డీఎడ్కు ప్రత్యేక కౌన్సెలింగ్
డీఎడ్కు ప్రత్యేక కౌన్సెలింగ్
Published Tue, Oct 4 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
అంగలూరు (గుడ్లవల్లేరు) :
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుకు మంగళవారం అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస ్థ(డైట్)లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధ్యాపకులు డి.నగేష్, ఏవీడీఎం ప్రసాద్ పరిశీలించారు. ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బుధవారం కూడా కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం లోగా తమకు కేటాయించిన సంస్థలో చేరకపోతే ఆ సీట్లు పక్షం రోజుల్లోగా రద్దు అవుతాయన్నారు.
Advertisement
Advertisement