అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర | YS Jagan mohan reddy 6th day raithu bharosa yatra in ananthapuram | Sakshi
Sakshi News home page

అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర

Published Sun, Jul 26 2015 8:19 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర - Sakshi

అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర

అనంతపురం : అనంతపురం జిల్లాలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసాయాత్ర ఆరవ రోజు ముగిసింది. మడకశిర నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి వారిని ఓదార్చారు. పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని, రైతుల తరఫున పోరాడుతానని వైఎస్ జగన్ తెలిపారు.

దేవరహట్టిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అప్పుల బాధలు తాళలేక ఎస్ ఎస్ గుండ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబాన్ని కలిసిన ఆయన వారికి దైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ను అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement