డెంగీ బారిన పడి ఇద్దరి మృతి
Published Sun, Oct 16 2016 2:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగీ బారిన పడి ఇద్దరు మృతిచెందారు. మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన బానోతు మంగ(48), గుగులోతు సైదులు(28) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఇద్దరికి డెంగీ సోకడంతో.. వైద్యులు చికిత్స అందిస్తుండగా.. కొద్దిసేపటి క్రితం ఇద్దరు మృతిచెందారు. గ్రామంలో డెంగీ ప్రభలిన పట్టించుకునే నాధుడు లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement