వరంగల్: క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్లోని గిరిప్రసాద్నగర్ కాలనీలో ఆదివారం జరిగింది. కాలనీకి చెందిన ముగ్గురు మహిళలు.. ఈ మధ్య కాలంలో.. అందంగా, బలంగా, పొడవైన వెంట్రుకలతో ఉన్న మహిళలకు గాలం వేసి వారిని క్షుద్రపూజలకు వినియోగిస్తున్నారు. శనివారం రాత్రి కాలనికి చెందిన ఒక మహిళను క్షుద్రపూజలకోసం తీసుకెళ్లారు. నగ్నంగా తయారుచేసి వింత వింత చేష్టలు చేయడంతో.. ఆ మహిళ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నగ్నంగా క్షుద్రపూజలు: ముగ్గురు మహిళల అరెస్ట్
Published Sun, Aug 9 2015 11:44 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
Advertisement
Advertisement