేట్లు చేస్తావు. అప్పు తీర్చకపోతే వడ్డీ పెరిగిపోయినట్లు ఈ అనుబంధం అనే అప్పు తీర్చకపోతే మనిషికి మోక్షం రాదు. తన తర్వాత తన పిల్లలు ఏమైపోతారో అన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. వేకువలో వెన్నెల, కరిగే కర్పూరం, జారిపడే జాబిల్లి, ఆశల హారతి, కరిగే మబ్బు.. వీటన్నిటినీ జీవితం అనే అస్థిరానికి అద్ది చివరికి తెగిన వీణలా బంధాలన్నిటినీ తెంచుకుని శరీరం మూగబోతుంది. ఓ ఈశ్వరా! నీ సృష్టి ఎంత విచిత్రం? నువ్వే సృష్టిస్తావు. జ్ఞానమో, అజ్ఞానమో అన్నీ నువ్వే పంచుతావు. చివరికి ఏదీ శాశ్వతం కానట్టు, నువ్వే తీసుకెళతావు. ఓ ప్రభూ .. మనుషులుగా జన్మించినందుకు మాకిది తప్పదా? ప్రతి మనిషీ ఈ చట్రంలో బిగుసుకోవాల్సిందేనా? ఈ బంధాలనించీ, పునరావృతమయ్యే నీ లీలలనించీ ఎప్పుడయ్యా మాకు విముక్తి?మనసు ధారాపాతంగా రోదిస్తూనే వుంది. తర్వాతరోజు ఉదయం పది గంటల వేళ.. శరీరం అగ్నిలో దహనమయ్యింది. బంధాల్ని తెంచుకుని ఆత్మ ఊర్ధ్వముఖంగా శూన్యంలోకి పయనమయ్యింది. నడ్డా సుబ్బారెడ్డి(మిత్రుడు వైవీకే రవి చెప్పిన మాటల సౌజన్యంతో ) -
ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లి.. శవమై తిరిగొచ్చిన ఏపీ యువకుడు
గోవా: న్యూఇయర్లో విషాదం చోటు చేసుకుంది. గోవాలో ఏపీ టూరిస్ట్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్లకు గోవా బీచ్లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.బీచ్ షాక్ యజమాని బీచ్ షాక్ యజమాని అగ్నెల్ సిల్వేరా,అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియాతో పాటు సిబ్బంది అనిల్ బిస్టా, సమల్ సునర్లను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్లో మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది. నిన్న రాత్రి ఒంటి గంటకు ఆ రెస్టారెంట్కు అర్థరాత్రి వచ్చిన రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్కు చెందిన స్పందన్ బొల్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే బీచ్ షాక్ రెస్టారెంట్ యజమాని సిల్వేరా.. రవితేజ, అతని స్నేహితుడి నుంచి ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉన్న బిల్లుపై ఎక్కువ మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు. అలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారు. ఆపై శరీర భాగాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మరణించినట్లు పేర్కొన్నారు.కాగా, గోవాలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు టూరిస్ట్లు మరణించారు. అంతకుముందు నవంబర్లో ఢిల్లీ టూరిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహరాష్ట్రకు చెందిన టూరిస్ట్ బోట్ బోల్తా పడి మరణించాడు. -
అంతర్జాతీయ మోడల్ హఠాన్మరణం..
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ మోడల్ డేల్ హడన్(Dayle Haddon(76)) అనూహ్యంగా మృతి చెందారు. తన ఇంటిలోని మొదటి అంతస్తులో అచేతనంగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రి తరలించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. అయితే మోడల్ మరణం అనుమానాస్పదం లేక హత్యా అనే అనుమానం రేకెత్తించింది. అయితే పోలీసుల విచారణలో విషపూరిత కార్బన్ మోనాక్స్డ్ని పీల్చడం వల్లే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇంటిలోని బాయిలర్ హీటింగ్ యూనిట్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ హీటింగ్ యూనిట్ కార్బన్ మోనాక్సైడ్ వాయువు(Carbon Monoxide)కి మూలం. కావున ఈ యూనిట్ లీకేజ్ లోపం కారణంగానే ఈ కెనడా మోడల్(Canadian Model) మరణించినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. అలాగే అగ్నిమాపక కంపెనీ నమోదు చేసిన రీడింగ్లో ఆ ఇంటిలో కార్బన్ మోనాక్స్డ్ వాయువు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మాంట్రియల్లో పుట్టి పెరిగిన డేల్ హడన్కి ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో మంచి నిష్ణాతురాలు.తొలుత బ్యాలెట్(డ్యాన్సర్గా) ఈ వృత్తిని కొనసాగించింది. ఆ తర్వాత రెవ్లాన్, ఎస్టీ లాడర్, క్లైరోల్ మరియు మాక్స్ ఫ్యాక్టర్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు మోడల్గా పనిచేసింది. అంతేగాదు వోగ్ మేగజైన్ కవర్పేజ్లో ఆమె ముఖం చిత్రం ప్రచురితమైంది. అలా ఆమె సూపర్ మోడల్ అనే పేరుని సుస్థిర పరుచుకుంది. అంతేగాదు 15 ఏళ్లకు పైగా లోరియల్(L'Or'eal) అనే కాస్మెటిక్ కంపెనీకి ప్రతినిధిగా పనిచేసింది. అలాగే యూనిసెఫ్కు అంబాసిడర్గా బాలికలు, మహిళల విద్య కోసం కృషి చేశారు. అందుకోసం స్వచ్ఛంద సంస్థ విమెన్వన్ని స్థాపించి మహిళలకు మంచి విద్య అందేలా చూశారామె. కేవలం అందంతోనే గాక దయ, మానవత్వం వంటి సేవా కార్యక్రమాలతో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది డేల్. తన తల్లి జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమార్తె ర్యాన్ నివాళులర్పించారు. కాగా కుమార్తె కుమార్తె ర్యాన్ హాడన్ జర్నలిస్ట్, అల్లుడు పెన్సిల్వేనియా ఇల్లు బ్లూకాస్ హాల్మార్క్ నటుడు.(చదవండి: వనితదే చరిత) -
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
చనిపోయినా.. చచ్చేంత సంపాదన
చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?టాప్ మైఖేల్ జాక్సన్ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
కంటతడి పెట్టిస్తున్న అమ్మ ప్రేమ.. తెగిపడిన కుమారుడి తలను ఒడిలో పెట్టుకుని లాలిస్తూ.. రోదిస్తూ
లక్నో: అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా! ఉన్నతంగా చదువుకుని నన్ను, మీ నాయనను మంచిగా చూసుకుంటావని చెబితవిగా ..అప్పుడే ఇంత పనైందేంది బిడ్డా అంటూ.. అల్లంతా దూరాన మొండం.. పక్కనే తెగి పడిన కుమారుడి తలను ఒడిలోకి తీసుకుని లాలిస్తూ.. రోదిస్తున్న తీరు చూసి చూపరులు కన్నీటి పర్యంతమయ్యారు.ఉత్తరప్రదేశ్లో భూ తగాదా ఓ 17 ఏళ్ల అనురాగ్ను బలి తీసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన భూ తగాదాలో ఓ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన బాలుడిని తలను నరకడంతో భయానక వాతావరణం నెలకొంది.గౌరబాద్షాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీరుద్దీన్ గ్రామంలో రెండు వర్గాల మధ్య భూతగాదా కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. తాజాగా, బుధవారం రోజు ఘర్షణ హింసాత్మకంగా మారింది. భూ తగాదాలో రామ్ జీత్ యాదవ్ కుటుంబం సభ్యులపై ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడింది. ఈ దాడులు జరిగే సమయంలో ప్రత్యర్థులు మారణాయుధాలతో రామ్ జీత్ కుమారుడు అనురాగ్ వెంటబడ్డారు.నిందితుల్లో ఓ వ్యక్తి అనురాగ్ తలను పదునైన కత్తి నరికాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అయితే కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొన్ని గంటల పాటు కుమారుడి తలను ఒడిలోకి తీసుకొని గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసేవారి కళ్ళు కూడా చెమర్చాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
కంగువ ఎడిటర్ నిషాద్ హఠాన్మరణం
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’కి ఎడిటర్గా చేసిన నిషాద్ యూసుఫ్ (43) ఆకస్మిక మృతి చెందారు. నిషాద్ స్వస్థలం కేరళలోని చంగనస్సేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంపిల్లి నగర్లో నివాసం ఉంటున్నారు. స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున ఆయన విగత జీవిగా కనిపించారు.ఇక నిషాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? ఎవరైనా గిట్టని వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ‘చావెర్, ఉండా, తల్లుమాలా, సౌదీ వెళ్లాక, వన్, ఆపరేషన్ జావా’ వంటి పలు సినిమాలకు ఎడిటర్గా చేశారు నిషాద్. ఆయన పని చేసిన చివరి చిత్రాలు ముమ్మట్టి నటించిన ‘బజూక’, సూర్య నటించిన ‘కంగువ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. -
Russia-Ukraine war: రష్యా నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్టు మృతి
కీవ్: రష్యాలో నిర్బంధంలో ఉన్న ఉక్రెయిన్ జర్నలిస్ట్ 27 ఏళ్ల విక్టోరియా రోషినా మృతి చెందారు. సెప్టెంబర్ 19న రోషినా మరణించినట్లు రష్యా గురువారం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో జీవితం గురించి ప్రత్యక్ష కథనాలు రాసిన విక్టోరియా.. గత ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలకు రిపోర్టింగ్కు వెళ్లారు. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబం, ఉక్రెయిన్ అధికారులు, జర్నలిస్టుల హక్కుల సంస్థ ఆర్ఎస్ఎఫ్ పదేపదే అభ్యర్థించినా రష్యా అధికారులు ఆమె నిర్బంధం గురించి ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. చివరకు విక్టోరియా తమ కస్టడీలో ఉందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మే నెలలో ఆమె తండ్రికి రాసిన లేఖలో అంగీకరించింది. విక్టోరియా మరణానికి సంబంధించిన సమాచారం ధృవీకరించినట్లు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల సమన్వయ ప్రధాన కార్యాలయం ప్రతినిధి పెట్రో యాట్సెంకో చెప్పారు. ఆమె ఎలా చనిపోయిందనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. 2014లో ఉక్రెయిన్ నుండి రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలో, అలాగే రష్యా నిధులతో వేర్పాటువాదులు స్వాధీనం చేసుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాల్లో జీవితం గురించి విక్టోరియా అనేక కథనాలను రాశారు. 2022 ఫిబ్రవరిలో మాస్కో పూర్తి స్థాయి ఆక్రమణను ప్రారంభించిన తరువాత ఆమె పలు కథనాలు డాక్యుమెంట్ చేశారు. దేశం యుద్ధం ప్రారంభించిన కొద్దికాలానికే రష్యన్లు ఆమెను మొదట 10 రోజుల పాటు నిర్బంధించారు. ఆ తరువాత వదిలిపెట్టారు. 2022లో ఆమెకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ ‘కరేజ్ ఇన్ జర్నలిజం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. -
చనిపోయిన భార్యపై ప్రేమతో..
బ్రహ్మపూర్: భార్యాభర్తల బంధం విడదీయరానిదని అంటారు. ఆలుమగలులో ఏ ఒక్కరు దూరమైనా మరొకరు విలవిలలాడిపోతారు. ఒంటరితనానికి లోనవుతుంటారు. అయితే ఒడిశాలోని బ్రహ్మపూర్కు చెందిన ఓ భర్త తన భార్య చనిపోయాక, ఆమెను మరచిపోలేక చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపూర్లో ప్రశాంత్ నాయక్(52) అనే వ్యాపారవేత్త భార్య కిరణ్ కరోనా కాలంలో మరణించారు. వారిద్దరికీ 1997లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. ప్రశాంత్ తన భార్య దూరమవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో ఆయన సిలికాన్ మెటీరియల్తో భార్య విగ్రహాన్ని తయారు చేయించాడు. దానిని తన డ్రాయింగ్ రూమ్లో ఉంచాడు. ప్రశాంత్ తన పెద్ద కూతురు వివాహం సందర్భంగా ఆ సిలికాన్ విగ్రహానికి చీర, నగలు ధరింపజేశాడు.ప్రశాంత్ కుమార్తె మెహక్ తన తల్లి విగ్రహాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. ప్రతీరోజూ ఆ విగ్రహానికి చీరలు, నగలు మారుస్తుంటుంది. మెహక్ ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన భార్య తనతోనే ఉన్నట్లు అనిపిస్తుందని ప్రశాంత్ తెలిపారు. ఇంట్లో అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తన పిల్లలు కోరారని ప్రశాంత్ పేర్కొన్నారు.బెంగళూరుకు చెందిన శిల్పి ఫైబర్, రబ్బరు, సిలికాన్ ఉపయోగించి ఏడాదిపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రశాంత్ కుమార్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని ప్రశాంత్ తన పెద్ద కుమార్తె పెళ్లికి ముందు ఇంటికి తీసుకువచ్చారు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తమ తల్లి తమతోనే ఉన్నదనిపిస్తుందని ప్రశాంత్ పిల్లలు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. -
ఏఐ సాంకేతికతో అలా స్వాంతన పొందడం మంచిదేనా..?
ఏఐ సామర్థ్యం ఊహకందని విధంగా పలు రంగాల్లో తన హవా చాటుతూ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ముఖ్యంగా మనకెంతో ఇష్టమైన వారు ప్రమాదవశాత్తు దూరమయ్యితే ఆ బాధను దిగమింగడం అంత ఈజీ కాదు. అలాంటి వాటిలో చక్కటి ఉపశమనం కలిగిస్తోంది ఏఐ సాంకేతికత. అలాంటి వాటికి సంబంధించిన ఇటీవల్ల కొన్ని భావోద్వేగ కథలను విన్నాం. అయితే ఇలా సాంకేతికతో స్వాంతన, ఉపశమనం పొందడం ఎంతవరు సరైనది. ఎన్నటికీ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు గదా..!. దీని కారణంగా వాస్తవికతకు దూరమయ్యే పరిస్థితి ఎదురవ్వుతుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..జస్టిన్ హారిసన్ అనే టెక్ వ్యవస్థాపకుడు తన తల్లి ఇంకొద్ది రోజుల్లో దూరమైపోతుందని తెలిసి తల్లిడిల్లిపోతాడు. దీంతో ఆమె గుర్తులు, జ్ఞాపకాలు తనను వీడిపోకుండా ఉండేలా ఏఐ సాంకేతికతో అమ్మ వాయిస్ని క్రియేట్ చేసుకున్నాడు. అతడు ఆమె బతికున్న రోజుల్లోనే ఈ పనికి ఉపక్రమించాడు. ఆ తర్వాత ఆమె కొన్నాళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే జస్టిన్ మాత్రం తన ఏఐ సామర్థ్యంతో రూపొందించిన తన తల్లి వాయిస్తో స్వాంతన పొందుతుంటాడు. తనతోనే తల్లి ఉందన్న భరోసాతో జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాపకం వచ్చినప్పుడల్లా ఆమె వాయిస్ రికార్డుతో కూడిన ఏఐ సాంకేతికతో తల్లితో మాట్లాడిన అనుభూతిని పొందుతుంటాడు. అంతేగాదు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు కూడా. ఇది నిజంగా ప్రియమైన వారిని కోల్పోయిన బాధలో ఉన్నవారికి ఓ వరం అంటూ ఆ సాంకేతికతపై పొగడ్తల వర్షం కురిపించాడు. అయితే మానసిక నిపుణుడు రుచి రుహ్ మాత్రం ప్రారంభ దశలో ఈ సాంకేతికత ఉపశమనంగా అనిపించినా రాను రాను వాస్తవికతలో ఉండేందుకు మెదడు అంగీకరించకపోవచ్చు లేదా ఇష్టపడకపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. నిజానికి దుఃఖం మనిషిని బలవంతుడిగా మారిస్తే..ఈ సాంకేతికతో లభించిన భరోసా..వాస్తవికతకు దూరం చేస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సాంకేతిక డిప్రెషన్లోకి వెళ్లిపోయిన వాళ్లను మాములు మనుషులు చేసేందుకు వినియోగించి ఓ వ్యక్తి జీవితాన్ని మెరుగ్గా ఉండేలా చెయ్యొచ్చు. కానీ దీనిమీదే ఆధారపడిపోయేలా మాత్రం తయారు కాకూడదని చెబుతున్నారు. చెప్పాలంటే.. ఇష్టమైన వారిని కోల్పోయిన బాధ కొన్నాళ్లకి తగ్గి సాధారణ మనుషులుగా సహజసిద్దంగానే మారిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం.ఏనాటికైనా అందరూ చనిపోవాల్సిన వాళ్లే అనే సత్యాన్నికి కట్టుబడి ఉండేలా సహజసిద్ధంగా మనసు సిద్ధమవుతుంది. అందువల్లే పూర్వం వాళ్లు ముక్కుపచ్చలారని పసివాళ్లు దూరమైనా..బాధను దిగమింగి మరీ ధైర్యంగా బతుకును సాగించేవారు. సాంకేతికత పుణ్యమా అని ప్రాణాలు అల్పమైపోయాయి. చిన్న బాధను కూడా తట్టుకోలేని సున్నిత మనస్కులుగా, అల్పమైన జీవులుగా మారిపోతున్నాం. సెన్సిటివిటీ కంటే మానసికంగా స్ట్రాంగ్గా ఉండేలా మనిషి మారితేనా అన్ని విధాల శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
నేపాల్లో వరద బీభత్సం.. 112 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా వరదలకు ఇప్పటివరకు 112 మంది మృతి చెందినట్లు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇదే సమయంలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడగా దాదాపు 68 గల్లంతు అయినట్టు సమాచారం.నేపాల్లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిపోయాయి. దీంతో అక్కడి జనజీవనం స్తంభించింది. వరద బాధితులను సహాయక దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. నేపాల్ వరదల ప్రభావం బీహార్పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి కొన్ని నదులు బీహార్లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అధికారులు సన్నద్ధమవుతున్నారు. September 27, 2024Kathmandu, NepalFloods and landslides in Nepal continue to claim lives, 66 dead and dozens missing have been reported so far. Heavy rains caused catastrophic consequences in the Kathmandu Valley and other regions of the country, destroying roads pic.twitter.com/M3xgvgwQ97— Creative Society India (@CreativeSoIndia) September 29, 2024 #BREAKING: Nepal has reported 112 deaths due to flooding, landslides, and road closures due to persistent downpours, with 69 missing and 60 injured.#NepalFloods #Kathmandu #Flood #Nepal pic.twitter.com/fvm6nWiCei— JUST IN | World (@justinbroadcast) September 29, 2024 Happening now at Medicity hospital, Be safe. pic.twitter.com/o22qMm4B3A— संजय तिमिल्सिना (@sanjayabkt) September 28, 2024ఇక, నేపాల్లో శనివారం రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 54 సంవత్సరాల తర్వాత కేవలం 24 గంటల సమయంలోనే 323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పలువురు మృతిచెందారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లు, బోట్ల సాయంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. #BREAKING #NEPAL #KATHMANDU🔴 NEPAL : 📹 SEVERE FLOODING IN NEPAL DUE TO INCESSANT MONSOON RAINS Nepal floods and landslides killed at least 66 people, 69 missing. Capital City of Kathmandu is mostly affected.-Reuters#Ultimahora #Flooding #Inundación #Inondation pic.twitter.com/YHLMtYGWbM— LW World News 🌍 (@LoveWorld_Peopl) September 28, 2024ఇది కూడా చదవండి: నస్రల్లా మృతిపై జో బైడెన్ సంచలన కామెంట్స్ -
Uttar Pradesh: మెట్రో స్టేషన్ వద్ద కాల్పులు.. యువకుని మృతి
నోయిడా: యూపీలోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఒక యువకునిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కలకలం చెలరేగింది. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం నోయిడా సెక్టార్ 137 మెట్రో స్టేషన్ దిగువన ఉన్న ఫుడ్ కోర్టులో ఒక యువకునిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడిని నవేంద్ర కుమార్ ఝాగా పోలీసులు గుర్తించారు.ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటన గురించి అదనపు సీపీ శివ హరి మీనా మాట్లాడుతూ ఆస్తి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరువర్గాలు మెట్రో స్టేషన్ 137 కింద సమావేశమయ్యాయన్నారు. అయితే ఇంతలోనే ఒక వర్గానికి చెందిన వారు నవేంద్ర కుమార్ ఝాపై కాల్పులు జరిపారన్నారు.బుల్లెట్ నవేంద్ర తలకు తగిలిందని, ఆసుపత్రిలో చేర్పించాక అక్కడ మృతి చెందాడన్నారు. నవేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పులు జరిపినవారిని గుర్తించామని, ఇరువర్గాలు వారు ఘజియాబాద్కు చెందినవారని పోలీసులు తెలిపారు. సెక్టార్ 82లోని ఆస్తి విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోందన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు -
నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి
అబుజా: నైజీరియాలోని జంఫారాలో పడవ బోల్తా పడిన ఘటనలో 41 మంది మృతిచెందారు. మరో 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. నైజీరియాలోని ఫెడరల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లోని గుమ్మి-బుక్కుయుమ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ శాసనసభ్యుడు సులేమాన్ గుమ్మి ఈ విషయాన్నితెలియజేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్నారు. జాంఫారాలోని గుమ్మి పట్టణ సమీపంలోని నదిలో పడవ బోల్తా పడిందని ఆయన తెలిపారు.ప్రయాణికులు రోజూ పడవను తీసుకుని సమీప ప్రాంతంలోని తమ పొలాలకు వెళ్లేవారని గుమ్మి చెప్పారు. వార్తా సంస్థ జిన్హువా తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందిన వెంటనే అధికారులు రెస్క్యూ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపారు. వారు 12 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జంఫారా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి హసన్ దౌరా మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారన్నారు.జంఫారా ప్రావిన్స్లో రైతులు తమ భూముల దగ్గరకు పడవలో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధ్యక్షుడు బోలా టినుబు తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యవసర ఏజెన్సీలను ఆదేశించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా దేశంలో పడవ బోల్తా ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఓవర్లోడింగ్, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర లోపాలు మొదలైనవి ప్రమాదాలకు కారణాలవుతుంటాయని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: జలమార్గాన ప్రపంచయానం -
పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య
కరాచీ: పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి పాలలో విషమిచ్చి హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఖైర్పూర్ సమీపంలోని హైబత్ ఖాన్ బ్రోహి గ్రామంలో ఆగస్టు 19న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.మృతులను గుల్ బేగ్ బ్రోహి, అతని భార్య, ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, మరో ముగ్గురు బంధువులుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ పెద్దకు కొందరితో భూవివాదం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. సకూర్లోని కెమికల్ లేబొరేటరీలో నిర్వహించిన పరీక్షల్లో కుటుంబ సభ్యులు మృతిచెందిన రోజు తాగిన పాలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వెల్లడయ్యిందని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాల్లో విషపదార్థాలు ఉన్నట్లు కూడా నివేదికలో నిర్ధారణ అయ్యిందన్నారు.ఖైర్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) డాక్టర్ సమీవుల్లా సూమ్రో మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని సమీవుల్లా సూమ్రో తెలిపారు.ఇది కూడా చదవండి: Ghaziabad: పండ్ల రసాల్లో మూత్రం కలిపిన వ్యాపారి అరెస్ట్ -
బీహార్లో వెయ్యి దాటిన డెంగ్యూ కేసులు
పట్నా: బీహార్లో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తూ, అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పట్నా జిల్లాలో గత 10 రోజుల్లో డెంగ్యూ కారణంగా మొత్తం ఏడుగురు మృతిచెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా మృతి చెందిన యువకుని వివరాలిలా ఉన్నాయి.పాలిగంజ్లోని సిగౌరి పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల సంజీత్ కుమార్ కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో పీఎంసీహెచ్లోని డెంగ్యూ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత 24 గంటల్లో ఒక్క పట్నా జిల్లాలోనే కొత్తగా 18 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. పట్నా జిల్లాలో ఇప్పటివరకు 538 మంది డెంగ్యూతో బాధపడుతున్న రోగులను గురించారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ సంఖ్య వెయ్యి దాటింది. బీహార్లోని 11 జిల్లాలు డెంగ్యూ బారిన పడ్డాయి. డెంగ్యూ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్నా తర్వాత గయలో అత్యధికంగా 70 డెంగ్యూ కేసులు నమోదయ్యయి. -
పొరపాటు తీసిన ప్రాణం.. ఇంటర్ విద్యార్ధి మృతి
హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మూగజీవాల్ని కబేళాలకు తరలిస్తున్నారనే నెపంతో గోసంరక్షకులు ఇంటర్ విద్యార్థి అర్యన్ మిశ్రాను కాల్చి చంపారు. ఈ ఘటనలో విద్యార్ధి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు అనిల్ కౌశిక్, వరుణ్, కృష్ణ, ఆదేశ్, సౌరబ్లను అదుపులోకి తీసుకున్నారు.మూగజీవాల్ని కళేబరాలకు తరలిస్తున్న స్మగ్లర్లు రెనాల్ట్ డస్టర్, టయోటా ఫార్చూనర్ కార్లలో తిరుగుతున్నారంటూ నిందితులకు సమాచారరం అందింది. దీంతో వెంటనే అనిల్ కౌశిక్, అతని స్నేహితులు స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.సరిగ్గా అదే సమయంలో బాధితుడు ఆర్యన్ మిశ్రా,అతని స్నేహితులు శాంకీ,హర్షిత్లు ప్రయాణిస్తున్న డస్టర్ కారు పటేల్ చౌక్ వద్ద కనిపించింది. ఆ కారును 30కిలోమీటర్లు వెంబడించిన నిందితులు విద్యార్థిని కారు ఆపాలని బెదిరించారు. కారు ఆపకపోవడంతో నిందితులు కాల్పులు జరపగా బాధితుడు మృతి చెందాడు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఆ ‘రష్యన్ స్పై వేల్’ ఇక లేదు!
రష్యా గూఢచారిగా 2019 నుంచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెల్లని బెలుగా తిమింగలం చనిపోయింది. హవాల్దిమిర్గా పేరున్న ఈ తిమింగలం కళేబరం దక్షిణ నార్వేలోని రిజావికా బే వద్ద నీటిపై తేలియాడుతూ శనివారం స్థానికుల కంటబడింది. 14 అడుగుల పొడవు, 1,225 కిలోల బరువున్న హవాల్దిమిర్ కళేబరాన్ని క్రేన్తో బయటకు తీశారు. బెలుగా కళేబరంపై ఎటువంటి గాయాలు లేవని, మృతికి కారణాలను కనుగొనేందుకు పోస్టుమార్టం చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఒంటిపై కెమెరాను అమర్చేందుకు వీలుగా బెల్టు లాంటి ఒక పరికరం అమర్చి ఉండటం, దానిపై ‘ఎక్విప్మెంట్ సెయింట్ పీటర్స్బర్గ్’అని రాసి ఉండటంతో నార్వే ప్రజలకు అనుమానం మొదలైంది. రష్యాయే నిఘా కోసం ఈ తిమింగలాన్ని పంపి ఉంటుందని, నార్వే–రష్యా భాషలను కలిపి ‘హవాల్దిమిర్’గా పిలవనారంభించారు. సాధారణంగా తిమింగలాలు గుంపులుగా సంచరిస్తుంటాయి. అందుకు విరుద్ధంగా హవాల్దిమిర్ ప్రజలకు మచ్చికయ్యింది. ఇంతకీ, ఇది రష్యా పంపిందేనా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. బహుశా, రష్యా నిర్బంధంలో ఉంటూ అనుకోకుండా తప్పించుకుని వచ్చి ఉంటుందని, అందుకే ప్రజల సంజ్ఞలకు స్పందించే లక్షణం అబ్బి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. – హెల్సింకీ -
ఆస్పత్రి దూరమై.. రహదారి నరకమై..
చింతూరు: సకాలంలో వైద్యం అందకపోవడంతో అప్పుడే పుట్టిన మగబిడ్డ మృత్యువాత పడిన విషాద ఘటన చింతూరు మండలం కలిగుండంలో శుక్రవారం చోటు చేసుకుంది. కలిగుండం గ్రామానికి చెందిన కుంజా జయమ్మ స్థానిక మినీ అంగన్వాడీ కేంద్రంలో వర్కర్గా పనిచేస్తున్నది. గర్భిణీ అయిన జయమ్మకు ఇటీవల పరీక్షలు నిర్వహించగా వచ్చేనెల 18న కాన్పు అయ్యే అవకాశముందని వైద్యులు చెప్పినట్లు ఆమె భర్త సీతారాం తెలిపాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున జయమ్మకు అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భర్త సీతారాం సిద్ధమయ్యాడు. తమ గ్రామం నుంచి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆమెను రెండు కిలోమీటర్ల దూరంలోని పేగకు కాలినడకన తీసుకెళ్లేందుకు గ్రామస్తుల సాయం కోరాడు. మార్గమధ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవంక వాగును ప్రాణాలకు తెగించి దాటించి పేగకు చేరుకున్నారు. అప్పటికే పురిటి నొప్పులతో అల్లాడిన జయమ్మకు వ్యయప్రయాసతో గుండెల్లోతు నీళ్లలో వాగు దాటడంతోపాటు, రెండు కిలోమీటర్లు కాలినడకన రావడంతో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు తోడుగా వచ్చిన ఆశా కార్యకర్త వెంటనే పేగలోనే ఓ ఇంటిలో కాన్పు చేయడంతో జయమ్మ మగబిడ్డకు జన్మనిచ్చి0ది. బిడ్డను కాపాడుకునేందుకు.. పుట్టిన బిడ్డకు అస్వస్థతగా ఉండడంతో ఆ బిడ్డను కాపాడుకునేందుకు పేగ నుంచి ఆటోలో ఏడు కిలోమీటర్ల దూరంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని, చింతూరు ఏరియా ఆస్పత్రిలోని చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్సులో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే బిడ్డ మృతి చెందిందని చెప్పారు. దీంతో బిడ్డను కోల్పోయిన దంపతులు గుండెలవిసేలా రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. -
గాజాలో 20 మంది పాలస్తీనియన్లు మృతి
జెరూసలేం: గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడిల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్యూనిస్, డెయిల్ అల్ బలాహ్పై జరిగిన ఈ దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులున్నట్లు చెప్పారు. టుల్కారెమ్లోని నూర్షామ్స్ శరణార్థి శిబిరంపై దాడుల్లో ఐదుగురు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆంక్షలతో గాజాలో 10 లక్షల మందికి నెల రోజులుగా కనీస సాయం కూడా అందడం లేదని ఐరాస తెలిపింది.హమాస్ చెర నుంచి బందీని కాపాడిన ఆర్మీహమాస్ చెరలో ఉన్న తమ పౌరుడిని మంగళవారం ఇజ్రాయెల్ ఆర్మీ కాపాడింది. గతేడాది అక్టోబర్ ఏడున గాజా సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మందిని చంపడం, 250 మందిని బందీలుగా పట్టుకోవడం తెలిసిందే. వారిలో క్వాయిద్ ఫర్హాన్ అల్కాదీ(52) అనే వ్యక్తిని గాజా కాపాడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. హమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 8 మందిని కాపాడింది. ఇంకా 110 మంది బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు. -
కేంద్ర మంత్రి జుయల్ ఓరం భార్య మృతి
భువనేశ్వర్: కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరం భార్య జింగియా ఓరం మృతి చెందారు. డెంగ్యూతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. జుయల్ ఓరం సైతం డెంగ్యూ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జింగియా ఓరం మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఆస్పత్రిని సందర్శించారు. సీఎంతో పాటు ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్, స్పీకర్ సూరమా పాడి, ఇతర బీజేపీ నేతలు కూడా జింగియా ఓరం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి రాజేష్ మృతి
సాక్షి, హన్మకొండ: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి పేరెంట్స్.. కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో విషాదం నెలకొంది. ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు సమాచారం ఇచ్చారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.అయితే, రాజేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కన్నీరు పెట్టుకుంటూ కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, తొమ్మిది నెలల క్రితమే రాజేష్ తండ్రి మరణించారు. -
చొరబాటుదారుణ్ణి మట్టుబెట్టిన బీఎస్ఎఫ్
రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా పంజాబ్ సరిహద్దుల్లో ఓ పాకిస్తానీ చొరబాటుదారుడు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అతనిని మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా బీఎస్ఎఫ్ వెల్లడించింది.ప్రస్తుతం సరిహద్దుల్లో హై అలర్ట్ అమలులో ఉందని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తరన్తారన్ జిల్లాలోని దాల్ గ్రామం వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటి కంచె సమీపంలోకి వస్తున్న వ్యక్తి కనిపించాడని ఆయన తెలిపారు. అప్పుడు విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బంది చొరబాటుదారునితో తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. అయితే అతను అధికారుల సూచనలు వినకుండా సరిహద్దు భద్రతా కంచె వైపు వస్తూనే ఉన్నాడు.ప్రమాదాన్ని పసిగట్టిన డ్యూటీలోని సైనికులు ఆ చొరబాటుదారునిపై కాల్పులు జరిపారు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భారత ఆర్మీ మరోమారు చొరబాటుదారుడియత్నాన్ని విజయవంతంగా తిప్పికొట్టిందని ఆయన పేర్కొన్నారు. కాగా పంజాబ్లోని 553 కి.మీ. పొడవైన భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. -
టీడీపీ నేత క్వారీలో జేసీబీ డ్రైవర్ మృతి!
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ నేత నడుపుతున్న క్వారీలో ఆదివారం జేసీబీ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బైక్పైనే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో అది ప్రమాదమా! లేక హత్యా! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మాదిగబండలోని అక్రమ క్వారీ కథ ఇది..స్థానికుల కథనం ప్రకారం.. మాదిగబండ సమీపంలోని సర్వే నంబర్లు 1367,1345, 1376లో 4.43 హెక్టార్లలో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ కోసం శరత్కుమార్ గనులశాఖ అనుమతులతో క్వారీ నడుపుతున్నారు. ఈక్రమంలో నిబంధనలు పాటించడంలేదని అధికారులు క్వారీకి అనుమతులు రద్దుచేస్తూ ఈ నెల 1న నోటీసులిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ క్వారీని టీడీపీ నేత జనార్థన్నాయుడు స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. దీని కరెంటు బిల్లులు రూ.20.09 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ అధికారులు.. బకాయిలు చెల్లించకపోయినా స్పందించలేదు. అనర్హత వేటుపడిన ఈ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేయకుండా వదిలేశారు. ఇన్ని ఉల్లంఘనల మధ్య యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్వారీలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదమా? చంపేశారా?ఈ క్వారీలో ఎర్రగొండేపల్లికి చెందిన చిన్నస్వామి (38) జేసీబీ ఆపరేటర్గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జేసీబీ ముందు భాగంలో తొట్టి వద్ద చిన్నస్వామి గ్రీజు వేస్తుండగా సెల్వ అనే వ్యక్తి జేసీబీ క్యాబిన్లో కూర్చొన్నాడు. సెల్వి సెల్ఫోన్ చూస్తూ గేర్ వేయడంతో జేసీబీ తొట్టె కిందికెళ్లిపోయి, గ్రీజు వేస్తున్న చిన్నస్వామిపై పడిందని, దాని కింద నలిగి అతను మృతి చెందినట్టు చెబుతున్నారు. పోలీసులను పిలవకుండానే మృతదేహాన్ని బైక్పై ఆస్పత్రికి తెచ్చారు. క్వారీలో ఉన్న జేసీబీని మాయం చేశారు. దీంతో ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చిన్నస్వామిని జేసీబీతో కొట్టి చంపేశారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యజమాని ఆదేశాలతో ఆ ప్రాంతానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి ఎంతోకొంత పరిహారం చెల్లించి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతుల బంధువులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరి గిందనేది తెలుస్తుందని పలమనేరు టౌన్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!
అమరత్వం కోసం పరిశోధకులు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలో ఒక సిలికాన్ వ్యాలీ కంపెనీ సీఈవో 46 ఏళ్ల బ్రయాన్ జాన్సన్ తన జీవ సంబంధ వయసును ఐదేళ్లకు పైగా తగ్గించుకున్నాడు, వృద్ధాప్య లక్షణాలను తిప్పి కొట్టాడు. అందుకోసం నిత్య వైద్యలు పర్యవేక్షణలో ఉంటూ ఎన్నెన్ని ఇంజెక్షన్లు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో విన్నాం. ఇప్పుడూ ఏకంగా ఓ జర్మన్ స్టార్ట్ప్ కంపెనీ ఓ అడుగు ముందుకేసి మరణాంతరం బాడీని స్థభింపచేసి ఎక్కువ కాలం బతికేలా చేస్తానంటోంది. చెప్పాలంటే ఎక్కువకాలం జీవించాలనుకుంటున్న వారు తమ కంపెనీని ఆశ్రయించమని చెబుతోంది కూడా. ఇంతకీ అసలు అదెలా సాధ్యమో సవివరంగా చూద్దామా..!జర్మన్ స్టార్టప్ కంపెనీ టుమారో బయో అనే కంపెనీ ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. మరణాన్ని రివర్స్ చేయాలనే లక్ష్యంతో ఈ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. మరణాంతరం శరీరం పాడవకుండా సజీవంగా ఉండేలా స్థభింపచేస్తుంది. భవిష్యత్తులో ఏ వ్యాధి కారణంతో చనిపోయారో, దానికి చికిత్స పొంది మరీ ఆ బాడీని పునరుద్ధరించవచ్చిని టుమారో బయో కంపెనీ చెబుతోంది. సదరు కంపెనీ క్రియోప్రెజర్వేషన్ ద్వారా 198 మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని బయోస్టాసిస్లో ఉంచుతుంది. ఈ స్థితిలో జీవప్రక్రియలన్నీ నిరవధికంగా నిలిచిపోయి శరీరం చెక్కు చెదరకుండా ఉంటుంది. భవిష్యత్తులో వినియోగించేలా ఉంటుంది. అంతేగాదు ప్రజలు తాము ఎంతకాలం జీవించాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వివరాలు తెలియజేసి వారి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ ప్యాకేజీని ఎన్నుకోవాలని పేర్కొంది టుమారో బయో కంపెనీ. ఇప్పటికే ఆరుగురు వ్యక్తులు, ఐదు పెంపుడు జంతువులను క్రియోప్రెజర్వేషన్ కింద ఉంచామని కంపెనీ తెలిపింది. అలాగే సర్వీస్ చెల్లించిన సుమారు 650 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్లు వెల్లడించింది. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే తమ పని మొదలుపెడతామని చెప్పుకొచ్చింది. అందుకోసం యూరోపియన్ నగరాల్లో ప్రత్యేక అంబులెన్స్ మృతదేహాలను స్విట్జర్లాండ్ తీసుకువెళ్లేలా బెర్లైన్, ఆమ్స్టర్డామ్, జ్యూరిచ్లలో ఉద్యోగులను కూడా నియమించింది. అలాగే ఇక్కడ బాడీని మైనస్ 198 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచేలా ద్రవ నైట్రోజన్తో నింపిన ప్రత్యేక స్టీల్ కంటైనర్లో ఉంచుతారు. కాగా, మరణాంతరం ఇలా భద్రపర్చడానికి సదరు కంపెనీ ఏకంగా రూ. 1.8 కోట్లు వసూలు చేస్తోంది. కేవలం మెదడుని స్థభింపచేయాలనకుంటే దగ్గర దగ్గర రూ. 67.2 లక్షలు డిమాండ్ చేస్తోంది. అయితే కంపెనీ చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు(బతికిస్తారు) అనేది క్లియర్గా వివరించలేదు. క్రయోప్రెజర్వేషన్ అంటే..ఇది జీవ పదార్ధం - కణాలు, కణజాలాలు లేదా అవయవాలని ఎక్కువ కాలం పాటు భద్రపరచడానికి స్తంభింపజేసే ప్రక్రియ. అయినప్పటికీ, క్రియోప్రెజర్వేషన్లో గడ్డకట్టడం భిన్నంగా ఉంటుంది. ఇది శరీరంపై మంచు స్ఫటికాలను నిరోధించడానికి ప్రత్యేక క్రయోప్రొటెక్టెంట్ సొల్యూషన్స్ (లిక్విడ్ నైట్రోజన్) కలిగి ఉంటుంది.(చదవండి: 'రియల్ ఐరన్ మ్యాన్': కృత్రిమ గుండెను పొందిన తొలి వ్యక్తి!) -
సూడాన్లో భారీ వర్షాలు.. 32మంది మృతి
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల వరదల సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో 32 మంది మృతిచెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5,575 ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా డయేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలావుండగా కస్సాలా నగరం గుండా ప్రవహించే గాష్ నది నీటి మట్టం పెరుగుతోంది.దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సూడాన్లో సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందగా, లెక్కలేనన్ని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. -
విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్ జిల్లాలోని షాపూర్ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. Madhya Pradesh | 9 children died after being buried under the debris of a wall in Sagar. Some children are injured, and they are under treatment. All the debris has been removed from the site of the incident: Deepak Arya, Collector, Sagar(Source - DIPR) pic.twitter.com/saKV2RKADv— ANI (@ANI) August 4, 2024దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. -
హిమాచల్: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిదిమంది మృతిచెందారు. 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.సిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కులులోని బాఘిపుల్, మండిలోని పద్దర్లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఆరు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్లు సిమ్లా, కులు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, వంటగ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని తెలిపారు. #WATCH | Shimla: On Himachal Pradesh disaster, Special Secretary, Disaster Management DC Rana says, "A cloudburst in the Samej area of Shimla district, Rampur region, Baghipul area of Kullu, and Paddar area of Mandi has led to widespread destruction. 53 people are missing and six… pic.twitter.com/s0CAl1Me4e— ANI (@ANI) August 3, 2024 -
చిన్నారి ప్రాణం తీసిన సెల్ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్ఫోన్ ఛార్జర్ కేబుల్తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు. 123 మంది మృతి. వందలాది మంది జాడ గల్లంతు
-
కోచింగ్ కోళ్ళఫారాలు
వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు చేయాల్సిన పని చేయకపోతే... విషాదం ఎలా ఉంటుందో చెప్పడానికి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు బేస్మెంట్లో నడుపుతున్న స్టడీ సెంటర్లోకి పైపులు పగిలి నీళ్ళు వెల్లువెత్తినప్పుడు, జలదిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టు కున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. పూర్తిస్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందట. పది పన్నెండు మంది కనిపించట్లేదట. కొద్దిరోజుల క్రితం పొంగిపొర్లిన వర్షపునీటి వీధిలో విద్యుదాఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించినప్పుడే వ్యవస్థ మేల్కొని ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇప్పుడీ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. గమనిస్తే, క్రిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్ళఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు, కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలు, వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్ళు, అధ్వాన్నమైన డ్రైనేజ్ వ్యవస్థ, అవినీతికి పాల్పడి అన్నిటినీ వదిలేసిన అధికార యంత్రాంగం... అలా ఇది సామూహిక వైఫల్యం. సమష్టిగా అందరూ చేసిన పాపం. ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్, యజమానుల లాంటి పెద్ద చేపల్ని వదిలేసి చిరుద్యోగుల అరెస్ట్, ఘటనకు దారి తీసిన కారణాలు – నివారణ చర్యలపై నివేదికకు కేంద్ర హోమ్శాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు లాంటివి చకచకా జరిగాయి. కానీ, పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లితండ్రుల గర్భశోకం తీరుస్తాయా? శనివారం నుంచి విద్యార్థులు బైఠాయించి, శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన హామీనిచ్చి సాంత్వన పరచలేకపోవడం మరో వైఫల్యం.ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్ద ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న టీచర్లు, పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలను చూస్తుంటే వెగటు పుట్టక మానదు. ప్రజలెన్నుకున్న ఢిల్లీ ‘ఆప్’ సర్కార్పై కేంద్రం పనుపున లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన తైనాతీ అధికారుల పెత్తనం ఒక తప్పయితే... క్షేత్రస్థాయిలో లేకున్నా జైలు నుంచే రోజువారీ పాలన సాగిస్తానంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు. శిక్ష, నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు, పరిపాలనకు పడుతోంది.ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. 61 మంది విద్యార్థులు గాయపడ్డారు. అప్పుడూ ఇలాగే జనాగ్రహం పెల్లుబికింది. సదరు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 600 దాకా కోచింగ్ సెంటర్లుంటే, వాటిలో 67కే అనుమతులున్నాయట. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, చేసింది శూన్యం. నిజానికి, 2021 నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్, అలాగే 2016 నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించాయి. అయినా సరే బేస్మెంట్లలో కోచింగ్ కేంద్రాలు, వాటి లైబ్రరీలు, జిమ్లు, షాపులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి పొంచివున్న ప్రమాదాలు అనేకం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసినా, ఈ ఉల్లంఘనలపై అన్నిచోట్లా పాలకులది ఓ గుడ్డిదర్బారే! వాహనాల పార్కింగ్, స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్టవ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా వాడుతూ, వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్న వైనం పట్ల చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నెల క్రితం కూడా సాక్షాత్తూ ఓ విద్యార్థే ఈ సెల్లార్ల నియమోల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ‘‘పెను ప్రమాదం సంభవించవచ్చు’’ అని భవిష్యద్వాణిలా హెచ్చరించారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. తక్కువ వసతులు, కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్ల అత్యాశ తెలియనిది కాదు. సక్సెస్ రేటు, సెలక్టయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనల్లో ఇవ్వరాదని నిబంధనలున్నా, వాటినవి గాలికొదిలేస్తున్న వైనమూ నిత్యం చూస్తున్నదే. తప్పుడు గొప్పలు చెప్పుకొని ఆకర్షించే జిమ్మిక్కులూ తెలిసినవే. వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీటికి అడ్డూ ఆపూ లేదు. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యావ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోలేకున్నా అమాయకుల ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా నిబంధనలతో అదుపు చేయడం పాలకులు తలుచుకుంటే కష్టం కాదు. ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య! తాజా ఘటన పార్లమెంట్లో చర్చ దాకా వెళ్ళడంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజనుకు పైగా చట్టవిరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీలు వేసింది. మరో అరడజను పేరున్న సంస్థల బేస్మెంట్లకు తాళాలు బిగించింది. స్థలాలను ఆక్రమించి, వరద నీటి కాల్వలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగం మొదలుపెట్టింది. నిజానికిది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం. కోచింగ్, దాని అనుబంధ వ్యాపారం కోట్లలో సాగుతూ, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నా, కనీస రక్షణ, వసతులు ప్రభుత్వపరంగా కల్పించలేకపోవడం పాలకుల హ్రస్వదృష్టికి తార్కాణం. పైగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ, వికసిత భారత గాథను లిఖించాలని చూస్తున్న పాలకులకిది శోభనివ్వదు. సరైన పట్టణ ప్రణాళిక లేకుండా కాంక్రీట్ కీకారణ్యాల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనమూ లేదు. ఢిల్లీ ఘటనలు పునరావృతం కాకముందే కేంద్రం, రాష్ట్రాలు నిద్ర లేవాలి. -
‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!
కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..స్పెయిన్లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్కు తరలించారు. మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.ఈ వ్యాధి లక్షణాలు..తీవ్ర జ్వరంతీవ్రమైన తలనొప్పివెన్ను, కీళ్ల నొప్పులుకడుపు నొప్పి, వాంతులుఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖంనోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలుకామెర్లుమానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులుఆందోళననిద్రమత్తురక్తస్రావం.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది. నివారణటిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.సీసీహెచ్ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి. (చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!) -
చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్
చచ్చిన ఎలుకలను కనుగొనేందుకు భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో బోరెస్కోపిక్ కెమెరాలను వినియోగించనుంది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్గా దీనిని ముంబైలో ప్రారంభించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ హాల్, ఆఫీసు, క్యాంటీన్లోని మూలల్లో ఎలుకలు చనిపోతుంటాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. చచ్చిన ఎలుకల నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తరచుగా అందుతుండటంతో చచ్చిన ఎలుకలను వెతికేందుకు సెంట్రల్ రైల్వే రెండు అత్యాధునిక బోరోస్కోపిక్ కెమెరాలను కొనుగోలు చేసింది.బోరోస్కోపిక్ కెమెరా అతి చిన్న ప్రదేశంలోకి కూడా వెళుతుంది. సాధారణంగా చూడలేని ప్రాంతాన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తుంది. దీని సాయంతో ఆయా ప్రాంతాల్లో స్కాన్ చేసి చచ్చిన ఎలుకలను గుర్తిస్తారు. తరువాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ కెమెరాలను ప్రయోగపూర్వకంగా ఉపయోగించినప్పుడు స్టేషన్ లాబీ, టాయిలెట్, వాష్రూమ్ సీలింగ్ వెనుక కొన్ని చచ్చిన ఎలుకలు కనిపించాయి. అనంతరం ఆ ఎలుకలను తొలగించారు. ప్రస్తుతానికి ముంబై స్టేషన్లో రెండు కెమెరాలు అమర్చినట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. త్వరలో ఇతర స్టేషన్లలోనూ ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. -
కోచింగ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయి.. శ్రేయ విషాద గాథ
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లోకి ప్రవేశించిన నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మృతులలో ఒకరే శ్రేయ. ఉన్నత అధికారి కావాలనుకున్న కుమార్తె కలలను నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రేయ కుటుంబ సభ్యులు రెండు నెలల క్రితమే ఆమెను పోటీ పరీక్షల కోచింగ్ కోసం ఢిల్లీకి పంపించారు.శ్రేయ కుటుంబ సభ్యులు యూపీలోని అంబేద్కర్ నగర్లో ఉంటారు. గత మేనెలో శ్రేయ.. రావ్ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకుంది. శ్రేయ తన ఇంటిలో మొదటి సంతానం. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే శ్రేయపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె తండ్రి రాజేంద్ర యాదవ్ తన కుమార్తెను ఐఏఎస్గా చూడాలని తపన పడేవాడు. శ్రేయ రెండు నెలల నుంచి కోచింగ్ సెంటర్లోనే శిక్షణ తీసుకుంటోంది. ఈ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో లైబ్రరీ ఉంది. శనివారం సాయంత్రం ఆ లైబ్రరీలో శ్రేయతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు.ఉన్నట్టుండి భారీ వర్షం రావడంతో బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించి, అది లైబ్రరీని ముంచెత్తింది. దీంతో లైబ్రరీ వరద నీటితో నిండిపోయింది. ఫలితంగా విద్యార్థులంతా లైబ్రరీలో చిక్కుకుపోయారు. బయట నుంచి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే అప్పటికే ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న శ్రేయ కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు. శ్రేయ ఇద్దరు తమ్ముళ్లు తమ అక్కను గుర్తు చేసుకుంటూ రోదిస్తున్నారు. కుమార్తెను ఐఏఎస్గా చూడాలనుకున్న శ్రేయ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. -
ఆఫ్రికాలో పడవ బోల్తా.. 15 మంది మృతి
ఆఫ్రికన్ దేశమైన మారిటానియా సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) ఈ సమాచారాన్ని తెలియజేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 300 మంది ఉన్నారు. మారిటానియా రాజధాని నౌవాక్చాట్కు సముద్రమార్గంలో పడవ చేరుకుంటున్న సమయంలో అది బోల్తా పడింది. ఈ పడవ ఏడు రోజుల పాటు సముద్రంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ పడవలో అధికశాతం మంది సెనెగల్, గాంబియన్ ప్రజలు ఉన్నారు.నౌక్చాట్లో పడవ బోల్తా పడి 15 మంది వలసదారులు మృతిచెందడం, సముద్రంలో 195 మందికి పైగా జనం గల్లంతుకావడం తమకు చాలా బాధ కలిగించిందని ఐఓఎం ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది. ప్రాణాలతో బయటపడిన వారిలో 10 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. -
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 15 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశం కానున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. నెతన్యాహు యూఎస్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చ కూడా జరగనుంది.మరోవైపు గాజాలో పోలియో వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గాజాలోని ప్రజలకు పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదు. సెంట్రల్ గాజాలోని బురెజ్ శరణార్థుల శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది మృతిచెందారు. గాజా నగరాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు తరలివెళ్లాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సైన్యం గతంలోనే ఆదేశాలు జారీచేసింది. -
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో 12 నుంచి 15మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందడంతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో మధ్యాహ్నం నుంచి పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా దాదాపు ఆరు గంటల పాటు జరగ్గా.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే, మూడు ఏకే 47 తుపాకీలతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.ఇక, కాల్పుల సందర్భంగా తిపాగడ్ దళం ఇంఛార్జి డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం మృతిచెందినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, ఈ కాల్పుల్లో ఒక జవాన్కు బుల్లెట్ గాయం కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. -
మహిళ ప్రాణం తీసిన ప్రాంక్ వీడియో?!
సరదా చేష్టలు చేసి.. వాటిని ప్రాంక్ వీడియోలుగా ప్రమోట్ చేసుకుని ఫాలోవర్స్ను పెంచుకుంటారు కొందరు. అయితే అలాంటి వీడియోలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడో ఘటన చెబుతోంది. కలిసి పని చేసే మహిళపై ప్రాంక్ వీడియో చేద్దామని ప్రయత్నించిన ఓ వ్యక్తి.. ఏకంగా ఆమె ప్రాణం పోయేందుకు కారణం అయ్యాడు. ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలోని డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఓ మహిళ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకుంది. కొలీగ్స్ ఆమెపై ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నిస్తుండగా.. మూడో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు నాగినా దేవి మంజీరామ్గా గుర్తించారు. Woman falls off third floor of a complex in Maharashtra's Dombivli. This happened while the woman was with her friends. Another of her friends was saved by bystanders.The woman was identified as Gudiya Devi, who worked as a cleaner in the building. She is survived by a son… pic.twitter.com/tfKpjHFn4U— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు బిల్డింగ్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అందులో రికార్డయిన వీడియోల ఆధారంగా ప్రాంక్ చేస్తుండగా జరిగిన ప్రమాదమని పోలీసులు ఒక అంచానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, భవనంలోని మూడవ అంతస్తులో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దేవితో పాటు మరొకరు సైతం బిల్డింగ్పై నుంచి కిందపడబోతుండగా.. పక్కనే ఉన్న వారు పట్టుకొని పైకి లాగడంతో ప్రమాదం నుంచి బయట పడ్డారు. కాగా, ఆ భవనంలో నాగినా దేవి సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు తెలిపింది. మరణంతో ఆమె కుమార్తె, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
జ్వరమా.. మరేదైనా కారణమా..?
పెన్పహాడ్: గురుకుల పాఠశాల విద్యార్థిని అను మానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే జ్వరంతో విద్యార్థిని చనిపోయిందని ప్రిన్సిపాల్ చెబుతుండగా, రాత్రే చనిపోతే ఉదయం వరకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహంతో మృతురాలి బంధువులు ప్రిన్సి పాల్పై దాడి చేశారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివ రాల ప్రకారం... సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన కొంపెల్లి సోమయ్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు సరస్వతి(10) పెన్ పహాడ్ మండలంలోని దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సరస్వతికి సోమవారం రాత్రి జ్వరం వచ్చింది.గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న జీఎన్ఎం మంగళవారం తెల్లవారుజామున పరీక్షించి మరో ఉపాధ్యాయురాలితో కలిసి గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ఇంజక్షన్ వేయించారు. అయినా జ్వరం తీవ్రత తగ్గకపోగా సీరియస్గా ఉండటంతో 108 వాహనంలో సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సరస్వతిని పరీక్షించిన డాక్టర్ అప్పటికే చని పోయిందని చెప్పారు. దీంతో ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి.. మీ పాపకు సీరియస్గా ఉందంటూ సర స్వతి తల్లి దండ్రులకు ఫోన్ చేశారు. వారు వెంటనే ఆస్పత్రికి చేరుకోగా అప్పటికే మృతి చెందినట్టు తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కూతురు బాగానే ఉందని, అప్పుడే ఎలా చనిపోయిందని వారు ప్రిన్సిపాల్ను నిలదీశారు. ఆస్పత్రిలో బంధువులు, తల్లిదండ్రుల ఆందోళనసరస్వతి మృతి చెందిన విషయం ప్రిన్సిపాల్ విజ యలక్ష్మి, పాఠశాల సిబ్బంది తమకు తెలియజే య కుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఆస్పత్రి లోని మార్చురీ వద్ద కుటుంబసభ్యు లు ఆందోళన చేశారు. తమ కూతురు సోమ వారం రాత్రే చని పోయిందని, ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి మంగళవారం ఫోన్ చేసి సీరియస్గా ఉందని చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. తమ కూతురుని కొట్టి చంపారా.. లేక ఏదైనా చేశారా మాకు చెప్పాలని తండ్రి సోమయ్య డిమాండ్ చేశాడు. న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయొద్దని పట్టుబట్టారు. మాట్లాడదామని చెప్పి...ప్రిన్సిపాల్తో మాట్లాడించాలని రీజినల్ కోఆర్డి నేటర్ షకీనాను బంధువులు కోరగా, ఆమెను తీసుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. ప్రిన్సిపాల్పై సరస్వతి బంధువులు దాడి చేశారు. వెంటనే అక్కడే ఉన్న డీఎస్పీ రవి జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీసీ గురుకుల అధికారులు మద్దిలేటి,వెంకటేశ్వర్లు ఆస్పత్రి వద్దకు వెళ్లి అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు మృతదేహాన్ని స్వగ్రామా నికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మృతురాలి తండ్రి కొంపెల్లి సోమయ్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
హర్యానాలో ఏఎస్ఐ కాల్చివేత
హర్యానాలో పోలీసులకు సైతం రక్షణ కరువయ్యింది. దీనికి కర్నాల్లో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలిచింది. యమునానగర్లోని స్టేట్ క్రైమ్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సంజీవ్పై బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐని వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సంజీవ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన సంజీవ్ కుటుంబంతోపాటు స్థానికంగా విషాదాన్ని నింపింది.కర్నాల్లో నేరపూరిత ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓంగాడ్ గ్రామంలో ఒక దుకాణం వెలుపల దుండగులు కాల్పులు జరిపిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటన కర్నాల్లోని కుటేల్ గ్రామ సమీపంలో జరిగింది.సంజీవ్ ఇటీవలే యమునానగర్లోని స్టేట్ క్రైమ్ బ్రాంచ్లో ఏఎస్ఐగా నియమితులయ్యారు. ఆయన తన ఇంటి బయట వాకింగ్ చేస్తుంగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ సంజీవ్ నుదిటిపై తగలగా, మరొకటి నడుములోనికి దూసుకెళ్లింది. సంజీవ్ సోదరుడు, తండ్రి ఇటీవలే మృతి చెందారు. సంజీవ్ ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
Hathras Stampede: అన్ని మృతదేహాలను ఒకేచోట చూసేసరికి..
యూపీలోని హత్రాస్లో తొక్కిసలాట తర్వాత సమీప ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కనిపించాయి. ఇవి చూపరుల హృదయాలను కలచివేశాయి. ఎంతటి గుండెధైర్యం కలిగినవారైనా అన్ని మృతదేహాలను ఒకేచోట చూస్తే వారి మనసు కల్లోలమవుతుంది. ఒక కానిస్టేబుల్ ఇటువంటి అనుభవానికే లోనై, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఎటా మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్ట్మార్టం హౌస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవికుమార్ మృతదేహాలను అక్కడికి తీసుకురావడాన్ని గమనిస్తున్నాడు. అక్కడికి వస్తున్న మృతదేహాల సంఖ్య లెక్కకుమించి ఉండటానికి తోడు, బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటడం రవికుమార్ మనసును తీవ్రంగా కలచివేశాయి.అతనిలో గుండె దడ మొదలయ్యింది. కొద్ది క్షణాలకే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే తోటి కానిస్గేబుల్ లలిత్ కుమార్ అతనిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించాడు. వైద్య చికిత్స తీసుకుంటూనే 20 నిమిషాల తర్వాత రవికుమార్ మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రవి కుమార్ బన్నా దేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహల్లా సిద్ధార్థ్ నగర్లో నివసిస్తున్నాడు. 2022 నుండి అవగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. హత్రాస్ ప్రమాదం నేపధ్యంలో రవికుమార్ను ఎటా మెడికల్ కాలేజీ మార్చురీ వద్ద విధులలో నియమించారు. -
ఎవరీ ‘బోలే బాబా’?..హత్రాస్ తొక్కిసలాటకు కారణం అదేనా?
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్లోని సికంద్రరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో తొక్కిసలాట జరిగింది.రతిభాన్పూర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిస లాటలో 107 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని హత్రాస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగ్రాతులకు సకాలంలో చికిత్సనందించేలా చూడాలని యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఆధిత్యనాద్ సైతం ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు.కారణం అదేనాకాగా స్థానిక గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి గౌరవార్థం ప్రతి ఏటా ఫుల్రాయ్ గ్రామంలో శివారాదన జరుగుతోంది. అయితే ఈ ఏడాది కూడా శివారాదన జరిగింది. ఇందులో పాల్గొనేందుకు సుమారు 20వేల మంది భక్తలు హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. గురువు భోలే బాబా నారాయణ్ సాకర్ హరి కారు బయలుదేరే వరకు భక్తులను వెళ్లనీయకుండా నిర్వహకులు అడ్డుకున్నారు. దీంతో నిర్వహకులు భక్తుల్ని అడ్డుకోవడం..వెనుక నుంచి ముందుకు భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్గాంధీంతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులను, వారి కుటుంబసభ్యులను అన్నీ రకాలుగా ఆదుకోవాలని ఉత్తర్ దేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎవరీ భోలే బాబాభోలే బాబా అలియాస్ అకా నారాయణ్ సాకర్ హరి అలియాస్ నారాయణ్ హరి ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని బహదూర్ నగరి గ్రామంలో జన్మించాడు. అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేయడం ప్రారంభించాడని, ఆ సమయంలో ఆధ్యాత్మికత వైపు మళ్లినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. -
అసోంలో వరదలు.. 60 మంది మృతి
దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల బారిన పడిన అసోం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షలమంది నిరాశ్రయులుగా మారగా, 60 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరిగింది. ఫలితంగా నగాంవ్, డిబ్రుగఢ్ తదితర జిల్లాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.మరోవైపు ఉత్తరాఖండ్లోని అలకనందా నదిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో సమీపప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో జూలైలో సాధారణం కన్నా అధికవర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. జూన్లో సాధారణంకన్నా 11 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని పేర్కొంది. -
ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు నార్సింగ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బస్సు ప్రమాదం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రీల్ చేస్తుండగా తిరగబడిన ట్రాక్టర్.. యువకుడు మృతి
‘రీల్స్ చెయ్యాలి... సోషల్ మీడియాలో పెట్టాలి.. అందరూ చూడాలి.. లెక్కలేనన్ని వ్యూస్, లైక్స్ రావాలి’.. ఇదే చాలామంది యువతీ యువకుల మనసులలో బలంగా ఉన్న కోరిక. అయితే ఈ తాపత్రయంలోనే కొందరు యువతీయువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఒక ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన నీరజ్ అనే రీల్స్ చేస్తుంటాడు. ఇదే మోజులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది. అత్రియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమ్మత్ నగర్కు చెందిన నీరజ్ డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటాడు. తాజాగా అతను ఒక ట్రాక్టర్ను మరో ట్రాక్టర్కు కట్టి లాగే స్టంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్యాసాన్ని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.ఈ ఫీట్ చేస్తుండగా నీరజ్ కూర్చున్న ట్రాక్టర్లోని ముందు భాగం అతనిపైకి తిరగబడింది. దీంతో నీరజ్ ట్రాక్టర్ రెండు భాగాల మధ్య ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం అక్కడ జనం తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియకుండా మృతదేహాన్ని దహనం చేశారు.కేసు పోలీసులు దర్యాప్తులో ఉంది. -
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత
అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు. -
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి
బనశంకరి: భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెంగళూరులోని కొత్తనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కనకశ్రీ లేఔట్ ఎస్ఎల్వీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులోని తన ఫ్లాట్ నుంచి ఆయన కింద పడటంతో తీవ్ర గాయాలై మరణించారు. గురువారం ఉదయం గం. 11:15 సమయంలో ఈ సంఘటన జరిగింది. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన 52 ఏళ్ల డేవిడ్ జాన్సన్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలున్నాయి. 1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. న్యూఢిల్లీ వేదికగా 1996 అక్టోబర్లో ఆ్రస్టేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన జాన్సన్ రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీశాడు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో జాన్సన్ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు సాధించాడు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో సైనికుడు, పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఛత్తీస్గఢ్ సాయుధ దళాల (సీఎఎఫ్) వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. Chhattisgarh | Two Chhattisgarh Armed Force (CAF) security personnel died and one was injured after the vehicle they were travelling in overturned in the Balrampur district. The civil driver of the pick-up vehicle was also injured in the incident. Both the injured are under… pic.twitter.com/xVlVowxnop— ANI (@ANI) June 20, 2024 -
ఇరాన్లో భూకంపం.. నలుగురు మృతి
ఇరాన్లోని కష్మార్లో భూకంపం సంభవించంది. ఈ విపత్తులో నలుగురు మృతిచెందారు. 120 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.9గా నమోదయ్యింది. భూకంపం కారణంగా మృతిచెందివారి వారి సంఖ్యను కష్మార్ గవర్నర్ హజతుల్లా షరీయత్మదారి ధృవీకరించారు.భూకంపం బారినపడి తీవ్రంగా గాయపడిన 35 మంది బాధితులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. భూకంపం కారణంగా కష్మార్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాత భవనాలు దెబ్బతిన్నాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల (ఆరు మైళ్ళు) లోతులో సంభవించింది. ఇరాన్ టెలివిజన్ భూకంపం ఫుటేజీని ప్రసారం చేసింది. దానిలో కొన్ని భవనాలు బీటలువారడం కనిపిస్తుంది. అలాగే కార్మికులు భవన శిధిలాలను తొలగిస్తున్న దృశ్యాలను కూడా చూపించారు.ఇరాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2023లో టర్కీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ముగ్గురు మృతిచెందారు. 800 మందికి పైగా జనం గాయపడ్డారు. కాగా 2003లో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. బామ్ నగరంలో 6.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంలో 31వేల మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. -
బెంగాల్లో రైలు ప్రమాదం.. 10కి చేరిన మృతులు
న్యూఢిల్లీ/కోల్కతా/ సిలిగురి: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో, మృతుల సంఖ్య 9 నుంచి 10కి చేరుకుందన్నారు. సీల్డాకు వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం ఉదయం రంగపాణి రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న కాంచనజంగ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన విషయం తెల్సిందే.ఘటనలో మృతి చెందిన, గాయాలపాలైన వారిని వదిలేసి ప్రమాదానికి గురవని బోగీలతో 850 మంది ప్రయా ణికులతో సోమవారం మధ్యాహ్నం బయలుదేరిన కాంచనజంగ ఎక్స్ప్రెస్ మంగళవారం వేకువజామున సీల్డాకు చేరుకున్నట్లు ఈస్టర్న్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. సీల్డా నుంచి ప్రయాణికులను వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు 16 బస్సులు, 60 కార్లను ఏర్పాటు చేశామన్నారు.కుమార్తె బర్త్డే కోసం వస్తూ...సోమవారం జరిగిన రైలు ప్రమాదం కోల్కతాకు చెందిన సృష్టి అనే 11 ఏళ్ల చిన్నారికి తీరని వేదన మిగిల్చింది. ఈమె తండ్రి శుభొజిత్ మాలి(31) ఆఫీసు పని మీద శుక్రవారం సిలిగురి వెళ్లారు. మరికొద్ది రోజులపాటు ఆయన అక్కడే ఉండిపోవాల్సి ఉంది. కానీ, సృష్టి బర్త్డే వేడుకలో పాల్గొనేందుకు ముందుగానే సోమవారం బయలుదేరారు. కాంచనజంగ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కే ముందు సృష్టికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎలాగోలా సమయానికి వచ్చేస్తా.బర్త్డే ఘనంగా చేసుకుందామని, కేకు తీసుకొస్తానని కూతురికి మాట ఇచ్చారు. కానీ, విధి మరోలా ఉంది. రైలు ప్రమాదంలో మరణించిన వారిలో శుభొజిత్ కూడా ఉన్నారు. అదే రైలులో ప్రయాణించిన ఆయన స్నేహితుడు ఈ విషాద వార్తను కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో, శుభొజిత్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. ఎప్పుడూ బస్సులోనే ప్రయాణించే శుభొజిత్.. ఈసారి మాత్రం కుమార్తె పుట్టిన రోజు వేడుక జరపాలనే తొందరలో రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారని, ఇదే ఆయన ప్రాణాలు తీసిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలి: ఖర్గేదేశంలో రైల్వే వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మండిపడ్డారు. మోటారు సైకిల్పై కూర్చుని ప్రమాద స్థలికి మంత్రి చేరుకోవడంపై స్పందిస్తూ. అశ్వినీ వైష్ణవ్ రైల్వే మంత్రినా లేక రీల్ మంత్రినా అంటూ ఎద్దేవా చేశారు. -
వడదెబ్బకు 14 మంది హజ్యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు హజ్యాత్రను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘పెట్రా’తెలిపిన వివరాల ప్రకారం హజ్ యాత్రలో పాల్గొన్న 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. మృతులను సౌదీ అరేబియాలో ఖననం చేయలా లేదా జోర్డాన్కు పంపించాలా అనేదానిపై సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.హజ్యాత్ర చివరి రోజులలో సైతానుకు గుర్తుగా ఉన్న స్థంభాలను ముస్లింలు రాళ్లతో కొడతారు. దీనిని చెడును తరిమికొట్టడానికి గుర్తుగా భావిస్తారు. ఇది ముస్లింలు హజ్యాత్రలో చేసే చివరి ఆచారం. ప్రపంచం నలుమూలల నుండి 18 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా హజ్ యాత్రకు ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అటువంటి ఆంక్షలు లేకపోవడంతో హజ్ తీర్థయాత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి మృతి
గుజరాత్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.అగ్నిమాపక దళ అధికారి హెచ్సీ గాధ్వి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. #WATCH अमरेली, गुजरात: अग्निशमन अधिकारी एचसी गढ़वी ने कहा, "करीब 12:30 बजे सूचना मिली थी की एक बच्ची जो करीब डेढ़ साल की है वो बोरवेल में गिर गई है। तुरंत हमारी रेस्क्यू टीम यहां पहुंची। हमने कैमरे से देखा कि बोरवेल करीब 45 फीट गहरा है। बच्ची को सांस देने के लिए ऑक्सीजन दिया जा… https://t.co/4fF7YMHnzO pic.twitter.com/CjQ6J1jTdQ— ANI_HindiNews (@AHindinews) June 14, 2024 -
చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే కన్నుమూత
భారతదేశానికి చెందిన చంద్రయాన్-1 మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ హెగ్డే శుక్రవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ హెగ్డే మూడు దశాబ్దాలకు పైగా (1978 నుండి 2014) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేశారు.ఈ సమయంలో అంతరిక్ష సంస్థ నిర్వహించిన అనేక చారిత్రాత్మక మిషన్లలో కీలక పాత్ర పోషించారు. వాటిలో ముఖ్యమైనది 2008లో చేపట్టిన చంద్రయాన్-1. ఇది చంద్రునిపై నీటి అణువులను గుర్తించింది. శ్రీనివాస్ హెగ్డే పదవీ విరమణ అనంతరం బెంగళూరుకు చెందిన స్టార్టప్ టీమ్ ఇండస్లో చేరారు. -
భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
చిన్నపాటి నిప్పు పెను ప్రమాదానికి దారితీస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లాంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. ఒక్కోసారి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఘజియాబాద్లో ఇలాంటి ఉదంతమే జరిగగా, ఐదుగురు సజీవ దహనమయ్యారు.ఢిల్లీకి ఆనుకుని ఉన్న యూపీలోని ఘజియాబాద్ పరిధిలోని ఓ గ్రామంలో మూడంతస్తుల ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఇంట్లో ఫోమ్ తయారీ పనులు జరుగుతుంటాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక శాఖకు చెందిన పలు వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాయి. అయితే అంతకుముందే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులంతా మంటల్లో చిక్కుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెహతా హాజీపూర్ గ్రామంలో ఇష్తియాక్ అలీకి మూడు అంతస్తుల ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఈ ఇంట్లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అనంతరం వారు ఇంటిలోనికి ప్రవేశించిగా అక్కడ వారికి ఐదు మృతదేహాలు కనిపించాయి. మృతులలో ఫర్హీన్ (28), షీష్ (7 నెలలు), నజారా (30), సైఫుర్ రెహ్మాన్ (35), ఇఫ్రా (8)లు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బాధితులు టెర్రస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని, అయితే అది సాధ్యం కాలేదని స్థానికులు చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురు యూట్యూబర్ల దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో కారులో కూర్చున్న నలుగురు యూ ట్యూబర్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్దారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన హసన్పూర్ గజ్రౌలా రోడ్డుపై చోటుచేసుకుంది. గాయపడివారికి చికిత్స అందించేందుకు పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.ఈ యూట్యూబర్లు ‘రౌండ్ టు వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్నారు. హసన్పూర్ గజ్రౌలా రోడ్డులోని మనోటా బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ కారులోని వారంతా అమ్రోహాలోని హసన్పూర్లో విందు ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులను లక్కీ, సల్మాన్, షారుక్, షెహ్నవాజ్గా పోలీసులు గుర్తించారు. వీరంతా కామెడీ వీడియోలను రూపొందిస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. -
హమాస్ స్థావరంపై ఇజ్రాయెల్ దాడి.. 39 మంది మృతి!
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తాజాగా గాజా స్ట్రిప్లోని ఒక పాఠశాలలోగల హమాస్ స్థావరం లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 39 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని సమాచారం.హమాస్కు చెందిన అల్-అక్సా టెలివిజన్ ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడిలో 39 మంది మృతి చెందారని తెలిపింది. అయితే పాలస్తీనియన్ న్యూస్ ఏజెన్సీ ఇజ్రాయెల్ దాడుల్లో 32 మంది మృతి చెందారని పేర్కొంది. పాలస్తీనియన్లకు సహాయం అందించే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ నిర్వహిస్తున్న పాఠశాలపై తమ యుద్ధ విమానాలు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘హమాస్’, ‘ఇస్లామిక్ జిహాద్’ సంస్థలు తమ కార్యకలాపాలకు ఈ పాఠశాలను స్థావరంగా ఉపయోగించుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను చూపలేదు. -
ట్రెక్కింగ్కు వెళ్లి నలుగురు మృతి..?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో ట్రెక్కింగ్(పర్వతారోహణ)కు వెళ్లిన 22 మంది సభ్యుల టీమ్లో నలుగురు గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల వారు దారితప్పి మిస్సయినట్లు తెలుస్తోంది. వీరంతా సహస్రతాల్ ప్రాంతంలో మే29న ట్రెక్కింగ్ ప్రారంభించారు. వీరంతా సాహస యాత్ర ముగించుకుని జూన్7న తిరిగి రావాల్సి ఉంది. అయితే యాత్ర మధ్యలోనే నలుగురు దారితప్పి కనిపించకుండా పోవడంతో మిగిలిన వారిని వెనక్కి తీసుకురావాల్సిందిగా ట్రెక్రింగ్ ఏజెన్సీ ఎస్డీఆర్ఎఫ్ను కోరింది. 4100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతాల్ ప్రాంతంలో మొత్తం ఏడు సరస్సులుంటాయి. ఇక్కడి నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. -
ఒడిశాలో వడగాడ్పుల విలయం.. 99 మంది మృతి!
దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. వడగాలుల తీవ్రతకు ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఉష్ణోగ్రత రానురాను రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. విపరీతమైన ఎండల కారణంగా పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్నారు.ఒడిశాలో ఎండల ప్రభావం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇది పలువురి ప్రాణాలను బలిగొంటోంది. ఒడిశాలో గత 72 గంటల్లో 99 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ 99 మరణాల్లో 20 కేసులను జిల్లా మేజిస్ట్రేట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ మాట్లాడుతూ వడదెబ్బ కారణంగా ఇప్పటివరకూ రాష్ట్రంలో 141 మంది మృతి చెందినట్లు వివిధ జిల్లాల మెజిస్ట్రేట్లలో నమోదయ్యిందన్నారు. During the last 72 hours, 99 alleged sun stroke death cases have been reported by the Collectors. Out of 99 alleged cases, 20 cases have been confirmed by the Collectors. During this summer, total 141 alleged sun stroke death cases have been reported by the Collectors out of… pic.twitter.com/bWXsiaFA3F— ANI (@ANI) June 3, 2024 -
‘ముందు ఓటు.. తర్వాతే తల్లి అంత్యక్రియలు’
దేశంలో లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్లోని జెహనాబాద్ లోక్సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.జెహనాబాద్లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్ యాదవ్, మనోజ్ యాదవ్ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి
ఉత్తరప్రదేశ్లో వడదెబ్బకు 15 మంది పోలింగ్ సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం నాడు ఏర్పడిన అత్యధిక ఉష్ణోగ్రతలకు తాళలేక జనం విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన 15 మంది పోలింగ్ సిబ్బంది కన్నుమూశారు. ఈ వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు. యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో 13 మంది ఎన్నికల సిబ్బంది ఎండి వేడిమి కారణంగా తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 23 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోన్భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ స్థానాలకు ఈరోజు (శనివారం) పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటర్లు ఎండవేడిమికి గురికాకుండా ఉండేందుకు పలు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పారామెడికల్ సిబ్బందిని, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బంది తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని, వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని అధికారుల సూచించారు. -
భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ
దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్కుమార్గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బీఎస్ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్ను రామ్గఢ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్గఢ్ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్గఢ్ నుండి జోధ్పూర్కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్పూర్ నుంచి పశ్చిమ బెంగాల్లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు
దేశాన్ని అగ్ని ప్రమాదాలు వణిస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్లో ఒక గేమింగ్ జోన్లో అగ్ని ప్రమాదం సంభవించి, 27 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే ఢిల్లీలోని వివేక్ విహార్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి, ఆరుగురు శివువులు సజీవ దహనమయ్యాయి. ప్రతీ ఏటా వేసవిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దేశాన్ని వణికించిన కొన్ని అగ్ని ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుంది.1. డిసెంబర్ 1995 (హర్యానా, మండి దబ్వాలి)భారతదేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది. హర్యానాలోని మండీ దబ్వాలిలో జనరేటర్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ నేపధ్యంలో జరిగిన తొక్కిసలాటలో 540 మంది మృత్యువాత పడ్డారు.2. ఫిబ్రవరి 1997(ఒడిశా, బరిపడ) మతపరమైన ఆచారాలు నిర్వహిస్తున్న సందర్భంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 206 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 148 మంది తీవ్రంగా గాయపడ్డారు.3. జూన్ 1997 (న్యూఢిల్లీ) గ్రీన్ పార్క్లోని ఉపహార్ సినిమా థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది మరణించారు. సినిమా చూస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 103 సజీవ దహనమయ్యారు.4. జూన్ 2002 (ఆగ్రా) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోని శ్రీలీ ఇంటర్నేషనల్ ఫుట్వేర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 42 మంది మృత్యువాత పడ్డారు.5. జూలై 2004(తంజావూరు, తమిళనాడు)తంజావూరు జిల్లా కుంభకోణంలోని ఓ పాఠశాలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 94 మంది అమాయక చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ఘటన తమిళనాడు చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా పరిగణిస్తారు.6. సెప్టెంబర్, 2005(ఖుస్రోపూర్, బీహార్) బీహార్లోని ఖుస్రోపూర్ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది చనిపోయారు. దీంతో పాటు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.7. ఏప్రిల్, 2006(మీరట్) ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని విక్టోరియా పార్క్లో బ్రాండ్ ఇండియా ఫెయిర్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 100 మంది మృత్యువాత పడ్డారు.8. డిసెంబర్, 2011(కోల్కతా) కోల్కతాలోని ఏఎమ్ఆర్ఐ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం కారణంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు వ్యాపించి 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి చుట్టూ మృతదేహాలు కుప్పలు కనిపించాయి.9. సెప్టెంబర్, 2012(శివకాశి, తమిళనాడు) ముదలిపట్టిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది ప్రాణాలు కోల్పోగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.10. మే, 2022 (న్యూఢిల్లీ)పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 30 మందికి పైగా జనం మరణించారు. -
పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్, షోపియాన్లలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ అజాజ్ అహ్మద్ షేక్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఉదంతం షోపియాన్లోని హీర్పోరాలో చోటుచేసుకుంది. #WATCH | Anantnag, J&K: Terrorists fired upon and injured a lady Farha, resident of Jaipur and spouse of Tabrez at Yannar. Injured evacuated to hospital for treatment.(Video source: Local) https://t.co/7UUq9YXR8Y pic.twitter.com/im1NZ2hSEm— ANI (@ANI) May 18, 2024 జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అజాజ్ అహ్మద్ షేక్ ఇటీవలే బీజేపీలో చేరారు. అతనిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటన అనంత్నాగ్లో చోటుచేసుకుంది. ఇక్కడి యన్నార్ ప్రాంతంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఫర్హా అనే మహిళ, ఆమె భర్త తబ్రేజ్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలు జరిగిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఈ రెండు ఉగ్రవాద దాడులపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ట్విట్టర్లో తన స్పందనను తెలిపారు. ‘ఈరోజు పహల్గామ్లో ఇద్దరు పర్యాటకులు గాయపడిన ఘటనను, షోపియాన్లోని హీర్పోరాలో సర్పంచ్పై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే అంశం. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.Terrorist fired upon a person Aijaz Ahmad at Heerpora, Shopian. Injured evacuated. Area cordoned off. Further details to follow: Kashmir Zone Police pic.twitter.com/Y31BJouz0J— ANI (@ANI) May 18, 2024 -
ఆ డ్రగ్తో ఎదుటివాళ్ల మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చట!
మత్తుమందులకు బానిసై రోజంతో మత్తులో జోగుతుండే వ్యక్తులు గురించి విన్నాం. వారిని ఆ వ్యసనం నుంచి బయపడేసేందుకు నానాయాతన పడుతుంటారు సంబంధికులు. అందుకోసం డీ అడిక్షన్ సెంటర్లు కూడా వచ్చేశాయి. అయితే ఈ మత్తు మందులన్నీ వాళ్లంతటా వాళ్లు వొళ్లు తెలియకుండా ఊహ ప్రపంచంలో విహరించేందుకు వాడుతుంటారు కానీ ఈ కొత్త రకం డ్రగ్ మాత్రం ఏకంగా అవతలి వాళ్ల మైండ్ని కంట్రోల్ చేస్తుందట. కొందరూ దుండగలు ఈ డ్రగ్తో అమాయక ప్రజలను దోచుకోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇంతకీ ఏంటి కొత్త రకం డ్రగ్. ఎలా అవతల వాళ్ల మైండ్ని కంట్రోల్ చేయగలరు?ఈ డ్రగ్ పేరు స్కోపోలమైన అనే సింథటిక్ డ్రగ్. దీన్ని ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. వికారం, నిలకడలేనితనం, కొన్ని ఆపరేషన్ల తర్వాత రోగులకు ఇచ్చే ఔషధాల్లోనూ దీన్ని కలుపుతారు. అయితే ఇది సహజంగా లభించేది కాదు. కొన్ని సహజ పదార్ధాలకు మరి కొన్ని రసాయనాలు కలపడం ద్వారా స్కోపోలమైన్ను కృత్రిమంగా తయారు చేస్తారు. ఘన, ద్రవ రూపాల్లో లభిస్తుంది. దీన్ని ఉమ్మెత్త పువ్వు నుంచి తయారు చేస్తారు. ఒకప్పుడు పిచ్చొళ్లను చేసేందుకు..ఒకప్పుడు దేశంలో, ప్రజల్నిపిచ్చోళ్లను చేసేందుకు ఉమ్మెత్త పువ్వుల్ని నూరి పాలలో కలిపేవారు. అందులో నుంచి కొంత భాగాన్ని తీసి దాన్ని ఉపయోగించి స్కోపోలమైన్ సింథటిక్ డ్రగ్గా తయారు చేస్తున్నారు. మెక్సికోలోని డ్రగ్ గ్యాంగులు దీన్నితయారు చేసి ప్రపంచం అంతటా సరఫరా చేసినట్లు నార్కోటిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చీఫ్ కెమికల్ ఎగ్జామినర్ డాక్టర్ దులాల్ కృష్ణ సాహా వెల్లడించారు.ఎలా పని చేస్తుందంటే..రెండో ప్రపంచ యుద్ధంలో స్కోపోలమైన్ డ్రగ్ ఉపయోగించినట్లు ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం. ఆ సమయంలో దీన్ని ద్రవ రూపంలో ఇంజక్షన్గా ఇచ్చేవారు. స్కోపోలమైన్ను ఇప్పటికీ ఔషధంగా ఉపయోగిస్తున్నామని బంగబంధు షేక్ ముజిబ్ మెడికల్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ సౌదుర్ రహమాన్ చెప్పారు. దీంతో పాటు మరి కొన్ని డ్రగ్స్ వైద్యశాస్త్రంలో ఉపయోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నిఘా వర్గాలు ఈ స్కోపోలమైన్ను ఉపయోగించి ప్రత్యర్థుల నుంచి నిజాలను రాబట్టేవారు. ఈ డ్రగ్ను ప్రయోగించిన తర్వాత శత్రువులు తమ మెదడు మీద నియంత్రణ కోల్పోయి ఎదుటి వ్యక్తులు చెప్పినట్లు చేసేవారు. ఎవరితోనైనా నిజాలు మాట్లాడించడానికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పౌడర్ను వాసన పీల్చేలా చేస్తే అది సైతాన్ శ్వాసగా మారుతుంది. అలాగే దీన్ని వికారం, ఇతర అనారోగ్యాలకు ఉపయోగిస్తే ఔషధం లాగా పని చేస్తుందని రహమాన్ వివరించారు.నేరాలలో ఎక్కువగామోసాలు, కిడ్నాపులు, ఇతర నేరాల కోసం స్కోపోలమైన్ను పౌడర్ రూపంలో ఉపయోగిస్తున్నారు. ఈ పౌడర్ను విజిటింగ్ కార్డు, క్లాత్, మొబైల్ స్క్రీన్ల ద్వారా ఇతరుల మీద ప్రయోగించడం చాలా తేలిక. ఈ పౌడర్ను ప్రయోగించాలనుకున్న వ్యక్తి మీద, అతడు శ్వాస తీసుకునే సమయంలో ముక్కుకు నాలుగు నుంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచి ప్రయోగించినా.. అది బాధితుడి ముక్కులోకి చేరుతుంది. దీన్ని నోటి ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ముక్కు ద్వారా ప్రయోగించాలని భావిస్తే నాలుగు అంగుళాల దూరంగా ఉండటం ముఖ్యం అని డాక్టర్ దులాల్ కృష్ణ సాహా చెప్పారు. ఇక్కడ ఈ డ్రగ్ని పీల్చిన పది నిముషాల నుంచి సదరు వ్యక్తి మీద ప్రభావం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికి మెదడు నియంత్రణ కోల్పోతుంది. మళ్లీ మాములు కావడానికి గంట నుంచి మూడు గంటలు పడుతుంది.(చదవండి: ఓటర్లకు స్ఫూర్తి ఆ వృద్ధ మహిళలు..! ఆ ఏజ్లోనూ..) -
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు. -
AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
సాక్షి, విశాఖపట్నం/నెట్వర్క్: ద్రోణి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక చోట్ల పిడుగులు పడగా.. ఏడుగురు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రాజమహేంద్రవరంలో కుండపోత వర్షానికి వీధులు జలమయమయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో 12.4 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. మండపేట (కోనసీమ)లో 12, రాజమహేంద్రవరం 9.2, నూజివీడు (ఏలూరు) 7.3, మచిలీపట్నం (కృష్ణా) 7.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 45 చోట్ల 2 నుంచి 6 సెం.మీ. వర్షపాతం రికార్డయింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం సుమారు గంటసేపు ఈదురుగాలులు, ఉరుములతోపాటు మోస్తరు వర్షం కురిసింది. నందిగామ పాత బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై దాదాపు అడుగుమేర నీరు నిలిచింది.పిడుగుపాటుకు గురై.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామానికి చెందిన కవల నాగేశ్వరరావు (55), ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో పర్సా రామారావు (44), ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారిగూడెం ఎర్రకాలువ ప్రాంతంలో కరిపోతుల నాగేశ్వరరావు (72), పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరులో మొక్కజొన్న కోతలకు వెళ్లిన తల్లీకూతుళ్లు బొందెల నాగేంద్రమ్మ (53), నాగరాణి(33), పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెంకు చెందిన ఆవుల కోటేశ్వరరావు (42), అతని మేనల్లుడు జమ్ముల గోపి(35) మరణించారు. పశ్చిమ గోదావరిజిల్లా శృంగవృక్షంలోని వట్టూరి వారి వీధిలో మంగళవారం వీచిన ఈదురుగాలులకు కొబ్బరి చెట్టు కూలి నిమ్మల శ్రీనివాస్ (49) అనే వ్యవసాయ కూలీ మృత్యువాతపడ్డాడు.తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలుద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే 2–5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. లద్దగిరి (కర్నూలు)లో 43.3, ఎండ్రపల్లి (ప్రకాశం) 43.2, మద్దూరు (వైఎస్సార్), మంగ నెల్లూరు (తిరుపతి)లో 42.9 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో మూడు రోజులు వానలే..అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో అల్లాడుతున్న రాష్ట్రానికి మంగళవారం ఉపశమనం లభించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బుధవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో జల్లులకు ఆస్కారం ఉందని వివరించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని పేర్కొంది. -
ఒబెసిటీ ఇంత ప్రమాదకరమైనదా? పాపం ఆ వ్యక్తి..!
ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ఒబెసిటీ. ప్రస్తుతం ఉన్న అస్తవ్యస్తమైన జీవన విధానం, కల్తీ ఫుడ్ల కారణంగా టీనేజీ యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తోంది. కనీసం పెళ్లీడు రాకమునుపే పెద్దవాళ్లలా కనిపించేంత భారీకాయంతో సతమతమవ్వుతున్నారు. అచ్చం అలాంటి సమస్యతోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి మరణించాడు. జస్ట్ 33 ఏళ్లకే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఒబెసిటీ ఇంత ప్రమాకమైనదే? లావుగా ఉంటే అంతే సంగతులా..!లావుగా ఉంటే లైఫ్ లాసే అని ఈ వ్యక్తిని చూస్తే అనిపిస్తుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూకేలో చోటు చేసుకుంది. బ్రిటన్ నివాసి జాసన్ హోల్డన్ యూకేలోనే అత్యంత లావుగా ఉండే వ్యక్తి. అతడి బరువు ఏకంగా 317 కిలోలు. అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకోవాలట. ఇక అతడు పడుకోవాలన్నా.. ప్రత్యేకంగా రూపొందించిన ఫర్నిచర్పై బెడ్పై నిద్రిస్తాడు. అతడికి అతిగా తినే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఎంతలా ఉందంటే రోజువారీగా ఏకంగా పదివేలకు పైగా కేలరీలు తీసుకునేంత స్థాయిలో ఉంది. అతడి బ్రేక్ఫాస్ట్లో డోనార్ కబాబ్లు తీసుకుంటాడంటే..అతడు ఎంతలా తింటాడో చెప్పాల్సిన పనిలేదు. దీని కారణంగానే ఆరోగ్యం క్షీణించటం మొదలయ్యింది. దీంతో అతను కొన్నాళ్లుగా గదికే పరితం కాగా, క్రమేణ మంచానికే పరిమతమయ్యాడు. ఆ తర్వాత చలనశీలత దెబ్బతింది. మొదట అతడి శరీరంలో కిడ్నీ పనిచేయడం మానేసింది. అలా నెమ్మదిగా మిగతా అవయవాలు వైఫల్యం చెందడం ప్రారంభించడంతో 34వ ఏటాలోకి అడుగుపెట్టడానికి కొన్ని రోజుల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు గతేడాది ఒక ఇంటర్వ్యూలో తన సమయం అయిపోయిందని, తాను ఎన్నాళ్లో బతకనని చెప్పేశాడు కూడా. పైగా అలా కాకుండా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి 2020లో ప్రమాదవశాత్తు హోల్టన్ మూడవ అంతస్తు నుంచి పడిపోయాడు. పాపం అతడిని రక్షించటానికి ఏకంగా 30 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, క్రేన్ రంగంలోకి దిగి కాపాడారు. ఆ ఘటనను తలచుకుంటూ అది తన జీవితంలో అత్యంత బాధకరమైన ఘటనగా పేర్కొన్నాడు హోల్డన్. ఆ టైంలో తనను చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి చాలా బాధపడడ్డానని అన్నాడు. హోల్డన్ మానసిక స్థితి ఎంతలా మారిపోయిందంటే.. లావుగా ఉండే వ్యక్తులను ఆధారం చేసుకుని తీసిన సినిమాలు సైతం అతడికి భయానక చిత్రాలుగా అనిపించాయి. కనీసం తన అమ్మను కూడా చూడొద్దని కన్నీటి పర్యంతమయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ అధిక బరువు కారణంగా ఎంతగా ఇబ్బంది పడ్డానేది నేరుగానే తెలుస్తోంది. అతను తరుచుగా ఈ బ్రిటన్ దేశంలో తానే అత్యంత లావుగా ఉన్నవ్యక్తిని అని బాధపడేవాడు. అతడి పోస్ట్మార్టం రిపోర్టులో కూడా అధిక బరువు కారణంగా అవయవాల వైఫల్యం చెంది మరణించినట్లు ఉంది. హోల్టన్ ఈ అధిక బరువు కారణంగా స్ట్రోక్లు, రక్త గడ్డకట్టడం వంటి పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అధిక బరువు అనేది ప్రాణాంతకమైన సమస్యే. నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్యకరమైన పద్ధతిలో తగ్గించుకునే యత్నం చేయకపోతే అంతే సంగతులని ఈ ఉదంతమే చెబుతోంది. అందువల్ల కొద్దిపాటి శారీరక శ్రమ, క్యాలరీల తక్కువ ఉన్న ప్రత్యామ్నాయ ఆహారంతో బరువుని అదుపులో ఉంచుకునే యత్నం చేయండి. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించండి.(చదవండి: సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?) -
US: వరుస విద్యార్థుల మరణాలు..ఎఫ్ఐఐడీఎస్ సీరియస్!
గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 మంది విద్యార్థులు వేర్వేరు పరిస్థితిల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా యావత్ భారత్ తీవ్ర భయాదోళనలు వ్యక్తం చేసింది. నిజానికి మన దేశం నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకై అమెరికా వైపుకే మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు ఆ దేశం సురక్షితమేనే అనే సందేహాలు అందరిలోనూ మెదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా మరణాలపై దర్యాప్తు చేస్తున్న ప్రవాస భారతీయులకు సంబంధించిన ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్) చాలా షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ ఘటనలు పునారావృత్తం కాకుండా యూఎస్ అధికారులు, విశ్వవిద్యాలయాలు సంస్థలు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేగాదు అమెరికాలో ఉండే భద్రతపై పరిజ్ఞానం లేకపోవడం వల్ల పర్యావరణ మరణాలు(మోనాక్సైడ్ విషప్రయోగం, అల్పోష్ణస్థితి), ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరిపించే మానసిక సమస్యలు వల్ల అనుమానాస్పద మరణాలు, హింసాత్మక నేరాలు జరిగినట్లు సర్వేలో వెల్లడించింది. ఆయా కారణాల వల్ల బాధిత విద్యార్థులు మరణాలకు కారణమని ఎఫ్ఐఐడీఎస్ సర్వేలో తేలింది. యూఎస్లో విద్య అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల అని పేర్కొంది. ఈ భయానక ఘటనలు ఒక్కసారిగా భారత సంతతి విద్యార్థులు, వారి కుటంబాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయని వెల్లడించింది. ప్రస్తుతం యూఎస్లో దాదాపుగా రెండు లక్షలకు పైగా భారత సంతతి విద్యార్థులు ఉన్నట్లు పేర్కొంది. మొత్తం విదేశీ విద్యార్థులలలో సుమారు 25% మంది విద్యార్థుల నుంచి ఫీజులు, ఖర్చులు రూపంలో అమెరికా దాదాపు రూ. 900 కోట్లు వరకు ఆర్జిస్తోందని ఎఫ్ఐఐడీఎస్ చీఫ్ ఖండేరావ్ కాండే అన్నారు. ఈ మరణాలు పెరిగినట్లయితే ఆ ఆదాయానికి గండి పడే అకాశాలు ఉండటమే గాక యూఎస్ విశ్వవిద్యాలయాల భద్రతపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అయ్యే ప్రమాదం లేకపోలేదని ఎఫ్ఐఐడీఎస్ హెచ్చరించింది. అంతేగాదు దీన్నే అదనుగా చూసుకుని కొందరూ అమెరికా సమాజంపై ద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోసి భారతీయ అమెరికా కమ్యూనిటీ చుట్టూ పుకార్లు వ్యాపించేలా చేస్తున్నట్లు ఎఫ్ఐఐడీఎస్ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఐడీఎస్ భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆందోళనలు, భద్రతకు సంబంధించిన సర్వేను ప్రారంభించింది. ఆసక్తిగల భారత సంతతి విద్యార్థులు ఈ ఎప్ఐఐడీఎస్ వెబ్సైట్లోని సర్వేలో పాల్గొని తామ ఎదుర్కొంటున్న భయాందోళనలు గురించి వెల్లడించాలని పిలుపునిచ్చింది.అంతేగాదు అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న భద్రత, శ్రేయస్సుకి సంబంధించిన ఆందోళనలు పరిష్కరించేలా యూఎస్ అధికారులు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరింది ఎఫ్ఐఐడీఎస్ ►సురక్షిత విద్యను పెంపొందించడం: చాలామంది విదేశీ విద్యార్థులుకు తాము ఉన్న నిర్థిష్ట ప్రాంతాల్లో జరిగే నేరాలు, ప్రమాదాల పట్ల అవగాహన ఉండకపోడచ్చు . అందువల్ల విద్యాపరంగా సురక్షితంగా ఉండే ప్రాంతాల్లో ఉండేలా నిర్ణయాలు తీసుకునేలా సమాచారం అందించడం లేదా శక్తిమంతంగా ఎలా ఎదుర్కొవాలే అవగాహన కల్పించడం వంటివి చేయాలి. ►రెస్క్యూ విధానాలు మెరుగుపరచడం: అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రమాదంలో ఉన్న విద్యార్థుల భద్రత లేదా వారి క్షేమం నిర్థారించేలా తక్షణ ప్రతిస్పందన, సమర్థవంతమైన రెస్క్యూ విధానాలు చాలా ముఖ్యమైనవి. దీని వల్ల అంతర్జాతీయ విద్యార్థుల ప్రమాదాలను నియంత్రించగలుగుతాం. తద్వార విద్యారుల జీవితాలను కాపాడగలం కూడా. ►ర్యాగింగ్కి అడ్డుకట్టవేయడం: ర్యాగింగ్ వంటివి విద్యార్థుల శారీరీక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. అటువంటి వాటికి వ్యతిరేకంగా కఠిన నియమాలు, నిబంధనల అమలు చేయడం వల్ల ఎలాంటి నేర పూరిత సంఘటనలు ఎదురవ్వకుండా నియంత్రించగలుగుతాం. తద్వారా విదేశీ విద్యార్థులకు సమగ్రమైన క్యాంపస్ వాతావరణాన్ని అందించగలుగుతాం. ►ప్రమాదాలు భద్రతపై అవగాహన: విదేశీ విద్యార్థుకు కొత్త ప్రదేశాల్లోని క్యాంపస్ లోపల, వెలుపల ఎదురయ్యే ప్రమాదాలు, నష్టాలు గురించి అవగాహన కల్పించాలి. అక్కడ తమ తోటి విద్యార్థుల వల్ల ఎదురయ్యే ప్రమాదాలు గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారికి అవగాహన కల్పించాలి. ►మానసిక ధైర్యం అందిచటం: విదేశీ విద్యార్థులు తమ వాళ్లను దేశాన్ని అన్నింటిని వదిలేసి ఇంత దూరం చాలా ప్రయాస పడి వస్తారు. వారికి ఇక్కడ ముందుగా ఎదరయ్యేది ఒంటిరితనం. ఇది వారిలో కలగుకుండా ఉండేలా మానసిక స్థైర్యాన్ని అందించేలా తోడ్పాటు అందించటం వల్ల కూడా అనుమానస్పద మరణాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. చివరిగా జాతి లేదా మతం ఆధారంగా భారత సంతతి విద్యార్థుల పట్ల ద్వేషపూరిత నేరాలు లేదా కుట్రలు జరుగుతున్నాయా అనేదానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం. సత్వరమే వారికి న్యాయం అందేలా చేయడం. ముఖ్యంగా మైనారిటి వర్గాలపై జరిగిన వివక్ష లేదా హింస గురించి పూర్తి స్థాయిలో విచారించడం ముఖ్యం. ఈ చర్యలన్ని తీసుకుంటే తమ సొంత గడ్డను వదిలి ఎందో ప్రయాస పడి ఇంత దూరం వచ్చిని విదేశీ విద్యార్థులుకు సురక్షితమైన వాతావరణాన్ని, ధైర్యంగా విశ్వవిద్యాలయంలో చేరి మంచి చదువును పొందగలమనే భరోసాను వారికి అందించగలుగుతామని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. (చదవండి: కెనడాలో భారతీయ విద్యార్థి మృతి) -
చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..
చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు. మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం. చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు. (చదవండి: కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!) -
విషాదం: ప్రాణం తీసిన బర్త్ డే కేక్?
ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(63) గురువారం గుండెపోటుకు గురై బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందారు. అంతకుముందు, రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీ ఆరోగ్యం విషమించడంతో అధికారులు బందా జిల్లా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం చికిత్సలు చేస్తుండగానే ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ పీటీఐకి తెలిపారు. దీంతో, ఉన్నతాధికారులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పొట్టలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంగళవారం కూడా ఆస్పత్రిలో 14 గంటలపాటు ఉంచినట్లు అధికారులు చెప్పారు. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఇతడి సోద రుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. 5సార్లు ఎమ్మెల్యే.. 60కిపైగా కేసులు మౌ సదర్ స్థానం నుంచి రెండుసార్లు బీఎస్పీ తరఫున, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సొంతపార్టీ క్వామీ ఏక్తా దళ్ తరఫున మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ ఆరోపణలపై యూపీ, పంజాబ్ జైళ్లలో 2005 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. యూపీలోని వివిధ కోర్టులో 2022 నుంచి ఇతడిపై ఉన్న 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం బందా జైలులో ఉన్నారు. -
భవనం కూలి ఇద్దరు మృతి.. మరొకని పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలోని కబీర్ నగర్లో బుధవారం అర్ధరాత్రి 2:16 గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న పాత భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన భవనంలో మొదటి అంతస్తులో ఎవరూ నివసించడంలేదు. గ్రౌండ్ ఫ్లోర్లో జీన్స్ కటింగ్ పనులు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. వీరిలోని ఇద్దరు జీటీబీ ఆసుపత్రిలో మృతి చెందారు. ఒక కూలీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. భవనం యజమాని షాహిద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. షాహిద్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo — ANI (@ANI) March 21, 2024 -
వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం ఇదే..
వనపర్తి: పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి పిల్లలు, పెద్దలందరితో ఇంటి నుంచి బయల్దేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా కొత్తకోట శివారులో చోటుచేసుకుంది. అతివేగం, కునికి పాటు ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. కారు డ్రైవింగ్ చేసిన పెళ్లి కుమారుడు ఖాజాకుత్బుద్దీన్ మాట్లాడుతూ బళ్లారిలోని బసవన్నకుంట నుంచి బయల్దేరిన తాము కర్నూలు పట్టణం దాటిన తర్వాత అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఒక హోటల్ వద్ద కుటుంబ సభ్యులంతా భోజనం చేశామని చెప్పారు. అప్పుడే రైలులో వెళ్తున్న వారు కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారు.. నిద్ర వస్తే.. హైవేపై ఉన్న పెట్రోల్ పంపులో ఆగి కొద్దిసేపు నిద్రించి తెల్లవారుజామున బయల్దేరాలని సూచన చేశారు. కానీ, ఆలస్యం అవుతుందని భావించి భోజనం తర్వాత మళ్లీ బయల్దేరామని, కునికిపాటు రావడంతో కారు పక్కకు వెళ్లినట్లు గుర్తించలేదని, ఒక్కసారిగా భారీ శబ్దంతో కారు చెట్టును ఢీకొట్టడం, కారులోని అందరం చెల్లాచెదురుగా పడిపోవడంతో మేలుకువ వచ్చిందని వాపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినవనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి ఇది మూడో ఘటన.. 2009లో అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే మిత్రులు ప్రమాణ స్వీకారం చూడాలనే ఉద్దేశంతో మారుతీ వ్యాన్లో హైదరాబాద్కు వెళ్తుండగా.. తెల్లవారుజామున వాహనం అదుపు తప్పడంతో చోటుచేసుకున్న సంఘటనలో నలుగురు మృతి చెందారు. ● 2020లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళ్తుండగా క్లూజర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కల్వర్టును ఢీకొట్టడంతో ప్రమాదంతో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంఘటనా స్థలంలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. ● తాజాగా ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. జాగ్రత్తలు పాటించాలి అర్ధరాత్రి ప్రయాణాల విషయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని వనపర్తి ఎస్పీ రక్షితా కె.మూర్తి అన్నారు. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేసే అనుభవం లేనివారు వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రించడం, అతివేగంగా కారు నడపడమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధురాలు.. ఏడు నెలల పసికందు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురిలో 95 ఏళ్ల సలీమాబీ, 7 నెలల పసికందు వాసీఫారిఫత్ అనే చిన్నారితోపాటు 39 ఏళ్ల అబ్దుల్ రహమన్, రెండేళ్ల రుమానా, నాలుగేళ్ల రోషిణి ఉన్నారు. మరో ఆరేళ్ల చిన్నారి సుమేర ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం గమనార్హం. -
అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!
భూమ్మీద పుట్టిన జీవరాశుల్లో అనేక జీవులు అంతరించిపోయాయి. ఇప్పటికే అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించడం సాధ్యంకాదనే ఇంతవరకు అనుకుంటూ వచ్చారు. అయితే, అది సాధ్యమేనని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు నడుంబిగించారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ పక్షులను తిరిగి పుట్టించడానికి అమెరికన్ బయోసైన్సెస్–జెనెటిక్ ఇంజినీరింగ్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ప్రారంభించారు. డోడో పక్షులు భారీగా ఉండేవి. ఇవి ఎగరగలిగేవి కాదు. ఒకప్పుడు మారిషస్లో విరివిగా తిరిగేవి. ఈ జాతిలోని చివరి పక్షి 1681లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పక్షులకు చెందిన పురాతన డీఎన్ఏ నమూనాలను సేకరించామని, వాటి ఆధారంగా మారిషన్ వైల్డ్లైఫ్ ఫౌండేషన్ సహకారంతో డోడో పక్షులకు పునర్జీవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలోసల్ బయోసైన్సెస్ వ్యవస్థాపకుడు బెన్ లామ్ వెల్లడించారు. డోడో తరహాలోనే ఇప్పటికే అంతరించిన గులాబి పావురానికి కూడా పునర్జీవం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇవి చదవండి: ‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది! -
అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్నాథ్ ఘోష్ అమెరికాలో జరిగిన కాల్పులకు బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు. అమర్నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు. అమర్నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘మంగళవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం, మిస్సోరిలోని సెయింట్ లూయిస్లో నా స్నేహితుడు అమర్నాథ్ ఘోష్ హత్యకు గురయ్యారు. అమర్నాథ్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి మూడేళ్ల క్రితం కన్నుమూశారు. అమర్నాథ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. అమర్నాథ్ కోల్కతాకు చెందినవారు. పీహెచ్డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్నాథ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు. My friend #Amarnathghosh was shot & killed in St louis academy neigbourhood, US on tuesday evening. Only child in the family, mother died 3 years back. Father passed away during his childhood. Well the reason , accused details everything are not revealed yet or perhaps no one… — Devoleena Bhattacharjee (@Devoleena_23) March 1, 2024 అమర్నాథ్ హత్యకు చికాగోలోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. కాగా ఇటీవలి కాలంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, భారత సంతతికి చెందిన పలువురు హత్యకు గురయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా దేవోలీనా భట్టాచార్జీ ట్వీట్కు పలవురు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. Deep condolences to family & friends of deceased Amarnath Ghosh in StLouis, Missouri. We are following up forensic, investigation with police & providing support. @IndianEmbassyUS @MEAIndia — India in Chicago (@IndiainChicago) March 1, 2024 -
ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. పాపులర్ 'బినాకా గీత్ మాలా' కార్యక్రమం వెనుక ఉండే వాయిస్ ఆయనేదే. ఈ కార్యక్రమం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆయనకు ప్రస్తుతం 90 ఏళ్ల వయసు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కుమారుడు రాజిల్ సయానీ తెలిపారు. రాత్రి ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు చెప్పారు. ఆయన రేడియోలో తనను తాను 'నమస్కార్ భాయి యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్' అనే డైలాగ్తో పరిచయం చేసుకునేవారు. ఇదే ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే గాక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన డిసెంబర్ 21, 1932న ముంబైలో సాహితివేత్తల కుటుంబంలో జన్మించారు. కాగా, ఆయన మృతి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ టెలివిజన్ రాజ్దీప్ సర్దేశాయి అమీన్ సయానీని ఉద్దేశించి ఓ లెజెండర్ గాత్రం మన నుంచి దూరమయ్యింది. ఆయన 'బినాకా గీత్ మాలా', బోర్న్ విటా క్విజ్ వంటి కార్యక్రమాల్లో తన గాత్రంతో ప్రేకక్షులకు అలరించారు. అంతేగాక 50 వేలకు పైగా రేడియో షోలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన గొప్ప వ్యక్తి కనుమరుగవ్వడం బాధకరమైన విషయమంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. More sad news: A legend.. the melodious voice of radio, of Binaca Geetmala.. of Bournvita Quiz contest on radio and so much more.. Behno aur Bhaiyo.. the genius that was Ameen Sayani with more than 50,000 radio shows is no more.. RIP, Om Shanti 🙏🙏 pic.twitter.com/ufMQ586u6M — Rajdeep Sardesai (@sardesairajdeep) February 21, 2024 (చదవండి: ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా? నటుడు రితురాజ్ మృతికి ఇదే కారణమా?) -
బైక్పై వెళ్తున్న యువకునికి గుండెపోటు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్పై పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇండోర్ పరిధిలోని ముసాఖేడీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన రాహుల్ రైక్వార్కు బైక్పై వెళుతుండగా గుండెపోటు వచ్చినట్లు ఆజాద్ నగర్ పోలీసులు తెలిపారు. రాహుల్ వయసు 26 ఏళ్లు. రాహుల్ తన తమ్మునితో కలిసి ఏదో పనిమీద బైక్మీద బయలు దేరాడు. బైక్పై వెనుక రాహుల్ కూర్చోగా, అతని తమ్ముడు బైక్ నడుపుతున్నాడు. దారిలో రాహుల్కు గుండె నొప్పి వచ్చింది. దీంతో బైక్పై నుంచి కింద పడిపోయాడు. దీనిని గమనించిన అతని తమ్ముడు చుట్టుపక్కలవారి సాయంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడు రాహుల్కు ఏడాదిన్నర కుమార్తె ఉంది. కాగా చిన్నవయసులో గుండెపోటుకు క్రమరహిత దినచర్య, అనారోగ్యకర ఆహారం, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. -
దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఈ ఘటనతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆమెకి కాలు విరగడంతో వాడిన మందులు సైడ్ ఇఫెక్ట్ ఇవ్వడంతో చనిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ కుటుంబల సభ్యులు అందువల్ల కాదంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆమె మరణానికి అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధే కారణమన్నారు. ఆ వ్యాధితోనే పోరాడుతూ చనిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఇంతకీ ఏంటా వ్యాధి. ఆ వ్యాధి వస్తే ఇక అంతేనా? అమీర్ ఖాన్ రెజ్లింగ్ మూవీ దంగల్లో యువ బబితా ఫోగట్గా నటించి మెప్పించిన సుహనీ భట్నాగర్ శనివారం ఢిల్లీలో మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ కలిచివేసింది. అయితే ఆమె కండరాల బలహీనతకు కారణమయ్యే అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధి అయిన డెర్మాటోమయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగానే ఆమెను ఫిబ్రవరి 7న ఎయిమ్స్కి తరలించినట్లు తెలిపారు. చివరికి ఆ వ్యాధి విషమించడంతో ఫిబ్రవరి 16న తుది శ్వాస విడించిందని అన్నారు. నిజానికి పదిరోజుల క్రితమే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్థారణ కాగా, రెండు నెలల క్రిత అందుకు సంబధించిన లక్షణాలు కనిపించినట్లు వెల్లడించారు. రెండు నెలల క్రితం సుహాని రెండు చేతులపై ఎర్రటి మచ్చలు వచ్చినట్లు తెలిపారు. అయితే తాము వివిధ ఆస్పత్రులు సంప్రదించాం. కానీ అది ఏం వ్యాధి అనేది నిర్ధారణ కాలేదని సుహాని తల్లి పూజ భట్నాగర్ కన్నీటిపర్యంతమయ్యారు. రోజురోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లో చేర్పించినట్లు చెప్పుకొచ్చారు పూజ. అలాగే ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని, పైగా ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి అదనపు ద్రవాలు ఊపిరితిత్తుల్లో చేరడంతో అవి కూడా దెబ్బతిన్నాయని సహాని తండ్రి సుమిత్ భట్నాగర్ చెప్పారు. దీంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిచారు కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదని ఆవేదనగా చెప్పుకొచ్చారు సుమిత్. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నవారు ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు సహాని తండ్రి. డెర్మాటోమియోసిటిస్ అంటే.. డెర్మాటోమియోసిటిస్ అనేది బంధన కణజాలం, కండరాలు, చర్మం అంతర్గత అవయవాల వాపుతో కూడిన పాథాలజీ. సకాలంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి రోజు రోజుకి తీవ్రతరమవుతుంది. ఈ డెర్మాటోమియోసిటిస్ అనేది ఆటో ఇమ్యూన్ పాథాలజీ. అంటే రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఆటంకాలు కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయిత, పాథాలజీ అభివృద్ధి విధానం.. శరీరం దాని స్వంత కణాలను విదేశీగా గ్రహించడం ప్రారంభిస్తుంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత కండరాలు బంధన కణజాలంపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత నెమ్మమదిగా వారిలో వాపుకు గురయ్యే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు రోగనిరోధక వ్యవస్థే రోగి అంతర్గత అవయవాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. లక్షణాలు: అలసట, జ్వరం బరువు తగ్గడం కండరాల నొప్పి భుజం కటి ప్రాంతంలో బలహీనత బహుశా కనురెప్పలు లేదా మెల్లకన్ను పడిపోవడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మింగడంలో ఇబ్బంది చర్మం పొలుసులుగా ఎరుపు రంగులోకి మారడం, వాయడం వంటివి. కంటి ప్రాంతంలో వాపు, ఎరుపు. చికిత్స: మందులు (కార్టిసోన్ వంటివి) కండరాల శిక్షణ. ఫిజియోథెరపీ వంటి వాటితో అదుపులో ఉంచగలరు. పూర్తి స్థాయిలో క్యూర్ అవ్వడం అంటూ ఉండదు. (చదవండి: అమెరికాలో ప్రాణాంతక బుబోనిక్ ప్లేగు వ్యాధి కలకలం) -
అమెరికాలో నలుగురు మలయాళీ కుటుంబ సభ్యుల మృతి!
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కౌంటీలోని ఒక ఇంటిలో ఈ నలుగురు విగతజీవులుగా కనిపించారు. వీరిని భారతదేశంలోని కేరళలోగల కొల్లాంకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య అలిస్ ప్రియాంక (40), కవలలు నోహ్, నాథన్ (4)లుగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం వీరంతా హీటర్ నుంచి వచ్చిన విషవాయువులు పీల్చిన కారణంగా మృతి చెందివుంటారని తెలుస్తోంది. మృతుడు ఆనంద్ కోల్లాంలోని ఫాతిమా మాత నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ హెన్రీ కుమారుడు. ఆనంద్ ఇటీవలే గూగుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి, తన కొత్త కంపెనీని ప్రారంభించారు. కాగా వీరి మృతికి గల కారణాలను శాన్ మాటియో పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 12న ఉదయం 9.15 గంటలకు వీరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. -
జనంపైకి పాల ట్యాంకర్ .. ముగ్గురు మృతి, 150 మందికి గాయాలు!
సిక్కింలోని గ్యాంగ్టక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపైనున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 150 మంది గాయపడ్డారు. వీరిలో 30 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన సిక్కింలోని రాణిపూల్లోని తాంబ్లా గేమ్ ఫెయిర్లో ఆదివారం రాత్రి 7.13 గంటలకు జరిగింది. ఆ సమయంలో రాణిపూర్ టాటా మైదానం జనంతో కిటకిటలాడింది. ఈ సమయంలో హఠాత్తుగా సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీకొని నేరుగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద నలిగిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు 150 మంది గాయపడ్డారు. సిక్కిం పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో జనం హాహాకారాలు మిన్నంటాయి. CCTV footage of Sikkim Milk Union truck accident at Ranipool Mela, Sikkim pic.twitter.com/wStmjBfilp — Jyoti Mukhia (@jytmkh) February 10, 2024 -
పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు.. ఒక పోలీసు మృతి!
పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలలోని 336 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ఇవి ఎంతో కీలకం కానున్నాయి. కాగా మూడు ప్రావిన్సుల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మూడు ప్రాంతాల్లో పోటీకి దిగిన అభ్యర్థులు మృతి చెందిన నేపధ్యంలో ఇక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో ఎన్ఏ-8 (బజౌర్), పీకే-22 (బజౌర్), పీకే-91 (కోహట్), పీపీ-266 (రహీమ్ యార్ ఖాన్) ఉన్నాయి. ఇదిలా ఉండగా పాక్లోని ట్యాంక్ ఏరియాలోని ఒక పోలింగ్ బూత్పై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందాడు. ఈ సమాచారాన్ని ఏఆర్వై న్యూస్ వెల్లడించింది. -
అమెరికాలో భారత విద్యార్థుల వరుస మరణాలు
అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మూడో విద్యార్థి మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా అమెరికాలోని సిన్సినాటిలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. ఆయన గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. వివేక్ సైనీ ఇటీవలే వివేక్ సైనీ(25 ) అనే భారత విద్యార్థిని నిరాశ్రయుడై ఓ వ్యక్తి దుకాణంలో కొట్టి చంపాడు. సైనీ ఇటీవలే అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో దాడికి కొన్ని రోజుల ముందు నుంచి మాదకద్రవ్యాలకు బానిసైన జూలియన్ ఫాల్క్నర్ అనే నిరాశ్రయునికి సైనీ సహాయం చేశాడు. అయినప్పటికీ సైనీని ఫాల్క్నర్ హత్య చేశాడు. నీల్ ఆచార్య ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య గత వారం రోజుల క్రితం శవమై కనిపించాడు. జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజ్ ఆఫ్ పర్డ్యూ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు ఆచార్య. కాగా గత ఆదివారం ఆచార్య కనిపించడం లేదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరుసటి రోజే ఆచార్య చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. ఆదిత్య అద్లాఖా గత ఏడాది నవంబర్లో ఆదిత్య అద్లాఖా(26)అనే భారతీయ విద్యార్థిని దారుణంగా హత్యకు గురయ్యాడు. సిన్సినాటి యూనివర్శిటీలో ఆదిత్య అద్లాఖా పీహెచ్డీ విద్యార్థి. ఒహియోలోని కారులో ఆయన్ని దుండగులు కాల్చి చంపారు. మరో కేసులో ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అకుల్ ధావన్(18) అనే భారత సంతతి విద్యార్థి కూడా మృతి చెందాడు. ఇదీ చదవండి: Jordan Attack: అంతటి అమెరికా సైన్యమే పొరబడింది! ఫలితంగా ముగ్గురు మృతి -
ఛత్తీస్గఢ్: 13 ఏళ్లలో 11 నక్సల్ ఘాతుకాలు!
ఛత్తీస్గఢ్లో సాధారణ జనజీవనానికి నక్సలైట్లు విఘాతం కలిగిస్తుంటారు. ఆ రాష్ట్రంలో నక్సలైట్ల దాడులకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నక్సలైట్లు దాడులకు పాల్పడ్డారు. తాజాగా నిన్న (జనవరి 30)న ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల సమస్య ఈనాటిది కాదు. 2023 ఏప్రిల్ 26న నక్సలైట్ల దాడిలో 10 మంది డీఆర్జీ సైనికులు వీరమరణం పొందారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల భారీ దాడి 2010 ఏప్రిల్ 6న జరిగింది. ఈ ఘటనలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. నక్సలైట్ల దాడిలో సామాన్యులు, ఆర్మీ సిబ్బంది మాత్రమే కాదు, ఒకప్పుడు నక్సలైట్ల దాడిలో పలువురు రాజకీయ నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2023, మే 25న జరిగింది. ఆ రోజున జీరం వ్యాలీలో నక్సలైట్లు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ నేతలతో సహా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014, ఏప్రిల్ 12న ఛత్తీస్గఢ్లోని బస్తర్లో నక్సలైట్లు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో జరిగిన నక్సలైట్ల దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, సామాన్యులకు నక్సలైట్లు ఎప్పుడూ ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2010 నుంచి నక్సల్స్ భారీ ఘాతుకాలు 2023, ఏప్రిల్ 26 దంతెవాడలో జరిగిన దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2021, ఏప్రిల్ బీజాపూర్, సుక్మా సరిహద్దుల్లో 22 మంది సైనికులు వీరమరణం పొందారు. 2020, మార్చి సుక్మాలో జరిగిన దాడిలో 17 మంది సైనికులు అమరులయ్యారు. 2017, ఏప్రిల్ 24 సుక్మాలో జరిగిన దాడిలో 25 మంది సైనికులు వీరమరణం పొందారు. 2017, మార్చి 11 సుక్మాలో జరిగిన దాడిలో 12 మంది జవాన్లు వీరమరణం పొందారు. 2017, మార్చి దంతెవాడలో జరిగిన దాడిలో ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2015, ఏప్రిల్ దంతెవాడలో జరిగిన దాడిలో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. 2014, ఏప్రిల్ 12 జీరం వ్యాలీలో జరిగిన దాడిలో 14 మంది సైనికులు వీరమరణం పొందారు. 2013, మే 25 జీరం వ్యాలీలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నేతలు సహా 30 మందికిపైగా మృతి. 2010, ఏప్రిల్ 6 దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సైనికులు వీరమరణం పొందారు. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి!
కర్ణాటకలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కర్ణాటకలోని బెల్తంగడిలోని కుక్కడి గ్రామంలో గల ఒక బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ పేలుడు శబ్దం చాలా మైళ్ల దూరం వరకూ వినిపించింది. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ ఉంది. పేలుడు శబ్దం నాలుగు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. సమీపప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను వర్గీస్ (62), స్వామి (60), చేతన్ (24)గా గుర్తించినట్లు దక్షిణ కన్నడ పోలీసు సూపరింటెండెంట్ సీబీ రిషియంత్ తెలిపారు. ఈ ఉదంతంపై విచారణ జరిపి, పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
‘జాగరణ’లో స్టేజ్ కూలి ఒకరు మృతి.. 17 మందికి గాయాలు!
దేశ రాజధాని ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో జరిగిన ‘జాగరణ’ కార్యక్రమంలో వేదిక కూలిపోవడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో దాదాపు 1,600 మంది అక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మహిళ మృతి చెందింది. గాయడిన 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతంలో ‘జాగరణ’ నిర్వాహకులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 337/304A/188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 1:20 గంటలకు జరిగినట్లు సమాచారం. #WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers. (Video: Viral visuals confirmed by Police) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/xJgJ0wSdqB — ANI (@ANI) January 28, 2024 -
‘లాలా’ కోసం భగత్సింగ్ ఏం చేశారు? విప్లవకారుల పొరపాటు ఏమిటి?
బ్రిటీషర్ల బానిసత్వ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కల్పించడంలో స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ విశేష కృషి చేశారు. ఆయన నిష్ణాతుడైన రాజకీయవేత్త, చరిత్రకారుడు, న్యాయవాది, రచయితగా పేరుగాంచారు. లాలా లజపతిరాయ్ కాంగ్రెస్లో అతివాద గ్రూపు నేతగా, పంజాబ్ కేసరిగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర వీరుడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సహా విప్లవకారులకు లాలా లజపతిరాయ్ అంటే ఎంతో గౌరవం. యువతను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడేలా లాలా లజపతిరాయ్ పురిగొల్పారు. నేడు లాలా లజపతిరాయ్ జయంతి. పంజాబ్లోని మోగా జిల్లాలోని అగర్వాల్ కుటుంబంలో 1865, జనవరి 28న లాలా లజపతిరాయ్ జన్మించారు. 1928, అక్టోబర్ 30న సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో భారీ ప్రదర్శన జరిగింది. దీనిలో లాలా లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో బ్రిటీష్ సైనికులు అతనిపై లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమయంలో, లాలా మాట్లాడుతూ ‘నా శరీరంపై పడే ప్రతీ లాఠీ దెబ్బ.. బ్రిటిష్ ప్రభుత్వ శవపేటికపై దిగబడే మేకులా పనిచేస్తుంది’ అని పేర్కొన్నారు. 1927, నవంబరు 8న భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. దానికి సైమన్ కమిషన్ అనే పేరు పెట్టింది. దీనిలో ఏడుగురు బ్రిటిష్ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. భారతీయులకు దానిలో స్థానం దక్కలేదు. మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల పరిశీలనకు ఈ కమిషన్ ఏర్పాటయ్యింది. సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3న భారతదేశానికి వచ్చింది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్తో సహా దేశమంతా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పంజాబ్లో జరిగిన ఈ నిరసనకు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. లాహోర్ పోలీస్ ఎస్పీ జేమ్స్ ఎ స్కాట్ నేతృత్వంలో లాఠీ ఛార్జ్ జరిగింది. లాలా తీవ్రంగా గాయపడి 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. చివరకు 1928 నవంబర్ 17న కన్నుమూశారు. లాలా లజపతి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భగత్ సింగ్తో సహా పలువురు విప్లవకారులు బ్రిటిష్ అధికారి జేమ్స్ ఎ. స్కాట్ హత్యకు ప్లాన్ చేశారు. అయితే అతనిని గుర్తించడంలో పొరపాటు జరిగి, 1928, డిసెంబరు 17న భగత్ సింగ్, రాజ్గురులు బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ పి. సాండర్స్ను కాల్చిచంపారు. ఆ సమయంలో సాండర్స్ లాహోర్ ఎస్పీగా ఉన్నారు. లాలా లజపతిరాయ్ మృతి విషయంలో దేశం మౌనంగా ఉండదని, బ్రిటిష్ వారికి తగిన సమాధానం చెప్పాలని భావించిన విప్లవకారులు బ్రిటిష్ వారికి ఇటువంటి సందేశం ఇచ్చారు. -
కుకీస్ తింటున్నారా? ఐతే ఓ డ్యాన్సర్ ఇలానే తిని..
కుకీస్ అంటే ఇష్టంగా తినేవారు ఈ ఘటన వింటే మాత్రం తినేందుకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఓ ప్రోఫెషనల్ డ్యాన్సర్ ఈ కుకీస్ తిని నిండు జీవితాన్ని కోల్పోయింది. ఈ ఘటన ఒకరకంగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. కుకీస్ ఎంతవరకు తినొచ్చు మంచిదేని అన్నంత అనుమానాలకు దారితీసింది. అస్సలు కుకీస్ తినడం వల్ల ప్రాణం పోవడం ఏమిటీ? అసలేం ఏం జరిగింది.. వివరాల్లోకెళ్తే..ఓర్లా బాక్సెండేల్ అనే 25 ఏళ్ల ప్రోఫెషనల్ డ్యాన్సర్ కుకీస్ తిన్న తర్వాత జనవరి 11న అనాఫిలాక్టిక్ షాక్కి సంబంధించిన తీవ్ర అలెర్జీకి గురై మరణించింది. అయితే కుకీస్ వేరుశెనగతో చేసినవి. తమ బిడ్డ చనిపోవడానికి కారణం సదరు కకీస్ తయారు చేసే కంపెనీయే అంటూ కోర్టుని ఆశ్రయించారు ఆమె బంధువులు. ఇక బాధితరుఫు న్యాయవాది ఆ కుకీస్ ప్యాకెట్పై వేరుశెనగకు సంబంధించిన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని, ఆహార పదార్థాల్లో కంపెనీ చూపిన నిర్లక్ష్యంధోరణి కారణంగానే తన క్లయింట్ మరణించిందని వాదించారు. తప్పుగా లేబుల్ చేసిన కుకీస్ వల్ల బాధితురాలు ప్రాణాలు పొగొట్టుకుందని అన్నారు. ఈ ఘటనతో యూకే నగరంలోని స్టీవ్ లియోనార్డ్ స్టోర్ల నుంచి వెనిలా ఫ్టోరెంటైన్ కుకీలను కొనేందు జనాలు జంకుతున్నారు. నిజానికి ఓర్లా 2018లో డ్యాన్స్ చేసేందుకు న్యూయార్క్ నగరానికి వెళ్లారు. అప్పుడే ఆమె ఒక సూపర్ మార్కెట్ నుంచి ఈ కుకీస్లను కొని, తినడం జరిగింది. చివరికి డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఆస్పత్రి పాలై చనిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనపై సూపర్ మార్కెట్ స్పందించి.. ఈ కుకీలను తయారు చేసి, తమ మార్కెట్కి సరఫరా చేసే లాంట్ ఐలాండ్ బేకీరీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. పైగా ఈ దిగ్బ్రాంతికర ఘటనకు సదరు సూపర్ మార్కెట్ సీఈవో ఓ వీడియోలో సానుభూతి వ్యక్తం చేశారు కూడా. బాధితురాలు కూడా దర్యాప్తులో నిర్లక్ష్యపూరితంగా తయారు చేసిన కుకీస్ వల్లే చనిపోయినట్లు పేర్కొంది. అయితే బాధితురాలి తరుఫు న్యాయవాది తయారీ దారులు లేదా అమ్మకందారుల నిర్లక్యానికి ఓ ప్రాణం బలవ్వడమే గాక ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చిందంటూ వాదన వినిపించారు. అయితే కుకీస్ తయారీదారు కుకీస్ యునైటెడ్ కంపెనీ మాత్రం అందుకు తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పింది. అమ్మకందారులు తప్పుగా లేబుల్ చేయండంతో తలెత్తిన తప్పిందంగా పేర్కొంది. తాము మార్కెట్కి ఉత్పత్తిని సరఫరా చేయడానికి ముందే ఎలాంటి ఇన్గ్రేడియంట్స్ వాడతామన్నది కూడా ముందుగానే సదరు సూపర్ మార్కెట్తో మాట్లడటం జరుగుతందని అందువల్ల ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తమ తప్పిదం కాదని వాదించింది. అందువల్ల దయచేసి వినియోగుదారులందరూ కుకీస్ కొనే ముందు దేనితో తయారు చేశారు, తయారీ తేదీ వివరాలు చూసుకుని కొనుగోలు చేయండి. ఇక్కడ ఎవరీ వ్యాపారం వారిదే మనుషల జీవితాలకు గానీ, వారి ఆరోగ్యానికి గానీ ప్రాముఖ్యం ఇవ్వవు, తప్పిదానికి బాధ్యత కూడా వహించవు అన్నది గుర్తు ఎరగాలి. ఎంత సేల్స్ చేశాం ఎంత ఆదాయం వచ్చింది అన్నదానికే ప్రాధాన్యత ఇస్తున్నంత సేపు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!. మన సంరక్షణ మనమే చూసుకోవాలి తప్పదు. (చదవండి: ఆ కవలలు పుట్టగానే వేరయ్యారు! మళ్లీ 19 ఏళ్ల తర్వాత..) -
కునో నేషనల్ పార్క్లో మరో నమిబియా చీతా మృతి
భోపాల్: ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అన్నారు. చీతాకు పోస్ట్ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు. ఈరోజు(మంగవారం) ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర ఆందోళనకరంగా అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్ పార్క్ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా ‘శౌర్య’ మరణించిందని తెలిపారు. Today, on 16th January, 2024 around 3:17 PM, Namibian Cheetah Shaurya passed away...Cause of death can be ascertained after Post Mortem: Director Lion Project pic.twitter.com/ISc2AlCNcy — ANI (@ANI) January 16, 2024 ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం. చదవండి: ఆప్ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు -
ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి
లష్కరే తోయిబా(LeT) వ్యవస్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టావి మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి(UNO)ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్కు డిప్యూటీగా వ్యవహరించిన సలాం భుట్టావి మరణించినట్లు యూఎన్ఓ భద్రతా మండలి నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన వెల్లడించింది. 2008 ముంబై 26/11 దాడుల కుట్రదారుల్లో ఒకరైన సలాం భుట్టావి గుండెపోటుతో 2023 మేలో మృతి చెందినట్లు పేర్కొంది. పాకిస్తాన్ ప్రభుత్వ కస్టడిలో ఉన్న భుట్టావి పంజాబ్ ప్రావిన్స్లోని మురిధేలో మరణించారు. లష్కరే తోయిబా చేసిన ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా.. సుమారు 300 మంది గాయపడ్డారు. ఐఖ్య రాజ్య సమితి నిషేధించిన మహమ్మద్హఫీజ్ సయీద్ను ముంబై దాడుల ఘటనకు సంబంధించి విచారించడం కోసం తమకు అప్పగించాలని పాకిస్థాన్ను భారత్ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. చదవండి: అమెరికా, బ్రిటన్ మూల్యం చెల్లించుకోవాల్సిందే.. హెచ్చరించిన హౌతీలు -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్కాంత్ కూడా..
కోలివుడ్కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
అమెరికాలో విషాదం.. శవాలై కనిపించిన భారత సంతతి కుటుంబం
అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్ కమల్ కుటుంబం అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేష్ కమల్ (57)తో పాటు ఆయన భార్య టీనా కమల్ (54), కుమార్తె ఆరియానా (18) మృతి చెందడం కలకలం రేపుతోంది. స్థానిక కాల మానం ప్రకారం.. గురువారం సాయంత్రం 7.30గంటల సమయంలో రాకేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉండే ఖరీదైన డోవర్ భవనంలో చనిపోయినట్లు గుర్తించామని నార్ఫోర్క్ డిస్ట్రిక్ అటార్నీ (డీఏ) మైఖేల్ మొరిస్సే తెలిపారు. ఈ ఘటనపై మైఖేల్ మొరిస్సే మాట్లాడుతూ.. ఈ కాల్పుల ఘటన గృహ హింస అయ్యిండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు భర్త రిక్కీ మృతదేహం వద్ద తుపాకీ ఉండడమేనని అన్నారు. చంపారా? చంపించారా? ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారా? లేదంటే ఎవరిచేతనైనా చంపబడ్డారా? అనేక అనుమానాలపై స్పష్టత ఇచ్చేందుకు న్యాయ వాది మైఖేల్ మొరిస్సే నిరాకరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. ఈ సంఘటనను హత్య లేదంటే ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకోవాలా? వద్దా? అని నిర్ణయించే ముందు వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉందని చెప్పారు. ఆర్ధిక సమస్యలే కారణమా? రాకేష్ కుటుంబ సభ్యుల అనుమానాస్పద మరణానికి ఆర్ధిక సమస్యలే కారణమని తెలుస్తోంది. సంబంధిత ఆన్లైన్లోని ఆధారాల్ని స్థానిక పోలీసులు సేకరించారు. అదే సమయంలో కుటుంబసభ్యుల మధ్య మనస్పర్ధలు, ఇతర సమస్యలు ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించ లేదని మోరిస్సే చెప్పారు. ప్రస్తుతం ఈ హత్యలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆస్తుల అమ్మకం ది పోస్ట్ నివేదిక ప్రకారం.. రాకేష్ కమల్ కుటుంబం 5.45 మిలియన్ డాలర్ల విశాలమైన భవనంలో నివసిస్తుంది. అయితే ఈ భవనాన్ని ఏడాది క్రితం మసాచుసెట్స్కు చెందిన విల్సోండేల్ అసోసియేట్స్ ఎల్ఎల్సీకి 3 మిలియన్లకు విక్రయించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, 2019లో కమల్లు 19,000 చదరపు అడుగుల ఎస్టేట్లో 11 బెడ్రూమ్లు ఉన్న భవనాన్ని రిక్కీ 4 మిలియన్లకు కొనుగోలు చేశారు. సంస్థ కార్యకలాపాల రద్దు రాష్ట్రంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన డోవర్లో నివసించే రాకేశ్ కమల్ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. విద్యా వంతులు ఎడ్యునోవా వెబ్సైట్ ప్రకారం..రాకేష్ కమల్ భార్య టీనా కమల్ భారత్లోని ఢిల్లీ యూనివర్సీటీ, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్సైట్లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించేవారు. ఇక కమల్ బోస్టన్ యూనివర్సిటీ, ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి కూడా. ఎడ్యునోవాలో పని చేయడానికి ముందు రాకేష్ కమల్ ఎడ్యుకేషన్ విభాగంలో అపారమైన అనుభవం ఉంది. ఇక ఎడునోవా మిడిల్ స్కూల్, హైస్కూల్, కాలేజ్లలోని విద్యార్థుల గ్రేడ్లను మెరుగుపరిచేలా సేవలందిస్తోంది. ఇక, రాకేష్ కమల్, టీనా కమల్ దంపతుల కుమార్తె ఆరియానా వెర్మోంట్లోని మిడిల్బరీ కాలేజీ న్యూరోసైన్స్ చదువుతుండేవారు. అప్పుల ఊబిలో ఉక్కిరి బిక్కిరి టీనా కమల్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. తనకు 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల అప్పు ఉందని ఫైలింగ్లో తెలిపారు. తగిన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో రెండు నెలల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చివరికి ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే రాకేష్ కమల్ తన భార్య టీనా కమల్, ఆరియాను హత్యా చేశారా? ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దృష్టిసారించారు. -
చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా? యూకేలో వింత ఘటన
చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమేనా? కానీ ఈ వింత సంఘటన నిజంగానే జరిగింది. లండన్కు చెందిన ఓ మహిళ చనియినట్లు నిర్థారించిన 40 నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది. స్పృహలో లేని ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆమె తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో సోషల్ మీడియాలో పంచుకుంది. ''చనిపోయాక మనిషికి ఇంకో జన్మ ఉంటుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మళ్లీ బతుకుతాను అన్న ఆశ లేని సమయంలో జీవితం మరో అవకాశాన్ని ప్రసాదించింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్త స్టూ, నేను డిన్నర్ డేట్కు ప్లాన్ చేసుకున్నాం. ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం అనుకునేలోపు సోఫాలో కుప్పకూలిపోయాను. స్టూ ఎంత పిలుస్తున్నా నాలో ఎలాంటి చలనం లేదు. నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. ఇంతలో నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్లడం, వాళ్లు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. నా కుటుంసభ్యులకు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు కూడా. కానీ నన్ను నేనే నమ్మలేకపోతున్నా. కోమాలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయిపోయాను'' అంటూ క్రిస్టీ బోర్టోస్ తెలిపింది. ఆమె చనిపోయిందని ప్రకటించిన 40 నిమిషాల తర్వాత క్రిస్టీ ప్రాణాలతో బయటపడడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. మెదడుకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే మనిషి బతికే ఛాన్స్ లేదు. మరి క్రిస్టీ విషయంలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఏంటన్నది ఇప్పటికీ వైద్యులకు అర్థం కావడం లేదు. గతంలోనూ పలుమార్లు ఆమె గుండెపోటుకు గురయ్యింది. అలాంటిది దాదాపు చావు వరకు వెళ్లి తిరిగిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోతే దెబ్బతింటుంది. కానీ క్రిస్టీని పరీక్షించినప్పుడు ఆమెకు గుండె, ఊపిరితిత్తులు, మెదడు అన్నీ అవయవాలు బాగానే ఉన్నాయని పరీక్షల్లో వెల్లడి కావడం మరో ఆశ్చర్యం. -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు
పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది ఆ జంట. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా భర్తను కోల్పోయింది. దీంతో ఆమె జీవితం పూర్తి నిరాసక్తతతో కూడిన చీకటి ఆవరించింది. కనీసం పిల్లలైన కలిగిన వారిలో తన భర్తను చూసుకునేదాన్ని కదా! అన్న బాధ ఆమెను తొలిచేసింది. మరోవైపు భర్త దూరమయ్యాక అత్తింటి వారెవ్వరూ ఆమెను చేరదీయలేదు. ఒంటరి జీవితం వెళ్లదీస్తున్న ఆమెకు తన భర్త ఉండగా పిల్లల కోసం తాము ఎంచుకున్న ఐవీఎఫ్ పద్ధతి గుర్తుకొచ్చింది. దీంతో తామప్పుడూ సంప్రదించి వైద్యులను సంప్రదించి తల్లి అయ్యి తన కోరికను నెరవేర్చుకుంది. పైగా ఆమె కారణంగా వైద్య చరిత్రలో మరో అద్భుతం చోటు చేసుకుంది. బెంగాల్లోని బీర్భూమ్కి చెందిన సంగీతా కేశారి, ఆమె భర్త అరుణ్ ప్రసాద్ కేశారి రెండేళ్లుగా గర్భం దాల్చడంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. చివరిగా వారు ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా 2021లో భర్త స్పెర్మ్ను కోల్కతాకు చెందిన ప్రయోగశాలలో నిల్వ చేయడం జరిగింది. అయితే అంతలోనే ఆమె భర్త కరోనా మహమ్మారికి బలైయ్యాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. అయినప్పటికీ ఎలాగైన పిల్లలను కనాలి తన భర్త లేని లోటుని భర్తీ చేసుకుని వారి ఆలనపాలనలో గడపాలని గట్టిగా కోరుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఆ పిల్లల్లో తన భర్తను చూసుకోవాలని ఆరాటపడింది. ఎందుకంటే..? ఆమె భర్త దూరమయ్యాక కనీసం అత్తింటి వారు ఆమెను చేరదీయలేదు. దీంతో ఆమె అప్పటి నుంచి ఒంటిరిగానే జీవితం కొనసాగిస్తోంది. తన భర్త నడిపే కిరాణ దుకాణాన్ని ఆమె నడుపుతూ జీవిస్తోంది. సరిగ్గా అప్పడే తన భర్త ఉండగా సంప్రదించిన ఆస్పత్రి గుర్తుకొచ్చింది. అక్కడ భర్త స్పెర్మ్ దాచిన సంగతి జ్ఞప్తికి వచ్చి పిల్లలను కనడం సాధ్యమవుతుందా? తన కోరిక నెరవేర్చుకోగలనా లేదా? అని ఆ ఆస్పత్రి వర్గాలను సంప్రదించి సవివరంగా తెలుసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఆ మహిళకు 48 ఏళ్లు పిల్లలను కనగలిగే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆమెకు ఈ పద్ధతి కాస్త రిస్క్ అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ఆమె సంకల్పానికి తగ్గట్టుగానే ఆ పద్ధతి విజయవంతమై పూర్తి ఆరోగ్యంతో ఉన్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఈ మేరకు వైద్యుడు పలాష్ దాస్ మాట్లాడుతూ..ఆ మహిళ క్లిష్ట పరిస్థితుల్లో తల్లి అయ్యిందని అన్నారు. ఆమె పిల్లలను కనే వయసు ముగిసే సమయానికి ఆమె శుక్రకణాన్ని భద్రపరిచినట్లు తెలిపారు. ఇక్కడ ఆమె తల్లి కావాలనే తాప్రత్రయంతో కనడం అనేది ఆమెకు రిస్క్ అయినా లెక్కచేయకుండా డేర్ చేసిన తీరు ప్రశంసంచదగ్గ విషయమని అన్నారు. నిజంగా ఆమె ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిదేనని అన్నారు. (చదవండి: మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు..మరో రూపంతర వేరియంట్ కలకలం!) -
సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగ్పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. ఇది కూడా చదవండి: లోక్సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె? -
దుకాణాల్లోకి దూసుకెళ్లిన ట్రాలీ.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ నుంచి ఆగ్రా వైపు వేగంగా వెళ్తున్న ట్రాలీ అదుపు తప్పి జాతీయ రహదారిపై మాణిక్పూర్ మలుపు సమీపంలోని రెండు షాపుల్లోకి దూసుకెళ్లింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇదే ట్రాలీ ఢీకొనడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే డీఎం, ఎస్ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి 10:20 గంటల ప్రాంతంలో కాన్పూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న ట్రాలీ మాణిక్పూర్ మలుపు సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న పలువురు ట్రాలీ కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఇక్డిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్, జేసీబీలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో తొలి ఏఐ సిటీగా లక్నో -
ఇటుక బట్టీలో భారీ పేలుడు.. నలుగురు మృతి!
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణా జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో చిమ్నీ కూలిపోయి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బసిర్హత్లోని ధాల్టితా గ్రామంలో చోటుచేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఇటుక బట్టీలో పొయ్యి మండుతుండగా పేలుడు సంభవించిందని చెబుతున్నారు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన వారంతా ఇటుక బట్టీ కార్మికులేనని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, శిథిలాల కింద ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోందని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం భారీ పేలుడు థాటికి ఇటుక బట్టీలోని చిమ్నీ పూర్తిగా కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ పేలుడు వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య! -
కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్లో గల ఒక కొవ్వొత్తుల తయారీ కర్మాగారంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 10 మంది గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలియజేశారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శేఖర్ సింగ్ ఈ ఉదంతం గురించి మీడియాతో మాట్లాడుతూ తల్వాడేలో గల కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మంటలు సంభవించినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఈ కర్మాగారంలో.. పుట్టినరోజు వేడుకల్లో ఉపయోగించే కొవ్వొత్తులను తయారు చేస్తుంటారని ఆయన తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్ యజమాని సంఘటన గురించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని, ఆ తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రమాదంలో ఆరు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, వాటిని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీచేశారు. అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ దేశ్ముఖ్ ససూన్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇది కూడా చదవండి: ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా! -
41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె..!
నేరాలు ఎంత అనాలోచితంగా, కుట్రపూరితంగా చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోతాయి. ఆ ఘటనలు మిగిల్చే నష్టం, బాధ అంతా ఇంతా కాదు. ఆఖరికి వాటి ఇన్విస్టిగేషన్ కూడా ఓ పట్టాన వీడని మిస్టరీలా ఉండిపోతాయి. అంత తేలిగ్గా చిక్కుముడి వీడదు. ఒక్కోసారి ఏళ్లకు ఏళ్లు పడుతుంది. బాధితులకు తీరని మనో వ్యధ జీవితాంతం ఉంటుంది. ఆ వ్యక్తి తాలుకా వివరాలు బంధువులకు చేరక ఒకవైపు, ఆ కేసులోని చిక్కులు వీడక అధికారులు మరోవైపు ఇలా ఇరువురు తెలియని నరకం చూస్తారు. అలాంటి ఒక గాథ ఇది. 41 ఏళ్ల క్రితం నాటి మహిళ అదృశ్యం కేసు. ఆమె ఏమైంది? ఎలా చనిపోయింది? అనేది తెలియని ఓ అంతుచిక్కని మిస్టరీ. కానీ ఇప్పుడు ఆమె ఎవరనేది ఇప్పటికీ గుర్తించి ఆ బాధితురాలి కూతురికి తెలియజేస్తే.. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది మాటలకందని భావోద్వేగమే కదా!. ఒరెగాన్లోని కొన్నీ లోరైన్ క్రిస్టెన్సన్ అనే మహిళ కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా 1982లో టేనస్సీలోని నాష్విల్లేలో కనిపించింది. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె బంధువులు మిస్సింగ్ కేసుగా ఫైల్ చేశారు. కానీ ఆమె ఆచూకీ ఎక్కడన్నది కానరాకుండా పోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆమె ఇండియానాలోని ఓ గ్రామంలో చనిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ ఆమెకు సంబంధించిన వస్తువులు హైహిల్స్, బంగారు ఉంగరం తదితర వస్తువులను కొన్నీగా స్వాధీనం చేస్తుకున్నారు విచారణలో ఆమె వేటగాళ్ల చేతిలో శవమైనట్లు విచారణలో తేలింది. ఆమె మృతదేహానికి సంబంధించిన అవశేషాలు అదృశ్యమైన కొన్నీ లోరైన్ అవశేషాలతో సరిపోలాయి. దీంతో ఆమె గురించి వారి బంధువులకు తెలయజేయాలనే ఉద్దేశ్యంతో కరోనర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ ఆంత్రోపాలజీ విభాగంలో స్టోర్ చేశారు పోలీసులు. ఆమె తుపాకీ గాయం కారణంగా మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. అయితే కొన్నీ లోరైన్ హత్య ఎలా జరిగిందనేది తెలియరాలేదు పోలీసులకు. అయితే విచారణలో వాకింగ్ కోసం బయటకు వచ్చిందని, అప్పుడామె నాలుగు నెలల గర్భవతి అని తేలింది. అలాగే ఆమెకు ఓ ఏడాది కూతురు కూడా ఉందని, ఆమెను తన తోపాటు బయటకు తీసుకువెళ్ల లేదని తేలింది. ఇక ఇండియానా స్టేట్ పోలీస్ ఫోరెన్సిక్ లాబరేటరీ ఆమెకు సంబంధించిన అవశేషాలను, డీఎనే రిపోర్ట్ని వెబ్సెట్లో అందుబాటులో ఉంచడమే గాక ఆమె దుస్తులను, తాలుక వస్తువులను భద్రపరిచారు. ఆమె అవశేషాలు బంధువులకు చేర్చేలా గుర్తింపు చర్యలు ముమ్మరంగా సాగించింది. ఎట్టకేలకు ఆమె అవశేషాలు ఘటన జరిగిన 41 ఏళ్లకు ఆమె కూతురు చెంతకు చేరాయి. ఆమె తాలుకు బంగారపు ఉంగరం, వజ్రాలు అన్నింటిని అధికారలు ఆమెకు అందజేశారు. తన తల్లి ఏమైందీ? ఎక్కడుంది? అనే సమాధానంలేని వేల ప్రశ్నకు ఆ కూతురికి ఇన్నేళ్లకు సమాధానాలు దొరికాయి. తల్లి గురించి తెలుసుకోగలిగానని ఆనందపడాలో ఎలా అనాథలా చనిపోయిందని తెలుసుకుని బాధపడాలో తెలియని ఉద్విగ్న స్థితితో ఉక్కిరిబిక్కిరి అయ్యింది కొన్నీ లోరైన్ కూతురు. పైగా తన తల్లి ఆచూకి కనీసం ఇప్పటికైనా తనకు తెలిసేలే కృషి చేసినందుకు పోలీసులుకు వేవేల కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ అవశేషాలను ఖననం చేసి..తన తల్లికి భారంతో కూడిన హృదయంతో ఘనంగా వీడ్కోలు పలికింది ఆ కూతురు. (చదవండి: వింత ఘటన: ఓ మహిళ టూత్బ్రెష్ని అనుకోకుండా మింగేసింది! అంతే..) -
యమునలో కరసేవకులకు పిండ ప్రధానం
అయోధ్యలో రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆలయాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి ముందుగా 1990లో రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు మథురలో యమునా నది తీరాన ఉన్న విశ్రామ్ ఘాట్ వద్ద కరసేవకులకు ఆత్మ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పిండ ప్రధానం చేయనున్నారు. రామజన్మభూమి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కోసం పిండ ప్రధానాన్ని డిసెంబర్ 6న మధురలో నిర్వహించనున్నట్లు అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) జాతీయ అధ్యక్షుడు రాజ్యశ్రీ చౌదరి తెలిపారు. నాడు అయోధ్యలో కవాతు చేస్తున్న కరసేవకులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనను చౌదరి గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన త్యాగాన్ని మనం ఎన్నటికీ మరువలేమన్నారు. రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయిన నేపధ్యంలో, రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న తరుణంలో మనం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2019 నవంబరు 9న సుప్రీం కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పునిస్తూ, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, ఆగస్టు 5న రామమందిరానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. ఇది కూడా చదవండి: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు? -
ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!
హాలీవుడ్ నటి క్యాన్సర్ బారిన పడింది. అది కూడా ఫోర్త్ స్టేజ్లో ఉంది. బతికే అవకాశాలు లేవు. కానీ ఆమె మాత్రం నేను చనిపోవాలని కోరుకోవడం లేదు కాబట్టి బతుకుతాను అంటూ మొండి ధైర్యంతో జయించే ప్రయత్నం చేస్తుంది. పైగే ఈ దారుణ స్థితిని కూడా ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారిస్తుంది. ఆమె అచంచలమైన ధైర్యం తనలా అనారోగ్యంతో బాధపడేవాళ్లలో ఓ కొత్త ఊపిరిని, స్థైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమె హీరోయిన్గా వెండి తెరపైనే కాదు బయట కూడా హీరోయినే అని ప్రూవ్ చేసుకుంది. వివరాల్లోకెళ్తే..అమెరికా నటి షానెన్ డోహెర్టీ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతోంది. అది గుర్తించే నాటికే ఫోర్ట్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం ఆ క్యాన్సర్ ఆమె ఎముకలంతటికి వ్యాపించి పరిస్థితి కాస్త సివియర్గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. అయినా కూడా ఎక్కడ కించెత్తు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ స్థితిలో కూడా 'నేను చనిపోవాలని కోరుకోవడం లేదు' కాబట్టి బతుకుతా. 'నేను పూర్తిగా జీవించలేదు'. 'పూర్తిగా ప్రేమించబడ లేదు'. కాబట్టి కచ్చితంగా నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను అని ధీమాగా చెబుతుంది. పైగా తనలా మరెవరూ ఈ క్యాన్సర్తో బాధపడుకుండా ఉండేలా పరిశోధనలు మరింత విస్తృతంగా చేసేందుకు నిధులు వెచ్చిస్తుంది. అంతేకాదు ఈ క్యాన్సర్ నాకే ఎందుకు వచ్చింది? అది కూడా స్టేజ్4లోనే ఎందుకు ఉన్నా? ఇందంత ఏదో తన వల్ల అయ్యే గొప్ప ప్రయోజనం కోసమే ఇలా అయ్యి ఉంటుంది. అందుకే ఆ దిశగా నన్ను నేను బతికేలా ధైర్యం కూడగట్టకుంటూ క్యాన్సర్ అంతమొందించే ప్రపంచానికై తపస్సు చేస్తున్నానని నిర్భయంగా చెబుతోంది. ఈ వ్యాధి కారణంగా నడవలేం, తినలేం కనీసం పనిచేయలేం అని ఆవేదనగా చెబుతోంది. చిన్న వయసులోనే ఎందరో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ వ్యాధిని చూసి డీలా పడకుండా భిన్నమైన దృక్పథంతో మాలాంటి పేషెంట్లు ఉండి జీవితాన్ని నూతనోత్సాహంతో ఆస్వాదించాలి. అప్పుడే మళ్లీ మునుపటి జీవితాన్ని పొందగలరు అని నిరాశ నిస్ప్రుహలో ఉన్న క్యాన్సర్ పేషంట్లందరికి స్ఫూర్తినిచ్చేలా చెబుతోంది. నటి షానెన్ డోహెర్టీ 1990ల బ్లాక్బస్టర్ బెవర్లీ హిల్స్, 90201లో బ్రెండా వాల్ష్ వంటి పాత్రలతో అభిమానుల మనుసులను గెలుచుకుంది. ఈమెకు 2015లో క్యాన్సర్ నిర్థారణ అయినప్పుడూ ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది కూడా. అయితే అది మళ్లీ తిరగబెట్టి స్టేజ్ 4లో ఉండటమే బాధాకరం. (చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..) -
రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు. ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు -
'మాలి' ఇక లేదు!
పిలిప్పీన్స్ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే... నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్ జూ అధికారులు ఒక కాంక్రీట్ ఎన్క్లోజర్లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్ బిషప్లు, గ్లోబల్ పాప్ స్టార్, నోబెల్ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు. అంతేగాదు ఆ ఏనుగును థాయ్లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు. ఎలా ఈ జూకి వచ్చిందంటే.. శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు మలాకానాంగ్ ప్యాలెస్లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్క్లోజర్లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం. చనిపోవడానికి కారణం.. ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్ లాకునా చెప్పారు. (చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది) -
సొరంగం నుంచి బయటపడ్డ కొడుకును చూడకుండానే తండ్రి మృతి
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా టన్నెల్లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా దుమారియా బ్లాక్కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు. భక్తు ముర్ము 17 రోజుల అనంతరం సొరంగం నుండి బయటకు వచ్చి, తన తండ్రి మరణవార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. ఈ సందర్భంగా బర్సా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ‘మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలిసి, ఇంటిలోని మంచం మీద కూర్చున్నాడని, ఇంతలోనే అకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని’ తెలిపారు. బర్సా ముర్ము అల్లుడు మాట్లాడుతూ.. ‘భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం అందిన తర్వాత అతని తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భక్తు ముర్ము సోదరుడు రాంరాయ్ ముర్ము చెన్నైలో ఉంటాడని, మరో సోదరుడు మంగళ్ ముర్ము కూలి పనులు చేస్తుంటాడని’ తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్ -
ఈ ఐదుగురు.. 26/11 అమర వీరులు!
ముంబై మహానగరంలో 2008, నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. తాజ్, ట్రైడెంట్ హోటళ్లతో పాటు ఛత్రపతి శివాజీ టెర్మినస్పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 166 మంది మృతి చెందారు. అయితే మనదేశానికి చెందిన వీర జవానులు, పోలీసులు ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొని ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కాపాడారు. ఈ దాడిలో ఐదుగురు వీర జవానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరుల ధైర్యసాహసాలను మరోసారి గుర్తుచేసుకుందాం. హేమంత్ కర్కరే హేమంత్.. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అంటే ముంబై ఏటీఎస్ చీఫ్. హేమంత్ రాత్రి డిన్నర్ చేస్తుండగా నగరంలో ఉగ్రవాద దాడికి సంబంధించి క్రైమ్ బ్రాంచ్ నుండి కాల్ వచ్చింది. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చి, ఏసీపీ అశోక్ కామ్టే, ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్తో కలిసి డ్యూటీలోకి దిగారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్లు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ నేపధ్యంలోనే హేమంత్ వీరమరణం పొందారు. మరణానంతరం ఆయనకు అశోకచక్ర పురస్కారం లభించింది. అశోక్ కామ్టే అశోక్ ముంబై పోలీస్ విభాగంలో ఏసీపీ. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఆయన ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో ఉన్నారు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాది ఇస్మాయిల్ ఖాన్ అతనిపై అనేక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ అశోక్ తలకు తగిలింది. ఆయన తీవ్రంగా గాయపడినప్పటికీ, కొందరు శత్రువులను తుదముట్టించారు. విజయ్ సలాస్కర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సలాస్కర్ పేరు వినగానే ముంబయి అండర్వరల్డ్ వణికిపోయేది. విజయ్ సలాస్కర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా గుర్తింపు పొందారు. ముంబైలో దాడి జరిగినప్పుడు, విజయ్ సలాస్కర్ కూడా ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే బృందంలో సభ్యుడు. కామా హాస్పిటల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల బుల్లెట్లకు సలార్కర్ వీరమరణం పొందారు. మరణానంతరం అతనికి అశోకచక్ర పురస్కారం లభించింది. తుకారాం ఓంబ్లే ముంబై పోలీస్ విభాగానికి చెందిన ఈ ఏఎస్ఐ ధైర్యాన్ని ప్రశంసించకుండా ఎవరూ ఉండలేరు. తుకారాం ఆయుధాలు లేకుండా ఉగ్రవాది అజ్మల్ కసబ్ను ఎదుర్కోవడమే కాకుండా, చివరికి అతన్ని పట్టుకోవడంలో కూడా విజయం సాధించారు. ఈ సమయంలో కసబ్ అతనిపై అనేక రౌండ్ల బుల్లెట్లను కాల్చాడు. ఫలితంగా తుకారాం అమరుడయ్యారు. మరణానంతరం అతనికి అశోకచక్ర పురస్కారం లభించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఉగ్రవాద దాడుల సమయంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మిషన్ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడోకు నాయకత్వం వహించారు. అతను 51 ఎన్ఎస్ఏజీ కమాండర్. తాజ్ మహల్ ప్యాలెస్, టవర్స్ హోటల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో మేజర్ పోరాడుతుండగా, ఒక ఉగ్రవాది అతనిపై వెనుక నుండి దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే వీరమరణం పొందారు. అతనికి మరణానంతరం 2009లో అశోకచక్ర పురస్కారం లభించింది. ఈ ఐదుగురు వీర సైనికులు, పోలీసులతో పాటు హవల్దార్ గజేంద్ర సింగ్, నాగప్ప ఆర్. మహాలే, కిషోర్ కె. షిండే, సంజయ్ గోవిల్కర్, సునీల్ కుమార్ యాదవ్ తదిరులు నాడు జరిగిన పోరులో ధైర్యసాహసాలకు ఉదాహరణగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్కు మరో ఆటంకం? -
Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి
జాజ్పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. -
ఛత్ వేడుకల్లో విషాదం.. వివిధ ప్రాంతాల్లో 22 మంది మృతి
బీహార్లోని పలు ఛత్ ఘాట్ల వద్ద నీట మునిగి 22 మంది మృతిచెందారు. ఆది, సోమవారాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు యువకులు, ఏడుగురు యువతులు, ఒక బాలిక సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. షాపూర్ సమీపంలోని బ్రహ్మాపూర్ చెరువులో అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఇద్దరు కవల సోదరులతో సహా ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహించిన జనం జగన్పుర సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డును దిగ్బంధించి, ట్రాఫిక్ చెక్పోస్టును ధ్వంసం చేసి దానిని తగులబెట్టారు. సరన్ జిల్లాలోని దిఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్దాస్చక్ గ్రామంలో గంగా నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో మునిగి మరణించారు. దర్భంగా జిల్లాలోని నెహ్రా అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్పూర్ గ్రామంలో కొందరు యువకులు ఛత్ పూజ అనంతరం జూదం ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో నీటితో నిండిన గోతిలో రోషన్ అనే యువకుడు పడిపోయి మృతి చెందాడు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! -
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి కన్నుమూత!
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సతీమణి రోజ్లిన్ కార్టర్(96) ఆదివారం స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతిపై అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటివరకూ ఏది సాధించినా దానివెనుక రోజ్లిన్ నాకు అండగా నిలిచారు. నేను నిరాశకు గురైనప్పుడల్లా, ఆమె నాకు ప్రోత్సాహాన్ని అందించారు. నాకు నిరంతరం మంచి సలహాలు ఇచ్చేవారు. ఆమె నాకు ఉత్తమ సలహాదారు’ అని పేర్కొన్నారు. గత ఏడాది(2022) మేలో ఆమెకు డిమెన్షియా అనే వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ఆమె చికిత్స అందుకుంటోంది. అయితే గత ఫిబ్రవరి నుంచి ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. జిమ్మీ తన పదవీకాలంలో ఇజ్రాయెల్- ఈజిప్టు మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారు. ఈ విజయంపై ప్రపంచ వేదికపై ఆయనకు ప్రశంసలు అందాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, ఇరాన్ వివాదాల కారణంగా జిమ్మీ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రోజ్లిన్ తన భర్తకు అండగా నిలిచారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం కార్టర్ దంపతులు కార్టర్ సెంటర్ అనే సంస్థను స్థాపించారు. జిమ్మీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ దంపతులు క్యూబా, సూడాన్, ఉత్తర కొరియాలను సందర్శించారు. జిమ్మీ కార్టర్కు 2002లో నోబెల్ శాంతి పురస్కారం లభించింది. 1999లో నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్.. కార్టర్ దంపతులను అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్తో సత్కరించారు. ఇది కూడా చదవండి: పాక్నూ కాటేస్తున్న వాయుకాలుష్యం -
సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా ఇండియా గ్రూప్ చైర్మన్ సహారాశ్రీ సుబ్రతా రాయ్ సహారా మంగళవారం ముంబైలో తుది శ్వాస విడిచారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం లక్నోలోని సహారా షహర్కు తరలించనున్నారు. అక్కడ అభిమానులు ఆయనకు నివాళులు అర్పించనున్నారు. రాయ్ మృతికి వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సహారా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘సహారా ఇండియా పరివార్ మేనేజింగ్ వర్కర్, చైర్మన్ సుబ్రతా రాయ్ సహారా మృతికి విచారం తెలియజేస్తున్నాం. దూరదృష్టి కలిగి, అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అయిన సహారాశ్రీ సుబ్రతా రాయ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. రాయ్ క్యాన్సర్తో పోరాడుతున్నారని’ దానిలో పేర్కొంది. నవంబర్ 12న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. సుబ్రతా రాయ్ సహారా 1948, జూన్ 10న జన్మించారు. సహారా ఇండియా పరివార్ను స్థాపించారు. బీహార్లోని అరారియా జిల్లాలో జన్మించిన సుబ్రతా రాయ్ కోల్కతాలోని హోలీ చైల్డ్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత గోరఖ్పూర్లోని ప్రభుత్వ సాంకేతిక సంస్థలో మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేశారు. సహారాశ్రీగా పేరొందిన ఆయన తన వ్యాపారాన్ని 1978లో గోరఖ్పూర్ నుండి ప్రారంభించారు. 2012లో ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలోని 10 మంది ధనవంతులలో సుబ్రతా రాయ్ పేరును చేర్చింది. నేడు సహారా గ్రూప్.. హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. సహారాశ్రీ మృతికి సమాజ్వాదీ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంగా ఒక పోస్ట్లో సమాజ్వాదీ పార్టీ సుబ్రతా రాయ్ మృతికి సంతాపం తెలిపింది. సహరాశ్రీ సుబ్రతా రాయ్ మరణం చాలా బాధాకరమని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇది కూడా చదవండి: ఒబెరాయ్ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత सहाराश्री सुब्रत रॉय जी का निधन, अत्यंत दुःखद। ईश्वर उनकी आत्मा को शांति दें। शोकाकुल परिजनों को ये असीम दुःख सहने का संबल प्राप्त हो। भावभीनी श्रद्धांजलि ! pic.twitter.com/QO6vAjriAv — Samajwadi Party (@samajwadiparty) November 14, 2023 -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి!
దేశరాజధాని ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, ఒక చిన్నారి సహా 26 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మంటలు చెలరేగినప్పుడు భవనంలో 60 మంది ఉన్నారని, వీరిలో కొందరు భవనంపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. కాగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 26 మందిని ప్రమాదం బారి నుంచి కాపాడారు. అలాగే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనంలో తొక్కిసలాట జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని కిటికీ పక్కన నిచ్చెనను ఏర్పాటు చేసి, ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఒక్కొక్కరిగా రక్షించారు. ప్రమాదం జరిగిన షకర్పూర్ ప్రాంతంలో వీధులు చాలా ఇరుకుగా ఉండడంతో మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: హమాస్ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా? -
జార్ఖండ్లో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి!
జార్ఖండ్లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక దుకాణంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన ధన్బాద్లోని కెందువాడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెవార్ పట్టిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేవర్ పట్టిలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ దుకాణంపైన ఒక ఇల్లు ఉంది. కొద్దిసేపటికే మంటలు ఆ ఇల్లంతా వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నిచ్చెన సాయంతో ఆ ఇంట్లోకి చేరుకుని, ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. కాగా దుకాణంపైనున్న ఇంటిలో షాపు యజమాని సుభాష్ గుప్తా, అతని తల్లి తల్లి ఉమా దేవి, భార్య సుమన్ గుప్తా, నాలుగేళ్ల కుమార్తె మౌళి, ఏడాదిన్నర కుమారుడు శివాన్స్, సోదరి ప్రియాంక గుప్తా, సోదరుడు సుమిత్ ఉంటున్నారు. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన సుభాష్ తల్లి, కూతురు, సోదరి చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమన్, సుమిత్, శివాన్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుభాష్, అతని తండ్రి అశోక్ ఇంట్లో లేరు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో వృద్ధనేతలు.. మాట తప్పిన పార్టీలు? -
తల్లి మందలించిందని.. ఇంట్లో నుంచి వెళ్లి.. చివరికి..
సాక్షి, సంగారెడ్డి/గజ్వేల్: తల్లి మందలించిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ బాలుడు మరునాడు కాలువలో శవమై తేలిన ఘటన మండల పరిధిలోని దాతర్పల్లిలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాయిని యాదగిరి–వాణి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వీరి పెద్దకొడుకు చరణ్(11) రిమ్మనగూడలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం తల్లిని డబ్బులు అడగడంతో చరణ్ను మందలించింది. దీంతో అతను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. మరుసటి రోజు గ్రామ సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలో చరణ్ మృతదేహం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలువ వద్దకు వెళ్లిన పిల్లవాడు ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: ఇద్దరు కుమారులను పక్కింట్లో వదిలి, ఇంటికెళ్లి.. నోట్ బుక్లో రాసి.. -
రెడీ మిక్స్ ప్లాంట్లో దారుణం
మణికొండ (హైదరాబాద్): ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్న రెడీమిక్స్ ప్లాంట్ను శుభ్రం చేస్తున్న కార్మికులను గమనించకుండా.. దానిని ఆపరేటర్ ఆన్ చేయటంతో వారు అందులోనే నుజ్జునుజ్జుగా మారి మృతి చెందిన విషాద ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మారంట బేటా సోరెన్ (30), సుశీల్ ముర్ము (29)లు పుప్పాలగూడలో టవర్ల నిర్మాణం చేస్తున్న ఏఎస్బీఎల్ స్పెక్ట్రా సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు విధులకు వెళ్లిన వారు రెడీమిక్స్ కాంక్రీట్ను మిక్స్ చేసే యంత్రంలోకి దిగి దానిని నీటితో శుభ్రం చేస్తున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెడీమిక్స్ ఆపరేటర్ ఆన్ చేశాడు. దాంతో మారంగ బేటా సోరెన్, సుశీల్ ముర్ము అందులో కూరుకుపోయి నుజ్జునుజ్జు మారి మృతి చెందారు. పక్కనే పనిచేస్తున్న వారి బంధువు మాజ్హి ముర్ము గమనించి వెళ్లి చూడగా ఇద్దరూ అప్పటికే మృతిచెందారు. అతనితో పాటు అక్కడే పని చేస్తున్న తోటి కార్మికులు, మృతుల బంధువులు నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఫరి్నచర్ ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. పాటు ఆపరేటర్పై దాడికి పాల్పడ్డారు. మాజ్హి ముర్ము ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.. పుప్పాలగూడ ఎస్బీఎల్ స్పెక్ట్రా నిర్మాణ సంస్థలోని రెడీమిక్స్ ప్లాంట్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి.పర్వతాలు, జిల్లా కార్యదర్శి ఎస్. మల్లేష్లు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వ చ్చిన కార్మికుల భద్రతకు నిర్మాణ సంస్థలు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు చట్ట ప్రకారం వచ్చే ఎక్స్గ్రేషియాను ఇవ్వాలన్నారు. -
ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది
దెయిర్ అల్ బలా (గాజా): ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ క్షిపణుల ధాటికి వందలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ఒక్క రోజే ఏకంగా 300 ‘లక్ష్యాలను’ ఛేదించినట్టు సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా శరణార్థుల ఆవాస ప్రాంతంలోని కనీసం ఆరు అపార్ట్మెంట్లను ఇజ్రాయెల్ రాకెట్లు కుప్పకూల్చాయి. ఈ దారుణంలో భారీగా జన నష్టం జరిగిందని హమాస్ ఆరోపించింది. మృతుల సంఖ్యపై ఇప్పటిదాకా స్పష్టత రాకున్నా వందల మంది చనిపోయి ఉంటారని చెబుతున్నారు. శిథిలాల దిబ్బల్లో తమవారి కోసం వెదుకుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. వీడియో ఫుటేజీల్లో రక్తమోడుతున్న ఇద్దరు బాలలను కొందరు యువకులు భుజాలపై వేసుకుని తీసుకొస్తూ కల్పించారు. మరోవైపు నుంచి ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఉత్తర గాజాపై శతఘ్నుల వర్షం కురిపిస్తున్నాయి. అక్కడి హమాస్ ఉగ్రవాద సంస్థ తాలూకు భూగర్భ నిర్మాణాలపై ప్రత్యక్ష దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పలుచోట్ల పెద్దపెట్టున కాల్పులు జరుగుతున్నాయి. ఉత్తర గాజాలో ఇంకా లక్షల మంది పాలస్తీనియన్లు చిక్కిపోయి ఉన్న నేపథ్యంలో ప్రాణ నష్టం ఏ స్థాయికి పెరుగుతుందోనంటూ సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినా హమాస్ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. ఐరాస సహాయక సంస్థలకు చెందిన 64 మంది సిబ్బంది ఇప్పటిదాకా దాడులకు బలయ్యారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది తమ సిబ్బంది మరణించడం ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ పోరులోనూ జరగలేదని ఐరాస అధికార ప్రతినిధి వాపోయారు. ఇప్పటిదాకా పోరుకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 9,000 దాటినట్టు తెలుస్తోంది. హమాస్ అగ్ర నేత హతం! మంగళవారం వెస్ట్బ్యాంక్లో హమాస్ అగ్ర నేత సలేహ్ అల్ అరౌరీ నివాసాన్ని నేలమట్టం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడిలో అతను కూడా మరణించి ఉంటాడని భావిస్తున్నారు. అక్టోబర్ ఏడో తేదీన ఇజ్రాయెల్పై హమాస్ భారీ మెరుపుదాడికి పథక రచన చేసిన హమాస్ ఉత్తర డివిజన్ కమాండర్ నసీమ్ అబు అజీనా కూడా తమ యుద్ధవిమానాల దాడిలో హతమైనట్టు సైన్యం పేర్కొంది. సైనికురాలి విడుదల హమాస్ చెర నుంచి ఒరీ మెగిదీష్ అనే తమ సైనికురాలిని విజయవంతంగా విడిపించుకున్నట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది. ఆమెను అక్టోబర్ 7న మెరుపుదాడి సందర్భంగా ఉగ్రవాదులు అపహరించినట్టు వివరించింది. ఆమె తన కుటుంబ సభ్యులతో ఉన్న తాజా ఫొటోను ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. హమాస్ చెరలో ఇంకా 240 మందికి పైగా బందీగా ఉన్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. సముద్రమార్గంలో సాయం: సైప్రస్ అత్యవసరాలకు కూడా దిక్కు లేక అల్లాడుతున్న గాజావాసులను ఆదుకునేందుకు సైప్రస్ ముందుకొచ్చింది. ఐరోపా సమాఖ్య, మధ్య ప్రాచ్య దేశాలు సహకరిస్తే సముద్రమార్గ నడువా(సీ కారిడార్) ఏర్పాటు చేసి నిత్యావసరాలను గాజాకు చేరవేస్తామని ప్రకటించింది. -
ఏకంగా 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది! ఆల్మోస్ట్ డెడ్ కానీ..
మృత్యువు ఒడిలోకి వెళ్లి కూడా బతికి వస్తే వాట్ ఏ మిరాకిల్ అనుకుంటాం. మన కళ్లను మనమే నమ్మలేని కఠిన నిజం గందరగోళానికి గురి చేసేలా మన కళ్లముందు మెదిలాడుతుంది. ఆ క్షణం మన ఆనందానికి అవధులుండవు. అలాంటి ఓ అద్భుత ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. యూఎస్లోని టీనా అనే ఓ మహిళ కార్డియాక్ అరెస్టుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాదాపు 27 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. ఓ వైపు శరీరం నీలం రంగులోకి మారిపోతుంది కూడా. ఇంతలో ఆమె భర్త ఆమెను బతికించేలా చేస్తున్న సీపీఆర్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అంబులైన్స్ని పిలిపించి ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. అంతేగాదు ఆస్పత్రికి వెళ్లే మార్గంలో సైతం ఆమెను బతికించేలా ఆక్సిజజన్ అందించి గుండె పనిచేశాల చేసే ప్రథమ చికిత్సల్లో వేటికి ఆమె స్పందించలేదు. చివరికి ఆస్పత్రిలో వైద్యుల సైతం ఆమె చనిపోయిందని డిసైడ్ అయ్యారు. ఆల్మోస్ట్ ఓ శవం మాదిరి నిర్జీవంగా పడి ఉంది టీనా. దీంతో వైద్యులు చివరి ప్రయత్నంగా డీఫిబ్రిలేటర్తో షాక్ ఇద్దాం అని డిసైడ్ అయ్యి ఇస్తే..ఏదో నిద్రలో మెల్కోన్నట్లు కళ్లు తెరించింది. ఆ హఠాత్పరిణామానికి వైద్యులు సైతం సభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అసలు చలనం లేకుండా శవంలా పడి ఉంది. స్పదించదని తెలిసే జస్ట్ అలా కరెంట్ షాక్ ఇచ్చామని చెబుతున్నారు వైద్యులు. ఐతే కళ్లు తెరిచి చూసింది గానీ ఏం మాట్లాడలేకపోయింది. ఈ తంతంగమంతా చూస్తున్న ఆమె సభ్యులు కూడా విస్తుపోయారు. నిజంగా ఆమె బతికిందా దెయ్యమా? అన్నంత టెన్షన్గా చూశారు ఆమెను. ఆమె ఏం మాట్లాడలేదని వైద్యుల కుటుంబంసభ్యులకు చెప్పడంతో అంతా సైలెంట్గా ఉన్నారు. ఆమెకు ఒక పుస్తకం, పెన్ను ఇచ్చి నీకు ఏం జరిగిందో లేక గుర్తున్నది అందులో రాయమని సూచించారు. చనిపోయి బతికావని తెలుసా అని వైద్యులు అడగగా..ఔను! ఒక్కసారిగా చలనం లేకుండా పడి ఉన్నట్లు అనిపించిందని ఎంత ప్రయత్రించినా మేల్కొలేకపోతున్నట్లు తెలిసిందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి ఇలా జరిగినప్పుడు ఆక్సిజన్ బ్రెయిన్కి అందక మెదడులో బ్లీడింగ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అందువల్ల బతకదని తేల్చి చెప్పాం అన్నారు. ఆమె బతికినా బ్రెయిన్కి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో పరీక్షలు చేసినా వాటి తాలుకా గాయాలు ఏం కనిపించకపోవడం వైద్యులను మరింత ఆశ్చర్యపరిచింది. దీంతో ఆమెను మరో నాలుగు రోజులు పూర్తి అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. (చదవండి: ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!) -
ఆక్టోపస్ రెసిపీ తిని వ్యక్తి మృతి!
విదేశాల్లో కొన్ని రకాల సముద్ర జాతులు చూసేందుకే చాలా భయంకరంగా ఉంటాయి. ఐతే వాటిని కొంతమంది తింటుంటారు. ఇలాంటివి తినేటప్పుడూ అజాగ్రత్తతో తింటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అలానే ఓ వృద్దుడు లైవ్ ఆక్టోపస్ని తింటూ.. కొద్ది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయాడు. అసలు ఎలా జరిగింది? ఏవిధంగా చనిపోయాడు తదితరాల గురించే ఈ కథనం!. అసలేం జరిగిందంటే..ఆక్టోపస్ ఎలా ఉంటుందో తెలిసిందే. మెలికలు తిరిగిన కాళ్ల మాదిరి చాలా ఉంటాయి. అది వాటితోటే ఏదైన జీవిపై అటాక్ చేసి చంపి తింటుంది. దక్షిణ కొరియాకు చెందిన 82 ఏళ్ల వృద్ధుడు ఆక్టోపస్లతో చేసే ప్రముఖ సాన్ నాజ్కి వంటను ఆస్వాదించాడు. ఈ వంకాన్ని పచ్చిగా ఉన్న ఆక్టోపస్ మాంసలపై నువ్వులు వేసి కొన్ని రకాల సుగంధద్రవ్యాలను కలిపి నేరుగా తినేస్తారు. ఆ వృద్ధుడు కూడా ఇలానే తిన్నాడు వృద్ధుడు. ఐతే అతను తింటున్నప్పుడూ ఆ ఆక్టోపస్కు ఉండే టెన్టకిల్స్(కాళ్ల మాదిరిగా ఉండే భాగాలు) మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఆనందంగా తినడంపైనే దృష్టి పెట్టాడు. ఇంతలో ఆ టెన్టకిల్ ముక్క ఒకటి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్ట్కు గురై చనిపోయాడు. అందుకే ఆరోగ్య నిపుణులు పలుమార్లు ఈ ఆక్టోపస్ రెసిపీలు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ చాలామంది ఇలానే వ్యవహరించి ప్రాణాలపై తెచ్చుకుంటున్నారని అన్నారు. నిజానికి ఇలా లైవ్ ఆక్టోపస్ రెసిపీని 2003లో దక్షిణ కొరియాలో ఓ సినిమా నటుడు చేసి చూపించటంతో ఒక్కసారిగా ఈ రెసిపీ అందరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో అందరూ ఇలానే టేస్ట్ చేయడం ప్రారంభించారు. ఇలా లైవ్ ఆక్టోపస్ డిషిని తిని సుమారు ముగ్గురు వ్యక్తులు చనిపోయారు కూడా. వాస్తవానికి సజీవంగా ఉన్న ఆక్టోపస్ ముక్కలు చేసినా.. దాని భాగాలు ఇంకా కదులుతూనే ఉంటాయి. అందులోని ఈ రకమైన సాన్నాజ్కి డిష్ని వండకుండా పచ్చిగానే తింటారు. అలాంటప్పుడు అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక కార్డియాక్ అరెస్టు గురవ్వడం జరుగుతోంది. ఊపిరాడకపోతే కార్డియాక్ అరెస్టు జరుగుతుందా..? ఒక వస్తువు గొంతులో ఇరుక్కుపోతే వాయు మార్గాన్ని మూసేస్తుంది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. దీంతో ఒక్కసారిగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ప్రభావం ఏర్పడుతుంది. అలాంటప్పుడు సమీపంలో ఉన్నవాళ్లు బాధితులకు ఊపిరి ఆడేలా ఆక్కిజన్ అందించేలా చూడాలి. లేదా ఆ అడ్డంకి తొలగించే యత్నం అయినా చేయాలి. కొందరికైతే గొంతులో ఇరుక్కుపోయి పెద్ద పొలమారిన దగ్గులా వచ్చి రక్తపోటు పెరగిపోవడం జరుగుతంది. చివరికి గుండె మీద ప్రభావం ఏర్పడి ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే గొంతులో ఉన్న అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేసీ సీపీఆర్ చేస్తే మనిషి బతికే అవకాశాలు ఉంటాయి. (చదవండి: రైస్ వల్ల షుగర్ లెవల్స్ పెరగవు!.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
ప్రముఖ నటి ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ కోలీవుడ్ నటి ఇంట్లో విషాదం నెలకొంది. నటి బాబిలోనా సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ ఇటీవల చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రితీలో మృతి చెందారు. విఘ్నేష్ వయస్సు 40 ఏళ్లు కాగా.. ప్రస్తుతం చెన్నైలోని సాలిగ్రామం దశరథపురం అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో విగతజీవిగా పడి ఉన్న విఘ్నేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాబిలోనా సోదరుడిని కొద్ది రోజుల క్రితం చెన్నైలోని వలసరవాక్కంలో సాధారణ పెట్రోలింగ్లో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. విఘ్నేష్కు క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలోనూ అతను అనేక నేరాలకు పాల్పడినట్లు సమాచారం. కాగా.. నటి బాబిలోనా శాస్త్ర (2000), ఇష్క్ కా ఆచార్ (2004), లెవెల్ క్రాస్ (2002) వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నిర్మలా ఆంటీ అనే చిత్రంలో కనిపించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి కాగా.. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. -
రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా?
చాలామందికి రాత్రిళ్లు అకస్మాత్తుగా ఉన్నటుండి చెమటుల పడుతుంటాయి. చాలమంది వేడి చేసిందనో మరేదో సాకుతో కొట్టిపడేస్తారు. సీరియస్గా తీసుకోను కూడా తీసుకోరు. ఒక్కొసారి నలతగా ఉన్న ఇలా ఉంటుంది కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యమే మన ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకు ఉదహారణే యూకేకు చెందిన వ్యక్తి యూకేలోని బార్న్స్లీలో క్లర్క్గా పనిచేస్తున్న 48 ఏళ్ల ఫిర్త్కి రాత్రిళ్లు ఉన్నటుండి చెమటలు పట్టేసేవి. ఒళ్లునొప్పులు వల్ల అయ్యి ఉండొచ్చని, పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇలానే తరుచుగా అనిపించడంతో చివరికి ఓ రోజు డాక్టర్ని సంప్రదించాడు. ఫిజియోథెరపీ తీసుకుంటే తగ్గిపోతుందనే అనుకున్నాడు. అదే విషయాన్ని వైద్యుడితో కూడా చెప్పాడు. కానీ వైద్యులు అనుమానంతో ఫిర్త్కి కొన్ని వైద్య పరీక్షయలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు మైలోయిడ్ లుకేమియా అనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇలా చెమటు పట్టడానికి ఈ క్యాన్సర్ కారణంగాననే తేలింది. కానీ ఫిర్త్ తేలిగ్గా తీసుకోవడం కారణంగా ఆ క్యాన్సర్ స్టేజ్ కూడా దాటింది. ఈ వ్యాధి నిర్ధారణతో ఫిర్త్ కుటుంబ విలవిలలాడింది. అతడి భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఏదో రకంగా బతకాలని ధైర్యం తెచ్చుకుని మరీ కీమోథెరఫీ చికిత్సలు తీసుకున్నాడు. అయితే ఈ క్యాన్సర్కి స్టెమ్ సెల్స్ మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం. కానీ ఫిర్త్కి స్టెమ్సెల్ మార్పిడి చేయాలంటే కనీసం శరీరంలో 5%కి కంటే తక్కువ క్యాన్సర్ కణాలు ఉండాలి. ఫిర్త్ రెండు రౌండ్లు కీమో థెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో 40%కి పైగా క్యాన్సర్ కణాలు ఉన్నాయి. అందువల్ల స్టెమ్స్ మార్పిడి అనేది ఫిర్త్కి అత్యంత ప్రమాదం అవుతుంది. దీంతో అతడు జీవించే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. చివరికి ఫిర్త్ జూలై 9, 2020న విషాదకర రీతిలో మరణించాడు. ఇలా ఫిర్త్లా చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇలా చెమటలు ఉన్నట్టుండి పడుతున్నా లేదా వాతావరణం చల్లగా ఉన్నా మీకు మాత్రం ఎడతెగని చెమటు పడుతున్నా.. అస్సలు అలక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు క్యాన్సర్ సంకేతాలు కూడా కావొచ్చనని, సాధ్యమైనంత వరకు బీ కేర్ఫుల్గా ఉండాలని నొక్కి చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మాంసం తినే పరాన్నజీవి ఓ మహిళను శాశ్వతంగా అంధురాలిని చేసింది!) -
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి!
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, ఓవర్టెక్ తదితర కారణాలతో వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు(మంగళవారం) తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువన్నామలై వద్ద ఓ టాటా సుమోను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంగం-కృష్ణగిరి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన టాటా సుమోలో ఉన్నవారంతా అసోం రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. వీరంతా తిరువన్నామలై అన్నామలైయార్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు -
అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు?
కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు చాలామంది ఉండేవారు. ఆ క్రూరమైన నియంతలలో అతనిపేరు తప్పుక వినిపిస్తుంది. హిట్లర్ నియంతృత్వ పోకడల గురించి మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు మనం ‘ఉగాండా కసాయి’గా పేరొందిన ఒక నియంత గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నియంతకు మృతదేహాలతో జీవించడమన్నా, మనిషి మాంసం తినడమన్నా ఎంతో ఇష్టమట. ఈ ‘ఉంగాండా కసాయి’ పాలనలో లక్షలాది మంది హత్యకు గురయ్యారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం ఉగాండా నియంత ఈదీ అమీన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈదీ అమీన్ 1972లో ఉగాండాలో నివసిస్తున్న వేలాది మంది ఆసియావాసులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించించాడు. ఇదీ అమీన్ 130 కిలోలకు మించిన బరువు కలిగివుండేవాడు. ఎత్తు 6 అడుగుల నాలుగు అంగుళాలు. ఈ ‘ఉగాండా కసాయి’కి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ అత్యంత క్రూరమైనవాడు. అతని పేరు చెప్పగానే జనం వణికిపోయేవారు. ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. ఇంతేకాదు ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడాన్ని ఇష్టపడేవాడట. చిరుతపులి మాంసం కంటే మానవ మాంసమే బాగుంటుదని అమీన్ ఓ వైద్యునితో చెప్పాడట. ఇది కూడా చదవండి: ‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి? -
ఓ యువకుడు పండుగ సెలవులకి వచ్చి.. ఒక్కసారిగా ఇలా..!
సాక్షి, వరంగల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని గండిరామారంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీల రాజు కుమారుడు నీల అజయ్ (17) హనుమకొండ కృష్ణవేణి కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. పండుగ సెలవులు కావడంతో గురువారం గ్రామానికి చేరుకున్నాడు. ఈక్రమంలో తమ వ్యవసాయ బావివద్ద పంటచేనులోకి వచ్చిన కోతులను వెళ్లగొట్టే క్రమంలో పక్కపొలంలోని రైతు అడవిపందుల నుంచి రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికిగురై మృతిచెందాడు. కాగా ఈ విషయమై ఎస్సై కన్నెబోయిన శ్రీకాంత్ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. -
జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఒక్కసారిగా ఇలా అవ్వడంతో..
ఖమ్మం: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన జూనియర్ డాక్టర్ సుమ (23) డెంగీ జ్వరంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. సుమ హైదరబాద్లో ఓ ప్రైవేట్ వైద్యశాలలో జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి డెంగీ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా మారి గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహాన్ని హైదరబాద్ నుంచి సీతానగరం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. సుమ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: దయచేసి.. మా కుమారుడిని కాపాడండి! -
గాజాపై భూతల యుద్ధం!
జెరూసలేం/వాషింగ్టన్: చుట్టూ ఎటు చూసినా శిథిలాలు.. వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, రాత్రయితే కరెంటు లేక చిమ్మచీకటి, మరోవైపు మృత్యువు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో, రాకెట్లు, డ్రోన్లు ఎప్పుడు వచ్చిపడతాయో, ఎవరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయోనన్న భయాందోళన. గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ. ఆహారం కోసం జనం దుకాణాలు, బేకరీల ముందు బారులు తీరుతున్నారు. చాలావరకు అవి ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో తిండిగింజలు, నిత్యావసరాలు ఎప్పుడో నిండుకున్నాయి. గాజా ప్రజలకు ఆకలి తీర్చుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. చిన్న పిల్లల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాజా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా జనం ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆరో రోజు గురువారం కూడా కొనసాగింది. ఇరుపక్షాల మధ్య పోరు ఉధృతంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగించింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. ఇరువర్గాల మధ్య యుద్ధంలో మృతుల సంఖ్య 2,600కు చేరింది. గాజాలో 1,350 మందికిపైగా జనం మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తమ దేశంలో 222 మందిసైనికులు సహా 1,300 మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ పదాతి దళాలు సన్నద్ధం హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఇక భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి, ప్రతి ఇల్లూ గాలిస్తూ మిలిటెంట్లను ఏరిపారేయడానికి మిలటరీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను సమూలంగా నిర్మూలించడమే ఆశయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తమ పదాతి దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే మిగిలి ఉందని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ చెప్పారు. గ్రౌండ్ ఆపరేషన్ కోసం 3.60 లక్షల మంది రిజర్వ్ సైనికులను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లోని యూదుల కాలనీలను ఖాళీ చేయించింది. యూదులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. భూతల దాడుల వల్ల గాజాలో మరణాలు భారీగా పెరుగుతాయని, సామాన్య ప్రజలు బలైపోతారని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పునరాలోచన చేయాలని కోరుతున్నాయి. సిరియా ఎయిర్పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు సిరియాలోని రెండు విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ సైన్యం గురువారం వైమానిక దాడులు నిర్వహించింది. రాజధాని డమాస్కస్తోపాటు అలెప్పీలోని ఎయిర్పోర్టులపై ఈ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్కు సిరియా అండగా నిలుస్తున్న సంగతి విదితమే. సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు జరుగుతున్నాయి. సిరియాకు చేరుకోవాల్సిన ఇరాన్ విమానాన్ని ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్కు మళ్లించారు. ఈ విమానంలో ఇరాన్ దౌత్యవేత్తలు ఉన్నట్లు సమాచారం. బందీలను విడుదల చేస్తేనే.. 40 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్న గాజాలో 20 లక్షల మందికిగా జనం నివసిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు. గాజాకు ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను ఇజ్రాయెల్ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది. కరెంటు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడుదల చేయాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. బందీలను విడుదల చేసేంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ గురువారం హెచ్చరించారు. బందీలంతా విడుదలై, క్షేమంగా ఇళ్లకు చేరుకున్న తర్వాతే గాజాకు ఆహారం, నీరు, కరెంటు అందుతాయని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మిలిటెంట్ల చేతిలో 150 మందికిపైగా బందీలు ఉన్నట్లు తెలుస్తోంది. హమాస్ను నలిపేస్తాం: నెతన్యాహూ పాలస్తీనా సాయుధ తిరుగుబాటు సంస్థ ‘హమాస్’ను నలిపి పారేస్తామని, పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రతినబూనారు. తమ దేశంపై దాడి చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న హమాస్పై ఆయన నిప్పులు చెరిగారు. హమాస్లోని ప్రతి సభ్యుడికి ఇక చావే గతి అని తేలి్చచెప్పారు. నెతన్యాహూ బుధవారం రాత్రి టీవీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్లో శనివారం హమాస్ మిలిటెంట్లు సాగించిన రాక్షసకాండను వివరించారు. అంతకుముందు ఆయనతో ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ సమావేశమయ్యారు. హమాస్పై యుద్ధాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి వీలుగా వార్–టైమ్ కేబినెట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కేబినెట్కి నెతన్యాహూ నేతృత్వం వహిస్తారు. అండగా ఉంటాం: బ్లింకెన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ గురువారం ఇజ్రాయెల్లో పర్యటించారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇజ్రాయెల్కు అమెరికా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తనను తాను కాపాడుకొనే హక్కు ఇజ్రాయెల్కు ఉందన్నారు. బ్లింకెన్ శుక్రవారం పాలస్తీనా అధినేత మహమ్మద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో సమావేశం కానున్నారు. పాలస్తీనియన్లకు చట్టబద్ధమైన ఆకాంక్షలు ఉన్నాయని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. -
ఈజిప్టులో ఇజ్రాయెల్ పర్యాటకులపై కాల్పులు
ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఒక పోలీసు అధికారి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా హమాస్ మధ్య శనివారం ఉదయం నుండి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన దాడిలో మరొక వ్యక్తి గాయపడ్డాడు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితున్ని అదుపులోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. ఇదీ చదవండి: Israel-Palestine War: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు -
బిల్డింగ్ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులకు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడానికి కారణం అవి భవనాన్ని ఢీకొని కింద పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ మాట్లాడుతూ భవనం సమీపంలో పక్షులు నేలకొరిగాయని తెలిపారు. వీటిలో మృతిచెందిన, గాయపడిన పక్షులు ఉన్నాయి. దాదాపు 1.5 మిలియన్ పక్షులు ఇక్కడి నుంచి వలస వెళుతుంటాయి. వీటిలో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్లు, అమెరికన్ వుడ్కాక్స్, ఇతర రకాల సాంగ్బర్డ్లు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో కిటికీలకు తగిలి చనిపోయే పక్షులపై పరిశోధన చేసిన బ్రెండన్ శామ్యూల్స్.. కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చన్నారు. అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొనడంతో చనిపోతున్నాయన్నారు. పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు, భయపడి కిందపడి చనిపోతాయన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు గాయపడతాయన్నారు. భవనాల లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం పక్షుల మరణాలను తగ్గించడానికి ఒక మార్గంమని పేర్కొన్నారు చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గుతుందని తేలింది. ఇది కూడా చదవండి: బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? -
HYD: జూపార్క్లో ఏనుగు దాడి.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రు జూపార్క్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూపార్క్లోని ఓ ఏనుగు దాడిలో దాని కేర్ టేకర్ మృతి చెందాడు. వివరాల ప్రకారం.. నెహ్రు జూపార్క్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కాగా, ఏనుగు దాడిలో కేర్ టేకర్ షెహబాజ్ మృతిచెందాడు. ఏనుగు దాడి అనంతరం, షెహబాజ్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: నాకు బతకాలని లేదు. ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకపోవడంతో... -
సబ్మెరైన్ ప్రమాదం.. 55 మంది చైనా నావికులు మృతి
ఎల్లో సముద్రంలో చైనా న్యూక్లియర్ సబ్మెరైన్కు జరిగిన ప్రమాదంలో 55 మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. విదేశీ నావల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్మెరైన్ చిక్కుకున్నట్లు యూకే ఇంటెలిజెన్స్ విభాగాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతిన్న కారణంగా సబ్మెరైన్ విషపూరితంగా మారి నావికులు చనిపోయినట్లు వెల్లడించాయి. చైనా నావికాదళానికి చెందిన 093417 సబ్మెరైన్ ఆగష్టు 21న ఉదయం 8:12 సమయంలో ఎల్లో సముద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ నౌకల కోసం ఆర్మీ ఏర్పాటు చేసిన ఉచ్చులో సబ్మెరైన్ చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతింది. ఉపరితలానికి రావడానికి కనీసం ఆరు గంటలు పాడుతుంది. కానీ అప్పటికే సబ్మెరైన్ విషపూరితంగా మారి 55 మంది నావికులు మరణించారు. ఇందులో 22 మంది అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై చైనా స్పందించలేదు. ప్రమాద సమాచారాన్ని చైనా ఖండించింది. తప్పుడు సమాచారంగా ప్రకటించింది. తైవాన్ కూడా ఈ ఘటనను ఖండించింది. సబ్మెరైన్ జాడ కనిపెట్టడానికి కూడా అంతర్జాతీయ సహకారాన్ని చైనా ఖండించింది. గత 15 ఏళ్లుగా సబ్మెరైన్ సేవల్లో ఉన్నట్లు యూకే అంటెలిజెన్స్ విభాగాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: అంతరిక్షంలో చెత్త వదిలినందుకు రూ.1.24 కోట్ల జరిమానా -
ఏషియన్ పెయింట్స్ అశ్విన్ డాని కన్నుమూత
ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ (Asian Paints) నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్ సభ్యుడు, బిలియనీర్ అశ్విన్ డాని (Ashwin Dani) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతదేశపు అతిపెద్ద పెయింట్ తయారీ కంపెనీ అయిన ఏషియన్ పెయింట్స్ నలుగురు సహ-వ్యవస్థాపకులలో ఒకరైన డాని మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత పొందారు. ఆసియాలోని అతిపెద్ద పెయింట్ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఏషియన్ పెయింట్స్లో అశ్విన్ డాని 1968లో చేరారు. ఈ కంపెనీని అతని తండ్రి సూర్యకాంత్ డాని, మరో ముగ్గురు 1942లో స్థాపించారు. డాని కుమారుడు మాలావ్ కూడా కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం.. 2023 నాటికి అశ్విన్ డాని నికర విలువ 7.1 బిలియన్ డాలర్లు (రూ. 59 వేల కోట్లు). ఏషియన్ పెయింట్స్ హోమ్ పెయింటింగ్ సేవలతోపాటు ఇంటీరియర్ డిజైన్ సర్వీస్ను కూడా అందిస్తోంది. అశ్విన్ డాని కన్నుమూతతో గురువారం (సెప్టెంబర్ 28) ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ షేర్లు ట్రేడింగ్లో 4 శాతానికి పైగా పడిపోయాయి. -
విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు..
