నగరి: ప్రతిసారి వైఎస్సార్ సీపీ శ్రేణులను, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు కేసులు బనాయించడాన్నినగరి మున్సిపాలిటీ చైర్ పర్సన్, ఆ పార్టీ మహిళా నాయకురాలు శాంతా కుమారి తీవ్రంగా తప్పుబట్టారు. తన కుటుంబ సభ్యులుపైనే కాకుండా, స్థానికంగా ఉన్న తమ బంధువులపై కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తూ అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. తమపై నాన్ బెయిల్ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం రాజకీయ కుట్ర కాదా?అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు ఒత్తిడితో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ తమను వేధింపులు గురి చేస్తున్నారన్నారు.
శనివారం అర్ధారాత్రి శాంతాకుమారి ఇంటి గేటుకు వేసి ఉన్న తాళలను పగలగొట్టిమరీ లోనికి ప్రవేశించిన పోలీసుల తీరుతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. శాంతాకుమారి నివాసం వద్దకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించేప్రయత్నం చేశారు.
*ప్రతిసారి మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
*అక్రమంగా నాన్ బెయిల్ కేసులు నమోదు చేస్తున్నారు.
*నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో నా ఇంటికి వచ్చి గేటు పగులగొట్టారు
*దుర్బషలాడారు, బూతులు మాట్లాడారు
*మమ్మల్మి అరెస్ట్ చేస్తే కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంటానని నా పెద్ద కోడలు హెచ్చరించింది
*పనిచేయని శాడిస్ట్ కమిషనర్ ను పెట్టి ముద్దు కృష్ణమనాయుడు వేధిస్తున్నాడు
'రాజకీయ కుట్రతో మాపై కేసులు పెట్టారు
'మేమైనా టెర్రలిస్టులమా?
'మమ్మల్నే లక్ష్యంగా చేసుకుంటున్నారు'
Published Sun, Aug 16 2015 8:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement