raithu bharosa yatra
-
పరిపాలనకు బాబు యోగ్యుడేనా?
మూడేళ్లలో ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు: వైఎస్ జగన్ ♦ ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను అత్తగారి సొత్తులా లాక్కుంటున్నారు ♦ కరువు మండలాలను పేరుకు ప్రకటిస్తున్నా మేలు సున్నా ♦ ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఏదీ? ♦ మూడేళ్లలో ఒక్క ఇల్లూ కట్టించలేదు ♦ ఆరోగ్యశ్రీ, ఫీజుల పథకాలు నిర్వీర్యం ♦ వైఎస్ స్వప్నం బజారున పడే పరిస్థితి దాపురించింది ♦ కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ తొలి విడత ముగింపు రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు:‘‘రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన లెక్కలేనన్ని హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వ లేదు. పేదలకు ఒక్క ఎకరా భూమినైనా పంచలేదు. పైగా ఎస్సీ, ఎస్టీల భూములు ఆయన అత్తగారి సొత్తు అయినట్టు లాగేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలనకు యోగ్యుడేనా?’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలసి, ధైర్యం చెప్పేందుకు జగన్ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మంగళ వారం ఆరో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన వెంగళరెడ్డి పేట నుంచి బయలుదేరి బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదుగా మహానందికి చేరుకున్నారు. మహానందిలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం గాజులపల్లెకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో భారీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత ‘రైతు భరోసా యాత్ర’ మంగళవారం ముగిసింది. చివరి రోజు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. గాజులపల్లె బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... చంద్రబాబుతో పాటు వచ్చింది కరువే ‘‘ఈ మూడేళ్ల చంద్రబాబు పాలనను చూసిన తర్వాత... అయ్యో ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మాకు దూరమయ్యిందే, ఆ పాలన మాకు కరువయ్యిందే అని జనం అనుకుం టున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి జాడేలేదు. ఈ మూడేళ్లు చంద్రబాబుతో పాటు రాష్ట్రానికి వచ్చింది కరువు మాత్రమే. శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వాలంటే 844 అడుగులకు పైన నీళ్లు ఉండాలి. 844 అడుగులపైన ఆగస్టు 16వ తేదీ నుంచి ఉన్నాయి. అయినా ఇప్పటిదాకా సాగునీరు ఇవ్వలేకపోయారు. మనకు తెలుగుగంగకు రబీ పంటకు నీరు ఇవ్వబోమని చెబుతున్నారు. ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతీ సంవత్సరమూ రబీకి నీళ్లు అందాయి. ఇప్పుడు వరుసగా మూడేళ్లపాటు రబీకి నీళ్లు ఇవ్వబోమని పాలకులు సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. కేబినెట్ భేటీల్లో దుర్మార్గపు ఆలోచనలు మంత్రివర్గ సమావేశాల్లో రైతుల కష్టాలపై చర్చించరు. పేదవాడికి జరగాల్సిన మేలు గురించి మాట్లాడరు. రైతుల భూములను ఎలా లాక్కోవాలి? లాక్కున్న భూములను పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు, సింగపూర్ కంపెనీలకు ఇచ్చి కమీషన్లు ఎలా కొల్లగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనలను కేబినెట్ భేటీల్లో చేస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి తన పాలనలో 23 లక్షల మంది పేదలకు అక్షరాలా 31.25 లక్షల ఎకరాలను పంచిపెట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎస్సీ, ఎస్టీల భూములను తన అత్తగారి సొత్తులా భావిస్తున్నారు. పేదల భూములు, అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు వాటిని ఎలా లాక్కోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 31.25 లక్షల ఎకరాలను పేదలకు పంచగా, చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో ఒక్క ఎకరా కూడా ఇచ్చిన పాపానపోలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, వైఎస్సార్ హయాంలో కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీపడ్డారు. చంద్రబాబు మాత్రం మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. కుయ్.. కుయ్.. కుయ్.. ఇప్పుడేది? చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితిని గమనిస్తే మరింత బాధేస్తోంది. రాజశేఖర్రెడ్డి హయాంలో ‘108’ నంబర్కు ఫోన్ కొడితే చాలు కుయ్... కుయ్... కుయ్.. అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ ఇంటికొచ్చేది. ఇప్పుడు అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వైఎస్సార్ హయాంలో మూగ, చెవుడుతో బాధపడుతున్న చిన్నారులకు 12 ఏళ్లు వచ్చేదాకా రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఉచితంగా చేసేవారు. ఇవాళ మూగ, చెవుడు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయం అంటూ వెనక్కి పంపిస్తున్నారు. మూత్రపిండాలు ఫెయిలైన రోగులదీ, కేన్సర్ రోగులదీ అదే పరిస్థితి. వైఎస్ రాజశేఖర్రెడ్డి స్వప్నం బజారున పడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలనలో మంచి జరిగిందని ఎవరైనా చెప్పగలరా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో అన్నాడా? లేదా? రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని అన్నాడా? లేదా? డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడా? లేదా? (అన్నాడని ప్రజలంతా బిగ్గరగా బదులిచ్చారు) హామీల అమలు కోసం ప్రజలంతా చంద్రబాబును గట్టిగా నిలదీయాలి. అప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అవుతుందేమోనని ఆశిద్దాం. బాబు పచ్చి అబద్ధాలకోరు చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ, తానే చేశానని అంటున్నారు. కర్నూలు జిల్లాలోనే ముచ్చుమర్రి ప్రాజెక్టును చూశాం. వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యింది. మూడేళ్ల నుంచి మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తన కలలోకి వచ్చిందని, దాని కోసం చాలా కష్టపడ్డానని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి పాలనకు యోగ్యుడేనా అని అడుగుతున్నా. చంద్రబాబు రేపు పులివెందులకు వెళుతున్నారు. రూ.700 కోట్ల పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. చంద్రబాబు తన మనఃసాక్షిని ప్రశ్నించుకోవాలి. అసలు ఈ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చింది? ఈ ప్రాజెక్టును ప్రారంభించింది, పనులు చేసింది దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్లి పైడిపాలెం కూడా తన కలలోకి వచ్చిందని చంద్రబాబు చెబుతారేమో! ఇలాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది. అందరూ అడుగులో అడుగు వేసి, చేతిలో చేయి వేసి నాతోపాటు కలిసి నడవాలని కోరుతున్నా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో రెండోవిడత రైతు భరోసా యాత్ర ఈ నెల 19 నుంచి ప్రారంభమవనుంది. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ జగన్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అలాగే శ్రీ కోదండరాముల వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైఎస్ జగన్ను ఆశీర్వదించారు. – మహానంది -
ఆరో రోజూ..రైతు భరోసా యాత్ర
-
లాక్కోడానికి అవేమైనా అత్తగారి సొమ్ములా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రైతు భరోసాయాత్రలో భాగంగా మహానంది మండలం గాజులపల్లిలో ఆయన మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఎక్స్గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, మూడేళ్ల నుంచి ఇక్కడ కరువే కరువని జగన్ అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ హయాంలోప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు అందాయని, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 844 అడుగుల నీటిమట్టం ఉన్నా కూడా రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదన్నారు. కేబినెట్ సమావేశాల్లో కూడా రైతుల సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలనే విషయంపైనే మాట్లాడుతున్నారని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా నీరుగార్చారని జగన్ విమర్శించారు. 108, ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదని, కాక్లియర్ ఇంప్లాట్ల కోసం మూడేసి సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెడితే, చంద్రబాబు దాన్ని కూడా పక్కన పెట్టేశారన్నారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, విద్యార్థులతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తయ్యాయని, ఇప్పుడు చంద్రబాబు 5 శాతం మాత్రమే పనులు చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ తానే కట్టించినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని మనందరం ఒక్కటై బంగాళాఖాతంలో కలిపేద్దామని కర్నూలు వాసులకు ఆయన పిలుపునిచ్చారు. -
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
-
నందీశ్వరుడికి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు
మహానంది : కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మంగళవారం మహానంది మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మహానందీశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన జగన్ ఆర్చకులు ఘనస్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరో రోజుకు చేరిన విషయం తెలిసిందే. -
పసుపు పంటను పరిశీలించిన వైఎస్ జగన్
-
పసుపు పంటను పరిశీలించిన వైఎస్ జగన్
కర్నూలు : రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంగళవారం మహానంది జిల్లా శ్రీనగరంలో పసుపు, అరటి పంటలను పరిశీలించారు. మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపు, అరటి పంటకు గిట్టుబాటు ధర లభించిందని, ఇప్పుడు మాత్రం కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మహానంది చేరుకుంటారు. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది. -
వెంగళరెడ్డి పేట నుంచి వైఎస్ జగన్ యాత్ర
-
వెంగళరెడ్డి పేట నుంచి వైఎస్ జగన్ యాత్ర
కర్నూలు : జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి ఆరోరోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన మహానంది మండలం వెంగళరెడ్డి పేట నుంచి యాత్రను ప్రారంభించారు. రోడ్ షో బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదగా మహానంది చేరుకుంటుంది. అక్కడ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరుడి దర్శనాంతరం రోడ్ షో గాజులపల్లె వరకూ కొనసాగుతుంది. -
‘చంద్రబాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు’
-
లింగాపురం చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
కర్నూలు: జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆయన సోమవారం ఉదయం బండి ఆత్మకూరు మండలం లింగాపురం నుంచి అయిదోరోజు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు లింగాపురం చర్చిలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకూ రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్భాషా కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్ షో వెంగళరెడ్డి పేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బుక్కాపురం వరకూ రోడ్ షో చేపడతారు. -
బాబు గద్దెనెక్కాక వరుస కరువులే
ప్రజలంతా బాబు దిగిపోయే రోజు కోసం ఎదురు చూస్తున్నారు: వైఎస్ జగన్ ♦ రూ. 5 వేల కోట్లతో నిధి పెడతానని ఎన్నికల ముందు చంద్రబాబు కబుర్లు చెప్పారు ♦ ఇప్పుడు మద్దతు ధర అడిగితే ఉల్లి రైతులపై కేసులు ♦ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టదా? ♦ మోసగాళ్లను బంగాళాఖాతంలో కలిపేస్తామని అర్థమయ్యేలా చెప్పండి భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత రాష్ట్రానికి తెచ్చింది వరుసగా కరువే... కరువు. ఒకవైపు రైతులు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు బాధలు పడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పుణ్యాన రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తున్నారు. వృద్ధిరేటులో దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని ఉపన్యాసాలిస్తున్నారు. మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో నిధి పెడతామని మేం చెప్తే... మా కంటే ఎక్కువ చెబితే ఓట్లు వస్తాయని రూ.5 వేల కోట్లతో నిధి పెడతానని కబుర్లు చెప్పారు. ఇవాళ ఆదుకోమని ఉల్లి రైతులు రోడ్డు ఎక్కితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. కర్నూలు సోనా ధాన్యం బస్తా రూ.1,200కు అమ్ముకునే పరిస్థితి. మిర్చి ధర, పంట దిగుబడి తగ్గి రైతులు రోదిస్తున్నారు. టమోటోలు రోడ్డు మీద పోస్తున్నారు. అయినా పట్టించుకోని ఇలాంటి ముఖ్యమం త్రి ఎప్పుడు దిగిపోతాడా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. రైతులను ఆదుకోకపోతే డిపాజిట్లు కూడా పోతాయనే భయం రావాలి. అప్పటివరకూ అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇలాంటి దుష్టపాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి... అడుగులో అడుగు వేయండి. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర శ్రీశైలం నియోజకవర్గం లో నాలుగో రోజుకు చేరుకుంది. ఆయన వేల్పనూరు నుంచి బయలుదేరి చిన్నదేవుళా పురం, నారాయణపురం చేరుకున్నారు. అక్కడ పొలంలో మిర్చి రైతులతో ముచ్చటిం చారు. అక్కడి నుంచి సంతజూటూరు మీదు గా లింగాపురం, బీసీ పాలెంకు చేరుకున్నారు. ఈ రెండు గ్రామాల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అనంతరం సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠపురం మీదుగా ఈర్నపాడుకు చేరుకున్నారు. నాలుగో రోజు భరోసా యాత్ర ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మొత్తం 11.30 గంటలపాటు దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది... మనందరం రైతులం. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నవాళ్లం. రాష్ట్రంలో దాదాపుగా 65 శాతం జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి... రాష్ట్రం బాగుంటుంది. రైతు బాగుంటేనే కూలీలకు పనులు దొరుకుతాయి... గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు పరిపాలనలోకి వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ మూడేళ్లలో మీకు ఏమి మేలు జరిగిందని అడుగుతున్నా? ఆయనవల్ల మేలేమీ జరగకపోగా... ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా కరువే.. కరువు. మూడేళ్ల కిందట చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చునేందుకు... బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, రైతుల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి, నిరుద్యోగులకు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి... ఏ టీవీ ఆన్ చేసినా ఇవే మాటలు, ఏ గోడ మీద రాతలు చూసినా ఇవే రాతలు. చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు... రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను మోసం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 32 నెలలైంది... నెలకు రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి చొప్పున నాకు రూ.64 వేలు బాకీ ఉన్నాడన్నా... అని మొన్న విజయనగరం యువభేరిలో ఒక యువకుడు అడిగాడు. కనీసం ఆ పిల్లాడు మాటలైనా విని చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. బుద్ధి, సిగ్గు అన్నది ఏ మాత్రం ఉన్నా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రీయింబర్స్మెంట్ను జోక్గా మార్చేశారు పేదరికం పోవాలంటే కుటుంబంనుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని పేద విద్యార్థులను ఉచితంగా చదివించేందుకు నాన్న, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. చదువులకు పేదరికం అడ్డురాకూడదని ప్రతి పేద విద్యార్థికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. ఇవాళ ఇంజనీరింగ్లో లక్ష రూపాయలు, మెడికల్ కాలేజీల్లో రూ.11 లక్షలు ఫీజులుంటే... చంద్రబాబు ప్రభుత్వం ముష్టి వేసినట్టు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగతా ఫీజు కట్టేందుకు ఇంట్లో ఉన్న ఆస్తులు, పొలాలు అమ్మాల్సి వస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది ఒక జోక్గా మార్చేశారు. ఇక ఇళ్ల సంగతి సరేసరి. కొత్త ఇళ్లు కాదు కదా.. గతంలో కట్టిన గోడలకు కూడా బిల్లులివ్వడంలేదు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయలేదు. అందరినీ మోసం చేశారు. ఇలాంటి మానవత్వంలేని ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పాలనను సాగనంపేందుకు చేయి చేయి కలపండి. అడుగులో అడుగు వేయండి. మోసం చేసేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని అర్థమయ్యేలా చెప్పాలి. కమీషన్ల కోసమే కేబినెట్...! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం గా ఉంది. రబీలో పంటలు వేసిన రైతులకు వ్యవసాయ రుణాలు రూ.24 వేల కోట్లు, టర్మ్ రుణాల కింద మరో రూ.9,800 కోట్లు ఇవ్వాలి. కానీ కేవలం రూ.4,900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా రు. అయినా చంద్రబాబు కేబినెట్ మీటింగు ల్లో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఏ రైతు నుంచి ఎంత భూమి గుంజుకుం దాం? ఎంత కమీషన్ తీసుకుని ఎవరికి ఇద్దామనే ఆలోచిస్తున్నారు. రైతుల రుణా లకు సంబంధించి బ్యాంకులు ఇచ్చింది పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా? అని అడుగుతున్నా. రైతుల పరిస్థి తి ఎంత దారుణంగా ఉదంటే... ఉల్లి కేజీ 2 రూపాయలకు కూడా అమ్ముకోలేక పొలంలోనే వదిలేసి వ్యవసాయాన్ని నిలిపి వేస్తున్నారు. టమోటా, మిరప, ధాన్యం పరిస్థితి అంతే. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కర్నూలు సోనా బస్తా రూ.1,200కు కూడా కొనే నాథుడు దొరకడం లేదు. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నాలు చేస్తే వారి మీద కేసులు పెడుతున్నారు. చంద్రబాబు పుణ్యా న రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటు న్న పరిస్థితి. కానీ వృద్ధిరేటులో రాష్ట్రం దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని చంద్ర బాబు ఉపన్యాసాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసు కుంటే... కేవలం నలుగురంటే నలుగురికే నష్టపరిహారం ఇచ్చారు. గ్రామంలో ఎవరైనా చనిపోతేనే మళ్లీ కొత్త పింఛను ఇస్తామంటున్నారు. -
ఆయనొచ్చాక మూడేళ్లుగా కరువే కరువు
-
మూడేళ్లుగా కరువే కరువు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా లింగాపురంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, రైతులు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది రైతు బాగుంటే రైతు కూలీలకు కూడా పనులు దొరుకుతాయి, గ్రామీణ వ్యవస్థ పరిగెత్తే పరిస్థితి వస్తుంది చంద్రబాబు పాలనలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది ఈ మూడేళ్లలో మనకు ఏం మేలు జరిగిందని చంద్రబాబును ప్రశ్నించమని అడుగుతున్నా ఆయనవల్ల మేలు జరగకపోగా వరుసగా ఇప్పటికి మూడేళ్లు కరువే కరువు చంద్రబాబు సీఎం అవ్వడం కోసం ఆ రోజుల్లో.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అనేవారు రైతులను వదల్లేదు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెళ్లనూ వదల్లేదు ఏ గోడమీద రాతలు చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా.. డ్వాక్రా సంఘాలను తానే కనిపెట్టానని చెప్పేవారు డ్వాక్రా సంఘాల అప్పులన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేవారు రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు చివరకు చదువుకుంటున్న పిల్లలను సైతం వదల్లేదు జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు చివరకు బాబు ముఖ్యమంత్రి అయ్యారు రైతులు, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చదువుకున్న పిల్లలను మోసం చేశారు చంద్రబాబు సీఎం అయ్యి 32 నెలలైంది.. ఆయన నాకు 64వేలు బాకీ అని ఓ యువకుడు అడిగారు తాను ఎవరికి చెప్పుకోవాలని అడిగాడు కనీసం ఆ పిల్లాడు మాట్లాడిన మాటలకైనా చంద్రబాబుకు కాస్తో కూస్తో జ్ఞానోదయం అవుతుందేమో, బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా వస్తాయేమోనని ఆశగా ఎదురుచూశాం రబీ పంటలు వేశాం. కానీ రైతులు బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నారు పంట రుణాలు 24వేల కోట్లు, టెర్మ లోన్స్ మరో 9800 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే, రబీ పంటకు చంద్రబాబు పుణ్యమాని కేవలం 4900 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు మరి ఈ ముఖ్యమంత్రి బ్యాంకులను నిలదీయాల్సింది పోయి, క్యాబినెట్ మీటింగులో రైతుల గురించి మాట్లాడలేదు బయటకొచ్చాక బ్యాంకులిచ్చింది సంతృప్తికరంగా ఉందని చెప్పారు ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయడానికి అర్హుడా అని అడుగుతున్నా రైతులు ఉల్లిపంట వేసి.. కిలో 2 రూపాయలు కూడా గిట్టక పొలంలోనే వదిలేశారు గిట్టుబాటు ధర కోసం రైతులు ధర్నా చేస్తుంటే వాళ్లమీద పోలీసు కేసులు పెట్టిస్తున్నారు ఉల్లి, టమోటా, మిర్చి, చివరకు ధాన్యం పరిస్థితి కూడా అంతే కర్నూలు సోనా అనేది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధాన్యం కానీ ఆ ధాన్యం బస్తా 1250-1300 కూడా కొనే నాథుడు దొరకడం లేదు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి రైతులు అవస్థలు పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తాడు రాష్ట్రం జీడీపీ గ్రోత్రేటులో దేశం కన్నా ముందు పరిగెడుతోందని చెబుతారు ఈ పాలనను సాగనంపేందుకు మీ అందరూ చేయి చేయి కలపాలి అడుగులో అడుగు వేయాలి.. చంద్రబాబు లాంటి మోసకారులు, అబద్ధాలు ఆడేవాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి వస్తుందని అర్థం కావాలి అంతవరకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నా -
దిగులు గుండెకు..ఆత్మీయ అండ
-
వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. శనివారం ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించిన వైఎస్ జగన్.. బోయరేవులు చేరుకున్నారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బ్యాంకులో రూ. 30వేలు అప్పు చేసిన చాకలి వెంకటేశ్వర్లు.. ప్రైవేటుగా వడ్డీ వ్యాపారి వద్ద రూ. మూడు లక్షల 70వేలు అప్పు చేశారు. పంట చేతికి అందకపోవడం, ఈ అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోవడం, చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఆయన తనువు చాలించారు. రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఓదార్చి.. ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా లింగాపురం చేరుకుంటారు. -
వెంకటేశ్వర్లు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
-
‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’
కర్నూలు : జిల్లాలో రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ఈ యాత్ర మూడోరోజుకు చేరింది. ఆయన ఈ సందర్భంగా వేల్పనూరులో మాట్లాడుతూ రైతులు, నిరుద్యోగులు, మహిళలను చంద్రబాబు నాయుడు మోసగించారని ధ్వజమెత్తారు. ‘ చంద్రబాబు రుణమాఫీ మాటే మరిచిపోయారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇక బుడ్డా శేషారెడ్డి కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చుపెట్టారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారు. బుడ్డా శేషారెడ్డికి అన్నివిధాలుగా అండగా ఉంటా. అందరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు. (కాగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కర్నూలు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఇటీవలే టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.) -
వేల్పనూరు నుంచి మూడోరోజు రైతు భరోసా యాత్ర
కర్నూలు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్ర మూడోరోజుకు చేరింది. వైఎస్ జగన్ ఈరోజు ఉదయం వెలుగోడు మండలం వేల్పనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. గ్రామం నుంచి రోడ్ షో గా అబ్దుల్లాపురం, వెలుగోడు మీదగా బోయరేవులు చేరుకుంటారు. అక్కడ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం మోత్కూరు, తిమ్మనపల్లి, బండిఆత్మకూరు మండలంలోని చిన్నదేవలాపురం, నారాయణపురం, సంతజూటూరు మీదగా రోడ్ షో లింగాపురం చేరుకుంటుంది. -
40 మంది మరణిస్తే.. నలుగురికే పరిహారమా?
కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం నలుగురికి మాత్రమే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని గౌడ్ సెంటర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... రైతు భరోసా యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాకు వచ్చి, అందులో భాగంగా ఆత్మకూరుకు వచ్చి మీ అందరి ప్రేమాభిమానాల మధ్య నిలుచున్నా ఇదే కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ ఇంతవరకు కర్నూలు జిల్లాలో ఎంతమందికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారని చంద్రబాబును నిలదీసి అడుగుతున్నా కేవలం నలుగురికి మాత్రమే ఆ ఎక్స్గ్రేషియా ఇచ్చారు రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు, రైతులకు తోడుగా నిలబడే పరిస్థితి లేదు రైతుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీవీలలో చెప్పేవారు, గోడల మీద రాసేవారు రైతన్నలను మోసం చేశారు, ఆడవాళ్లని కూడా చూడకుండా డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా మోసం చేశాడు చదువుకునే పిల్లలను కూడా వదల్లేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎన్నికలయ్యాయి.. చంద్రబాబు సీఎం జాబ్ తీసుకుని కుర్చీలో కూర్చున్నారు రైతన్నల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ అయ్యాయా? రైతులను, పిల్లలను కూడా చంద్రబాబు మోసం చేశారు చంద్రబాబు చెప్పారు కాబట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు కట్టలేదు రైతులకు ఇంతకుముందు లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీ మాత్రమే పడేది లక్ష నుంచి మూడు లక్షల వరకు కేవలం పావలా వడ్డీ పడేది ఇప్పుడు బ్యాంకులు రైతుల నుంచి రూపాయిన్నర వడ్డీ వసూలు చేస్తున్నాయి ఈవాళ రైతులు రుణాలు కట్టకుండా పోయినందుకు రుణాలు రెన్యువల్ కాలేదు, ఇన్సూరెన్స్ కూడా రావట్లేదు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి లేదు రబీ లెక్కలు చూస్తే.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులన్నీ కలిపి రైతులకు 24వేల కోట్ల పంట రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, 9800 కోట్ల టెర్మ్ లోన్స్ ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇచ్చింది కేవలం 4900 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు బ్యాంకుల దగ్గరకు రైతులు వెళ్లే పరిస్థితి లేదు. రైతులకు రుణాలు దొరక్క రబీ వేసుకోడానికి దిక్కులేక బయట 2, 3 రూపాయల వడ్డీకి తీసుకుంటున్నారు రబీ మొత్తానికి 24 లక్షల హెక్టార్లలో పంటలు వేయాలి. కానీ ఈసారి వేసింది కేవలం 11.9 లక్షల హెక్టార్లు మాత్రమే అంటే 48 శాతం కూడా పంటలు వేయలేకపోయారు ఇంతటి దారుణంగా రైతులు బతుకుతుంటే, చంద్రబాబు కేబినెట్ మీటింగులలో రైతులకు ఏం చేయాలో పట్టించుకోరు, పేదలు ఎలా ఉన్నాడో పట్టించుకోరు ఆరోగ్యశ్రీ పథకం విఫలమై నెలల తరబడి నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు కట్టక ఆ పథకం నీరసించిపోయింది డయాలసిస్ చేయించుకోవాల్సిన పేషెంట్లను ఏడాది తర్వాత రమ్మని ఆస్పత్రులు చెబుతున్నాయి చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ను జోక్గా తయారుచేశారు పేదలు అప్పులపాలు కాకుండా ఉండాలంటే ఆ పేదల కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి ఆలోచన చేశారు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు లక్షకుపైగా ఉన్నాయి. మెడికల్ కాలేజిలో ఏడాదికి 11 లక్షలు చెబుతున్నారు. కానీ వీళ్లిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ ముష్టి 35 వేలు ఆ రోజుల్లో వైఎస్ అయితే ప్రతి పైసా పూర్తిగా ఇచ్చేవారు కేబినెట్ సమావేశాల్లో కూర్చున్నప్పుడు రైతులకు, పేదలకు ఏం చేస్తున్నారో చంద్రబాబు ఆలోచించరు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు తోడుగా నిలబడ్డారు కేబినెట్ మీటింగులో చంద్రబాబు రైతుల నుంచి భూములు ఎలా లాక్కోవాలి, వాటిని కమీషన్లు తీసుకుని ఎవరికి అమ్మాలని మాత్రమే ఆలోచిస్తున్నారు నిన్న శ్రీశైలం డ్యాం ఇంజనీర్లను.. డ్యాంలో 844 అడుగుల పైన ఎన్నిరోజులున్నాయని అడిగా ఆగస్టు 16 నుంచి 844 పైనే ఉన్నాయని వాళ్లు చెప్పారు. కానీ వాటి నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు వదిలే పరిస్థితి లేదు ఏ ప్రాజెక్టు చూసినా సగంలోనే ఆగిపోయాయి గాలేరు-నగరి, కేసీ కెనాల్ మరమ్మతులు అన్నీ సగంలోనే ఆగాయి రైతు భరోసా యాత్ర చేస్తే.. రైతులు ఎలా బతుకుతున్నారో తెలుస్తోంది ఇదే కర్నూలు జిల్లాలో ఉల్లి కిలో 2 రూపాయలకు అమ్మలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు టమోటా కిలో 2 రూపాయలకు అమ్ముకోలేక వదిలేస్తున్న దుస్థితి కర్నూలు జిల్లాలోనే ఉంది మిరప పంటకు 7వేల ధర పలుకుతోందని, అది పెట్టుబడులకు కూడా చాలదని రైతులు వాపోతున్నారు రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు కనీసం ఇప్పటికైనా చంద్రబాబుకు రైతులు పడుతున్న బాధలు అర్థం కావాలని ప్రయత్నిస్తున్నా ఈవాళ ఇదే చంద్రబాబుకు రాబోయే రోజుల్లో బుద్ధి రావాలంటే ఆయన గాజు మేడల నుంచి బయటకొచ్చి, సామాన్యులతో తిరిగితే ఆయనను రాళ్లతో కొడతారని అర్థమవుతుంది ఇదే చంద్రబాబుకు ఒక్క విషయం గట్టిగా చెబుతాను ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు డబ్బుల ఆశ చూపించి కొనుగోలు చేశారు ఇదే జిల్లా నుంచి ఐదుగురిని కొనుగోలు చేశారు చంద్రబాబు గారూ, రేపు మీరు గెలవాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొంటే చాలదు.. ప్రతి పేదవాడికి మంచి చేస్తే, ప్రతి పేదవాడి ఇంట్లో నీ ఫొటో ఉండేలా చేసుకో, అప్పుడు గెలుస్తావని చెబుతున్నా చంద్రబాబు నాయుడి నైజం ఈవాళ ఎంత డబ్బు సంపాదించాం, ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం, రాజకీయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టించాం అని చూస్తున్నారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పేవారు అలాంటి గొప్ప నాయకుడు పాలించిన ఆంధ్ర రాష్ట్రంలో ఈవాళ ఇలాంటి దిక్కుమాలిన నాయకుడు పాలిస్తున్నాడు రైతుల కష్టాలు చంద్రబాబుకు రాబోయే రోజుల్లో మరింత అర్థమయ్యేలా రైతన్నలతోనే చెప్పిస్తాం రుణమాఫీలో రైతులు, డ్వాక్రా మహిళలు ఎంత నష్టపోయారో, ఎంత మోసపోయారో చెప్పిస్తాం చదువుకున్న ప్రతి పిల్లవాడి చేతికి మైకిచ్చి, ఎన్నికలకు ముందు, తర్వాత చంద్రబాబు ఏమన్నారో చెప్పిస్తాం మనమంతా ఒక్కతాటిమీద నిలబడి చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని ప్రతి ఒక్కరికి చేతులు జోడించి, పేరు పేరునా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా మీ అందరి చల్లని ఆశీస్సులకు పేరుపేరునా కృతజ్ఞతలు -
‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
-
‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
దోర్నాల: అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ప్రకాశం జిల్లా దోర్నాలలో ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయ్యాక...రాష్ట్రంలో వరుసగా కరువులొచ్చాయని వైఎస్ జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ముష్టి వేసినట్లు రూ.100 కోట్లు ఇచ్చారని, ఆ నిధులు ఏ మూలకు చాలవని, ఆ నిధులతో ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. హెడ్ రెగ్యులేటరీ పనులను ఇప్పటివరకూ ప్రారంభించనే లేదని, రైతులపై కాకుండా చంద్రబాబుకు కాంట్రాక్టర్లపై ప్రేమ ఉందని, డబ్బు...డబ్బు...డబ్బు... తప్ప చంద్రబాబుకు ఏమీ అవసరం లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మూడేళ్ల పాలన పూర్తయిందని, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని, అ తర్వాత కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం' అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరినవారు రాజీనామా చేయాలని లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సీఎంగా గెలవాలంటే ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లాక్కోవడం కాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ 42 లక్షల ఇళ్లు నిర్మిస్తే...చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ నాటి సువర్ణయుగం మళ్లీ రావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అలాగే వెన్నుపోటు నేతలను బంగాళాఖాతంలో కలపాలని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని ఆయన కోరారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. -
4నుంచి వైఎస్ జగన్ రైతుభరోసా యాత్ర
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఈ నెల 4వ తేదీ నుంచి రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో భరోసా నింపడమే ఈ యాత్ర ఉద్దేశమన్నారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు పూర్తిగా సాగు సంక్షోభంలో ముగినిపోయాయని, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో వృద్ధి రేటు బాగుందని చెప్పి కేంద్ర నిధులు కూడా రాకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నిర్వాకంతో వ్యవసాయ రంగం కుదేలవుతోందని నాగిరెడ్డి విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముచ్చుమర్రి లిప్ట్ ఇరిగేషన్ పథకం పనులను వైస్ రాజశేఖరరెడ్డే తొంభై శాతం పనులు పూర్తి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. -
4నుంచి వైఎస్ జగన్ రైతుభరోసా యాత్ర
-
అబద్ధాలతోనే నడుస్తున్న ప్రభుత్వం