సాక్షి, మెదక్: మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి నలుగురు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లిన ఓ బాలుడు చెరువులో మునిగిపోయాడు. ఈ క్రమంలో చెరువులో మునిగిపోతున్న బాలుడిని ఓ మహిళ కాపాడబోయింది. దీంతో, సదరు మహిళ కూడా చెరువులో పడి మునిగిపోయింది. వీరిద్దరూ గమనించిన మరో ఇద్దరు మహిళలు వీరిని కాపాడబోయి.. చెరువు నీటిలో మునిగి మృతిచెందారు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం, స్థానికుల సహాయంలో ముగ్గురు మహిళ మృతదేహాలను బయటకు తీశారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది కూడా చదవండి: విషాదాన్ని మిగిల్చిన ప్రయాణం -
ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..
చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది.. గమ్మత్తైన ప్రశ్న. దీన్ని శోధించడం కోసం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే ఓ అమెరికా శాస్త్రవేత్త చనిపోయిన తర్వాత ఏం జరగుతుందో..ఆత్మ ఏం చేస్తుందో వంటి షాకింగ్ విషయాలు వెల్లడించాడు కూడా. అందుకోసం దాదాపు 5 వేల మరణాలపై అధ్యయనం చేసినట్లు కూడా వివరించాడు. కానీ ఇక్కడొక వ్యక్తి చావుని చూసి..అంటే..చనిపోయినట్లు డిక్లరయ్యి ఎలాంటి ఆశ లేకుండా.. బతికే అవకాశం కోసం చేస్తున్న వైద్యుల ప్రయత్నాల ఉత్కంఠ నడుమ కోవాలో ఉండి మరీ బతికి బట్టగట్టగలిగాడు. ఆ సమయంలో ఏం జరుగుతుంది..అలాగే తాను నిర్జీవంగా పడిఉన్న సమయంలో చుట్టూ ఏం జరుగిందో పూసగుచ్చినట్లు వివరించాడు. అదే అతనికి ఒకరకంగా జీవితం విలువను తెలిసేలా చేసిందని ఉద్వేగంగా చెబుతున్నాడు. అసలేం జరిగిందంటే..బ్రిటీష్ రంగస్థల నటుడు, కళకారుడు శివ్ గెర్వాల్ తన భార్యతో కలిసి ఎప్పుడులానే భోజనం చేస్తున్నాడు. ఏమైందో ఏమో సడెన్గా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అతడి భార్యకు కాళ్లు చేతులు ఆడలేదు. వెంటనే అంబులెన్స్కి కాల్చేసి అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ సమయంలో అతడి గుండె ఆల్మోస్ట్ ఆగిపోయింది. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు ఏదైనా ప్రథమ చికిత్స చేద్దామనుకుంటే దేనికి రెస్పాండ్ కాలేదు. అంబులెన్స్లో ఉండే సిబ్బంది కూడా ఫస్ట్ ఎయిడ్ చేద్దామనుకుంటే గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. వాళ్లు కూడా చేసేది ఏంలేదని తెలిసి చాలా స్పీడ్గా ఆస్పత్రికి తరలించారు. చెప్పాలంటే శివ్ గెర్వాల్ గుండె దాదాపు ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడ వైద్యులు కూడా అతడి పరిస్థితి క్రిటికల్ అని చెప్పేశారు. అక్కడ వైద్యుల అతడిని బతికించే నిమిత్తం గుండెని కొట్టుకునేలా సీపీర్ చేశారు. ఆ తర్వాత సర్జరీ చేసి గుండెకి అడ్డుపడుతున్న ధమనికి స్టంట్ వేశారు. అతను సుమారు ఓ నెలపాటు కోమాలోనే ఉన్నాడు. విచిత్రమేమిటంటే గెర్వాల్కి ఆ టైంలో తన చుట్టు ఏం జరుగుతుందో తెలిసింది. తాను ఏదో అఛేతనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా బతకాలి నా భార్యతో మాట్లాడలనే ఆత్రుత అతడిలో చలనం తెప్పించి కోమాలోంచి బయటకు వచ్చేలా చేసింది. వైద్యలు సైతం అతడు బతుకుతాడని బావించలేదు. ఓ ప్రయత్నంగా వైద్యులు చేసిన ఆపరేషన్, మరోవైపు గెర్వాల్ బతకాలని తపన పడుతున్న భార్య ఆకాంక్ష వెరసి అతడికి పునర్జన్మనిచ్చాయి. అతడిని ఆ మృత్యుముఖం నుంచి బయటకొచ్చేలా చేసింది. కోలుకుని తాను ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక ఆ టైంలో ఏం జరిగింది, తన గుండె ఎలా ఆగిపోయింది తదితరాలను చెబుతూ అందర్నీ షాక్కి గురిచేశాడు. మరణాంతరం ఏం జరుతుందో గుదిగుచ్చినట్లు వివరించాడు. మరణాంతరం ఏ జరుగుతుందనే ఆ అనుభవమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు అంతేగాదు తన గుండె ఆగిపోయినప్పుడూ జరిగిన ప్రతిదాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని దాన్ని ఓ కళగా చిత్రకరించేందుకు ప్రయత్నిస్తున్నాని చెబుతున్నారు. ప్రసుతం తాను మరణాంతరం తిరిగి పొందిన జీవితాన్ని అనుభవిస్తున్నాని సంతోషంగా చెబుతున్నాడు. ఇది ఒకరకంగా మరణం గురించి భయం లేకుండా ధైర్యంగా ఉండేలా చేసింది. అంతేగాదు ఈ అనుభవం జీవితంలో ప్రతిక్షణం ఎంత విలువైందో తెలిసి వచ్చేలా చేసింది. ఈ రోజు నేను ఇక్కడ బతికిబట్టగలిగి ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమేగాక సంతోషంగా ఉందని అన్నారు. View this post on Instagram A post shared by shiv grewal (@artshivinder) (చదవండి: జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!) -
పొడవు జుట్టుంటే మహిళ మృతదేహమేనా? పోస్టుమార్టంలో ఏం తేలింది?
యూపీలోని బస్తీలో పోలీసుల నిర్లక్ష్యం మరోమారు కనిపించింది. పోలీసులకు లభ్యమైన ఒక మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో అది మహిళ మృతదేహంగా భావించి, పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే పోస్టుమార్టం సమయంలో వైద్యులు ఆ మృతదేహాన్ని చూసి హడలిపోయారు. పోలీసుల పేర్కొన్నట్లు అది మహిళ మృతదేహం కాదని, పురుషునిదని వారు గుర్తించారు. వివరాల్లోకి వెళితే మూడు రోజుల క్రితం పోలీసులకు ఒక అనాథ మృతదేహం లభ్యమయ్యింది. అది గోనె సంచీలో కట్టివేసివుంది. ఆ మృతదేహానికి పొడవైన జుట్టు ఉంది. దీంతో వారు అది మహిళ మృతదేహమని నిర్ధారిస్తూ, దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే వైద్యులు ఆ మృతదేహాన్ని పరిశీలించి అది పురుషునిదని గుర్తించారు. పోలీసులు చేసిన తప్పిదాన్ని నిరసిస్తూ, వారు పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. మరోమారు పంచనామా చేసిన అనంతరమే పోస్టుమార్టం నిర్వహిస్తామని వారు తేల్చిచెప్పారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబౌలియా పోలీస్స్టేషన్ పరిధిలోని గోకుల్పూర్లో రోడ్డు పక్కన పోలీసులకు సంచీలో బంధించిన మృతదేహం లభ్యమయ్యింది. ఆ మృతదేహం అప్పటికే కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో విపరీతంగా దుర్ఘందం వెలువడుతోంది. ఆ మృతదేహానికి ఉన్న జుట్టు ఆధారంగా పోలీసులు దానిని మహిళ మృతదేహంగా భావించి, దర్యాప్లు ప్రారంభించారు. కాగా ఇంతవరకూ అది ఎవరి మృతదేహమనేది తెలియరాలేదు. ఇది కూడా చదవండి: కుమారుని బర్త్డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి! -
కుమారుని బర్త్డే కేక్ కట్ చేస్తూ తండ్రి మృతి!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒక కాలనీలో కుమారుని బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఉందంతం స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది. లక్నోలోని ములాయం నగర్లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సుశీల్శర్మ(45) తన భర్య కిరణ్, పిల్లలు సాక్షి, సార్థక్, మన్నత్లతో పాటు స్థానికంగా ఉంటున్నాడు. తాజాగా సునీల్ శర్మ తన కుమారుడు సార్థక్ పుట్టినరోజు సంద్భంగా కేక్ కట్ చేస్తుండగా కళ్లుతిరిగి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. సునీల్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య కిరణ్ మాట్లాడుతూ తమపై 22 లక్షలు రుణం ఉందని, ప్రతీనెల రూ. 70 వేలు కడుతున్నామని తెలిపారు. అయితే ఈనెల సొమ్ము కట్టలేకపోవడంతో అప్పు ఇచ్చినవారు ఘోరంగా అవమానించారని, దీంతో తన భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడని పేర్కొన్నారు. మృతుని భార్య కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: బావిలోకి తోసి.. భార్య విలవిలలాడుతుంటే వీడియో తీసి.. -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
గాలి తగిలితే వణుకు, నీటిని చూస్తే భయం.. రేబిస్తో 14 ఏళ్ల బాలుడు మృతి!
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో రేబిస్తో 14 ఏళ్ల బాలుడు హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. నాలుగు రోజుల క్రితం బాలునిలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. గాలికి, నీటికి భయపడటంతో పాటు చీకటిలో ఉండేందుకు ఇష్టపడసాగాడు. పిల్లాడి విచిత్ర ప్రవర్తన, అనారోగ్య పరిస్థితులను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఈ ఉదంతం విజయ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చరణ్సింగ్ కాలనీలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన యూకూబ్ పెద్ద కుమారుడు సాబేజ్ను నెల రోజుల క్రితం కుక్క కరిచింది. భయం కారణంగా సాబేజ్ ఈ విషయాన్ని ఇంటిలోని వారికి చెప్పలేదు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ కుర్రాడిలో రేబిస్ లక్షణాలు బయటపడ్డాయి. మొదట్లో ఇంటిలోని వారికి ఏమీ అర్థం కాలేదు. అయితే రానురాను సాబేజ్ ఆరోగ్యం క్షీణించసాగింది. పిల్లాడి ప్రవర్తనలో మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు సాబేజ్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేసిన అనంతరం వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. వైద్యం అందని స్థితిలో సాబేజ్ హృదయవిదారక స్థితిలో కన్నుమూశాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారునిడి చికిత్స కోసం ఘాజియాబాద్లోని ఎంశ్రీం ఆసుపత్రితో పాటు మీరఠ్, ఢిల్లీలోని జీటీబీ, ఎయిమ్స్ ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లామన్నారు. అయినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సాబేస్ను పొరుగింటిలోని వారి కుక్క కరిచింది. ఒక మహిళ ఆ కుక్కను సంరక్షిస్తోంది. అలాగే ఆమె వీధి కుక్కలను ఆహారం కూడా అందిస్తుంటుంది. దీంతో ఐదారు కుక్కలు ఆమె ఇంటి వద్దనే ఉంటాయి. ఆ మహిళ పెంచుకుంటున్న కుక్క కరవడంతోనే తమ కుమారుడు మరణించాడని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లాడికి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని వారు అంటున్నారు. ఈ ఉదంతం నేపద్యంలో నగరపాలక అధికారులు ఆ కుక్కను పెంచుకుంటున్న మహిళకు నోటీసు అందజేశారు. తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఇది కూడా చదవండి: విద్యాదానం వీరి జీవన విధానం! -
అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 'మాయా గ్యాంగ్'.. అసలేంటిది..?
ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్ప్రీత్ గిల్ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్ప్రీత్ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్లో పని చేస్తున్నాడు. Bhajanpura murder: Delhi Police nabs 18-year-old man, says case solved Read @ANI Story | https://t.co/CwwQ54udMf#BhajanpuraCase #DelhiPolice pic.twitter.com/JjWFK7aA5M — ANI Digital (@ani_digital) August 31, 2023 అమెజాన్ మేనేజర్ హత్య.. ఢిల్లీకి చెందిన హర్ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్తో కలిసి సుభాష్ విహార్లోని ఇరుకైన సందులో బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్ప్రీత్ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
కోర్టు కాంప్లెక్స్లోనే లాయర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్లో తన ఛాంబర్లో ఉన్న మోను చౌదరి అనే లాయర్ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్లోకి ప్రవేశించి గన్లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. హాపూర్ లాయర్ల ఆందోళన.. ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
అక్కడ శిశువులు ఎలా చనిపోతున్నారనేది?..అంతుపట్టని మిస్టరీ!
ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు. చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె. పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా.. రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు! 2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. వైద్య బృందాలు అధ్యయనం చేయగా.. వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే. గుర్తించిన అంశాలు.. శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది. (చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్) -
ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది!
కొన్ని ఘటనలు అంత తేలిగ్గా మర్చిపోం. ఎందుకంటే అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వాతావరణం సడెన్గా భీతావహంగా మారితే జీర్ణించుకోవడం అంత ఈజీ కాదు. అందులోకి మొత్తం ఊరు మొత్తం చనిపోయి..వేళ్లపై లెక్కపెట్టేంత మంది వ్యక్తులు మాత్రమే మిగిలితే ఆ బాధ అంత ఇంత కాదు. అలాంటి ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఎందువల్ల జనాలు పిట్టలా రాలిపోయారనేది ఇప్పటికి అంతుతేలని మిస్టరీలా ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న గ్రామం న్యోస్. అస్సలు ఊహించలేదు వారంతా అదే తమకు చివరి రాత్రి అని. ఏమైందో ఏమో సడెన్గా పశువులు, జంతువులు మనుషులు ఎక్కడివాళ్లు అక్కడే విగతజీవుల్లా మారిపోయారు. ఎందుకు అంతా అలా చనిపోతున్నారు, ఏం జరుగుతుందని తేరుకునేలోపు అంతా అయిపోయింది. వేళ్లపై లెక్కపెట్టేంత మందే బతికారు. ఆయా వ్యక్తులు తమ వాళ్లంతా చనిపోతే ఆ శవాల మధ్య బిక్కుబిక్కుమంటూ నిస్సహాయంగా ఉండిపోయారు. ఒక్కసారిగా ఆ గ్రామం అంతా అత్యంత నిశబ్దంలోకి వెళ్లిపోయింది. ఆ అనూహ్య ఘటనతో ఓ మహిళ ఏడుస్తూ పిచ్చి పట్టినట్లుగా బట్టలు చింపుకుని వింతగా ప్రవర్తించింది. హలీమా అనే మహిళ, కొందరూ వ్యక్తులు తప్ప అంత నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. అంతమంది ఒకేసారి చనిపోయిన ఎవ్వరిపై ఒక్క ఈగ కూడా వాల్లేదు. ఇది అత్యంత ఆసక్తి రేపే కీలక అంశం. కనీసం కీటకాలు గానీ ఏవిలేవు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అందరూ ఒక్కొక్కరిగా చనిపోయినట్లు నాటి భయనక ఘటనలు గుర్తు చేసుకున్నారు ఆ వ్యక్తులు. ఈ ఘటన 1986లో జరిగింది. ఈ విషయం దావనంలా వ్యాపించింది. మొత్తం గ్రామమే తుడిచిపెట్టుకుపోవడం అక్కడ ఓ వింత ఘటనగా చర్చనీయాంశంగా మారిపోయింది. నాటి ఘటనలో దాదాపు 1,746 మంది దాక చనిపోగా సుమారు 3,500 వ్యవసాయ జంతువులు చనిపోయినట్లు గణాంకాల్లో వెల్లడైంది. ఆ గ్రామం సమీపంలో న్యాస్ అనే సరస్సు ఉందని, దానిలోంచి కార్బన్ డయాక్సైడ్ ఫ్రీక్ ఫ్లూమ్ పెరగడంతోనే అందరూ మరణించినట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం 1.6 మిలియనల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైందని, సరిగ్గా లోయకు సమీపంలోని వ్యక్తులంతా పీల్చడంతోనే చనిపోయారని అన్నారు. ఐతే ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు మాత్రం సరస్సు నుంచి కుళ్లిన కోడిగుడ్ల వాసన వచ్చినట్లు చెప్పారు. మరికొంత మంది ఈ ఘటన తరువాత రోజు ఒక్కొక్కరుగా చనిపోయారు కూడా. అలాగే ఆ న్యాస్ నది జలాలు కూడా ఆ రోజు నీలిరంగుకు బదులు ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇలాంటి భయానక ఘటనలు యూఎస్లో చాలా జరిగాయి కూడా. ఐతే శాస్త్రవేత్తలు వీటిని అంతుపట్టని సహజ మరణాలుగా తేల్చారు. వాస్తవికంగా ఏం జరింగిందనేది ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీలా ఉండిపోయాయి. పలువురు శాస్త్రవేత్తలు ఆ సరస్సు వల్ల అని, విషవాయువుల వల్ల అని రకరకాలుగా చెప్పారే తప్ప ఏం జరిగిందనేది? ఎవ్వరూ నిర్థారించలేకపోయారు. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్..
ఓ తండ్రి తన కుమార్తె మృతదేహానికి తల కొరివి పెట్టేందుకు అంతా సిద్ధం చేశాడు. ఆ ఇంటిలో మౌనం తాండవిస్తోంది. నెల రోజుల క్రితం అతని కుమార్తె ఇంటి నుంచి మాయమయ్యింది. తరువాత వారు ఒక మృతదేహానికి సంబంధించిన దుస్తులను చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. దీనిపై స్థానికులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇంతలో ఆ తండ్రికి..‘నాన్నా నేను బతికే ఉన్నాను. చనిపోలేదు’ అంటూ కుమార్తె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఘటన బీహార్లోని పూర్ణియా జిల్లాలోని అక్బర్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంశు కుమారి నెలరోజుల క్రితం ఇంటి నుంచి మాయమయ్యింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే రెండు రోజుల క్రితం పోలీసులు ఒక యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంశు కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి ఉన్న దుస్తులు చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. ఆ మృతదేహం నీటిలో దొరికిన కారణంగా ముఖం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. దీంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. అంశు తండ్రి ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇంతలో ఆ తండ్రి మొబైల్కు ఒక వీడియో కాల్ వచ్చింది. దానిలో ‘నాన్నా.. నేను బతికే ఉన్నాను’ అంటూ అతని కుమార్తె తెలిపింది. అంతే .. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరిగి అతని కుమార్తె ఫోనులో.. తాను తన ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఇంటి నుంచి పారిపోయానని తెలిపింది. ప్రస్తుతం అత్తవారింట్లో ఉన్నానని పేర్కొంది. అయితే పోలీసులకు లభ్యమైన ఆ యువతి మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు వారికి సవాల్గా నిలిచింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కాఫీ షాప్లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం! -
కాకుల కొండ వద్ద చిరుత కళేబరం
మడకశిర రూరల్: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్ అధికారి ఆనంద్, రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు. ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ అమర్ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు. వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు. -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం
పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కేప్ వెర్డే దీవుల్లో పడవ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారని,38 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధికారులు తెలిపారు. దీనిని అల్ జజీరా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలోమీటర్ల (385 మైళ్లు) దూరంలోని ద్వీప దేశమైన కేప్ వెర్డే నుంచి ఒక ఫిషింగ్ బోట్ నెల రోజుల క్రితం సెనెగల్ నుండి బయలుదేరింది. మీడియా తెలిపిన వివరాల ప్రకారం గినియా-బిస్సౌకు చెందిన ఒక పౌరునితో సహా 38 మందిని అర్థరాత్రి వేళ పడవ ప్రమాదం నుండి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్ ద్వీపానికి 320 కిలోమీటర్ల (200 మైళ్లు) దూరంలో స్పెయిన్ ఫిషింగ్ బోట్ ఈ ఓడను గుర్తించింది. స్పానిష్ మైగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ ఈ ఓడను భారీ ఫిషింగ్ బోట్గా పేర్కొంది. ఈ పడవను పిరోగ్ అంటారు. ఇది 100 మంది శరణార్థులు, వలసదారులతో జూలై 10న సెనెగల్ నుండి బయలుదేరింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేప్ వెర్డేలో నెలకొన్న పేదరికం, యుద్ధ వాతావరణం కారణంగా వేలాదిమంది ఇక్కడి నుంచి బయటపడేందుకు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం రక్షణలేని పడవలు లేదా స్మగ్లర్లు అందించే మోటరైజ్డ్ పడవలలో వీరంతా ప్రయాణిస్తుంటారని అల్ జజీరా తెలిపింది. ఇది కూడా చదవండి: ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ! -
ఫేస్బుక్లో పరిచయం.. ఆపై పెళ్లి, అంతా బాగుందని ఆనందపడేలోపే
అన్నానగర్(చెన్నై): ఆత్మహత్యకు యత్నించిన నవవధువు చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపూర్ జిల్లా ఉడుమలైపేటకు చెందిన మయిలత్తాల్ (65) మనవరాలు భూమిక (20). తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ సంరక్షణలో పెరిగింది. భూమిక, అదేప్రాంతానికి చెందిన అబ్బాయి సహజీవనం చేశారు. ఈ క్రమంలో తిరుచ్చికి చెందిన రఘు(25) భూమికకు ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. తల్లిదండ్రుల అంగీకారంతో జూలై 5న అతడితో వివాహం జరిగింది. భూమిక రఘుతో కలిసి తిరుచ్చిలో నివసిస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఉడుమలైపేటకు వెళ్లి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడికి అమ్మమ్మ రాగా సహజీవనం చేసిన వ్యక్తి చనిపోయాడిని తెలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది. భూమిక చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. చదవండి: Viral Video: 36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. మామూలు విషయం కాదు! -
రక్తం కారుతున్నా.. ‘అన్నా.. తను జాగ్రత్త’
అనంతపురం (శ్రీకంఠం సర్కిల్): రెండు కాళ్లూ ఛిద్రమై రక్తమోడుతున్నాయి. అయినా ఆయన భయపడలేదు. తనతో పాటు ప్రమాదానికి గురైన భార్యను కాపాడాలని తాపత్రయపడ్డాడు. పైకి లేచి నిలబడలేని స్థితిలోనూ గుండె నిబ్బరం చేసుకుని నేలపై పాకుతూ వెళ్లి భార్యను గుండెలకు హత్తుకున్నాడు. ‘ఏం కాదులే’ అని ధైర్యం చెప్పాడు. 108 వాహనంలోకి చేర్చే క్రమంలో ఆమెను దీనంగా చూస్తూ అంబులెన్స్ సిబ్బందితో.. ‘అన్నా.. తను జాగ్రత్త’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. భార్యను కాపాడేందుకు ఎంతగానో తపించిన ఆ భర్త చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనంతపురం నగర శివారులోని నేషనల్ పార్క్ వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు అక్కడి వారిని కంటతడి పెట్టించాయి. లారీ ఢీకొన్న ఘటనలో కిరణ్కుమార్ (42) మరణించగా.. అతడి భార్య అనిత తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్.. భార్య టీచర్ ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కిరణ్కుమార్ 2003 బ్యాచ్కు చెందిన ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్. ఇదే ప్రాంతానికి చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అనితకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ రీత్యా అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు ఎస్బీఐ కాలనీ రెండో క్రాస్లో నివాసం ఉంటున్నారు. కిరణ్కుమార్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వర్తిస్తుండగా.. అనిత తరిమెల జెడ్పీ హైసూ్కల్లో టీచర్. వీరికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ ఇద్దరు సంతానం. రోజూ ఉదయం భార్యను సోములదొడ్డి క్రాస్కు బైక్పై తీసుకెళ్లి.. ఆర్టీసీ బస్సులో తరిమెలకు పంపించడం కిరణ్కుమార్ దినచర్య. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో కిరణ్కుమార్ భార్యతో కలిసి సోములదొడ్డి బస్స్టాప్ వద్దకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. 44వ జాతీయ రహదారిపై నుంచి నేషనల్ పార్క్ వద్ద సరీ్వసు రోడ్డులోకి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. బైక్పై నుంచి ఎగిరి కిందపడ్డ కిరణ్కుమార్ కాళ్లపై లారీ వెనుక టైర్లు వెళ్లాయి. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకోగానే అల్లంత దూరంలో భార్య అనిత పడి ఉండటం చూసి ఆమెను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. తన కాళ్లు ఛిద్రమైపోయినా శక్తినంతటినీ కూడదీసుకుని పాకుతూనే ఆమె వద్దకు చేరాడు. భార్యను చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ముక్కు, చెవిలో రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకుంటున్న భార్యను చూసి ‘ఏమీ కాదు’ అంటూ ధైర్యం చెబుతూ కన్నీరు పెట్టుకున్నాడు. ఆమెను అంబులెన్స్లోకి ఎక్కించిన తరువాత అపస్మారక స్థితిలోకి చేరాడు. దంపతులిద్దరినీ 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రథమ చికిత్స చేసి బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కానిస్టేబుల్ కిరణ్కుమార్ మృతి చెందగా.. భార్య అనిత కోమాలోకి వెళ్లింది. చదవండి: కుమారుడు పరీక్షలో తప్పాడని..తల్లి ఆత్మహత్య -
పడవ బోల్తా.. 41 మంది మృతి..
మధ్యదరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 41 మంది వలసదారులు మరణించారు. అన్సా న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపానికి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు తీరానికి ప్రాణాలతో చేరారు. అనంతరం పడవ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. 45 మందితో ప్రయాణించిన పడవ.. మధ్యదరా సముద్రంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరూ మరణించారు. కేవలం నలుగురు మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సంక్షోభంతో నిండిపోయిన ట్యూనీషియా నుంచి 45 మందితో పడవ ప్రయాణించినట్లు తెలుస్తోంది. పడవ మొదలైన కొన్ని గంటల్లోనే ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఆ భయానక దృశ్యాల గురించి తెలిపారు. ఇదీ చదవండి: 'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..' -
సున్నపు రాయి ఇంత ప్రమాదమా? అదే ఆ తల్లికి తీరని కడుపు కోత మిగిల్చింది!
మన కళ్ల ముందు కనిపించేవి, మన నిత్య జీవితంలో ఉపయోగించేవి చెడు చేస్తాయని ఊహించం. నష్టం వాటిల్లంత వరకు.. తేరుకోం, తెలుసుకోం. సరదాగా తీసుకుంటాం. ఏం కాదనకుంటాం. జరగకూడనిది జరిగినప్పుడూ గానీ మనకు అవగతం కాదు. టైం బాలేనప్పుడూ తాడే పామై మృత్యువు అవుతుందని పెద్దలు అందుకే అన్నారేమో!. అచ్చం అలాంటి విషాదకర ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించిన సున్నపు రాయి పౌడర్ రోడ్డుకి ఒకపక్కన రాసిలా ఉంది. అక్కడే రొమాల్డో బిటెన్కోర్ట్ కుటుంబం నివశిస్తుంది. వాళ్ల ఏడేళ్ల బాబు ఆడుకోవడం కోసం అని బయటకు వచ్చి ఈ సున్నపు రాయి పౌడర్ వద్దకు వచ్చాడు. దాంట్లో దొర్లి ఆడుకుంటూ కేరింతలు కొట్టాడు. అతడి కుటుంబ సభ్యులు ఫోటోలు కూడా తీశారు. సరదాపడుతున్నాడు కదా అని ఏమి అనలేదు. అంతే సడెన్గా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కుటుంబసభ్యలుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే ఆ బాలుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ పౌడర్ శ్వాసనాళల్లోకి చేరిందని అందువల్లే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒక్కసారిగా ఆ కుటుంబం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది. మరొక చిన్నారి ఇలా మృత్యువాత పడకూడదనే సదుద్దేశంతో ఆ బాలుడి కుటుంబసభ్యులు ఆ సున్నపు రాయి వద్ద ఆడుకున్న చివరి ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వివరించారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాటి దగ్గరకి పిల్లల్ని వెల్లనీయకుండా చూసుకోండి అని సూచించారు. సున్నపు రాయి ప్రమాదకరమా..పీల్చితే అంతేనా! అయితే ఈ సున్నపు రాయి రేణువు సాధారణ ఇసుక రేణువు కంటే వంద రెట్లు చిన్నదని ఈజీగా శ్వాసక్రియా నాళాల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు వైద్యులు. అయితే దీన్ని పిల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, కిడ్నీ వ్యాధి, సిలికోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే సున్నపు రాయి రేణువులు ఊపిరితిత్తుల కణజాలంలో చిక్కుకోవడం వల్ల శరీరంపై వాపు, మచ్చలు ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి ఊపిరితిత్తుల వ్యాధికి దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ 'స్ట్రేంజ్ అడిక్షన్' వింటే షాకవ్వాల్సిందే!)