జయేంద్ర సరస్వతిని కలిసిన వైఎస్ జగన్ | ys jagan met jayendra saraswathi in vijayawada | Sakshi
Sakshi News home page

జయేంద్ర సరస్వతిని కలిసిన వైఎస్ జగన్

Published Thu, Aug 18 2016 11:05 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

జయేంద్ర సరస్వతిని కలిసిన వైఎస్ జగన్ - Sakshi

జయేంద్ర సరస్వతిని కలిసిన వైఎస్ జగన్

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం లబ్బిపేటలోని షిరిడీసాయిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరికాసేపట్లో పున్నమిఘాట్లో ఆయన పుష్కర స్నానమాచరించనున్నారు. అనంతరం నందిగామ నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement