విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కెటాయించకపోవడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి నివాసం వద్ద శనివారం ప్రజా విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్రంపై వత్తిడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు సుబ్బిరామిరెడ్డికి వినతి పత్రం సమర్పించాయి.
ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కెటాయించకుండా కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. సేకరించిన కోటి సంతకాలతో ఈ నెల 14న ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సారథ్యంలో రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని తెలిపారు.