ప్రభుత్వ ఉద్యోగం రాలేదని..
Published Fri, Mar 17 2017 8:58 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందురు సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన జనార్ధన్ గత కొంత కాలంగా ప్రభుత్వోద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉద్యోగం రాకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Advertisement
Advertisement