protest
-
వట్టిమాటలు కట్టి‘పెట్రో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్రమైంది. వారం రోజులుగా ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. సంక్షోభాన్ని నివారించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పైగా కృత్రిమ కొరతకు కారణమైంది. పర్యవసానంగా రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంఓ చంద్రబాబు సర్కార్ను మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపు నిచి్చంది. మంగళవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో పాటు ప్రజలు భాగస్వాములు కావటం విశేషం. దీంతో నిరసన కార్యక్రమం దిగి్వజయమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నేతలు ఎండగట్టారు. ‘ఏపీలో మద్యం పుల్ .. డీజిల్ పెట్రోల్ నిల్, పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు.. ఇక్కడే ఎందుకు? ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం, ఇంధనం అవసరమైనంత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి’ అంటూ రాసిన ప్లకార్డులు వైఎస్సార్సీపీ నాయకులు చేతపట్టుకొని బంకుల వద్ద నిరసన తెలిపారు.పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. వారం రోజులుగా తీవ్ర సమస్య ఉన్నా.. బాబు సర్కారు పబ్లిసిటీ డ్రామాలు ఆడడం ఏమిటని నిలదీశారు. మొన్న యూరియా .. నిన్న గ్యాస్ .. నేడు ఇంధన కొరత! ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజలకు నిత్యం నరకం కనపడుతోందని దుయ్యబట్టారు. ఈ ఇంధన సంక్షోభం బాబు సృష్టించిందేనని విమర్శించారు. విజయవాడ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. బాబు పబ్లిసిటీ స్టంట్లు ఆపి.. వట్టిమాటలు కట్టిపెట్టి ఇంధన సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా..⇒ ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ⇒ గుంటూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు నిరసన తెలిపారు. ⇒ కోనసీమజిల్లా కొత్తపేటలో డీజిలు లేక ఆగిపోయిన రైతు ట్రాక్టరుకు పగ్గం కట్టి బంకు వద్దకు తీసుకువచ్చి వినూత్న నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు నిరసన గళమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో మోటార్సైకిళ్లతో నిరసన తెలిపారు. రాజోలులో ట్రక్కు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. రాజమండ్రిలో పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ డీజిల్ డబ్బాలతో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లాలోనూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు సాగాయి. ⇒ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకులు పెట్రోల్ బంకులను సందర్శించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ విశాఖ జగదాంబ జంక్షన్లో ఆటోలకు తాడు కట్టి లాగుతూ తమ నిరసన తెలియజేసి, క్యూలో ఉన్న వినియోగదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు గళమెత్తారు.⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీ డీజిల్ డ్రమ్ములతో నిరసన తెలిపారు. ⇒ తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. -
సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!
న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్ మలిపోసి బ్రాంచ్కు వెళ్లాడు.కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్ హోల్డర్ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్కు గురయ్యారు. తమ మొబైల్స్లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.A man in Odisha dug up his deceased sister’s grave and brought her skeleton to the bank Just to prove she had died.He had been trying to withdraw ₹20,000 from her account, but bank officials kept insisting he bring the account holder in person. Despite repeatedly telling them… pic.twitter.com/hICEqwvPFu— Woke Eminent (@WokePandemic) April 28, 2026అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ పెద్దాయనకే సపోర్ట్గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. ‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్ రీఫండ్లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లుజనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లుపబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లుప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లువిదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.టీడీఎస్ రీఫండ్లుక్లైమ్ చేయని TDS రీఫండ్లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడంప్రజల్లో అవగాహన లోపంక్లిష్టమైన పేపర్వర్క్, ప్రక్రియలు -
కలకలం.. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నల్గొండలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్రమత్తమైన తోటి కార్మికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని సమాచారం. -
నేతన్నల నిరసనాగ్రహం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులు నిరసన గళమెత్తారు. తమ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పోరుబాట పట్టారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వై జంక్షన్లోని నేతన్న సర్కిల్ వేదికగా బుధవారం చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. దీక్షను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. వియన్నారావు ప్రారంభించి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో కూడిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు రావాల్సిన రూ.203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో 20 వేల ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే ‘చలో అమరావతి’ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో–కన్వినర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ , బండారు ఆనంద్ ప్రసాద్, సీపీఎం నేత రమాదేవి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గీతం యూనివర్శిటీ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో గీతం యూనివర్సిటీకి పిలుపునిచ్చింది. రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గీతం యూనివర్సిటీ ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ర్యాలీలో వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, మోల్లి అప్పారావు, దేవన్ రెడ్డి, మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు.గీతం యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటానికి దిగింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నిరసన నేపథ్యంలో గీతం యూనివర్సిటీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. -
పుట్టినరోజు సంబరాలే కాదు.. కూలీల సంగతీ పట్టించుకోండి
సాక్షి, అమరావతి: పుట్టిన రోజు వేడుక సంబరాల్లో మునిగితేలుతున్న సీఎం చంద్రబాబు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీల అతీగతీ కూడా పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఉద్ఘాటించింది. గత నాలుగున్నర నెలలుగా ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన కూలీలకు రూ. 1,027 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట కూలీలు ధర్నా నిర్వహించారు. మండుటెండలోనూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యాలయం ప్రధాన గేటు ముందు ఆందోళన నిర్వహించారు. పనిచేసిన 14 రోజులకు ఉపాధి వేతనాలు చెల్లింపులు పూర్తవ్వాలని చట్టం చెబుతున్నా, చేసిన పనికి నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా పేదలను వేధిస్తున్నారంటూ నిరసనలో పాల్గొన్న కార్మిక సంఘ నేతలు, కూలీలు దుయ్యబట్టారు. కూలీ కోసం, కూటి కోసం పేదలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాధినేతలు అసలు పట్టించుకోకపోవడం విచారకరమని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కుదించేందుకు చేసే కుట్రలను ఆపాలని స్పష్టం చేశారు.ఫేస్యాప్ ద్వారా హాజరు పడితేనే వేతనం వస్తుందన్న షరతును ప్రస్తావిస్తూ, దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫేస్యాప్ సరిగా పనిచేయక కూలీలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఫేస్యాప్ను తొలగించి, మ్యాన్యువల్గానే కూలీల హాజరు మస్టరు వేయాలని సూచించారు. డిమాండ్లు పరిష్కారం కాని పక్షంలో మే 1న కార్మిక దినోత్సవాన రాష్ట్రమంతటా ఉపాధి హామీ పథకం పని ప్రదేశాల్లో పేదలు నిరసనలు తెలపనున్నట్టు వివరించారు.సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి, వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు ఈమని అప్పారావు తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నేతలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉపాధి హామీ పథకం అమలు డైరెక్టర్ షణ్ముఖ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన చేస్తున్న ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కూలీలు -
చంద్రబాబు, పవన్లను ఏకిపారేసిన కార్యకర్త
నెల్లూరు : ‘ పవన్ సార్.. మేం అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని అప్పుడు హామీ ఇచ్చారు కదా.. ఇవేనా రోడ్లు’ అంటూ పశ్నించాడు కూటమి కార్యకర్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం కలిచేడు రోడ్డు అధ్వాన్నంగా ఉందని నడిరోడ్డుపైనే మంచం వేసుకుని నిరసన తెలిపాడు కూటమికి చెందిన కార్యకర్త. నెల్లూరు-గూడూరులను కలిపే ఈ రోడ్లపై వెళుతుంటే తమ ప్రాణాలు పోతున్నాయని, ఎటు చూసినా గుంతలు, గోతులతో చాలా అథ్వాన్నంగా ఉందని ఫైర్ అయ్యాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లు వేయిస్తామన్నారు కదా.. ఇవే నా మీరు వేసిన రోడ్లు అంటూ నడిరోడ్డుపై మంచంపై కూర్చొని మరీ నిరసన తెలిపాడు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఏకిపారేశాడు.‘అధికారంలోకి వస్తే రోడ్లు వేయిస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకూ వేయలేదు. నేను ఆరు నెలల క్రితం చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మళ్లీ ఈ విషయాన్ని ఇలా చెబుతున్నా. మా కడుపులు మండిపోతున్నాయ్. గతంలో టెంట్లు వేసుకుని రోడ్లు వేయమని అడిగాం. ఇప్పుడు ఇలా నులక మంచం వేసుకుని నిరసన తెలపాల్సి వచ్చింది.పుట్టిన రోజు వేడుకల్లో బిజిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ఇక్కడ(ఈ రోడ్లపై) పుట్టినరోజు చేసుకుని చూడండి. మా బాధ ఏంటో అర్ధమవుతుంది. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశానండి.. కడుపు మండిపోతుంది. నేను అడిగేది ఒక్కటే అబ్బా.. మీరు వారం రోజుల్లో రోడ్లు వేయిస్తారా.. లేక నిధులు పోగు చేసుకుని మేమే రోడ్డు వేసుకోవాలా? చెప్పండి’ అంటూ సూటిగా ప్రశ్నించాడు. -
డీలిమిటేషన్.. ఢిల్లీలో బీసీ సంఘాల మెరుపు ధర్నా
సాక్షి, ఢిల్లీ: కులగణన తర్వాతనే డీలిమిటేషన్ చేపట్టాలని ఢిల్లీలో బీసీ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. డీలిమిటేషన్ పత్రాలను చింపివేసి బీసీ నేతలు నిరసనలు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి అన్నారు. పెంచిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు మహిళల పేరుతో మళ్లీ అగ్రకులాలకు దక్కుతాయన్నారు.దేశవ్యాప్తంగా బీసీ కులగణన పూర్తి చేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ కోట కల్పించాలి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తాo’’ అని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.బీసీలు బీజేపీని క్షమించరు: మాజీ ఎంపీ వీహెచ్బీసీ ప్రధాని అయి ఉండి బీసీలకే మోదీ ద్రోహం చేస్తున్నారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోట కల్పించకపోతే బీసీలు బీజేపీని క్షమించరు. బీజేపీ బీసీలకు చేస్తున్న మోసంపై ఊరూరా తిరిగి చెప్తాo పోరాడతాం: బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్మహిళా బిల్లు పేరుతో బీసీలను రాజకీయంగా తొక్కి పెట్టాలని చూస్తున్నారు. దేశంలోని 40 కోట్ల మంది బీసీ మహిళల అక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థలలో లాగానే చట్టసభల్లో కూడా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం లేదు. బీసీ హక్కుల కోసం బీసీ సంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా పోరాడతాంబీసీలంటే పార్టీలకు చిన్న చూపు: శంకర్రావుదేశంలో బీసీలను పట్టించుకునే నాధుడే లేడు. బీసీలు అంటే అన్ని పార్టీలకు చిన్న చూపు. బీసీల ఓట్ల మీద ఉన్న ప్రేమ సీట్ల మీద లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలను చేర్చకపోతే కేంద్రంపై తిరగబడతాం -
అధికారులకు దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో
సాక్షి, మహబూబాబాద్: పట్టణంలోని 21వ వార్డుకు రెండు వారాలుగా మున్సిపల్ వాహనం రావడం లేదని దాంతో వార్డులో దుర్వాసన వెదజల్లుతుందని కౌన్సిలర్ జరీనా బేగం పేర్కొన్నారు. 21వ వార్డులోకి వాహనం రాకపోవడంతో స్థానికులు బుధవారం చెత్తతో వార్డు కౌన్సిలర్ ఇంటికి వెళ్లారు. దాంతో కౌన్సిలర్ జరీనాబేగం చేసేది ఏమీ లేక వారిని, వారు తీసుకొచ్చిన చెత్తతో మున్సిపాలిటీ కార్యాలయం వెళ్లారు.ఆ సంచులను కార్యాలయంలో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ జరీనా బేగం మాట్లాడుతూ.. డ్రైవర్ లేరని, వాహనాలు మరమ్మతులు ఉన్నాయని 45 రోజులుగా అధికారులు చెబుతున్నారన్నారు. రెండు వారాలుగా వాహనం రావడం లేదని అంతకుముందు కూడా వార్డు మొత్తం కాకుండా వార్డులో సగం మాత్రమే చెత్త సేకరించేవారని తెలిపారు.HOW TO TEACH LAZY AUTHORITIES A LESSON???Mahabubabad Municipality 21st ward decided not cleaning garbage for a few days is okay!Citizens requested, complained and then decided to teach the officials a lesson. They collected the trash and dumped the garbage in every section… pic.twitter.com/sqhyVFwdmc— Revathi (@revathitweets) April 15, 2026ఆ సమస్యను వార్డు వాసులతో కలిసి కమిషనర్ రాజేశ్వర్, చైర్మన్ గుగులోత్ జ్యోతికి వివరించారు. దీంతో వాహనాలు మరమ్మతులో ఉన్నాయని.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరో వార్డుకు కేటాయించిన ట్రాక్టర్ను 21వ వార్డుకు పంపించారు. కార్యక్రమంలో వార్డు వాసులు రవి, వీరన్న, ముక్తియార్, ఈసూఫ్, అస్లాం, జిలాని, జాకీర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్?
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ నోయిడా ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారింది. గత కొద్ది రోజులుగా వేతనాల పెంపుదల కోసం కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ పైనే నిలిచాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్న వేళ, అసలు ఎవరీ మేధా రూపమ్? ఆమె నేపథ్యం ఏంటి? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.సివిల్స్లో టాప్ 10 ర్యాంకర్మేధా రూపమ్ కేవలం ఒక ఉన్నతాధికారిణి మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని కూడా. ఆమె నేపథ్యం పరిశీలిస్తే.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్లో పట్టా పొందారు. 2013 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించి, సంచలనం సృష్టించారు. 2014 బ్యాచ్కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. ఆమె తండ్రి జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వివాదాలు.. వరుస సవాళ్లు2025 జూలై 29న గౌతమ్ బుద్ధ్ నగర్ డీఎంగా బాధ్యతలు చేపట్టిన మేధా రూపమ్నకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో ఒక ఇంజనీర్ వర్షపు నీటి గుంతలో పడి మరణించిన ఘటనలో ఆమె విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు కార్మిక లోకం భగ్గుమనడం ఆమె సమర్థతకు పెద్ద పరీక్షగా మారింది. కాగా కార్మికుల ఆందోళన తీవ్రం కావడంతో మేధా రూపమ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక వర్గాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.అదనపు పని గంటలు (ఓటీ), ఆదివారాలు పనిచేసే వారికి రెట్టింపు జీతం ఇవ్వాలి. ప్రతి నెలా 10వ తేదీలోపు శాలరీ స్లిప్పులతో పాటు పూర్తి జీతం ఖాతాల్లో జమ కావాలి. నవంబర్ 30 లోపు బోనస్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయాలని మేధా రూపమ్ ఆదేశించారు. ప్రతి ఫ్యాక్టరీలో మహిళా నేతృత్వంలో ‘లైంగిక వేధింపుల నివారణ కమిటీ’లను ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నోయిడా వీధుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి.. -
నోయిడా కార్మికుల నిరసనల్లో బిగ్ ట్విస్ట్..!
లక్నో: వేతనాలు పెంచాలంటూ నిన్న ( సోమవారం) గ్రేటర్ నోయిడా (యూపీ)లో కార్మికులు ఆందోళన చేపట్టిన హింసాత్మకంగా మారింది. అయితే నిరసనలపై యూపీ కార్మిక శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనల వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోతైన విచారణ చేపడుతున్నామని తెలిపారు.గ్రేటర్ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు జరుగుతున్న ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన కార్మికులు పోలీసుల వాహనాలను బోల్తా కొట్టించి, రాళ్ల దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు ఆందోళనకారులు పలు కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై యూపీ మంత్రి స్పందించారు.ఆయన మాట్లాడుతూ "నోయిడాలో జరిగిన నిరసనలు రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతోనే జరిగినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం, మీరట్ నోయిడాలలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరిగిందనే అవకాశాలు బలపడుతున్నాయి. ఏజెన్సీలు ఈ మొత్తం విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి," అని రాజ్భర్ అన్నారు.కాగా నిన్న జరిగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనల్లో హింసను సృష్టించిన దాదాపు 300 మందిని ఇప్పటివరకూ అరెస్టు చేసినట్లు తెలిపింది. మరో వందమందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముజఫర్ నగర్లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బందులు కలిగించడానికి ఈ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కార్మికులందరూ సంయమనం పాటించాలని ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు. -
దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..
దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.వేతనాల పెంపుప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణాతో పోలికఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలిహోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఓవర్ టైం, బోనస్ బకాయిలుకార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.పని ప్రదేశంలో భద్రత - గౌరవంఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపుఅనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
భార్యకు, చెల్లికి తేడా తెలియని ABN.. RKకు వత్తాసు..
-
సింహాల్లా పోరాడిన తండ్రి కూతురు
-
ABN రాధాకృష్ణ వ్యాఖ్యలపై YSRCP నిరసన
-
abn ఆఫీస్ వద్ద టెన్షన్ .. టెన్షన్ (ఫోటోలు)
-
గజ్వేల్ లో టెన్షన్ టెన్షన్..
-
11, 12 తేదీల్లో సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’
సాక్షి, అమరావతి: న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలని, ఉద్యోగుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేసే ప్రక్రియకు స్వస్తి పలకాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12 తేదీల్లో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘సచివాలయ ఉద్యోగుల ఆవేదన’ పేరిట జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. -
BR నాయుడు రాజీనామా చేయడం లేదా..? చంద్రబాబు చెప్పడం లేదా..
-
ఎమ్మిగనూరులో టెన్షన్.. టెన్షన్
సాక్షి, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడంపై ఆందోళన చేపట్టారు. కోఆపరేటివ్ సొసైటీ ఎదుట చేనేతలు నిరసనకు దిగారు. చేనేత కార్మికులకు మద్దతుగా వైఎస్సార్సీపీ, వామపక్ష నేతలు ధర్నాకు దిగారు. సొసైటీని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై చేనేత కార్మికులు, వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు.ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విలీనం పేరుతో చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. సర్వసభ్య సమావేశంలో విలీన అంశం తొలగించాలంటూ డిమాండ్ చేశారు. -
వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
సాక్షి, అమరావతి: అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసియేషన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రాట్యూటీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్లైన్స్ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.మార్చి 2న వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
ఇరాన్కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు. ఇరాన్కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.. బాహ్య జోక్యం ఉండకూడదు. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల హత్యను నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్లకు ఏ చట్టం అధికారం ఇచ్చింది’’ అంటూ ఆయన ప్రశ్నించారు.J-K: National Conference MLAs protest in assembly, express solidarity with Iran over killing of Ayatollah Ali KhameneiRead @ANI Story |https://t.co/RphI1lVvvm#JammuKashmirAssembly #Khamenei #protest #NationalConference #JKNC pic.twitter.com/FTZOaZy5ML— ANI Digital (@ani_digital) March 27, 2026 -
జిన్నా పాఠం తొలగించండి.. జమ్మూలో ఆందోళన
జమ్మూ వర్సిటీ ఎదుట ఈ రోజు ( ఆదివారం) ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. పీజీ పొలిటికల్ సైన్స్ సిలబస్లో పాకిస్థాన్ నాయకుడు మహ్మాద్ ఆలీ జిన్నా పాఠ్యాంశాన్ని చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చాఫ్టర్ని వెంటనే తొలిగించాలని లేనిచో ఆందోళన మరింతగా ఉదృతం చేస్తామని హెచ్చరించారు.జమ్మూ విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగం 2026-2028 విద్యా సంవత్సరానికి గాను విడుదల చేసన సిలబస్లో 'ఆధునిక భారత రాజకీయ ఆలోచన' అనే శీర్షిక కింద, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ జిన్నాలతో సహా కొంతమంది వ్యక్తులను మైనారిటీ వర్గాల ప్రతినిధులుగా చిత్రీకరిస్తున్నారు. దేశ విభజనలో పాత్ర పోషించి, ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు వీరే. వీరి గురించి బోధించడం ఆందోళన కలిగిస్తోంది'. అని ఏబీవీపీ నాయకులు తెలిపారు.పాఠ్యప్రణాళికలో మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాలంటే, దేశ విభజనతో సంబంధం ఉన్నవారిని కాకుండా, మైనారిటీల కోసం వ్యక్తులను చేర్చాలని వారినే చేర్చితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. అంతేగాని దేశ విభజనకు కారణమైన వారి గురించి చదవాల్సిన అవసరం లేదన్నారు. పాఠ్యాంశాన్ని తక్షణమే తొలగించకపోతే నిరసనలు మరింత ఉద్రిక్తం చేస్తామని తెలిపారు.అయితే దీనిపై పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి బల్జిత్ సింగ్ మాన్ స్పందించారు" జిన్నా మరియు ఇతర మేధావులను చేర్చడం పూర్తిగా విద్యాపరమైనదేనని, ఇది దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు అనుసరిస్తున్న పాఠ్యప్రణాళికలకు, అలాగే యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ఉందని" తెలిపారు. విశ్వవిద్యాలయం ఏ భావజాలాన్నీ ప్రోత్సహించదని, కానీ విమర్శనాత్మకతకు వీలు కల్పించేందుకు భిన్నమైన దృక్కోణాలను విద్యార్థులకు అందిస్తుందన్నారు. మంచి చెడులను అంచనా వేసి, ఏది సరైనదో ఏది తప్పో విచక్షణ కలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. -
పోలీసులతో మహిళలను, YSRCP నేతలను కొట్టిస్తున్న BR నాయుడు
-
నిందితులకు మూడు రోజుల కస్టడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలోని కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. ముగ్గురి కస్టడీని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకోగా, 24 గంటలపాటు చోటుచేసుకున్న నాటకీయ పరిణామా ల మధ్య వారిని ఢిల్లీ పోలీసులు దేశరాజధానికి తరలించారు. కోర్టు ట్రాన్సిట్ రిమాండ్కు అనుమతించినప్పటికీ హిమాచల్ పోలీసులు ఢిల్లీ పోలీసులను దాదాపు ఐదు గంటలపాటు దిగ్బంధించారు. ఎట్టకేలకు నిందితులతోపాటు వారు ఢిల్లీకి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య గురువారం పోలీసులు ముగ్గురినీ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మృదుల్ గుప్తా ఎదుట హాజరు పరిచారు. విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరారు. నిందితుల్లో యూపీ వాసులైన సౌరభ్, అర్బాజ్ ఖాన్, మధ్యప్రదేశ్కు చెందిన సిద్ధార్థ అవధూత్లు అరెస్ట్ల నుంచి తప్పించుకునేందుకు హిమాచల్ ప్రదేశ్లోని ఓ రిసార్టులో దాక్కున్నారని పోలీసుల తరఫు లాయర్ తెలిపారు. బుధవారం ఉదయం 6.40 గంటల వేళ వారిని అదుపులోకి తీసుకుని, అదే రోజు మధ్యా హ్నం 1.40కి సిమ్లాలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి, ట్రాన్సిట్ రిమాండ్కు కోరామన్నారు. అనుమతించిన కోర్టు.. వారిని 18 గంటల్లోగా సంబంధిత కోర్టులో హాజరుపర్చాలని షరతు పెట్టిందని వివరించారు. ఇంపాక్ట్ సమిట్ వద్ద నిరసన తెలిపేందుకు వాడిన టీషర్ట్ను సిద్ధార్థ్ డిజైన్ చేయగా, సౌరభ్ నిరసనకు పిలుపునిచ్చే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడని, సౌరభ్, అర్భాజ్లు నిరసనలో పాల్గొన్నారని లాయర్ పేర్కొన్నారు. నిరసన కోసం లక్షకు పైగా టీషర్టులను ప్రింట్ చేశారని, వీటిని ఎక్కడ ప్రింట్ చేశారు? దీని వెనుక ఎవరెవరున్నారో తెల్సుకునే ప్రయత్నా ల్లో ఉన్నామన్నారు. అయితే, నిరసన తెలిపారనే సాకుతో ఢిల్లీ పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారని, ఇదంతా రాజకీయ పేర్రేపితమని నిందితుల తరఫు లాయర్ వాదించారు. వాదనలు విన్న మేజి్రస్టేట్ నిందితుల ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మార్చి ఒకటో తేదీన తిరిగి వారిని తమ ఎదుట హాజరుపర్చాలని కోరారు. వీరితోపాటు ఈ కేసులో అంతకుముందే అరెస్ట్ చేసిన అజయ్ కుమార్, రాజా గుజార్ అనే వారి రిమాండ్ గడువు ముగియడంతో వారిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో, వారి రిమాండ్ను మరో మూడు రోజులకు పొడిగిస్తున్నట్లు మేజి్రస్టేట్ తెలిపారు. -
అధికారమదంపై ‘ధర్నా’గ్రహం
అధికారపార్టీ అడ్డగోలు వేధింపులు, అక్రమ తొలగింపులపై చిరుద్యోగులు నిరసన గళమెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చి బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రస్థాయి ధర్నాలో చంద్రబాబు సర్కారు దుర్నీతిపై ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని దిక్కులుపిక్కటిల్లేలా నినదించారు. సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : క్షేత్రస్థాయిలో పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామ సమాఖ్య సహాయకులు (వెలుగు వీవోఏ – డ్వాక్రా యానిమేటర్లు), మెప్మా రిసోర్స్ పర్సన్లు (ఆర్పీ)లు బుధవారం విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టారు. అధికార పార్టీ నేతల పెత్తనం పెరగడంతో పాటు నిబంధనలకు విరుద్ధ కార్యక్రమాల పేరిట వేధింపులు, అక్రమ తొలగింపులను నిరసించారు. తొలుత రాష్ట్ర నలుమూలల నుంచీ తరలివచ్చిన ఉద్యోగులు విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్కు చేరుకున్నారు. బాబు సర్కారుకు వ్యతిరేకంగా వారు చేసిన నినాదాలతో ధర్నాచౌక్ దద్దరిల్లింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీస వేతనాలు వర్తింపజేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో వీవోఏ–యానిమేటర్లతో పాటు ఆర్పీలకు ఇచ్చే నెలవారీ వేతనం రూ.8వేలు, రూ.పదివేలు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు రూ.26 వేల చొప్పున చెల్లించాలని.. హెచ్ఆర్ పాలసీ అమలు, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, అర్హులైన వారికి పదోన్నతులు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏ – యానిమేటర్లకు స్త్రీనిధి ప్రోత్సాహకాలు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, ఒక్కొక్కరికీ రూ. 30 వేల నుంచి రూ.లక్ష వరకు రావాల్సి ఉందని వివరించారు. ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించారు. 60 ఏళ్లు నిండిన వీఓఏలకు నిలుపుదల చేసిన వేతనాలు చెల్లించాలని, మెప్మా ఆర్పీలకు గ్రేడింగ్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచి్చన మేరకు మహిళలు పొదుపు సంఘాల ద్వారా తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీలు చెల్లించాలని, మహిళా మార్టులు, స్వావలంబన, అభయహస్తం నగదును పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరారు. చిరుద్యోగుల ధర్నాకు సీపీఎం నేత వి. శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు మద్దతుగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర స్థాయి ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు సెర్ప్ సీఈవో వాకాటి కరుణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్లను కలిసి వినతిపత్రాలను అందజేశారు.అంగన్వాడీల వినూత్న నిరసనఏలూరు (టూటౌన్): ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరాహార దీక్షలు రెండోరోజు బుధవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. కనీస వేతనం రూ.26,000, సంక్షేమ పథకాల అమలు, యాప్స్ అన్నీ కలిపి ఒకే యాప్గా మార్చాలని, మెనూ చార్జీలు పెంచాలని పెద్దపెట్టున నినదించారు. మోకాళ్లపై నిలిచి నిరసన గళం వినిపించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ , ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.భారతి పాల్గొన్నారు. -
శిశువు మృతిపై పెల్లుబికిన ఆగ్రహం..
సాక్షి, నాగర్కర్నూల్: రెండు రోజుల క్రితం ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులపై నిర్వాహకులు దాడి చేయగా తోపులాటలో రెండు నెలల శిశువు కిందపడగా, ఆదివారం మృతిచెందింది. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులతోపాటు ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతోపాటు బీసీ, ఎస్సీ, కులసంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రోజంతా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈనెల 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ‘కుమ్మెర ఆలయంలో దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఉన్న వారంతా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి బంధువులు కావడంతో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. వారిని కాపాడేందుకు బాధితులపైనే వేధింపులకు పాల్పడ్డారు’ అని మర్రి ఆరోపించారు. -
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ రత్నాబాయి, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతికి శానమండలి సంతాపం తెలిపింది రెండు నిమిషాల పాటు సభ్యులు మౌనం పాటించారు. భోలేబాబా, హెరిటేజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాసనమండలికి వైఎస్సార్సీపీ సభ్యులు ర్యాలీగా వెళ్లారు. ఇందాపూర్ డెయిరీ అంశంపై రెండో రోజు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వాయిదా తీర్మానంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టుపట్టింది.వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ఐదు నిముషాల పాటు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు.మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వాళ్ళిద్దరు వాయిదా తీర్మానం ఇవ్వడంలో వింత లేదు. వాళ్ళిద్దరు ఎప్పుడో చంద్రబాబు కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అని మంత్రి నారా లోకేష్ అనడం హాస్యస్పదం. వాళ్ళిద్దరితో వాయిదా తీర్మానం ఇప్పించి మా పార్టీ వాళ్ళు అనడం కేవలం చర్చను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం. ఇందాపూర్ డెయిరీపై మేము చర్చకు పట్టుపడుతున్నాం. మీకు దేవుడి పట్ల చిత్తశుద్ధి ఉంటే టీటీడీ సహా ఇతర ఆరోపణలపై చర్చకు సిద్ధం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్ విసిరారు. -
టీచర్ల గర్జనతో దద్దరిల్లిన బెజవాడ
-
శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
సాక్షి, అమరావతి: అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఎన్నడూ లేని రీతిలో గంట ఆలస్యంగా అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు బదులు 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గంట ఆలస్యంగా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవ్వగానే వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. 10 గంటలకు ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ఆలస్యానికి కారణాలపై ప్రభుత్వం స్పష్టత నివ్వలేదు.శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. గోవిందా గోవిందా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో వైఎస్సార్సీపీ సభ్యులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనలతో మండలి వాయిదా పడింది. ఆడబిడ్డ నిధి పేరుతో కూటమి మోసం: వరుదు కల్యాణివైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ... ఆడబిడ్డ నిధిపై మండలిలో తాము ప్రశ్నించామన్నారు. జిల్లా వారీగా ఖర్చుల వివరాలు చెప్పమని అడిగామని తెలిపారు. ప్రభుత్వం మూడు బడ్జెట్లు పెట్టింది. ఇంకా ఆడబిడ్డ నిధి పరిశీలనలో ఉందనే సమాధానం చెబుతోంది. మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీ ఆడబిడ్డ నిధి. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చి మరీ పబ్లిసిటీ చేశారు. ఇంటింటికీ వెళ్లి బాండ్లు పంచారు. కూటమి నేతల మాటలు విని ప్రజలు మోసపోయారు. ఏ మొహం పెట్టుకుని ఈరోజు ఆడబిడ్డల ముందుకు వెళ్తారు’’ అంటూ వరుదు కల్యాని నిలదీశారు.‘‘ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆడబిడ్డ నిధిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలి. ప్రభుత్వానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలనే ఆలోచన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి’’ అని వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. -
యూరియా కోసం రైతులు ఆందోళన
శ్రీకాకుళం: యూరియా కోసం సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగిన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి వచ్చిన యూరియా టీడీపీ నేతలు తీసుకుని అక్రమంగా తరలిస్తున్నారంటూ గార మండలం వమరవల్లి పంచాయతిలోని రైతులు ఆందోళన బాట పట్టారు. యూరియాను అందరికి సమానంగా అందజేయాలని కోరుతూ గ్రామ సచివాలయం ఎదుట రైతులు బైఠాయించార. యూరియాను అక్రమంగా తరలిస్తూ తమకు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.‘రైతులు కాని వారికి యూరియా ఇస్తున్నారు. టీడీపీ నాయకురాలు భవాని చెప్పిన వారికి మాత్రమే యూరియా ఇస్తున్నారు. అధికారులు కూడా టిడిపి నాయకులు చెప్పిన వారికే యూరియా ఇవ్వడం దారుణం. పాస్ బుక్ ప్రకారం యూరియా ఇమ్మని అడిగితే ఇవ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు సర్కార్ బడ్జెట్ ‘దృశ్యం’ సినిమాను తలపిస్తోంది: సీపీఎం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలిపిస్తోందంటూ సీపీఎం ఎద్దేవా చేసింది. కూటమి బడ్జెట్ను నిరసిస్తూ.. విజయవాడలో సీపీఎం ఆందోళనకు దిగింది. నిరసనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు , పరిశ్రమలు వచ్చినట్లు, యువతకు ఉపాధి కల్పించేసినట్లు చెబుతున్నారు. దేశం మొత్తంలో 25 శాతం పెట్టుబడులు ఏపీకి వచ్చేశాయని చెబుతున్నారు ..కానీ బడ్జెట్ అందుకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు.‘‘కోతల మీద వాతలు పెట్టినట్లే ఉంది ఈ బడ్జెట్. రావాల్సిన ఆదాయం తగ్గిపోతోంది. అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి. గత రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని తేలిపోయింది. బడ్జెట్ అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు. కౌలు రైతుల గురించి కనీసం ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ..ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అన్నారు.. అదీ లేదు...సూపర్ సిక్స్లో భాగమైనవి ఇవ్వకుండా అన్నీ ఇచ్చేశామంటున్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు ఎటు పోతున్నాయో అర్థం కావడం లేదు. బెజవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల మయం. విజయవాడే ఇలా ఉంటి మిగిలిన పట్టణాల సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి ప్రజల తిరోగమనానికి కారణమైన బడ్జెట్ ఇది’’ అంటూ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శాంతిభద్రతలను కాపాడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్ జగన్ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. వైఎస్ జగన్ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ నేపథ్యంలో మార్షల్స్ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. -
ప్రతిపక్ష హోదా ఇవ్వాలని YSRCP నినాదాలు
-
Hyderabad: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడికి బీజేపీ కార్యకర్తలు యత్నించారు. బారికేడ్లను తోసుకొని కార్యాలయం ముందుకు దూసుకువచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసనలకు దిగింది. మంత్రి శ్రీహరి వేధింపులే కారణమని బీజేపీ ఆరోపిస్తుంది.మక్తల్ బీజేపీ అభ్యర్థి సూసైడ్ చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని... మహాదేవప్ప సూసైడ్ లెటర్ రాయలేదని.. విచారణ చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కాగా, మక్తల్ పట్టణ కేంద్రంలో 6 వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందడంతో తాత్కాలింగా ఆ వార్డు ఎన్నిక మాత్రమే రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా
సాక్షి, హైదరాబాద్ / కంటోన్మెంట్: ప్రజల కు మాటి చ్చి.. ఏడాది న్నరగా చేయలేకపో యినందుకు ఎంపీగా సిగ్గుతో తలదించు కుంటున్నా.. అంటూ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మారేడు పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వా లంటూ స్థానిక కార్పొ రేటర్ కొంతం దీపిక చేపట్టిన దీక్షకు ఆయన హాజరై మాట్లాడారు. మారేడు పల్లిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో ఎనిమిదేళ్ల క్రితం ఇళ్లు కూల్చేసి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చేపట్టారన్నారు. 2022లో సుమారు 250 మందికి ఇళ్లు కేటాయించినా, మరో 150 మందికి ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరి జాగీరు కాద ని, ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించిన కాంగ్రెస్ నేతలు, వారు అధికారంలోకి వచ్చి ఒరగబెట్టిందేంటని నిలదీశారు. ఈ అంశంపై ఏడాదిన్నరగా తాను ప్రయ త్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేద న్నారు. అధికారులకు సైతం ఎంపీ అన్నా లెక్కలేకుండా పోయిందన్నారు. గత డిసెంబర్లో కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో తాను స్వయంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. జనవరి ఒకటో వారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారు లకు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినా, నేటికీ పని పూర్తికాలేదన్నారు. ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్లతో పదేపదే మాట్లాడినా ఎలాంటి స్పందన లేదన్నారు. -
అంబటి.. జోగిపై దాడులు.. పార్లమెంట్ లో YSRCP నినాదాలు
-
USA: మీ పాలన వద్దు బాబోయ్.. ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశంలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీనే వ్యతిరేకించిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ పాలనపైనే వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఆయన పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు సమాచారం."నేనేప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు" ఇది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎప్పుడు ఏంమాట్లాడుతారో.. ఏదేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో.. ఏభూమిని స్వాధీనం చేసుకుంటారో.. ఏ దేశంపై పన్నులు పెంచుతారో ఆయనకే తెలియదు.. అందుకే ట్రంప్ పాలన విధానంపై ప్రపంచ దేశాలు భయంభయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు సీన్ మరింతగా ముదిరింది. ఆయన పాలనపై తాజాగా అమెరికాలోనూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల అమెరికా మిన్నోసోటా రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడుల్లో ఇద్దరు మరణించగా అందుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చాలామంది తమ వ్యాపారాలను మూసి వేసి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. విద్యార్థులు సైతం పాఠశాలల నుంచి క్లాసులు వాకౌట్ చేశారు. అంతేకాకుండా నోవర్క్, నోస్కూల్, నోషాపింగ్ పేరుతో అమెరికా అంతటా ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.దీంతో ట్రంప్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాన్నే వ్యతరేకించిన అమెరికన్స్ తాజాగా ఆయన పరిపాలన పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ ట్రంప్ పాలనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడైంది. మెుత్తానికి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ని చివరకు ఆ దేశ ప్రజల చేతే తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. -
మంత్రి లోకేశ్ ఇంటి ముట్టడికి AIYF నేతల ప్రయత్నం
-
కూటమికి 24 గంటల డెడ్ లైన్.. TDP పోస్టర్ల దగ్గర నిరసన
-
దద్దరిల్లిన విశాఖ.. YSRCP భారీ ర్యాలీ
-
విశాఖలో గీతం భూదోపిడీ.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: గీతం భూ దోపిడీపై సీపీఎం నిరసన చేపట్టింది. గీతం యూనివర్సిటీ ముందు సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 5 వేల కోట్ల భూములను ఏ విధంగా గీతం యూనివర్శిటీకి కట్టబెడతారంటూ ప్రభుత్వాన్ని సీపీఎం నేతలు నిలదీశారు. ప్రభుత్వం ప్రజా ఆస్తులుకు రక్షణగా ఉండాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భరత్పై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు బంధువైన అంత మాత్రాన ఎంపీ భరత్కు 55 ఎకరాల భూమి కట్టబెడతారా? అంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు.గీతం యూనివర్సిటీ దగ్గర సీఐ మల్లేశ్వరరావు ఓవరాక్షన్గీతం యూనివర్సిటీ దగ్గర సీఐ మల్లేశ్వరరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీపీఎం నేతలు గీతం యూనివర్సిటీ ముందు ఆందోళన చేయడానికి వీల్లేదంటూ సీఐ అడ్డుకున్నారు. దీంతో సీఐతో సీపీఎం నేతలు వాగ్వాదానికి దిగారు. నిరసనను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ సీఐని సీపీఎం నేతలు నిలదీశారు. శాంతియుత నిరసన.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని సీపీఎం నేతలు పేర్కొన్నారు. -
మేం చెప్పిందే చేయాలి
లక్కవరపుకోట : తాము చెప్పిందే అధికారులు చేయాలంటూ విజయనగరం జిల్లా ఎస్.కోట టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పార్టీ శ్రేణులతో కలిసి లక్కవరపుకోట తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. కోర్టులో ఉన్నదైనా సరే తనకు తెలియకుండా తమపార్టీ నాయకుల భూమిని వివాదాస్పద భూమి జాబితాలోకి ఎందుకు మార్చారంటూ రెవెన్యూ సిబ్బందిపై ఊగిపోయారు. లక్కవరపుకోట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 422–5లో 0.67 సెంట్లు, 422–6లో 0.70 సెంట్ల మెట్టభూమికి సంబంధించి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావుకు, ఎం.జయశ్రీకి మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.3 కోట్ల వరకు పలుకుతుంది. ఈ భూమికి సంబంధించి ఈశ్వరరావు పేరుపై వన్బీ నమోదై ఉంది. ఈ విషయమై జయశ్రీ ఆర్డీవో కోర్టును ఆశ్రయించారు. ఆర్డీవో ఆదేశాలతో దీనిపై విచారించిన తహసీల్దార్ గత డిసెంబర్ 12న ఆర్డీవోకి నివేదిక ఇచ్చారు. అదేనెల 15న జేసీ ఆ భూమిని వివాదాస్పద భూమి జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని ఈశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే లలితకుమారికి చెప్పారు. ఆమె టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్వేసి ధర్నాకు దిగారు. ఆ భూమిని వివాదాస్పద భూముల జాబితా నుంచి తొలగించేవరకు ధర్నా విరమించేది లేదని చెప్పారు. ప్రస్తుతం అదనపు బాధ్యత వహిస్తున్న తహసీల్దార్ టి.రమేష్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. మీరు మాకు చెప్పకుండా పనులు చేసేస్తున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ భూమి వివాదం కోర్టులో ఉండటంతో జేసీ డిస్పూ్యట్ భూముల జాబితాలో చేర్చారని తహసీల్దార్ చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. -
నోర్ముయ్ అన్న.. ఎమ్మెల్యే పై తిరగబడ్డ కొల్లేరు వాసులు
-
భర్త వేధింపులు.. నువ్వు కన్యవేనా?
కడప అర్బన్ : కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో తన భర్త మద్దూరి దినేష్ నివసిస్తున్న ఇంటి ఎదుట భార్య శ్రీలక్ష్మి బుధవారం న్యాయం కోసం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా బాధిత మహిళ శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తనకు, మద్దూరి దినేష్కు 2022 జూన్ 18న కర్నూల్లో వివాహమైందని, తమకు కుమారుడు ఉన్నాడని తెలిపారు.తన భర్త, కుటుంబ సభ్యులు వివాహ సమయంలో ఇచ్చిన 25 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 5 లక్షల రూపాయలు నగదు, తాను ఉద్యోగం చేసి సంపాదించిన రూ.లక్ష ఇరవై వేలు, తనకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు సంబంధించిన వస్తువులను తీసుకునేందుకు వస్తే వారు పలకడం లేదన్నారు. న్యాయం కోసం ఇంటిముందు బైఠాయించాల్సి వచ్చిందని తెలిపారు. తాను మూడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కర్నూలులోని తమ పుట్టింటిలో వదిలేసి వెళ్లిపోయాడని, తర్వాత కుమారుడు జన్మించాడు, అప్పటినుంచి పట్టించుకోలేదని తెలిపారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళ ఆరోపించారు. వివాహమైనప్పటి నుంచి తనను శారీరకంగా మానసికంగా బాధపెట్టారని తెలియజేశారు. ఆమె తల్లి, రెండున్నర సంవత్సరాల కుమారుడు, టీడీపీకి చెందిన నాయకురాలు, బంధువులు వచ్చి అండగా నిలబడ్డారు. ఈ సంఘటనపై చిన్న చౌక్ పోలీసులు మాట్లాడుతూ ఇప్పటికే అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని, కోర్టులో కేసు నడుస్తుందని తెలియజేశారు. ఆందోళన విషయమై మహిళను పిలిపించి మాట్లాడామని తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖలో మహిళలు నిరసన
-
ఏపీ డీజీపీ ఆఫీస్ ముందు వైఎస్సార్సీపీ నేతల ధర్నా
సాక్షి, అమరావతి: డీజీపీ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు.. ఆయన అపాయింట్మెంట్ను కోరారు. అపాయింట్మెంట్ ఇచ్చేందుకు డీజీపీ గుప్తా నిరాకరించారు. డీజీపీ కార్యాలయం స్పందించకపోవడంతో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు తలొగ్గి అనుమతినిచ్చారు. ఏడీజీ ఫిర్యాదు తీసుకున్నారు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయంలో కనీసం మనుషులుగా కూడా గౌరవించలేదని.. పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తిపై కేసులు పెట్టడం దారుణమని.. కూటమి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. ‘‘సాల్మన్ను హత్య చేసిన నిందితులపై ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దారుణాలు, అఘాయితాలు పెరిగాయి. సాల్మన్ది ప్రభుత్వ హత్యే బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం ఇవ్వాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్ దారుణ హత్యపై డీజీపీకి వినతిపత్రం అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తమకు సోమవారం అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతూ డీజీపీకి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.ఊరు విడిచి ఎక్కడో తలదాచుకుంటూ, తన భార్యను చూసేందుకు వచ్చిన మందా సాల్మన్ను పిన్నెల్లిలో దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేశారని, రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని అప్పిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీ దళిత కార్యకర్తలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
Watch Live: దళిత హత్యలపై YSRCP పోరుబాట
-
భోగి మంటల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో
సాక్ష, తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు వైవిధ్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కోసం ఇచ్చిన జీవో కాపీలను భోగి మంటల్లో వేసి బాబు సర్కార్కు వ్యతిరేకంగా నిరసన చెబుతున్నాయి. ఈ నిరసనల్లో అటు వామపక్ష పార్టీలు సైతం పాల్గొన్నాయి.పనికిరాని వస్తువులన్నీ ‘భోగి’ మంటల్లో వేస్తున్నాం. కూటమి ప్రభుత్వ అహం తొలగిపోవాలని కోరుకున్నాం. ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చాం. వెంటనే ఆ జీవోను వెనక్కు తీసుకోవాలి. లేదంటే మరింతగా ప్రజా ఉద్యమాలు చేపడతాం అని కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. వైయస్సార్ జిల్లా కేంద్రంలో.. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చిన మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట పరిశీలకుడు సురేష్ బాబు, మేయర్ పాకా సురేష్ పాల్గొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.తెలుగువారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. మెడికల్ కాలేజీల పిపిపిని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను దగ్ధం చేశాం. ఈ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను పక్కనపెట్టేసింది. ప్రతీ అంశంలోనూ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పన్నులు,సెస్ లు వేసి ప్రజల పై భారాలు మోపుతోంది. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటానికి అర్హత లేదు అని విష్ణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో.. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు ,హరిదాసులు గంగిరెద్దులతో ఘనంగా సంక్రాంతి వేడుకలను ప్రారంభించారాయన. కూటమి హయాంలో కేవలం చంద్రబాబు కుటుంబం రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని.. కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఈ సందర్భంగా.. మెడికల్ కళాశాలల పిపిపి జీవో ప్రతులను భోగిమంటల్లో దగ్ధం చేశారు.ప్రకాశం జిల్లా భోగి వేడుకల్లో.. చీమకుర్తిలోని తన నివాసం వద్ద నిరవహించిన భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జగన్ మోహన్ రెడ్డి హయాంలో పేదలకు ఉపయోగ పడే విధంగా ప్రభుత్వమే 17 మెడికల్ కాలేజీ లను నిర్మించడానికి ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్కు మంచి పేరు వస్తుంది అని ప్రవేటు వారికి దారదత్తం చేయడానికి మెడికల్ కాలేజీ లను పీపీపీ విధానంలో కి మార్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకొని మెడికల్ కాలేజీ లను ప్రభుత్వమే నిర్మించాలి అని డిమాండ్ చేశారు. వైయస్సార్ జిల్లా పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గృహం వద్ద భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. జిల్లా ప్రజలకు భోగి , మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.చిత్తూరు జిల్లా నగరిలో తన నివాసం వద్ద ఆర్కే రోజా భోగి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో.. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ‘‘కూటమి ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, రాష్ట్రంలో ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదు. రైతులు సంతోషం జరుపుకునే పండుగ ఇది, 20 వేలు ఇస్తామని చెప్పి, కొందరికే 10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని సంతోషంగా నమ్మిన వారు నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. నాలుగుసార్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకు రాలేదు. కూటమి ప్రభుత్వం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. ప్రవేట్ మెడికల్ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపిన రోజా.. ఫ్రీ ఫ్రీ అనే ఫ్రీ బాబు మాటలు నమ్మవద్దు అని రాష్ట్ర ప్రజలను కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో.. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం వద్ద భోగి మంట వేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో శ్రేణులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలు మంటల్లో వేశారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి.. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. జీవో 590, 847 రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ.. ఏకంగా కూటమి మేనిఫెస్టోని భోగిమంటల్లో వేసిన ఏఐవైఎఫ్ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి రూ.3,000, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
రావణకాష్టంగా ఇరాన్
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాణిజ్య సము దాయాలు, బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు. ఉద్యమ వార్తలు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను స్తంభింపజేసింది. అయితే నాలుగు రోజుల తర్వాత కొందరికి మాత్రం అంతర్జాతీయ ఫోన్కాల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత రెండు వారాలుగా తాము పడుతున్న బాధలు, నరకయాతనను పలువురు విదేశాల్లోని తమ బంధువుల ముందు ఏకరవు పెట్టారు. సెంట్రల్ టెహ్రాన్లో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు మొహరించారని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బంధువులకు చెప్పారు.ఆన్లైన్ సదుపాయం లేక బ్యాంక్లలో నగదు లావాదేవీలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుండటంతో జనాలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకారులను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తూ కాల్పులు జరుపుతుండటంతో ఉద్యమసంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 2,003 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ’ మంగళవారం ప్రకటించింది. వీరిలో 1,850 మంది ఉద్యమకారులుకాగా 135 మంది పోలీసులు ఉన్నారు. అభంశుభం తెలియని 9 మంది చిన్నారులు, ఉద్యమంలో పాల్గొనని 9 మంది సాధారణ జనం సైతం కాల్పుల్లో కన్నుమూశారు. మరోవైపు అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేస్తే ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగడం ఖాయమన్న అంచనాలతో ఇరానియన్లు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనల ధాటికి దుకాణాలు మూతబ డుతున్నాయి. నిరంకుశ, ఛాందసవాద ఖమేనీ గద్దె దిగి ప్రజాస్వామ్యయుత పాలన కావాలంటూ వేలాదిగా జనం వీధుల్లో నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన ఖమేనీ సర్కార్ పోలీసులను రంగంలోకి దింపి లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులకు పనిచెప్తోంది. పోలీసులు, ఉద్యమకారులకు మధ్య ఘర్షణల్లో వేలాది మంది గాయపడ్డారు. గత రెండువారాల వ్యవధిలో 10,700 మందికిపైగా నిరసనకారులను ప్రభుత్వం అరెస్ట్చేసింది.ఉద్యమకారుడు ఇర్ఫాన్ను ఉరితీస్తాం..సుప్రీంకమాండర్ ఖమేనీని దూషిస్తూ గత గురువారం జరిగిన నిరనస ర్యాలీలో పాల్గొన్న నేరానికి 26 ఏళ్ల ఉద్యమకారుడు ఇర్ఫాన్ సొల్తానీని బుధవారం ఉరితీస్తామని ఖమేనీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అన్యాయంగా ఇర్ఫాన్ను ప్రభుత్వం బలితీసుకుంటోందని, అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ‘హెంగ్వా ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. టెహ్రాన్ శివారు కరాజ్లోని ఫర్దీస్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ను జనవరి 8వ తేదీన పోలీసులు అరెస్ట్చేశారు. దేవునిపై యుద్ధం ప్రకటించాడని ఇర్ఫాన్పై నేరాభియోగాలు మోపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్ణయాలు తీసు కుని ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఎప్పుడూ చూడలేదని టెహ్రాన్వాసులు అసహనం వ్యక్తంచేశారు. ఇర్ఫాన్ను చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇర్ఫాన్ సోదరి స్వయంగా న్యాయవాది అయినా కూడా ఆమె ఈ కేసు వాదించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ఇరాన్లో ఉంటున్న తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక అడ్వైజరీని జారీచేసింది.నేనున్నా.. రెచ్చిపోండి: ట్రంప్ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడారు. ఈ మేరకు ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ ఇరానియన్లు దేశ భక్తులు. నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలను మీ వశం చేసుకోండి. హంతకులు, దాడులు చేసే వారి పేర్లను రాసిపెట్టుకోండి. మనందరం కలిసి వాళ్ల అంతుచూద్దాం. దాడులకు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దారుణ హత్యోదంతాలు ఆగేదాకా ఇరాన్ ప్రభుత్వంతో నేను ఎలాంటి చర్చలు జరపబోను. అందుకే ఇరాన్ అత్యున్న తాధికారులతో అన్నిరకాల సమావేశాలను మంగళవారం రద్దు చేసుకున్నా. మీకు సాయం చేయబోతున్నాం. త్వరలోనే మీకు మా సాయం అందుతుంది. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగేన్’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. అయితే సాయం ఏ రూపంలో చేయబోతున్నారో ట్రంప్ వెల్లడించలేదు. అయితే అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ చెప్పారు. -
దద్దరిల్లుతున్న ఇరాన్.. ఖమేనీ ఫోటో కాల్చి సిగరెటికి నిప్పు
-
కాకాణి పై పోలీసుల అత్యుత్సాహం
-
మెడకు ‘ఉరి’.. చేతిలో పవన్ ఫోటో.. గిరిజనుల వినూత్న నిరసన
బొబ్బిలి (విజయనగరం జిల్లా): ‘మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌకర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను కలవాలని ఉచిత సలహా ఇచ్చారు. మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు.పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం’ అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావలస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు.వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించుకుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పలరాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు. -
Watch Live: విజయవాడలో నిరసన దీక్ష
-
మోడల్ స్కూల్లో కులవివక్ష!
చంద్రగిరి: సీఎం చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంపేట మోడల్ స్కూల్లో కుల వివక్ష చోటుచేసుకుంది. తమ పిల్లలను దళిత విద్యార్థులతో కలిసి చదివించేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు. టీడీపీ నాయకుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి అనధికారికంగా పాత పాఠశాలలోనే తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. అయితే, మోడల్ స్కూల్లో సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతోందని అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రగిరి మండలంలోని పనపాకం పంచాయతీలో ఉన్న అరిగెలవారిపల్లి, ఇరివిశెట్టివారిపల్లి, తూర్పుపల్లి ప్రాథమిక పాఠశాలలను పనపాకంపేట ప్రాథమిక పాఠశాలలో విలీనం చేసి మోడల్ స్కూల్గా ఏర్పాటుచేశారని చెప్పారు. ఇక్కడ సుమారు 65 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు నియమించారని తెలిపారు. నెలరోజులపాటు పాఠశాల సవ్యంగా సాగిందన్నారు.ఆ తర్వాత పనపాకంపేట మోడల్ స్కూల్లో ఆ గ్రామ దళిత విద్యార్థులు ఉన్నారని, వారితో కలిసి చదువుకునేందుకు తమ పిల్లలను పంపించబోమని అరిగెలవారిపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారని పేర్కొన్నారు. వారి పిల్లలను మోడల్ స్కూల్కు పంపకుండా నిలిపేశారని వివరించారు. ఆపై టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని అనధికారికంగా అరిగెలవారిపల్లిలోని పాత పాఠశాలలోనే వారి పిల్లలను తిరిగి చేరి్పంచారని తెలిపారు. అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లిలోని పాత పాఠశాలకు విద్యాశాఖ అ«ధికారులు సైతం మోడల్ స్కూల్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించారని పేర్కొన్నారు. త్వరలో సమస్య పరిష్కరిస్తాం: ఎంఈవో ఈ విషయంపై ఎంఈవో లలిత కుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా... అరిగెలవారిపల్లి నుంచి విద్యార్థులు రావడానికి ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ ఊరిలోనే పాఠశాల కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రుల ఆందోళనల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆమె వివరించారు.మా పిల్లల చదువులు అటకెక్కాయిపనపాకంపేట మోడల్ స్కూల్లో 45 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మిగిలారని తల్లిదండ్రులు తెలిపారు. వారిలో ఒక ఉపాధ్యాయుడు పది రోజుల కిందట డిప్యూటేషన్పై మరో పాఠశాలకు వెళ్లడంతో తమ పిల్లల చదువులు అటకెక్కాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలుగు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో పిల్లలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు విద్యాశాఖ అ«ధికారులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.అనధికారికంగా నిర్వహిస్తున్న అరిగెలవారిపల్లి పాఠశాలలో 20 మంది పిల్లలు ఉన్నారని, అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి, ఇక్కడ మాత్రం 45 మంది విద్యార్థులకు ఒకే ఒక్కరిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు. దళిత విద్యార్థులంటే అధికారులకు చిన్నచూపా... అంటూ మండిపడ్డారు. మూడు గ్రామాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి, అరిగెలవారిపల్లి టీడీపీ నాయకులు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారంటూ మండిపడ్డారు. కేవలం దళితులు ఉన్న పాఠశాల కావడంవల్లే అధికార పార్టీ నేతలు వివక్షతోనే మోడల్ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకుండా చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్.. రైతుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు.. అసెంబ్లీని ముట్టడించారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది.ఈ సందర్భంగా ఆదిలాబాద్ రైతులు మాట్లాడుతూ..‘అధిక వర్షపాతం కారణంగా సోయాబీన్ పంట నష్టం జరిగింది. రంగు మారిందని సోయాబీన్ పంట కొనుగోలు చేయడం లేదు. పార్టీలకు అతీతంగా రైతు నాయకులు, రైతులు అందరం.. మంత్రిని కలవడానికి వచ్చాం. కేవలం ఐదుగురు రైతులను మాత్రమే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. వచ్చిన రైతులందరినీ పంపిస్తేనే లోపలికి వెళ్తాం అని చెప్పుకొచ్చారు. అయితే, పోలీసులు రైతులను లోపలికి అనుమతించకపోవడంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.కాగా, రైతుల వద్ద నిలువ ఉన్న సోయాబీన్ పంటను రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుల వద్ద నుంచి 2,80,000 క్వింటాళ్లకు పైగా సోయాబీన్ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది.. 24,000 మంది రైతులు 72 ఎకరాలలో సోయాబీన్ సాగు చేశారు. 4,32,000 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా కానీ అంతకంటే ఎక్కువే వచ్చింది. ఇప్పటి వరకు 6280 మంది రైతుల వద్ద 1,64,000 క్వింటళ్ల పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో, రైతులు ఆందోళనకు దిగారు. -
ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహం
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచి్చ, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది క్రమంగా జెన్జీ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. బుధవారం, గురువారం నాలుగు నగరాల్లో నిరసనకారులకు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోంది. మరోవైపు నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. దాంతో రాజధాని టెహ్రాన్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తోంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలని, ధరలు తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వ్యాపార వర్గాలు సైతం ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నాయి. పాతాళానికి రియాల్ విలువ డాలర్తో పోలిస్తే రియాల్ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 42,125 రియాల్స్గా నమోదయ్యింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్టం. ఇరాన్పై అమెరికాతోపాటు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షల ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్లో 2022 తర్వాత ప్రజా ఉద్యమం రగులుకోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మాషా అమీనీ అనే యువతిని పోలీసులు నిర్బంధించారు. ఆమె పోలీసు కస్టడీలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలు భద్రతా సిబ్బంది దాడిలో ఏడుగురు మరణించడం పట్ల జనం మండిపడుతున్నారు. తమ పోరాటం ఉధృతం చేస్తామని తేలి్చచెబుతున్నారు. గురువారం లారెస్తాన్ ప్రావిన్స్లోని అజ్నా సిటీలో నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బక్తియారీ ప్రావిన్స్లోని లార్డెగాన్ నగరంలోనూ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్ఫాహాన్ ప్రావిన్స్లో ఉన్న ఫులద్షహర్లో ఒకరు బలయ్యారు. మరోవైపు జనం దాడిలో ఇద్దరు పారామిలటరీ గార్డులు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కౌహదస్త్ నగరంలో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. విదేశీ జోక్యాన్ని సహించం: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తిప్పి కొట్టారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేలి్చచెప్పారు. తమ సమస్యలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకొనే సామర్థ్యం తమకు ఉందన్నారు. ఇరాన్ వ్యవహారాల్లో అనవసరంగా కలుగుజేసుకోవాలని చూడడం సరైంది కాదని సూచించారు. ఇతర దేశాలు ఈ విషయం గుర్తించాలని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్లో అలజడికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఆరోపించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే అమెరికా అంతిమంగా ప్రయోజనాలే దెబ్బతింటాయని స్పష్టంచేశారు. గత ఏడాది జూన్లో ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం ఇరాన్ కరెన్సీ విలువ పడిపోకుండా కాపాడే విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంకేతాలిచ్చారు. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని, ప్రజలు శాంతించాలని కోరారు. నిరసనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్న ట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఘర్షణలో మృతిచెందినవారి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి చావు తప్పదంటూ ఈ సందర్భంగా జనం నినాదాలు చేశారు. హద్దు మీరితే జోక్యం: ట్రంప్ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై ఆయుధాలు ప్రయోగిస్తే తాము జోక్యం చేసుకోక తప్పదని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో పోస్టు చేశారు. ప్రజా ఉద్యమం పట్ల ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలపై హద్దు మీరి ప్రవర్తిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. నిరసనకారులను కాపాడుకుంటామన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు. -
తారా స్థాయికి చేరిన ‘Gen Z’ ఉద్యమం.. యుద్ధం తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారి ప్రాణాల్ని అన్యాయంగా తీసుకుంటుంటే అమెరికా చూస్తూ ఊరుకోదు. నిరసనకారులపై బలప్రయోగం చేయొద్దు. వారిని చంపితే ఇరాన్పై యుద్ధం చేస్తామంటూ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్లో జెన్జీ (Gen Z) ఉద్యమం తారాస్థాయికి చేరింది. అక్కడి యువత ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, రియాల్ కరెన్సీ పతనం కారణంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలు గత వారం టెహ్రాన్లో ప్రారంభమై కొన్ని గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ క్రమంలో ఆందోళన కారుల్ని అరికట్టేందుకు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇరాన్ తీరుపై ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ ప్రజలపై దాడులు కొనసాగితే, అమెరికా మౌనంగా ఉండదు. మేం సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ అన్నారు. అంతేకాదు నిరసన కారులను రక్షించేందుకు అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.2022 తర్వాత తొలిసారి ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుండడం, రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడం, అనైతిక చట్టాల అమలుతో పాటు పలు అంశాలపై ఇరాన్లోని టెహ్రాన్తో పాటు పలు ప్రోవిన్స్ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిరసన కారుల్ని అణిచి వేసేందుకు కాల్పులకు తెగబడుతోంది. ఫలితంగా ఐదురోజుల వ్యవధిలో సుమారు ఏడుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు. If Iran shots and violently kills peaceful protesters, which is their custom, the United States of America will come to their rescue. We are locked and loaded and ready to go. Thank you for your attention to this matter! President DONALD J.TRUMP(TS: 02 Jan 02:58 ET)…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) January 2, 2026 -
బొగ్గు గని ప్లాంట్ వద్ద నిరసన సెగ
రాయ్గఢ్: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలో జిందాల్ పవర్ లిమిటెడ్కు సంబంధించిన బొగ్గు గని ప్లాంట్ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన శనివారం హింసాత్మకంగా మారింది. తమనార్ పరిధిలోని లిబ్రా గ్రామంలో ఉన్న కోల్ హ్యాండింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు తరలించే వాహనాలను అడ్డుకుంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమ నాయకుడు రాధేశ్యామ్ శర్మ, మరో 40 మందిని అరెస్ట్చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అయితే సైకిల్పై వెళ్తున్న స్థానికుడిని మరో బొగ్గు ట్రక్కు ఢీకొట్టిందన్న వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తర్వాత ప్లాంట్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. కోల్ ప్లాంట్లోని కన్వేయర్ బెల్ట్, ట్రాక్టర్లు, పోలీస్ బస్సు, జీప్కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సెక్టార్–1 కోల్బ్లాక్ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన వేయి మందికిపైగా గ్రామస్తులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారు. అయినాసరే పరిస్థితి అదపులోనే ఉందని జిల్లా ఎస్పీ శనివారం వెల్లడించారు. -
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ జరిగింది..రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్కుమార్, సీఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఓటమి పాలైన అభ్యర్థిని తిట్లు భరించలేక...
రామారెడ్డి(ఎల్లారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు పోటీ చేసిన మహిళ ఓటమి పాలైంది. అప్పటి నుంచి బూతు పురాణం అందుకుంది. వార్డు ప్రజలను నోటి కొచ్చినట్టు తిడుతోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వార్డు ఓటర్లు ఆమె పంపిణీ చేసిన బీర్లు, చీరలు, కూల్డ్రింక్స్ను గ్రామ పంచాయతీ ముందు పెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబవ్వ ఉప్ప లవాయి పంచాయతీలోని 2వ వార్డుకు పోటీ చేసింది. ఓట ర్లను ఆకట్టుకునేందుకు బీర్లు, మహిళలకు చీరలు, కూల్డ్రింక్స్ పంపిణీ చేసింది. ఓటమి పాలైన రోజు నుంచి వార్డు ఓటర్లను ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషిస్తోందని వార్డు ప్రజలు వాపోయారు. గురువారం కూడా బాబవ్వ తన నోటికి పని చెప్పడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పంపిణీ చేసిన చీరలు, బీర్లు, కూల్డ్రింక్స్ను పంచాయతీ కార్యాలయం ఎదుట పడేసి నిరసన తెలిపారు. ఇదే మండలంలోని మరో రెండు మూడు గ్రామాలలో ఓటమిపాలైన వార్డు సభ్యులు తాము పంపిణీ చేసిన ఆండాలు (ఫంక్షన్లకు ఉపయోగించే వంట సామగ్రి ), బగోనేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదిలేక తిరిగి ఇచ్చేశారు. -
బెంగాల్లో మిన్నంటిన నిరసనలు
కోల్కతా: బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడి హత్యతోపాటు మైనార్టీలపై జరుగుతున్న∙దాడుల పట్ల పశ్చిమ బెంగాల్లో హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్, సరిహద్దులోని ఓడరేవుల వద్ద బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.దీంతో, కోల్కతాలో హౌరా బ్రిడ్జి వైపు ర్యాలీగా వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బారీకేడ్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ సనాతన ఐక్య పరిషత్ ఆధ్వర్యంలో 24 పరగణాల జిల్లా, మాల్డా, కూచ్ బెహార్ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18న బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ సిటీలో దీపూ చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అల్లరిమూకలు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ రాక్షసకాండ పట్ల ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. అల్లరిమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన దీపూ చంద్రదాస్ కుటుంబ బాధ్యతను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వీకరిస్తుందని మధ్యంతర ప్రభుత్వ సీనియర్ సలహాదారు సీఆర్ అబ్రార్ చెప్పారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దీపూ చంద్రదాస్ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల బాగోగులను ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు. అమాయకుడిని హత్య చేయడం దారుణమని అన్నారు. ఈ హత్యకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని దీపూ చంద్రదాస్ తండ్రి రవి చంద్రదాస్ డిమాండ్ చేశారు. తన కుమారుడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్నారు. -
భగ్గుమన్న భూ వివాదం.. తహసీల్దార్ కళ్లలో కారం కొట్టి..!
-
ఢిల్లీలో బంగ్లా హైకమిషన్ వద్ద VHP ఆందోళనలు
-
ఢిల్లీలో ఉద్రిక్తత.. బంగ్లా హైకమిషన్ వద్ద హిందూ సంఘాల నిరసనలు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరససగా వీహెచ్పీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో బంగ్లా హైకమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్పీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో, పరిస్థితి ఆందోళనకరంగా మారింది.వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దారుణాలు, దీపూ చంద్ర దాస్ను హత్య చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల సభ్యులు ఆ దేశ హైకమిషన్ దగ్గర నిరసనకు దిగారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద బారికేడ్లు తోసుకుంటూ వీహెచ్పీ నేతలు లోపలికి వెళ్లే యత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో హిందూ సంఘాలు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో హిందూ సంఘాల నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. #WATCH | Delhi | Members of Vishva Hindu Parishad and other Hindu organisations protest near the Bangladesh High Commission over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh pic.twitter.com/0nrtZ3XWYG— ANI (@ANI) December 23, 2025దీపు చంద్రదాస్ హత్య చేసిన వారిని శిక్షించాలని హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. యూనస్ ప్రభుత్వం రాడికల్స్ మద్దతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని, హిందువులపై అత్యాచారాలు నిరోధించేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని హిందువులను రక్షించాలని కోరారు. 1971 తరహాలో తప్పు చేయవద్దని ఇండియాలో బంగ్లాదేశ్ను కలపాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలు ఎవరూ లోపలికి వెళ్లకుండా నిలువరిస్తున్నారు. అనంతరం.. ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు తెలిసింది. మరోవైపు.. బంగ్లాదేశ్పై ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 జరగాలంటూ వీహెచ్పీ డిమాండ్ చేసింది. #WATCH | Delhi | Vishva Hindu Parishad and other hindu organisations protest near the Bangladesh High Commission against the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das pic.twitter.com/aKo0T3BUs2— ANI (@ANI) December 23, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్లో సైతం హిందు సంఘాల నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భోపాల్లో బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. #WATCH | Bajrang Dal and other Hindu organisations protest over the atrocities against Hindus and the mob lynching of Dipu Chandra Das in Bangladesh, in BhopalA Bajrang Dal member says,"Bajrang Dal has protested against the Bangladesh government today. We demand that… https://t.co/O134zU9B9p pic.twitter.com/1xVG722dxQ— ANI (@ANI) December 23, 2025 -
గురజాలలో ప్రజాస్వామ్యానికి తూట్లు
గురజాల: పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు ప్రజా స్వామ్యానికి తూట్లు పొడిచారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీకి చెందిన చైర్పర్సన్పై పోలీసులు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారు. ఆమె సెలవులో ఉన్నారంటూ కౌన్సిల్ హాలు గేటు బయటే నిలిపేశారు. టీడీపీ కూటమి నేతల ఒత్తిడి మేరకు గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీగా మార్చేందుకు కౌన్సిల్ తీర్మానం కోసం సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సమావేశంలో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీకి చెందిన చైర్పర్సన్ పోలు పవన్మయి రాగా, పోలీసులు అడ్డుకున్నారు. పవన్మయి కొద్దికాలం కిందట చైర్పర్సన్ పదవికి సెలవు పెట్టారని, ఆమె స్థానంలో మరొకరు చైర్మన్గా కొనసాగుతున్నారని, ముందస్తు సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశానికి హాజరై ఓటు వేయడానికి వీల్లేదని పోలీసులు గేటు బయటే నిలిపేశారు. ఓటు హక్కు కల్పించాలని కోరినా... చైర్పర్సన్ పదవికి సెలవు పెట్టినా కనీసం తాను కౌన్సిలర్గా అయినా సమావేశంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పవన్మయి కోరినా, మున్సిపల్ అధికారులు, పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆమె గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వచ్చి పవన్మయిని సమావేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.కానీ, పోలీసులు, మున్సిపల్ అధికారులు మాత్రం ఆమె సెలవులో ఉన్నారంటూ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. చాలాసేపు వాగ్వాదం అనంతరం ఆమె బయట ఉండగానే కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 20 మంది సభ్యులకు గాను, 18 మంది హాజరయ్యారు. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురాన్ని విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే తీర్మానానికి అనుకూలంగా టీడీపీలో కొనసాగుతున్న 11 మంది, వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు ఓటు వేశారు. మెజార్టీ సభ్యులు ఓటు వేయడంతో తీర్మానాన్ని ఆమోదించారు. కౌరవ సభను తలపించిన గురజాల కౌన్సిల్ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి గురజాల రూరల్: పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం కౌరవ సభను తలపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డి అన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ మహిళా చైర్పర్సన్ను కౌన్సిల్లోకి రానీయకపోవడం దారుణమని, గురజాల చరిత్రలో దీనిని బ్లాక్డేగా పరిగణించాలన్నారు. ‘గురజాలకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. 1999లో రాజకీయ కారణాల వల్ల గురజాల నుంచి జంగమహేశ్వరపురాన్ని విడగొట్టారు.అభివృద్ధికి ఆమడ దూరంలోఉన్న జంగమహేశ్వరపురాన్ని 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన తరువాత అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చొరవతో గురజాలలో విలీనం చేశారు. అప్పటినుంచి సుమారు రూ.22 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టాక మళ్లీ జంగమహేశ్వరపురాన్ని మళ్లీ గురజాల నుంచి విడదీయాలని చూస్తోంది’ అని యెనుముల విమర్శించారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వచి్చన నగర పంచాయతీ చైర్ పర్సన్ పోలు పవన్మయిని కౌన్సిల్ బయటే అడ్డుకోవడం దారుణమని, ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అని ప్రశి్నంచారు.‘జంగమహేశ్వరపురం గురజాలలోనే ఉండాలి. నగర పంచాయతీగా ఉంటేనే అభివృద్ధిసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ గురజాల నుంచి జంగమహేశ్వరపురాన్ని విడదీయనీయం’ అని స్పష్టం చేశారు. ఆరుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేసి టీడీపీకి మద్దతుగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తీరుపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కొమ్మినేని వెంకటేశ్వర్లు, కె.బుజ్జి, కె.అన్నారావు, సిద్దాడపు గాందీ, పాల్గొన్నారు. -
కదం తొక్కిన సీఆర్ఎంటీలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్రశిక్ష క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు (సీఆర్ఎంటీ) కదం తొక్కారు. స్కూల్ అసిస్టెంట్ అర్హతలతో విద్యాశాఖలో పనిచేస్తున్న వారంతా ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. తొలుత సీఆర్ఎం టీచర్లు ఏలూరు లాకుల సెంటర్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేతనాలు పెంచాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని, డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలనే డిమాండ్లతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.అనంతరం చేపట్టిన దీక్షలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ, ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఎస్టీయూ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. దీక్షను ఉద్దేశించి సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు ఎం.కాశి, బి.నారాయణమూర్తి, పోలినాయుడు, రాంజీప్రసాద్, యు.సాయికుమార్ మాట్లాడుతూ.. డిగ్రీ, బీఈడీ, టెట్ అర్హతలు కలిగిన తాము అతి తక్కువ వేతనానికి 14 ఏళ్లుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామన్నారు. అర్హతకు తగిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.స్కూల్ కాంప్లెక్సులను ఏ, బీ క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్లుగా వేతన పెంపు లేకుండా పనిచేస్తున్నామన్నారు. అన్ని అర్హతలు ఉన్న సీఆర్ఎంటీలకు డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలని, ట్రావెలింగ్ అలవెన్సు పునరుద్ధరించాలని, సీఆర్ఎంటీలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి అందరికీ ఒకే విధమైన హోదాను, పనిని అప్పగించాలని డిమాండ్ చేశారు. కొన్ని జిల్లాల్లో ఖాళీ పోస్టుల్లో 50–100కిలో మీటర్ల దూరం ఉన్న వారిని మ్యాపింగ్ చేసే ప్రక్రియను విరమించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులకు నూతన నియామకాలు చేపట్టి సీఆర్ఎంటీలపై అదనపు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఆర్ఎంటీలకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలన్నారు. సీఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. -
బంగ్లాదేశ్లో అల్లర్లు.. భారత్ అప్రమత్తం
త్రిపుర: బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రికతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దు రాష్ట్రం త్రిపురాలో భద్రతా చర్యల్ని కఠినతరం చేసింది. త్రిపుర సీఎం మాణిక్ సాహా ఆదేశాలతో సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు మోహరించాయి.బంగ్లాదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడి పరిస్థితి ఉద్రికత్తగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లు, శరణార్థుల ప్రవాహం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలు,బీఎస్ఎఫ్ సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నీ రక్షణ చర్యల తీసుకుంటోందని త్రిపురా సీఎం స్పష్టం చేశారు.మరోవైపు,బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం, రవాణా, సాంస్కృతిక సంబంధాలు ప్రభావితం కావచ్చు. అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బంగ్లాదేశ్ అశాంతి త్రిపురా, అసోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ప్రత్యక్ష ముప్పుగా మారవచ్చు.త్రిపురా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రజలు భద్రతా చర్యలను స్వాగతిస్తున్నప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన కొనసాగుతోంది. -
రైతన్నకు కోపం వచ్చింది.. రాజధాని తగలబడింది!
బ్రస్సెల్స్: యూరప్ రాజధాని బ్రస్సెల్స్ రైతుల ఆందోళనలతో అట్టుడికి పోతుంది. యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాదిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు పదివేలకు పైగా ట్రాక్టర్లతో నిరసనలు చేపట్టారు. ఆ నిరసన తారా స్థాయికి చేరుకున్నాయి.ఇటీవల యురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆందోళన చేస్తున్న రైతులు ట్రాక్టర్లతో యూరోపియన్ పార్లమెంట్ భవనం వెలుపల, యూరోపియన్ యూనియన్ నాయకుల సమావేశం జరుగుతున్న ప్రాంతంలో మొహరించారు. కొత్త ప్రతిపాదనలు తమ జీవనోపాధిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయోనని తెలిపేలా.. రైతులు టైర్లు కాల్చి, రహదారులను బ్లాక్ చేసి, బంగాళాదుంపలు, గుడ్లు,సాసేజ్లు విసిరారు. ట్రాక్టర్లతో రాజధాని బ్రస్సెల్స్ను అష్టదిగ్భందనం చేశారు. అయితే, రైతుల ఆందోళనల్ని నిలువరించేందుకు పోలీసు దళాలు వారిపై టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. రైతుల సమూహాన్ని చెదరగొట్టారు. ఎక్కడికక్కడే అరెస్టులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతుల తిరుగుబాటుకు కారణంయురేపియన్ యూనియన్ బ్రెజిల్, దక్షిణ అమెరికా దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంతో ఇరు దేశాల నుంచి చౌకగా మాంసం, పంటలు దిగుమతి అవుతాయని.. ఇది స్థానిక మార్కెట్లను దెబ్బతీస్తుందని రైతులు భయపడుతున్నారు. దీనికి తోడు సబ్సిడీలను తగ్గించడమే కాకుండా కఠినమైన పర్యావరణ నియమాలను అమలు చేస్తాయి. తద్వారా యూరోపియన్ రైతులను ప్రపంచ మార్కెట్లో పోటీ చేయలేని స్థితి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు.FARMERS BLOCK ROADS, BURN TIRES IN BRUSSELS to protest EU free trade deal and CARBON TAXESCritics say the deeply-unpopular policies will damage food security and farmer livelihoods in markets#BrusselsFarmersProtest #Brussels pic.twitter.com/X1kricxwBn— Mjrocksss (@Mritunjayrocks) December 19, 2025 రణరంగంగా గ్రీస్మరోవైపు, ఆగ్నేయ ఐరోపా దేశమైన గ్రీస్ రణరంగంగా మారింది. డిసెంబర్ 16–17న గ్రీక్ పార్లమెంట్ 2026 బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్పై ప్రజలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాలు 24 గంటల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు మున్సిపాలిటీ కార్యాలయాల్ని మూసివేశారు. ఉపాధ్యాయులు అథెన్స్లో కొనసాగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నిరసనలకు రైతులు సైతం మద్దతు తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారి బారికేడ్లను ఏర్పాటు చేశారు. తక్కువ వేతనాలు, పెరుగుతున్న ఆహారం ధరలు, ఇంటి వ్యయంపై ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. రైతులు, ప్రజా రంగ కార్మికులు కలిసి నిరసన చేయడం వల్ల ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, గ్రీస్ 2025లో 23.5 బిలియన్ రికార్డు స్థాయి పర్యాటక ఆదాయాన్ని గడించింది. ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది. పర్యాటక రంగం బలంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయంటూ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.Streets of Brussels woke up to a spud storm after farmers protested the EU -literally lining the streets with potatoes.#EuropeanUnion #Brussels #EuropeanParliament #farmers #BrusselsFarmersProtest#farming #NoFarmersNoFood pic.twitter.com/8ZbTkmcusR— MidnightVisions (@MidnightVision5) December 19, 2025 -
మున్సిపల్ కార్మికులపై విరిగిన లాఠీ
నెల్లూరు (బారకాసు): సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టేందుకు వెళ్తున్న మున్సిపల్ కార్మికులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. మహిళలని కూడా చూడకుండా తోసేశారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. కిందపడిపోయిన కొందరు.. లాఠీచార్జ్లో మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందర్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు 45 రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారంతా గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ముట్టడించేందుకు కార్యాలయ సమీపానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వచ్చేందుకు యత్నించారు. మరోవైపు మేయర్ స్రవంతి రాజీనామా ఆమోదం కోసం కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతోంది. తమ సమస్యలపై వినతిపత్రాన్ని అధికారులకు అందజేయాలనే ఉద్దేశంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు కార్మికుల్ని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు ఒక్కసారిగా లాఠీలు ఝుళిపించడంతో కార్మికులు కిందపడిపోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులు తాకరాని చోట తాకుతూ గందరగోళం సృష్టించారు. కార్మికులను ఇష్టానుసారం లాఠీలతో కొట్టారు. సీఐటీయూ నేతలు, కార్యకర్తలతోపాటు అనేకమంది మహిళా కార్మికులకు గాయాలయ్యాయి. రక్తగాయాలైన మహిళల్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం 63 మంది కార్మికులు, యూనియన్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి ముత్తుకూరు పోలీస్స్టేషన్కు తరలించారు. కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, కమిషనర్ నందన్, ఇన్చార్జి మేయర్ రూప్కుమార్యాదవ్ వచ్చి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పగా కార్మికులు అంగీకరించలేదు. మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. చివరికి అరెస్ట్ చేసిన వారిని తీసుకొచ్చి కార్పొరేషన్ కార్యాలయం వద్ద విడిచి పెట్టడంతో నిరసనను తాత్కాలికంగా విరమించారు. -
సర్కారు తీరుపై గురువులు గుర్రు
‘మేము సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు డఏలు వచ్చేవి.ఇప్పుడు ఏడాదికి రెండమెగా పీటీఎంలు వస్తున్నాయి’.మా సర్వీసులో విద్యార్థులు నోట్సులు సరిగా రాశారో లేదో చెక్ చేసేవాళ్లం.., ఇప్పుడు చిక్కీలు, కోడిగుడ్లు లెక్కలు చూడడం, యాప్ల్లో వివరాల నమోదుకే సమయం సరిపోవడం లేదు’..ఉపాధ్యాయుల సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ఇలాంటి పోస్టులు చంద్రబాబు పాలనపై గురువుల ఆగ్రహానికి అద్దం పడుతున్నాయి.సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. టీచర్లకు యాప్ల భారం ఉండదు, కేవలం బోధనకే పరిమితం చేస్తామన్న మాట నీటి మూటైంది. మరోపక్క ఇన్ సర్వీస్ టెట్ రద్దు చేస్తామని, దీనిపై తమ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న హామీని సైతం అమలు చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బకాయిల సంగతేంటి?పెండింగ్ బకాయిలు, ఐఆర్, డీఏలు ఇవ్వకపోవడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పీఆర్సీ ప్రకటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పాఠ్యాంశాలకు సంబంధం లేని వివరాలు పదుల సంఖ్యలో యాప్ల్లో నమోదు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బడుల నిర్వహణపై ఇతర శాఖల పెత్తనంపదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచడానికి 75 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఇందుకోసం రెండో శనివారం, ఆదివారాలు, పండగ సెలవుల్లో సైతం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ తరగతులను పరిశీలించే బాధ్యతను ఎంపీడీవోలు, మండల వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించింది. వాస్తవానికి మండలానికి ఇద్దరు ఎంఈవోలు, డీవైఈవోలు, జిల్లా స్థాయిలో డీఈవో ఉన్నారు. వీరిని కాదని ఇతర శాఖలకు పెత్తనం అప్పగించడంపై టీచర్లు మండిపడుతున్నారు. గతేడాది మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, విద్యార్థుల రేషనలైజేషన్ వంటి విధులకు రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వం వినియోగించింది.ఒత్తిడి పెంచి.. ప్రయోజనాలు ఎగ్గొట్టాలని..చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటినా ఉపాధ్యాయులకు ఒక్క ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదు. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తామన్న హామీని కూడా విస్మరించింది. నాలుగు డీఏలకు కేవలం ఒక్క డీఏతో సరిపెట్టింది. పదవీ విరమణ పొందినవారికి ఏడాదిన్నరగా గ్రాట్యుటీ, లీవ్ఎన్క్యాష్మెంట్ ఇవ్వలేదు. ప్రతి నెలా మెడికల్ బీమా డబ్బులు చెల్లిస్తున్నా ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందడం లేదు. అప్పుచేసి బిల్లులు చెల్లించినా తర్వాత రీయింబర్స్మెంట్ చేయడం లేదు. దీంతో ఆర్థిక బకాయిల కోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో సర్కారు రివర్స్ గేర్ వేసింది. ఒత్తిడి పెంచితే ఆర్థిక అంశాలు తెరపైకి రావనే భావనతో వ్యవహరిస్తోంది. ఇందులో ఇన్ సర్వీస్ టెట్ అంశం కీలకంగా మారింది. దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాయి. రాష్ట్రంలో మాత్రం టెట్ నిర్వహించడం, ప్రత్యేక శిక్షణ, నివేదికల పేరుతో ఇబ్బంది పెట్టడం వేధింపుల్లో భాగమేనని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలతో పాటు ఇతర శాఖల అధికారుల పెత్తనంపై గురువులు పోరుబాటకు సిద్ధమయ్యారు.రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నేడుఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు యూటీఎఫ్తో పాటు పలు సంఘాలు పిలుపునిచ్చాయి.బదిలీ అయి పాత పాఠశాలల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, బోధనేతర పనులు అప్పగించవద్దని.. టీచర్లపై ఇతర శాఖల పెత్తనం ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళన చేస్తున్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల కన్నెర్ర
అనంతపురం (మెడికల్): అనంతపురం సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇంటికి సాగనంపి కొత్త వారిని విధుల్లోకి తీసుకునేందుకు యత్నించిన ఏజెన్సీ నిర్వాకాన్ని నిరసిస్తూ శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సర్వజనాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులను వయసు నిబంధన పేరిట ‘పద్మావతి ఏజెన్సీ’ విధుల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏజెన్సీ నిర్వాహకుల దురుసు ప్రవర్తనతో మనస్తాపం చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మావతి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో శనివారం పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలు వీరి ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నాయి. ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు కొత్తగా పదుల సంఖ్యలో డైలీ వేజెస్ కింద సిబ్బందిని గుట్టుగా తీసుకువచ్చి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని చూశారు. దీనిపై కార్మికులు కన్నెర్ర చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రహ్మణ్యం, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత సమక్షంలోనే ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డితో వాగ్వాదానికి దిగారు. వివిధ వార్డుల్లో పనిచేస్తున్న ప్రైవేట్ సిబ్బందిని కార్మికులు అడ్డుకుని, తోసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆందోళనలు చేపట్టి, దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు కార్మిక సంఘాల నాయకులను హెచ్చరించారు. ఆస్పత్రికి వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను పారిశుద్ధ్య కార్మికులు చుట్టుముట్టారు. తమను అన్యాయంగా తొలగిస్తున్నారని వాపోయారు. సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం కోవిడ్ పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనులు చేసిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి మండిపడ్డారు. వయసు పేరిట కార్మికులను తొలగించాలని చూస్తే ఊరుకోబోమన్నారు. సీఐటీయూ నేత నాగేంద్ర మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మిత్రుడు భాస్కర్ నాయుడుకు చెందిన పద్మావతి ఏజెన్సీ దౌర్జన్యం, దాష్టీకానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజారెడ్డి, అనిల్కుమార్గౌడ్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ హుస్సేన్, వామపక్ష నాయకులు రామిరెడ్డి, సురేష్, యేసురత్నం, ఏటీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్థాన్కు వ్యతిరేకంగా బంగ్లాలో నిరసన
1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా ఆదేశ విద్యార్థులు పెద్దఎత్తున సంఘీభావ కార్యక్రమం చేప్టటారు.ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాకిస్థాన్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషీయా గ్రూపును ఏర్పాటు చేశారని దాని ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసం సృష్టించారని అన్నారు.రజాకార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్దఎత్తున ఇళ్లలో లూటీ చేశారని, సామూహికంగా చాలామందిని హత్యచేశారని స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తూ తీవ్రఆగడాలకు పాల్పడ్డారని తెలిపారు. వీళ్లకు పాకిస్థాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేయన్నారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వతంత్ర్య పోరాట యోధులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ పోరాటానికి షేక్ ముజిబూర్ రహ్మాన్ నాయకత్వం వహించారు.ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయం అందించింది. అంతేకాకుండా డిసెంబర్ 3న అధికారంగా రణ క్షేత్రంలో దిగి 13రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీని ఓడించింది. దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు, ఆదేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హాసీనా ఆయన కుమార్తె. బంగ్లాదేశ్లో అల్లర్ల చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హాసీనా భారత్లో భారత్లో తలదాచుకుంటుంది. -
యూనివర్సిటీ గేట్ వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్
-
ఉక్కు ఉద్యమం.. బాబుకు చుక్కలే
-
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వాముల ఆందోళన
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేరళకు వెళ్లే విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. -
గుంటూరులో టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ఇల్లు ముట్టడి..
-
చంద్రబాబు ఇంటికి భవానిపురం బాధితులు
-
ఛత్తీస్గఢ్లో మైనింగ్ వద్దంటూ ఆందోళన
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో అమెరా ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ విస్తరణ అంశంలో చెలరేగిన వివాదం తీవ్ర హింసకు దారి తీసింది. మైనింగ్ విస్తరణను అడ్డుకునేందుకు స్థానిక గిరిజనులు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఘర్షణ చెలరేగి గిరిజనులు దాడి చేయడంతో 40మందికి పైగా పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.సుర్గుజా జిల్లా ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ "ఇక్కడ మైన్ కోసం 2016లోనే భూసేకరణ పూర్తయింది. దానికి పరిహారం కూడా అందజేశాం. కానీ ఇప్పుడు కొంతమంది పరిహారాన్ని నిరాకరించి మైనింగ్ కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. మేము గ్రామస్థులతో మరోసారి మాట్లాడుతాం వారికి నచ్చజెప్పి మైనింగ్ కార్యకలాపాలు జరిగేలా చేస్తాం" అని అడిషనల్ కలెక్టర్ సునీల్ నాయక్ అన్నారు. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయని వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు.మైనింగ్ పై గ్రామస్థులు మాట్లాడుతూ.. "మాగ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా గ్రామాన్ని మేము ఏ కంపెనీలకు ఇవ్వదలచుకోలేదు. మేమెక్కడికి వెళ్లాలి? ఎంతోకాలంగా మా కుటుంబాలు ఇక్కడే పెరిగాయి, పనిచేశాయి, సంపాదించాయి. మేముకూడా ఇక్కడే ఉంటున్నాము ఇప్పుడు కంపెనీలకు భుమి ఇస్తే మా పిల్లల సంగతేంటి?" అని అక్కడి గ్రామస్తురాలు అన్నారు.అయితే ఈ ఘటనలో తొలుత పోలీసులే తమపై లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు అంటుండగా గిరిజనులే తమపై రాళ్లు రువ్వారని పోలీసులు అంటున్నారు ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.అయితే ఈ వివాదంపై అమెరా ఓపెన్ కాస్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కోసం పర్సోడికల, అమెరా, పుహ్ పుత్ర, కట్ లోనా గ్రామాలలో ఈ భూమిని 2001 సంవత్సరంలో సేకరించి, 2011లో పనులు ప్రారంభించాము. 2019 కొంతమంది స్వార్థప్రయోజనాల కారణంగా మైన్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. 2024లో తిరిగి ప్రారంభించినప్పడి నుంచి దశలవారిగా భూసేకరణ చేపడుతున్నామని ఇది వరకూ రూ.10 కోట్ల పరిహారం అందిచామని తెలిపారు. పర్సోడికల వైపు మైనింగ్ విస్తరిస్తున్న సమయంలో నిరసనలు రావడంతో నవంబర్ 8నుంచి మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. -
శంషాబాద్: ఇండిగో నిర్వాకం.. అయ్యప్ప స్వాముల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఇండిగో ఎయిర్లైన్స్ నిర్వాకంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో అయ్యప్ప స్వాములు పడిగాపులు పడ్డారు. విమానం ఆలస్యం కావడం.. ఆ సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంపై నిరసనకు దిగారు. షెడ్యూల్ ప్రకారం.. బుధవారం ఉదయం 9.40గం. విమానం రావాల్సి ఉంది. అయితే విమానం ఎంతకీ రాకపోవడంతో పడిగాపులు పడ్డారు. ఈలోపు ఆలస్యానికి కారణాలను కూడా వివరించలేదు. దీంతో స్వాములు ఆందోళనకు దిగడంతో.. సిబ్బంది సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
రోడ్డెక్కిన మామిడి రైతులు
-
గోబ్యాక్.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు
సాక్షి శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు సరుబుజ్జులి మండలం వెన్నెల వలసలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. కూన రవికుమార్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.అయితే కొద్ది రోజుల క్రితం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి వరకూ ర్యాలీ నిర్వహించాలని తలపించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే గిరిజనులు నిరసనలు చేపట్టారు. సురుబుజ్జి, బూర్జ మండలాలలో పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పవర్ ప్లాంట్ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారు. స్థానికుల జీవనోపాధి అయిన అడవులు, నీటి వనరులు, వ్యవసాయం ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజనులు.. ఈ మేరకు నిరసనల చేపట్టారు. ఇది గత కొంతకాలం నుంచి కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న నిరసన సెగ. ఇప్పటికే -థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళంలో ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. స్థానికులు తమ భూములు, వనరులు కాపాడుకోవడానికి సంఘటిత పోరాటం చేస్తున్నారు.ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఎదురైన నిరసన సెగ.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఘటనతో థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనపై రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తం అయ్యే అవకాశం ఉంది. గిరిజనుల నిరసనను విస్మరిస్తే మాత్రం వారి నిరసనలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి, వారి నిరసనకు ప్రజాబలం పెరుగుతుంది. మొత్తంగా, శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం గిరిజనుల ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది. -
ఖబడ్డార్ చంద్రబాబు.. నీ ప్రభుత్వం అంతు చూస్తాం
-
చెక్ పోస్ట్ అడ్డగోలు దోపిడీ.. చుక్కలు చూపించిన జనం
-
గ్రానైట్ పరిశ్రమల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/బల్లికురవ/మార్టూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్పై విచ్చలవిడిగా పన్నులు వసూలుచేయడాన్ని నిరసిస్తూ.. శనివారం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరం జంక్షన్లోని ఏఎంఆర్ చెక్పోస్టు వద్ద గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆగ్రహంతో చెక్పోస్టు కంటైనర్ బాక్స్ను బద్దలుకొట్టారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రితోపాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.అయితే, విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం అద్దంకి నుంచే గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆందోళనలో పాల్గొన్న వారిలో 90 శాతం అధికార టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. మల్లాయిపాలెం, వేమవరం, ఉప్పమాగులూరు, కొనెదన, గంగపాలెం, నక్కబొక్కలపాడు గ్రామాల పరిధిలోని 500 పరిశ్రమల నుంచి పలువురు యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు జంక్షన్కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం రాయలీ్ట, జీఎస్టీ అంటూ పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందంటూ తీవ్రంగా నిరసించారు. చంద్రబాబు సర్కారు తీరును దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం దుర్మార్గంగా పన్నులు వేసి గ్రానైట్ వ్యాపారాన్ని కుదేలు చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక కట్టర్కు రూ.27 వేలు టాక్స్ వసూలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా కట్టర్కు రూ.35 వేల రాయల్టీతోపాటు రూ.5 వేల జీఎస్టీ వసూలుచేస్తోందన్నారు. ఇదికాక.. కట్టర్కు మరో రూ.35 వేలు కప్పం కింద వసూలు చేస్తున్నారన్నారు. వసూలు బాధ్యతలు ఏఎంఆర్కు అప్పజెప్పడంతో వారు చెక్పోస్టులు పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని పరిశ్రమల యజమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత మొత్తంలో పన్నులు, ఇతరత్రా చెల్లించి వ్యాపారం చేయలేమన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, అదే జరిగితే తాము నష్టపోవడమే కాక యుపీ, ఎంపీ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పొట్టచేతబట్టుకుని వచి్చన కార్మికులు రోడ్డునపడతారని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని యజమానులుతోపాటు కార్మికులూ మండిపడుతున్నారు. తక్షణం ప్రభుత్వం అధికంగా విధించిన పన్నులు ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఉద్రిక్తంగా మారిన ఆందోళన.. ఇదిలా ఉంటే.. యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు వేమవరం జంక్షన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఒక్కసారిగా ఆందోళనకారులు అక్కడే వున్న ఏఎంఆర్ చెక్పోస్టు కంటైనర్ బాక్స్ వద్దకు వెళ్లి దానిని కూలదోశారు. బాక్స్లో వున్న కంప్యూటర్ సెట్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చెక్పోస్ట్ లైటింగ్ పోల్ను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వేమవరం చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేశారు. దీంతో.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిరసనకారులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం విధించిన పన్నుల భారానికి వ్యతిరేకంగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు నాలుగు రోజుల క్రితం మార్టూరు జాతీయ రహదారిపై జొన్నతాళి గ్రామం వద్ద నిరసన తెలిపారు.గ్రానైట్ సంఘ ప్రతినిధులకు డీఎస్పీ హెచ్చరిక అనంతరం మార్టూరు పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే గ్రానైట్ అసోసియేషన్ సభ్యులపై, ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
విజయవాడలో హైటెన్షన్.. పోలీసుల బారికేడ్లు తోసేసి లోకేష్ ఇంటి ముట్టడి!
-
స్వాములపై పోలీసుల లాఠీఛార్జ్
-
తెలంగాణ డీజీపీ ఆఫీస్ ముట్టడి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు కూడా యూనిఫాం ధరించాలంటూ ఆంక్షలు విధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ రూల్స్ ఉన్నాయంటూ స్వాములు మండిపడ్డారు. అయ్యప్ప స్వాములకు మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు కూడా డీజీపీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. అయ్యప్ప మాలతో ఆఫీసుకు రాకూడదంటూ ఇచ్చిన మెమోపై దీక్ష తీసుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన స్వాములు ఆఫీసులోనికి వెళ్లే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారని అయ్యప్ప స్వాములు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు భారీ ర్యాలీతో డీజీపీ కార్యాలయం ముట్టడికి తరలిరావడంతో వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవలసి వచ్చింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా స్వాములు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో స్వాములకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో పోలీసులు కొందరు అయ్యప్పలను అరెస్టు చేశారు. అయ్యప్ప దీక్ష ధరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకున్న పోలీసులు యూనిఫామ్ డ్రెస్ కోడ్ లేకుండా డ్యూటీకి రావద్దంటూ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. దీనికి నిరసనగా అయ్యప్పలు ఆందోళనకు దిగారు. అయ్యప్ప దీక్షాధారులకు పోలీస్ డ్రెస్ కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.కాగా అయ్యప్ప దీక్షాధారులకు యూనిఫారం నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వలేమని హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నవంబర్ 20న ఒక ఉత్తర్వు జారీ చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ, యూనిఫాం నిబంధనల్లో వెసులుబాటు కల్పించాలని కంచన్బాగ్ స్టేషన్కి చెందిన ఎస్సై ఎస్. కృష్ణకాంత్ వినతి చేశారు. సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ కె శ్రీకాంత్ ఈ అంశంపై స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఉత్తర్వుల ప్రకారం డ్రెస్ కోడ్ విషయంలో వెసులుబాటు కల్పించడం కుదరదని తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ఆ జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకూ తెలియజేశారు. ఇది కూడా చదవండి: TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట -
మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
సాక్షి,గుంటూరు: మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని మల్లవల్లి రైతులు ధర్నా చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆఫీస్కు ఇప్పటికి 27సార్లు వచ్చినా పట్టింపులేదంటూ రైతులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తమను కలవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు.కాగా, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిన్న (నవంబర్ 24, సోమవారం) పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్కు ప్రజలు, కార్మీకుల నుంచి నిరసనల సెగ తగిలిన సంగతి తెలిసిందే. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మీకులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా పవన్కళ్యాణ్కు గోడు వెళ్లబోసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ, పవన్ను కలిసేందుకు కార్మీకులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మీకులు పవన్కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
గాడి తప్పింది... గాడిదల కార్ అయింది!
ఎప్పటి నుంచో కారు కొనాలనే కోరిక నెరివేరినందుకు పుణెకు చెందిన గణేష్ సంగ్డే తెగ సంతోషించాడు. అయితే ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. సదరు ఆ వాహనం తరచుగా రిపేర్లకు వచ్చేది. ఎన్నిసార్లు వెహికిల్ డీలర్కు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో వింత నిరసనకు దిగాడు. రెండు గాడిదలను కారుకి ముందు కట్టి చాలా స్లోగా డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవాళ్లకు గాడిదలే కారును తీసుకువెళుతున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి తోడు కారుతో పాటు నడుస్తున్న వారు భజంత్రీలు మోగిస్తుంటారు! వాహనానికి ఇరువైపులా బ్యానర్లు కట్టి డీలర్పై మరాఠీ భాషలో తన నిరసన డైలాగులు రాశాడు గణేష్. గణేష్ సమస్య మాటేమిటోగానీ, ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన గాడిదల కార్ వీడియో వైరల్ అయింది. ‘గాడిదల కారు అని పేరు పెట్టవచ్చు!’ ‘డీలర్కు, మీకు మధ్య గొడవలు సరే, మధ్యలో గాడిదలు ఏంచేశాయి?’ ‘గాడిదలను వివాదాల్లోకి లాగడం సరికాదు’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
శబరిమలలో తెలుగు స్వాములకు ఘోర అవమానం!
శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం జరిగింది. ఓ పోలీస్ అధికారి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో స్వాములు ఆందోళనకు దిగారు. తాము దారి తప్పి వెళ్తన్న క్రమంలో ఓ పోలీస్ అధికారి ఎదురు పడ్డాడని.. దర్శనం క్యూ ఎక్కడ అని అడిగినందుకు ప్యాంట్ జిప్పు విప్పి అసభ్య సైగలు చేశాడని భక్తులకు తెలిపారు. ఈ మేరకు ఓ భక్తుడు మిగతా స్వాములతో ఆ వీడియోను తీసి నెట్లో షేర్ చేశాడు. ఆ అధికారి తీరును ఖండిస్తూ తాము నిరసన చేపట్టామని.. ఇంతలో కొందరు అధికారులు ఆ పోలీసు అతన్ని దొడ్డిదారిన పంపించి రక్షించారని భక్తులు ఆరోపించారు. తెలుగు భాషలో మాట్లాడినందుకే తమకు ఇలాంటి ఘోర అవమానం ఎదురైందని భక్తులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. శబరిమలలో ఇతర రాష్ట్రాల భక్తులకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురు కావడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే.. ఈసారి భక్తులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాబోవని నిర్వాహకులు ఇటు కేరళ ప్రభుత్వం, అటు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(TDB) భరోసా ఇచ్చాయి. అయినా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది. View this post on Instagram A post shared by @chandra4bharat1 -
నేరాలు, అవినీతిపై ఆగ్రహ జ్వాలలు
మెక్సికో సిటీ: పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో చేపట్టిన ర్యాలీకి వేలాదిగా జనం తరలివచ్చారు. జన్ జెడ్ గ్రూప్ సారథ్యం వహించిన ఈ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రశాంతంగా జరిగినా కొన్ని చోట్ల యువత పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా గాయపడిన 120 మందిలో 100 మంది పోలీసులేనని అధికారి ఒకరు తెలిపారు. ఇరవై మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర నగరాల్లో కూడా జరిగిన ప్రదర్శనల్లో ప్రతిపక్ష పారీ్టల నేతలు కూడా పాల్గొన్నారు. నిరసన కారులు ఈ సందర్భంగా ఉరువపన్ నగర మేయర్ కార్లోస్ మంజో హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. BREAKING: MEXICO🔴 THE NATIONAL PALACE HAS FALLENThe National Palace in Mexico City has been overrun — crowds flooding the gates, barriers collapsing, and the government losing control in real time.This is not a protest.This is a national eruption — the kind that signals… pic.twitter.com/V4GEZydhLg— Jim Ferguson (@JimFergusonUK) November 15, 2025డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. మాకు మరింత భద్రత కావాలంటూ ఆండెŠస్మస్సా అనే వ్యక్తి పుర్రె బొమ్మ కలిగిన జెండాను ప్రదర్శించారు. అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారియర్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిపై మండే పదార్థాలను విసిరేశారు. పోలీసుల వద్ద ఉండే షీల్డులను, ఇతర వస్తువులను లాగేసుకున్నారు. భవనం ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన నిరసనకారులను పోలీసులు టియర్గ్యాస్ ప్రయోగించి, అడ్డుకున్నారు. నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంజో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో చనిపోయారు.Te pido un favor ? No dejes de hablar de la represión en México , nadie de la izquierda te lo va a mostrar ni a contar , pero el pueblo mexicano cuenta con nosotros para visibilizarlo , vale un 🖐️ pic.twitter.com/TR9TmQNIBb— @IsraelVive (@IsraelVive1948) November 15, 2025 డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ రవాణాపై ఆయన తీవ్రంగా విమర్శలు చేయడమే ఇందుకు కారణమన్న అనుమానాలున్నాయి. అధ్యక్షురాలు షీన్బామ్ను 70 శాతం ప్రజలు అభిమానిస్తున్నారు. మత్తు మందు ఫెంటానిల్ అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, సాయుధ ముఠాలను నియంత్రించడంలో విఫలమైనట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై చుట్టుపక్కల దేశాలు కూడా మెక్సికోతో విభేదిస్తున్నాయి. పెరూ ఇటీవలే మెక్సికోతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంది. El pueblo ya despertó y perdió el miedo a las Narcodictaduras. La izquierda corrupta, violenta y saqueadora que gobierna en #Mexico empieza a desmoronarse.#MarchaNacional #GeneraciónZ Hoy México despertó.#Colombia cuando? pic.twitter.com/OpyhlE1jTY— Decko. (@Frankzm) November 15, 2025 -
మంత్రిగారూ.. న్యాయం చేయండి
శ్రీకాకుళం జిల్లా: ‘అచ్చెన్నాయుడు గారూ... మాకు న్యాయం చేయండి. నా భర్త కట్టిన ఇంటిని ఆడపడుచు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీనికి అధికారులు, మీ నేతలే సహకరిస్తున్నారు’ అంటూ బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద రోడ్డుపై ఓ మహిళ తన కుమార్తె, తల్లితో నిరసనకు దిగింది. వివరాల్లోకి వెళితే... టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేబారికి సంధ్య కొద్దిరోజుల క్రితం భర్తతో పాటు అత్తమామలను కోల్పోయింది. తమ సొంత డబ్బుతో నిర్మించుకున్న ఇంటిని ఆడపడుచు ఆక్రమించుకుని దౌర్జన్యానికి పాల్పడుతోందని బాధితురాలు సంధ్య వాపోయారు. ఇదే విషయమై పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదని, కొంతమంది టీడీపీ నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కలగజేసుకుని తక్షణమే న్యాయం చేయాలని, లేకపోతే కుమార్తె సహా ఆత్మహత్యే శరణ్యమంటూ బోరున విలపించారు. -
శ్రీకాకుళం ఎచ్చెర్ల IIIT విద్యార్థుల ఆందోళన
-
కోటి గళాల గర్జన.. గ్రాండ్ సక్సెస్
-
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
-
అడ్డుకున్న పోలీసులు.. తిప్పికొట్టిన YSRCP నేతలు
-
బారికేడ్లు బద్దలు కొడుతూ.. పోలీసులపై అంబటి ఉగ్రరూపం
-
బాబు అవినీతికి నిదర్శనం..! వైఎస్ఆర్ సీపీ ర్యాలీలకు వేలల్లో తరలివస్తున్న జనం
-
YSRCP ప్రజా ఉద్యమం
-
YSRCP సమర శంఖం
-
‘శ్వాస చంపేస్తోంది’.. ఢిల్లీలో భారీ నిరసనలు
న్యూఢిల్లీ: ‘పొగమంచు నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి’.. ‘శ్వాస మమ్మల్ని చంపేస్తోంది’ అనే ప్లకార్డులు చూపిస్తూ, పిల్లాపెద్దా అనే బేధభావం లేకుండా వందలాదిమంది ఢిల్లీవాసులు ఆదివారం ఇండియా గేట్ సమీపంలోని మాన్ సింగ్ రోడ్లో ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) ‘చాలా పేలవమైన’ విభాగంలో 370ని తాకిన తరుణంలో, ఢిల్లీ ప్రజలు ఊపిరి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.‘ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ప్రభుత్వం ఇప్పుడే క్లీన్ ఎయిర్ పాలసీని అందించాలి’ అని ఒక నిరసనకారుడు నినదించగా ‘ధనవంతులు ఎయిర్ ప్యూరిఫైయర్లను కొనుగోలు చేసుకుంటారు లేదా పచ్చని కొండ ప్రాంతాలకు పారిపోతారు. కానీ మా సంగతేంటి? ప్రతి శీతాకాలంలో శ్వాస తీసుకునేందుకు పోరాటం చేస్తున్నాం’ అని ఒక నిరసనకారుడు అన్నాడు. ‘గాలి ప్రభుత్వ ఆస్తి కాదు. అది అందరికీ చెందుతుంది’ అని నినదించాడు.మరో నిరసనకారురాలు జ్యోత్స్న సింగ్ ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ ‘పేదలు, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ బస్సులు, ఆటోల నుంచి వచ్చే ఉద్గారాలతో జనం బాధపడుతున్నారు. ఇవి కాలుష్యానికి 80 శాతం దోహదం చేస్తాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో మార్పులు రావాలి’ అని అన్నారు. ‘ప్రతి శీతాకాలంలో నాకు రక్తం పడేలా దగ్గువస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. ప్రభుత్వం ఇలాంటివాటిని పట్టించుకోదు. పంజాబ్ రైతులను లేదా గత పాలనను నిందిస్తూనే ఉంటుంది’ అంటూ డీయూ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.అని మరో నిరసనకారిణి ప్రేరణ మెహ్రా ‘కాలుష్యం పెరిగిన తరుణంలో ఏక్యూఐ పర్యవేక్షణ కేంద్రాల దగ్గర నీటిని చల్లుతున్న వీడియోలను చూసిన తర్వాత నేను ఒక దానిని నమ్మలేకపోతున్నాను. ఎవరైనా సంఖ్యలను తప్పుదారి పట్టిస్తున్నారా? లేదా నీటిని వ్యర్థం చేస్తున్నారా?’ అని ప్రశ్నించారు. వసంత్ కుంజ్కు చెందిన 76 వృద్ధుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ప్రజలు అవే బాధలను ఎదుర్కొంటున్నారు. నా మనవళ్ల కోసం నేను ఆందోళన చెందుతున్నాను. ప్రతిచోటా నిర్మాణాలు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది’ అని అన్నారు.నిరసనలు తీవ్రతరం కావడంతో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ కార్యకర్త విమ్లేందు ఝా ఈ అణిచివేతను ఖండించారు. 15 రోజులుగా లాక్డౌన్ లేదు, షట్డౌన్ లేదు కేవలం క్లౌడ్ సీడింగ్ లాంటి పనులు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. డీసీపీ మహలా మాట్లాడుతూ తాము భద్రతను కాపాడేందుకు కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇది కూడా చదవండి: ‘మరిన్ని రాష్ట్రాల్లో..’ మళ్లీ ‘బాంబు’ పేల్చిన రాహుల్ -
పోలీసులు వేధిస్తున్నారు
తిరుపతి అర్బన్: పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఎస్వీ మెడికల్ కళాశాల విద్యార్థులు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులు వెస్ట్ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రమిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 1 రాత్రి ఆస్పత్రిలో విధులు పూర్తయిన తర్వాత వైద్య విద్యార్థులు హరీష్, జయంత్ భోజనం కోసం వెస్ట్ పోలీస్స్టేషన్ వైపు బైక్పై వెళుతుంటే పోలీసులు ఆపారని చెప్పారు.తాము మెడికల్ విద్యార్థులమని చెప్పినా తమపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. తాము వారిని గట్టిగా ప్రశ్నిస్తే దాడి చేశారని చెప్పారు. అనంతరం పోలీస్స్టేషన్లోకి వెళ్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశామనీ ఆయనతో పాటు యూనిఫాంలో లేని కొందరు లాఠీలతో దాడి చేశారని చెప్పారు. డ్యూటీల నిమిత్తం వైద్య విద్యార్థి, విద్యార్థిని వెళుతుంటే అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు.తమ మొబైల్, స్కూటర్ను లాక్కున్నారని వివరించారు. ఆస్పత్రిలో డ్యూటీలు చేస్తూ కాఫీ, టీ తాగడానికి రోడ్లపైకి వచ్చినా పోలీసులు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలో న్యాయం కోసం కలెక్టర్ వెంకటేశ్వర్కు వినతిపత్రాన్ని ఇచ్చి తమ సమస్యను వివరించినట్లు వెల్లడించారు. వైద్య విద్యార్థులకు పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అందని సాయంపై ఆగ్రహజ్వాల
మర్రిపాలెం(విశాఖ జిల్లా)పూసపాటిరేగ(విజయనగరం జిల్లా)/కాకినాడ రూరల్: మోంథా తుపాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దొడ్డిదారిన పచ్చచొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది. అసలైన బాధితులను మోసగించింది. పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు వెతికింది. వాస్తవానికి తుపాను సమయంలో బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలని అధికారులు, సిబ్బందే సూచించి.. ఇప్పుడు పరిహారానికి ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మెల్లిగా జారుకుంటున్నారు. వాంబేకాలనీవాసుల ఆగ్రహం మోంథా తుపాను ప్రభావంతో విశాఖపట్నం 51వ వార్డు మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులూడిపోయాయి. తుపాను సమయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు కాలనీలో ఇళ్లను పరిశీలించి బాధితులను మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అయితే సిబ్బంది మాత్రం అవకాశం ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. ఆ సమయంలో అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. పునరావాస కేంద్రానికి 60 కుటుంబాలు వెళ్లగా, మరికొందరు బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నారు. తీరా నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి అధికారులు చాలామందికి ఎగనామం పెట్టారు. వాంబేకాలనీలో 80 కుటుంబాలు ఉండగా, శుక్రవారం మాధవధార ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కార్యాచరణ ప్రణాళిక కార్యాలయం(పీ–4)లో జరిగిన పరిహారం పంపిణీ కార్యక్రమంలో 30 కుటుంబాలకు మాత్రమే నిత్యావసరాలతోపాటు రూ.3వేల నగదు అందించారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజును నిలదీశారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు వినలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి, పైడిపల్లి సత్యవతి, నాగమణి తదితరులు మాట్లాడుతూ తమకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవిపై బాధితుల ఆగ్రహం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీకి వచి్చన ఆమెను కోనాడ గ్రామ బాధితులు నిలదీశారు. గ్రామంలో 590 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం మత్స్యకార భరోసా అందిన 27 కుటుంబాలకే బియ్యం ఇవ్వడంపై ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యేను నిలదీశారు. అందరికీ బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేయకుండానే పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డిని కలిసిన మత్స్యకార నాయకులు అందరికీ బియ్యం అందించాలని వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో వివక్ష లేకుండా సాయం పంపిణీ చేశారని వివరించారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేకూ నిరసన సెగ కాకినాడ రూరల్ మండలం పోలవరం, సూర్యారావు పేట గ్రామాలలోని మత్స్యకారులకు శుక్రవారం బియ్యం పంపిణీ చేయడానికి వచ్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీని తుపాను బాధితులు నిలదీశారు. నేమాం గ్రామ పరిధిలోని సూర్యారావుపేటలో సుమారు 245 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం 48 కుటుంబాలనే నష్టపరిహారానికి ఎంపిక చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు ఉండడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం తమ్మవరం గ్రామ పరిధిలోని పోలవరంలోనూ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే 77 కుటుంబాలను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. అందరికీ ఇస్తేనే తీసుకుంటామని సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. అలాగే సూర్యారావుపేటలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. -
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ
సాక్షి, నెల్లూరు జిల్లా: దగదర్తిలోని దివంగత టీడీపీ నేత మాలేపాటి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. మాలేపాటి సుబ్బానాయుడు ఇంటికెళ్లిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలోనే కావ్య కృష్ణారెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సుబ్బానాయుడిని ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో కారు దిగకుండానే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెనుదిరిగారు. -
కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, వైఎస్సార్: కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యూనివర్సిటీని అకస్మాత్తుగా తరలించేందుకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, భవన యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు.వివరాల ప్రకారం.. కడప ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ప్రస్తుతం ఉన్న భవనం నుంచి యోగివేమన యూనివర్సిటీలోని గురుకుల బిల్డింగ్స్లోకి తరలించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ తరలింపుపై వీసీ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల బిల్డింగులో ఎలాంటి సదుపాయాలు లేవని, యూనివర్సిటీ నిర్వహణకు అది సరిపోదని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు. కూటమి నేతల ప్రమేయంతో అకస్మాత్తు తరలింపు ప్రక్రియ జరుగుతోందని చెబుతున్నారు. ఉన్న ఫలంగా తరలిస్తే.. ఇబ్బందులు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. కూటమి ప్రభుత్వం సదరు భవన యాజమాన్యానికి రూ.4 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. నిబంధనల మేరకు మూడు నెలలు ముందు ఖాళీ చేస్తామని నోటీసులివ్వాల్సి ఉండగా కూటమి సర్కార్ మాత్రం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఇలా చేయడాన్ని భవన యాజమాన్యం తప్పుబడుతూ ఆందోళనకు దిగారు. ఇక, యూనివర్సిటీ వద్దకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో వచ్చారు. భవన యాజమాన్యాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేవలం వైఎస్ జగన్ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారనే అక్కసుతోనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ అడ్మిషన్లు నిర్వహించకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేసింది. కూటమి నిర్ణయంపై వైఎస్సార్సీపీ నేతల స్పందిస్తూ.. యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. -
ఆర్టీసీ కండక్టర్పై దాడి
రామచంద్రపురం రూరల్: బస్సు కండక్టర్పై దాడి చేసి ఆయన కాలు విరగ్గొట్టిన నిందితులపై ఐదు రోజులైనా చర్యల్లేకపోవడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడ్డాయి. సోమవారం రామచంద్రపురం డిపోలో గేట్ మీటింగ్ నిర్వహించి నిరసన తెలిపాయి. బాధిత కండక్టర్ కుక్కల మంగేశ్వరరావుకు న్యాయం చేయాలని డిమాండ్చేశాయి. బాధితుడి కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న మంగేశ్వరరావు ఈ నెల 23న కోరుమిల్లి– రాజమండ్రి సరీ్వసులో విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో కోరుమిల్లికి చెందిన తుట్టపు అన్నపూర్ణ బస్సు ఎక్కి మాచవరం వెళ్లాలని చెప్పారు. అయితే ఆమె సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో చార్జీ చెల్లించాలని మంగేశ్వరరావు స్పష్టం చేశారు.దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్పై దౌర్జన్యం చేసింది. దీంతో కండక్టర్, డ్రైవర్ అన్నపూర్ణను పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి అప్పగించాలని భావించారు. అయితే తోటి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వివాదాన్ని అంతటితో ముగించారు. బస్సు రాజమండ్రి వెళ్లి తిరిగి కోరుమిల్లి చేరుకున్న సమయంలో అన్నపూర్ణ కుమారుడు భూషణం, అతడి స్నేహితుడు అడ్డాల ఆదినారాయణ బస్సు నుంచి దిగుతున్న కండక్టర్ మంగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఆయన కాలు విరగ్గొట్టారు. స్థానికులు, డ్రైవర్.. కండక్టర్ను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. దీనిపై అంగర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావ డంతో పోలీసులు చర్యలకు వెనుకడుగు వేస్తున్నారు. పైగా, మంగేశ్వరరావుకు మెరుగైన వైద్యం అందించకుండా కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ కారి్మకులు జేఏసీగా ఏర్పడి సోమవారం గేట్ మీటింగ్ పెట్టి నిరసన తెలిపారు. బాధిత కండక్టర్ కాలుకు తక్షణం శస్త్రచికిత్స చేయించాలని, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కోలుకునేవరకు ఆన్డ్యూటీగా పరిగణించాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కారి్మకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేఎస్సీ రావు, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ ఎల్.నారాయణ, నేషనల్ యూనిటీ అసోసియేషన్ సెక్రటరీ ముత్యాలరావు, వర్కర్స్ యూనియన్ ప్రతినిధి జీఎస్ రాజు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దూ పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటి వరకు క్రమబద్ధీకరణను పట్టించుకోకపోవడం దుర్మార్గమని కాంట్రాక్ట్ లెక్చరర్లు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ కోసం చట్టం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.2024, 2025 మే నెల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశం అనంతరం బందరు రోడ్డులోని డాక్టర్ అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జీవో 114ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, డాక్టర్ గేయానంద్, ఉన్నత విద్యా పరిరక్షణ సమితి చైర్మన్ రాజగోపాల్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు పాల్గొన్నారు. -
Meghala Konda: గిరిజనుల వినూత్న నిరసన
సాక్షి, అల్లూరి జిల్లా: ఎకో టూరిజం పేరుతో తమ జీవితాలను నాశనం చెయొద్దంటూ గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. మెడకు ఉరితాడు వేసుకొని గిరిజనులు నిరసన తెలిపారు. మేఘాలకొండ వ్యూ పాయింట్ దగ్గర నిరసన తెలిపిన గిరిజనులు.. మాడగడ మేఘాలకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి 600 కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. అభివృద్ధి పేరుతో అటవీశాఖ తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకే అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు.కాగా, మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును అటవీ శాఖ అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడగడ పంచాయతీ ప్రజలు.. ఈ నెల అక్టోబర్ 6న అరకులోయలోని రేంజర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ను తమ నుంచి లాక్కొని, అటవీశాఖ ఆధీనంలోకి మారుస్తామనడం సరికాదన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి, అటవీశాఖ అధికారులు ఏ రకంగా వ్యూపాయింట్ను స్వాధీనం చేసుకుని, నిర్వహిస్తారంటూ వారు ప్రశ్నించారు. -
మత్స్యకారులతో కలెక్టర్ చర్చలు విఫలం
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మత్స్యకారులు స్పష్టంచేశారు. సముద్ర జలాలను కలుషితంచేసి, చేపల వేటకు విఘాతం కలిగించే బల్క్ డ్రగ్ పార్కును రద్దుచేయాలంటూ 41 రోజులుగా రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం వీరంతా జాతీయ రహదారిని దిగ్బంధించి నక్కపల్లిలో నాలుగు గంటలపాటు ధర్నాచేశారు. దీంతో కలెక్టర్ వచ్చి త్వరలో చర్చలు జరుపుతానని నచ్చచెప్పి అప్పట్లో ఆందోళన విరమింపజేశారు. ఈ నేపథ్యంలో.. కలెక్టర్ శుక్రవారం రాజయ్యపేట వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. గ్రామస్తుల తరఫున 20 మందిని ఎంపికచేసి వారితో మాట్లాడించారు. వారంతా పరిశ్రమను రద్దుచేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని తేల్చిచెప్పారు. బల్క్ డ్రగ్ పార్కు వస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది కలెక్టర్కు వివరించారు. గతంలో ఏర్పాటుచేసిన రసాయన పరిశ్రమలవల్ల భూగర్భ జలాలు కలుషితమై క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. దీనివల్ల ఇప్పటికే 40 మంది చనిపోయారన్నారు. తన భార్య గర్భవతి అని, పిల్లలు ఎలా పుడతారోనని బెంగగా ఉందని దైలపల్లి కృష్ణ అనే మత్స్యకారుడు ఆందోళన వ్యక్తంచేశాడు. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయని, పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని గోసల కామేశ్వరి అనే మహిళ కలెక్టర్కు వివరించింది. అధికారుల మాటపై నమ్మకంలేదు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పే విషయాలు వినాలని కలెక్టర్ వారికి సూచించగా.. అందుకు మత్స్యకారులు అంగీకరించలేదు. వారిపై నమ్మకంలేదని, వారు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆక్షేపించారు. దీంతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. రసాయన పరిశ్రమల్లో వ్యర్థ జలాలు శుద్ధిచేయకుండా వదిలేయడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రభుత్వం నిఫుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసిందని, త్వరలోనే నివేదిక ఇస్తారన్నారు. నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏయే కంపెనీలు పెడతారో తెలీదని, మందుల కంపెనీలకు భూములు కేటాయించలేదన్నారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తారన్నారు. ఇక్కడకు వచ్చే పరిశ్రమలపై మీతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే, బల్క్ డ్రగ్ పార్కు రద్దుచేయడమే డిమాండ్ అని స్పష్టంచేశారు.ఆంక్షలు, కేసులు ఎత్తివేయండి.. హోంమంత్రిని అడ్డుకున్నందుకు, జాతీయ రహదారిని ముట్టడించినందుకు చాలా మందిపై కేసులు నమోదుచేశారని, గ్రామంలో సెక్షన్–30 అమలుచేస్తూ ఇతరులెవరినీ గ్రామంలోకి రానీయడం లేదన్నారు. ఈ కేసులు, ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ వారు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్కు అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని, దీనిపై తానేమీ చెప్పలేనన్నారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కలెక్టర్ సమావేశాన్ని ముగించారు. కేసులు, గ్రామంలో సెక్షన్–30 ఎత్తివేయడం గురించి కలెక్టర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. -
రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామస్తులకు బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడుచుగా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రాగానే ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ మండిపడ్డారు.బల్క్ డ్రగ్ పార్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజయ్యపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నికలకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హితవు ç³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మత్స్యకారులకు బాసటరాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్యకారులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మత్స్యకారులను కలిసి బాసటగా నిలిచారు.వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకారులు వివరించారు.మాజీ సీఎం వైఎస్ జగన్తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన వైఎస్ జగన్ దృష్టికి బల్క్ డ్రగ్ పార్కు సమస్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనేమత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసానిచ్చారు.‘‘ఏ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం’’ అని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై ఎదురుదాడి తగదన్నారు. రాజయ్యపేటలో 3 వేల మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నిరసించారు. రైతులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. అచ్యుతాపురం సెజ్లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశామని, రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతులను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.మత్స్యకారులకు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హోంమంత్రి అనిత యత్నిస్తున్నారని విమర్శించారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మత్స్యకారుల అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతుంటుందని చెప్పారు. -
బంగ్లాదేశ్లో మళ్లీ జనాగ్రహం
ఢాకా: బంగ్లాదేశ్లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది. నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్ జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఏమిటీ చార్టర్? మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది. -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్లో విపక్ష మహాఘట్ బంధన్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
మంత్రి అండ దండలతో ఖాకీ కరప్షన్
-
ఇక నేనే అధ్యక్షుడిని.. సైనిక నేత మైఖేల్ వెల్లడి
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో(Madagascar) అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా(Randrianirina) బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా(Madagascar President) పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు.జెన్ జెడ్ యువత(Gen Z) నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెలిసిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు.అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయ రేడియోలో ప్రకటించారు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది. -
‘మోదీకి మా బాధ తెలియాలి..’ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల ఆందోళన
సాక్షి, కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో వేళ.. న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో, ఫ్లకార్డుతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వాళ్లు కోరుతున్నారు.సుగాలి ప్రీతిపై అఘత్యానికి పాల్పడ్డ వాళ్లను కఠినంగా శిక్షించాలి(Sugali Preethi Case News). అసలు లోకేష్ రెడ్ బుక్లో వాళ్ల పేర్లు లేవా?. మా కుటుంబానికి ఇప్పటికైనా న్యాయం చేయాలి అంటూ ఫ్లకార్డలతో నినాదాలు చేశారు. మరోవైపు.. తమకు న్యాయం చేయాలని, తమ గోడను ప్రధాని మోదీకి వినిపించే అవకాశాన్ని కల్పించాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి వేడుకుంటున్నారు. 2017లో కర్నూలులోని ఓ స్కూల్లో అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతిబాయి మృతి చెందింది. అయితే.. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల బెనిఫిట్స్ ప్రీతి కుటుంబానికి అందాయి. అలాగే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదల్లేదు. ఈలోపు ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఈ కేసు విపరీతమైన రాజకీయ ప్రచారానికి వాడుకున్నారు. అయితే తాజాగా బాధిత కుటుంబం కూటమి పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేయడం, ఆందోళనకు దిగిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిగి వచ్చి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే.. న్యాయం చేస్తానని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని పార్వతి ఆరోపిస్తున్నారు(Sugali Preethi Mother Slams Pawan Kalyan). అంతేకాదు.. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్కు మా ఉసురు తగులుతుంది’’ అని వాపోయారామె. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ రేపు(అక్టోబర్ 16న) కర్నూలుకు రానున్నారు(PM Modi AP Kurnool Tour). ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ను మోదీ అప్పాయింట్మెంట్ ఇప్పించాలని పార్వతి విజ్ఞప్తి చేశారు. అయితే.. అవతలి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. ఇదీ చదవండి: న్యాయం గెలిచింది.. కూటమికి గట్టి దెబ్బ -
నారా నకిలీ మద్యంపై YSRCP ఉద్యమం
-
YSRCP రణభేరి కూటమిలో భయం.. భయం
-
బాలకృష్ణకు బిగ్ షాక్.. చుట్టుముట్టిన హిందూపురం మహిళలు
సాక్షి, చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం(hindupur) టీడీపీ(TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు(nandamuri Balakrishna) నిరసన సెగ తగిలింది. ఆదివారం ఆయన చిలమత్తూరు మండల పరిధిలోని తుమ్మలకుంటలో పర్యటించగా.. బాలకృష్ణను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. తమ సమస్యలపై ఎమ్మెల్యే బాలకృష్ణను ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక.. ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు.. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని కొందరు, పింఛన్ రాలేదని మరికొందరు నిలదీశారు. బాడుగ ఇంట్లో ఉంటున్నాం. మాకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు. వారికి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయిన బాలకృష్ణ.. ‘ఇస్తాం’ అంటూ మాట దాటవేశారు. మహిళలు అడిగిన వాటిపై సరిగా స్పందించని బాలకృష్ణ.. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు అంటూ పథకాలను ప్రస్తావించారు. అవేవీ వినిపించుకోని మహిళలు మళ్లీ మళ్లీ అడగడంతో ఏదైనా జరుగుతుందేమోనని ఆలోచించిన టీడీపీ నేతలు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని వారు చెప్పినా మహిళలు వినకపోవడంతో చివరకు బాలకృష్ణ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు.ఇది కూడా చదవండి: కోటా వినుత డ్రైవర్ హత్య కేసులో మరో ట్విస్ట్.. -
భగ్గుమన్న మత్స్యకారులు
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మరో కరేడుగా మారింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలంటూ ఆదివారం వేలాది మంది మత్స్యకారులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. సుమారు 4 గంటల పాటు కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మత్స్యకారుల ఆందోళనతో సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే... నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో 2,200 ఎకరాల్లో ప్రభుత్వం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ పార్క్ ఏర్పాటైతే ఇక్కడ వందలాది ప్రమాదకర రసాయన పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేస్తారని, ఫలితంగా ఈ ప్రాంతమంతా కాలుష్యమయం అవుతుందని మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందంటూ రాజయ్యపేట మత్స్యకారులు 29 రోజులుగా గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళనకు పోలీసులు అనేక అడ్డంకులు కల్పిస్తున్నారంటూ మత్స్యకారులు ఆవేదనతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో 15 రోజుల క్రితం పనుల్ని అడ్డుకున్నారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో గత నెల 30న హోంమంత్రి అనిత గ్రామంలోకి వచ్చారు. మంత్రిని కూడా అడ్డుకుని ఘెరావ్ చేశారు. మత్స్యకారుల డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని, పనులు తాత్కాలికంగా నిలిపివేయిస్తానని హామీ ఇచ్చి, అక్కడినుంచి ఆమె వచ్చేశారు. గ్రామం నుంచి 30 మంది కమిటీగా వస్తే సీఎం దగ్గరకు తీసుకెళ్తానని ప్రకటించారు. ఇది జరిగి 15 రోజులు గడుస్తున్నా హోంమంత్రి నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని ఎటువంటి స్పందన లేదు. మత్స్యకారులు గ్రామంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. స్థానికేతరులను గ్రామంలోకి రానివ్వడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.పోలీసుల వైఖరితో విసిగివేసారి..ఆదివారం దీక్షలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను ఉపమాకలో అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో రగిలిపోయిన మత్స్యకారులు ఆదివారం మధ్యాహ్నం నిరాహార దీక్ష శిబిరం నుంచి 6 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లి నక్కపల్లి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మార్గంమధ్యలో పోలీసులు మత్స్యకారులను ట్రాక్టర్లు, ఐరన్ స్టాపర్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నప్పటికీ వాటిని «తొలగించుకుంటూ వందలాది మంది మహిళలు, మత్స్యకారులు జాతీయ రహదారిపై ఉపమాక జంక్షన్ వద్ద ధర్నాకు దిగారు.డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళనతక్షణమే బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిమాండ్ చేశారు. మత్స్యకారులు, నాయకులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని, రాజయ్యపేటలో అమల్లో ఉన్న 144వ సెక్షన్ ఎత్తివేయాలని, మత్స్యకారులకు సంఘీభావంగా వచ్చే వివిధ పార్టీల నాయకులను అడ్డుకోవడానికి వీల్లేదని, ర్యాలీ సందర్భంగా మహిళలపై దౌర్జన్యం చేసి గాయపర్చిన ఎస్.రాయవరం సీఐ లొడ్డు రామకృçష్ణను, నక్కపల్లి ఎస్ఐ సన్నిబాబును సస్పెండ్ చేయాలని పోలీసులు అడ్డుకున్న వీసం రామకృష్ణను తక్షణమే ఆందోళన వద్దకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వందలాది మంది బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, డీఎస్పీ శ్రీనివాసరావు వచ్చి మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారెవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, అంతవరకు ధర్నా విరమించే ప్రసక్తి లేదంటూ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు 4గంటల పాటు జాతీయ రహదారిపైనే ధర్నా చేయడంతో రెండువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిíచిపోయాయి. ఎట్టకేలకు సాయంత్రం 5.30 గంటలకు కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్సిన్హా ఆందోళనకారుల వద్దకు చేరుకున్నారు. బుధవారం రాజయ్యపేటలో మత్స్యకారులందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. -
నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపు
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..? -
మిలిటెంట్ గ్రూప్ మిలియన్ మార్చ్.. అట్టుడుకుతున్న పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ను బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐఎస్ఐఎస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో మిలిటెంట్ గ్రూపు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) చేపట్టిన ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రావల్పిండిలో టీఎల్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా పాకిస్తాన్లోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టీఎల్పీ నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతి చర్యగా టీఎల్పీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 65 మంది TLP కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిపై శాంతి భంగం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.ఈ ఘటనపై పాక్ పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్యత అని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, TLP నాయకులు తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. Tehreek-e-Labbaik workers forcibly took away a Pakistani police vehicle.This shows exactly how far Pakistan has fallen. Radical mobs are now ruling cities, and the state that cultivated them is watching helplessly.Chaos has become permanent.@LtGenDPPandey @EPxInsights pic.twitter.com/4rKPpPysjm— Stuti Bhagat (@StutiBhagat_) October 11, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
-
సచివాలయ ఉద్యోగుల ‘ఆత్మగౌరవం’ భగ్నం
నెల్లూరు (పొగతోట): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు టౌన్హాల్లో ఆదివారం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆత్మగౌరవ రొట్టె, ఆత్మగౌరవ సమావేశం, కొవ్వొత్తుల ప్రదర్శన తదితర కార్యక్రమాలకు పోలీసుల అనుమతి కోరారు. ఆత్మగౌరవ రొట్టె, కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతించకపోవడంతో ఆత్మగౌరవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు టౌన్హాల్కు భారీగా తరలివచ్చారు. అక్కడ పెద్దఎత్తున మోహరించిన పోలీసులు సభ నిర్వహణకు అనుమతిలేదంటూ ఉద్యోగులను బయటకు పంపించేశారు. అనంతరం టౌన్హాల్ గేట్లకు తాళాలు వేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేఏసీ నాయకులు, ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా వీఆర్సీ మైదానం వద్దకు వెళ్లాలంటూ హుకుం జారీ చేయడంతో అక్కడికి చేరుకుని నిరసన కొనసాగించారు.మా డిమాండ్లు నెరవేర్చాలిఉభయ గోదావరి జిల్లాల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశం జరిగింది. 1,500 మంది సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు.ఐక్యవేదిక చైర్మన్ జానీ పాషా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో క్యాడర్ అప్గ్రేడ్ చేయాలని కోరారు. సంఘ సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్కృష్ణ, కనీ్వనర్ షేక్ అబ్దుల్ రజాక్, నాయకులు పాల్గొన్నారు. -
సర్వేల పేరుతో వేధింపులు.. బాబుపై తిరగబడ్డ సచివాలయ ఉద్యోగులు
-
పాక్ దళాల కాల్పుల్లో ఎనిమిది మంది నిరసనకారులు మృతి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా మూడవ రోజు జరిగిన హింసాత్మక నిరసనల్లో బుధవారం ఎనిమిది మంది పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్కోట్లో నలుగురు మృతిచెందారని, ముజఫరాబాద్లో ఇద్దరు, మీర్పూర్లో ఇద్దరు మృతిచెందారని ఎన్డీటీవీ తెలిపింది. మరణించిన నిరసనకారుల సంఖ్య 10కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి.‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’పై అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా భారీ నిరసనలు జరగడంతోపాటు మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. రవాణా సేవలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం అతలాకుతలయ్యింది. బుధవారం ఉదయం నిరసనకారులు ముజఫరాబాద్లో షిప్పింగ్ కంటైనర్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువులు నిరసరకారులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని జనం అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి జనం తిరగబడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ఉద్యమాలను అణిచివేస్తోంది. అయితే ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.గత రెండు రోజులుగా ప్రజలు సైన్యం-పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు అనుమతినివ్వడం లేదు. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్టోబర్ 1న పీఓకేలోని ముజఫరాబాద్ వరకూ లాంగ్ మార్చ్ చేపడతామని నిరసనకారులు ప్రకటించారు. -
చంచల్ గూడ జైలులో ఖైదీల నిరాహార దీక్ష?
సాక్షి,హైదరాబాద్: చంచల్ గూడ జైలులో రాజకీయ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రజాసంఘాలు ఆరోపించాయి. జైలు అధికారుల తీరుకు నిరసనగా మావోయిస్టు ఖైదీలు నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే.. తమ జైలులో ఏడుగురు మావోయిస్టు ఖైదీలున్నారని చంచల్గూడ్ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. రొటీన్ ప్రాసెస్లో భాగంగా సోమవారం వారి బ్యారక్లను మార్చామని, అంతకు మించి ఏమీ జరగలేదని పేర్కొన్నారు. వారికి మద్దతుగా పలు ప్రజాసంఘాలు ఈరోజు ధర్నా చేశాయని, వారి తరఫున అడ్వొకేట్లు నలుగురు జైలులో పరిస్థితిని పరిశీలించారని వివరించారు. ప్రజాసంఘాల నేతలతో మావోయిస్టు ఖైదీలకు ములాఖత్ ఏర్పాటు చేశామన్నారు. -
అనిత ‘గాలి’ మాటలు.. మళ్లీ రోడ్డెక్కిన మత్స్యకారులు
సాక్షి, అనకాపల్లి జిల్లా: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలతో మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన లారీని మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పనులు జరగవని హొంమంత్రి ప్రకటించిన మరుసటి రోజే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ని అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న బల్క్డ్రగ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా మత్స్య కారులు ఆందోళన చేపట్టారు. అయితే, దీనిపై చర్చిచేందుకు హోంమంత్రి నిన్న (సెప్టెంబర్ 29, సోమవారం) గ్రామానికి వచ్చారు. పనులు నిలిపివేస్తున్నట్టు హోం మంత్రి ప్రకటించారు. కానీ ఇవాళ లారీలో ఇసుక రావడంతో మత్స్యకారులు మండిపడ్డారు. -
పీఓకేలో తిరుగుబాటు
ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని, అణచివేత చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ జనం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఓకే రాజధాని ముజఫరాబాద్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘ ర్షణ జరిగింది.హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న సాధారణ ప్రజలపై పాక్ సైన్యంతోపాటు ఐఎస్ఎస్ అండదండలున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ ముష్కరులు కిరాతకంగా కాల్పులు జరిపారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిని పొట్టనపెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 22 మందికిపైగా గాయపడ్డారు. ముజఫరాబాద్ వీధులు రణరంగాన్ని తలపించాయి. హింసాకాండ దృశ్యాలు పాకిస్తాన్ వార్తా చానళ్లలో ప్రసారమయ్యాయి. తెరపైకి 38 డిమాండ్లు ప్రాథమిక హక్కుల సాధన కోసం పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమిస్తోంది. ఆదివారం నుంచి ఆందోళనలు ఉధృతంగా మారాయి. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్ పాటించారు. సోమవారం మార్కెట్లు, దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా సేవలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు మొత్తం 38 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను పాక్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది.ఈ సీట్లను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. పీఓకేలోని మాంగ్లా డ్యామ్, నీలం–జీలం ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 60 శాతానికి పాకిస్తాన్కే సరఫరా అవుతోంది. స్థానికులకు దక్కుతున్న ప్రయోజనం స్వల్పమే. ఇదే అంశం వారిలో అసంతృప్తి కలిగిస్తోంది. పీఓకేలోని వనరులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధరలు విపరీతంగా పెరగడం జనంలో అసహనం కలిగిస్తోంది. ఇవన్నీ ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించాయి.గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణచివేస్తోందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్లను ఇప్పటికైనా నెరవేర్చకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు తేల్చిచెప్పారు. అణచివేత చర్యలు ప్రారంభం పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కార్ చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్కు చేరుకున్నారు. పలు పట్ణణాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. వీధుల్లోకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. పీఓకేలో ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాక్ వైమానిక దళం గతవారం ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్లోని ఓ మారుమూల గ్రామంపై భారీస్థాయిలో విరుచుకుపడింది. చైనా ఇచ్చిన జే–17 ఫైటర్ జెట్లతో ప్రజలపై నిప్పుల వర్షం కురిపించింది. చైనాలో తయారైన ఎల్ఎస్–6 లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో 30 మంది సాధారణ ప్రజలు మరణించారు. అది జరిగిన వారం రోజులకే పీఓకేలో ఆందోళనలు ప్రారంభం కావడం గమనార్హం. -
నిరసనల ఎఫెక్ట్.. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ కీలక ప్రకటన
ఖాట్మాండ్: నేపాల్(Nepal) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) కీలక ప్రకటన చేశారు. తాను దేశం వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తాజాగా మాట్లాడుతూ.. నేను ఎవరికీ భయపడను. దేశంలోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తాను. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి తాను పారిపోతానని అనుకుంటున్నారా? అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా.. విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికి కూడా తనకు బెదిరింపు మెసేజులు వస్తున్నాయన్నారు. నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేపాల్లో అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా ఇటీవల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా జెన్-జీ(Gen Z) ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 🚨 Nepal’s former Prime Minister and CPN-UML chairman KP Sharma Oli has denied speculation about his departure, accusing the Sushila Karki-led government of trying to remove his security and official benefits amid political tensions. pic.twitter.com/CJY9PUQ4bL— Geo Strategist (@GeoStrategistX) September 29, 2025 -
Bangladesh: గిరిజన బాలికపై సామూహిక అకృత్యం.. నిరసనల్లో ముగ్గురు మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత హింస చెలరేగింది. అక్కడి చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస చెలరేగింది.బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు. -
పాకిస్తాన్ సర్కార్కు బిగ్ షాక్.. పీవోకేలో ఆందోళనలు.. ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK) ఉద్రికత్త చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలను కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee (AAC)) నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో భారీ నిరసనలు చేపట్టారు. కాగా, అవామీ యాక్షన్ కమిటీ.. 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాండ్లను పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. పీఓకేలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా.. పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వు చేయబడిన పీవోకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలని, ఇది ప్రాతినిధ్య పాలనను దెబ్బతీస్తుందని తెలిపింది.#BREAKING: Thousands of civilians to launch massive protests in Pakistan Occupied Kashmir (PoK) tomorrow against Pakistani Govt under leadership of Awami Action Committee. Pak forces bring thousands of troops from Punjab to crush protest. Internet shutdown from midnight in PoK. pic.twitter.com/nfeSviJHsC— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025ఈ సందర్బంగా అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో మాట్లాడుతూ..‘మా ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదు. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. ఈ క్రమంలో పీవోకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ (Protests In PoK) రోడ్ల పైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకురావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు అక్కడికి చేరుకున్నట్టు పౌరులు తెలిపారు. ఇక, ఆందోళనల నేపథ్యంలో పీవీకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. చెక్ పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. Pakistani occupational forces are committing genocide in Pakistan-occupied Kashmir. @UNHumanRights remains silent. @BBCWorld @AJEnglish ignore it because it doesn’t suit their agendas. #POK #Kashmir #HumanRights pic.twitter.com/MxC1VCG6O1— Sabharwal (@GulshanKum6415) September 28, 2025 -
‘ఎవరిది రాజకీయం?..’ లోకేష్పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: తమ ఆందోళనలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వార్థంతోనే విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లోకేష్కు ఏయూ స్టూడెంట్స్ అల్టిమేటం జారీ చేశారు. ‘‘విద్యార్థులు రాజకీయం చేస్తున్నారా? ఎవరిది రాజకీయం?. మా ఇబ్బందులు చెప్పుకోవడం స్వార్థం అవుతుందా?. వీసీ రాజకీయ ఎజెండాతోనే వచ్చినట్లు మీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఏయూ వీసీ.. గీతం వర్సిటీ కోసం పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాగే మాట్లాడితే మీ ఇంటిని ముట్టడిస్తాం. తక్షణమే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని విద్యార్థులు హెచ్చరించారు.ఏయూ విద్యార్థుల ఆందోళనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏయూ బంద్కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నిరసనలు కాస్త ఆందోళనలుగా మారాయి. అయితే.. స్వార్థం కోసమే విద్యార్థులు ఆందోళనకు దిగారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. కావాలనే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆంధ్రా వర్సిటీలో రాజకీయం చేస్తున్నాయి. మణికంఠ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడు. ఆంబులెన్స్లో ఉన్నప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు. అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్లు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.. .. వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాం. ఏయూని టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని నారా లోకేష్ అన్నారు. మరోవైపు వీసీ రాజశేఖర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విద్యార్థుల చర్చ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఒక ఉద్దేశ పూర్వక నిరసనగానే అనిపిస్తోందని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం రెండో రోజుకి చేరాయి. వీసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆఫీస్ను శుక్రవారం ఉదయం విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వాళ్లకు అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. తమ జుట్టు పట్టుకుని లాగి పడేసి అనుచితంగా ప్రవర్తించారంటూ ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మీడియా ఎదుట వాపోయారు. విద్యార్థుల డిమాండ్లు..ప్రతి విద్యార్థికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలిడిస్పెన్సరీలో సౌకర్యాలను మెరుగుపరచాలిఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచాలిచనిపోయిన మణికంఠ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలివారం రోజుల్లో హామీలపై స్పష్టత ఇవ్వాలి.. లేదంటే విసీ రాజీనామా చేయాలివిద్యార్థుల డిమాండ్లతో పాటు విద్యార్థులు సమస్యలపై త్రీ మెన్ కమిటీ ఏర్పాటుకు వీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. విద్యార్థులు తమ డిమాండ్లను నిర్ణీత కాలపరిమితిలో నెరవేరుస్తామని రాసివ్వాలని కోరగా.. అందుకు వీసీ రాజశేఖర్ అంగీకరించలేదు. అలాగే పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.గత ఏడాది కాలంగా ఏయూలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అయినా వర్సిటీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీఈడీ స్టూడెంట్ మణికంఠ మృతి చెందడం, ఈ మరణానికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తుండడంతో ఆ నిరసనలు ఆందోళనల రూపం దాల్చాయి. మరో వీసీ నియామకం వెనుక రాజకీయాలు నడిచాయన్న ఆరోపణలనూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో వీసీ వైఖరి కారణంగానే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. -
లేహ్ లద్దాక్లో హైటెన్షన్.. బీజేపీ కార్యాలయానికి నిప్పు
ఢిల్లీ: లద్దాఖ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లేహ్లోని బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసు వాహనాలకు కూడా ఆందోళనకారులు నిప్పు అంటించారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో దీంతో బాష్పవాయువు ప్రయోగించి పోలీసులు.. నిరసనకారులను చెదరగొట్టారు.నలుగురి మృతి..నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్ చేస్తున్న నిరసనకారులు.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆందోళన చేస్తున్నామంటున్నారు. నగరంలో ఉద్రిక్తంగా మారిన నిరసనల నేపథ్యంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు గాయపడినట్లు తెలిపారు.#WATCH | Leh, Ladakh: BJP Office in Leh set on fire during a massive protest by the people of Ladakh demanding statehoothe d and the inclusion of Ladakh under the Sixth Schedule turned into clashes with Police. https://t.co/yQTyrMUK7q pic.twitter.com/x4VqkV8tdd— ANI (@ANI) September 24, 2025జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను 2019 ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంతో.. రాష్ట్ర హోదా, 6వ షెడ్యూల్ అమలు కోసం డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్తో ఆందోళనకారులు లేహ్ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. -
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు షాక్
-
మా ఎమ్మెల్యే ఎక్కడ?.. పవన్ పై తిరగబడ్డ ఉప్పాడ మత్స్యకారులు
-
CI బెదిరింపులు.. తగ్గేదేలే అంటున్న విద్యార్థులు
-
జార్ఖండ్లో కుర్మీల రైల్ రోకో
రాంచీ: జార్ఖండ్లో శనివారం కుర్మీలు ఇచ్చిన రైల్ రోకో పిలుపు ప్రభావం 100కు పైగా రైళ్ల రాకపోకలపై పడింది. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్, తూర్పు సెంట్రల్ రైల్వే ధన్బాద్ల పరిధిలోని వేర్వేరు స్టేషన్ల పరిధిలో కుర్మీల ఆందోళన కొనసాగుతోంది. నిషేధం ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ ఆందోళనకారులు పట్టాలపై బైటాయించారు. తమ కుర్మలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని, కుర్మీలకు షెడ్యూల్ తెగల హోదా ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి వేళ కూడా ఆందోళన కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేర్చేదాకా విరమించేది లేదని ఆదివాసీ కుర్మీ సమాజ్ నేత ఓపీ మహతో స్పష్టం చేశారు. కు ర్మీలను 1931లో ఎస్టీల జాబితా నుంచి తొలగించారని, అప్పటి నుంచి పోరాడుతున్నా డిమాండ్ నెరవేరలేదని సంఘం మరో నేత షీతల్ ఓహదార్ చెప్పారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామంటూ సమర్థించుకున్నారు. వీరికి పలు రాజకీయ పా ర్టీలు సైతం మద్దతు ప్రకటించాయి. ఆందోళనల కారణంగా తూర్పు సెంట్రల్ రైల్వే ధన్బాద్ డివిజన్ పరిధిలో 25 ప్రయాణికుల రైళ్లను రద్దు చేశామని, మరో 24 రైళ్లను దారి మళ్లించామని అధికారులు తెలిపారు. ఆగ్నేయ రైల్వే రాంచీ డివిజన్ పరిధిలో వందేభారత్, రాజధాని ఎక్స్ప్రెస్ సహా 12 రైళ్లను రద్దు చేసి, 11 రైళ్లను దారి మళ్లించామన్నారు. మరికొన్ని రైళ్ల గమ్యస్థానాలను కుదించామన్నారు. ఆందోళనల కారణంగా రైళ్లు నిలిచిపోవడంతో వేలాదిగా ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుబడిపోయారు. టాటా–పట్నా వందేభారత్ రైలులోని వందలాది మంది ప్రయాణికులు రాంచీలోని మురి స్టేషన్లో ఉండిపోయారు. ఈ రైలును అధికారులు రద్దు చేసిన విషయం తెలిసి ప్రయాణికులు గగ్గోలు మొదలుపెట్టారు. కాగా, కుర్మీల నిరసన చట్ట విరుద్ధం, అప్రజాస్వామికమంటూ వివిధ గిరిజన సంఘాలు రాంచీలోని రాజ్భవన్ ఎదుట నిరసన తెలిపాయి. అసలైన గిరిజనుల హక్కులను లాక్కునేందుకు కుర్మీలు ప్రయతి్నస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన
-
భయపడ్డ చంద్రబాబు.. ఇంత మంది పోలీసులా..
-
Watch Live: ఛలో మెడికల్ కాలేజ్
-
ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, వెలగపూడి: ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో ఆ శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. సభ్యులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ర్యాలీని కవరేజ్ చేస్తున్న మీడియాపైనా పోలీసులు దౌర్జన్యానికి దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
-
గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం
-
న్యాయం కోసం రోడ్డెక్కిన ‘సంగం’ మృతుల కుటుంబాలు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నెల్లూరులోని ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద ఇద్దరి మృతదేహాలతో కుటుంబ సభ్యులు గురువారం నిరసన చేపట్టారు. పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇందుకూరుపేటకు చెందిన వారితోపాటు నెల్లూరులోని 16వ డివిజన్ గుర్రాలమడుగు సంగానికి చెందిన శేషం చినబాలవెంగయ్య, సారమ్మ ఉన్నారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంతో నగరానికి చెందిన ఇద్దరి మృతదేహాలతో వారి కుటుంబసభ్యులు ముత్తుకూరు గేట్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు అంత్యక్రియలు చేసేది లేదని భీషి్మంచారు. పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సీపీఎం నగర శాఖ కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, మృతిచెందిన వారంతా నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన వారని చెప్పారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని మండిపడ్డారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం డబ్బుల్లేవన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మృతుల కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రూ.5 లక్షలతో సరిపెట్టిన ప్రభుత్వం రోడ్డుపై మృతదేహాలతో నిరసన విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. ఇదే విషయాన్ని నెల్లూరు అర్బన్ తహసీల్దార్ వచ్చి మృతుల కుటుంబాలకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన మృతుడు చినబాలగంగయ్య కుమార్తె ఎనిమిదేళ్ల అశ్విని తహసీల్దార్ను, పోలీసు అధికారులను నిలదీసింది. ఉదయం నుంచి తన తండ్రి మృతదేహాన్ని ఎండలో పెట్టుకొని బాధపడుతుంటే ఇప్పటివరకు ఏం చేస్తున్నారని అశ్విని ప్రశ్నించింది. తన తండ్రి బతికున్న సమయంలో తమ కోసం కష్టపడి ఎండలో పనిచేసేవారని, మరణించాక కూడా మృతదేహాన్ని ఎండలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో తమ చదువులు, భవిష్యత్తు బాగుపడతాయా? అని నిలదీసింది. కారు నంబర్తో టిప్పర్కు టింకరింగ్.. ఇది పోలీసుల కవరింగ్» నెల్లూరు జిల్లా టిప్పర్ ప్రమాద ఘటనలో దోషుల్ని తప్పించేందుకు యత్నం » ఏడుగుర్ని బలిగొన్న టీడీపీ నేత ఇసుక టిప్పర్.. ప్రమాదానికి గురైన కారు నంబర్ను టిప్పర్ నంబర్గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ » టిప్పర్ డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన ఎస్పీ.. పరారయ్యారంటున్న పోలీసులు.. మంత్రి ‘ఆనం’ అనుచరులకు పోలీసులు వత్తాసు సంగం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలో జాతీయ రహదారిపై టీడీపీ నేతకు చెందిన ఇసుక టిప్పర్ బుధవారం రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారును ఢీకొట్టి ఏడుగురిని బలిగొన్న ఘటనలో పోలీసుల తీరు విస్తుగొలుపుతోంది. ఈ కేçసును తారుమారు చేసేందుకు యతి్నస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టిప్పర్ డ్రైవర్ సంగం పోలీస్స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి లొంగిపోయాడని జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ప్రకటించారు. అయితే.. తెల్లవారేసరికి అదే టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని సంగం పోలీసులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ను నిబంధనల ప్రకారం తక్షణమే వైద్య పరీక్షలకు పంపించాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలకు పంపితే టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే విషయం బయటపడుతుందనే భయంతో పోలీసులపై మంత్రి ఆనంరామనారాయణరెడ్డి అనుచరులు ఒత్తిడి తెచ్చి డ్రైవర్ అరెస్ట్ కాలేదంటూ నాటకమాడిస్తున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. తప్పుల తడకగా ఎఫ్ఐఆర్ ఈ ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను సైతం పోలీసులు సక్రమంగా రాయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎఫ్ఐఆర్లో ఏ–1గా టిప్పర్ డ్రైవర్ను చూపించారు. ఇసుక టిప్పర్ నంబర్ను ఏపీ 40 హెచ్జీ 0758గా నమోదు చేశారు. నిజానికి ఈ నంబర్ టిప్పర్ది కాదు. ప్రమాదానికి గురైన కారుది. అంటే కారు నంబర్ను టిప్పర్ నంబర్గా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఏ–2గా టిప్పర్ యజమాని అని రాసి, అక్కడా టిప్పర్ నంబర్కు బదులుగా కారు నంబర్నే రాశారు. టిప్పర్ నంబర్ ఏపీ 39 డబ్యూహెచ్ 1695 కాగా.. ఈ నంబర్ను ఎఫ్ఐఆర్లో ఎక్కడా చూపకపోవడం గమనార్హం. కాగా, మృతుల్లో ఒకరైన తాళ్లూరు శ్రీనివాసులు సోదరుడు సాయిచైతన్య ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్, యజమాని, ఇసుక అక్రమ రవాణాదారు బుజ్జయ్యనాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు సర్కార్పై భగ్గుమన్న ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ
సాక్షి, అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కార్పై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ భగ్గుమంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి నిధుల నిలిపివేతపై నిరసనకారులు మండిపడ్డారు. భారీ ర్యాలీతో కలెక్టరేట్ను ముట్టడించారు. నిరసన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ఎందుకు కక్ష సాధింపు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీటీ స్వచ్చంద సంస్థకు ఎఫ్సీఆర్ఏ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిరసన కారుల ధ్వజమెత్తారు. -
కూటమి సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారు: స్టీల్ ప్లాంట్ కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. తమ జీతాలు తక్షణమే చెల్లించాలంటూ అడ్మిన్ బిల్డింగ్ దగ్గర నిరసనకు దిగారు. కంచాలతో భిక్షాటన చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడం వలన పిల్లలకు తిండి పెట్టలేక పోతున్నామని.. ఫీజులు కట్టలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు నిలబెట్టుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ను కాపాడతామన్నారు. కార్మికులు అర్ధాకలితో ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం స్పందించడం లేదు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి’’ అంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు హెచ్చరించారు. -
బ్రిటన్లో ఉద్రిక్తత.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్ నాశనం అవుతోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.బ్రిటన్లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా వీడియోలో మాట్లాడుతూ.. ‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని కామెంట్స్ చేశారు.📢 Massive protests in London today! Tens of thousands at "Unite the Kingdom" rally for free speech & anti-immigration, with reports of hundreds of thousands or even 1M+ attendees. 🇬🇧 #LondonProtests #UKNews pic.twitter.com/AD0OjUZjuy— Socially Trendy (@SociallyTrendyX) September 13, 2025 ఇదిలా ఉండగా.. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన 'యునైట్ ది కింగ్డమ్' ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, 25 మందిని అరెస్ట్ చేశారు.#BREAKING: Anti-immigration protesters clash with "Stand Up To Racism" counter-demonstrators in London, marching toward Westminster. Heavy police presence deployed to keep groups apart amid tense standoff in Whitehall. #LondonProtests #UKNews pic.twitter.com/ibaKsRxVF5— Uma Shankar✍️ (@umashankermedia) September 13, 2025మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపుతప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరుచేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజం' సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది. Police try to stop #UniteTheKingdom protesters going the route the police GAVE them to walk but the British heavily outnumbering the police push through the line. British men are waking up, they don't fear police. #TommyRobinson #london #reform pic.twitter.com/JEMP5pDX4K— Jamie (@Jamie69660989) September 13, 2025 -
నేపాల్ నిరసనల్లో భారతీయ మహిళ మృతి