రైతు భరోసాయాత్రలో బాబుపై మండిపడ్డ వైఎస్ జగన్ సాక్షి, కడప: ‘‘ఎన్నికలకు ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడచూసినా ప్రచారం కోసం పాకులాడటం.. తర్వాత మాట తప్పడం ఆయనకు నైజంగా మారింది. ముఖ్యమంత్రిగా అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దకుడాల, తాటిమాకులపల్లె, ముద్దప్పగారిపల్లె, ఎర్రగుడి తదితర గ్రామాల్లో మహిళలు, వృద్ధులు పింఛన్లతోపాటు డ్వాక్రా రుణమాఫీ సక్రమంగా అమలుచేయలేదని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. చివరకు పంట రుణాలు కూడా సక్రమంగా మాఫీ చేయలేదనడంతో ఘాటుగా స్పందించారు. రుణమాఫీ, డ్వాక్రామాఫీ జరగలేదని.. చివరకు పండుటాకులకు అందించే పింఛన్ల విషయంలో కూడా కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని.. టీడీపీ నేతలకు మాత్రం చంద్రబాబు కావాల్సినంత దోచిపెడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఉన్నారు. రెండు కుటుంబాలకు పరామర్శ వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాక.. ఉన్న పొలాలను అమ్ముతున్నా అప్పులు తీరక.. మానసిక వేదనతో బలవన్మరణం చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పరామర్శించారు. ముందుగా లింగాల మండలంలోని పెద్దకుడాల గ్రామానికి వెళ్లి రైతు మంజుల చలపతి కుటుంబసభ్యులను , అనంతరం చక్రాయపేట మండలంలోని ముద్దప్పగారిపల్లెకు చెందిన రైతు శుద్ధమల్ల చెన్నారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. -
చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ దాడులు'
అనంతపురం: టీడీపీ దాడులపై ఆదివారం అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ దాడుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ధర్నా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ అనంతపురం జిల్లాలో నేడు వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ ధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు, టీడీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ దౌర్జన్యాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎండగట్టారు. తాగుబోతులతో వైఎస్ జగన్ యాత్రకు ఆటంకం కలిగించే యత్నం చేస్తున్నారంటూ వారు దుయ్యబట్టారు. చంద్రబాబు దౌర్జన్యాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. రైతుల్లో మనోస్థైరం కల్పించేందుకు వైఎస్ జగన్ చేస్తున్న రైతు భరోసా యాత్రను టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. -
చంద్రబాబుకు చెప్పులు కాదు చీపుర్లు చూపించండి
అనంతపురం: ప్రజలను మోసం చేస్తున్న, అబద్ధాలాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అన్నారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా ఐదోరోజు ఆదివారం ఓబులదేవరచెర్వులో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మోసం చేసినా, జేబులు కొట్టినా 420 కేసులు పెడతారని, మోసం చేసి సీఎం పదవిలో కూర్చున్న చంద్రబాబుపై ఏం కేసు పెట్టాలని ప్రశ్నించారు. 'మోసం చేస్తున్న చంద్రబాబును నిలదీయకూడదట, అడగకూడదట. ఆయన మాత్రం మోసం చేయొచ్చంట. ఏమైనా చేయొచ్చంట. అలాంటి వ్యక్తికి జ్ఞానోదయం కావాలంటే ఏం చేయాలి? చంద్రబాబుకు చెప్పులు చూపించడం ఇష్టంలేదట. ఈ సారి చెప్పులు కాదు.. చీపుర్లు చూపించండి. చంద్రబాబు సర్కార్ను బంగాళాఖాతంలో కలిపేవరకు ఉద్యమిద్దాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేయాలి. ప్రభుత్వం పనిచేయాలంటే ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలి' అని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలనుకోవడం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్ సీపీ నాయకులు అంజాద్ బాషా, సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు వైఎస్ జగన్పై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబుకు ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రైతు భరోసా యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. -
రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ యత్నం
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ నాయకుల కుయుక్తులను ప్రజలు ఖాతరు చేయడం లేదు. రైతు భరోసా యాత్రకు జనం భారీగా తరలివస్తున్నారు. ప్రతీ పల్లెలో వైఎస్ జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ నాయకుల పన్నాగం పారకపోవడంతో కవ్వింపు చర్యలతో రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారు. రైతు భరోసా యాత్ర ఐదో రోజు కదిరి నుంచి ప్రారంభమైంది. -
వైఎస్ పట్టా ఇచ్చారు.. బాబు భూమి లాక్కున్నారు
వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా, కారుచౌకగా తమ భూములను లాక్కొందని తమ పరిస్థితి ఏంటంటూ రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు ఏమన్నారో వాళ్ల మాటల్లోనే... వైఎస్ చేతుల మీదుగా పట్టా తీసుకున్నా మాకు 15 ఎకరాలు ఉంది. నలుగురు అన్నదమ్ములున్నారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు ఎకరాల చొప్పున భూమి వచ్చింది. 50 సంవత్సరాల నుంచి మా మామగారి కాలం నుంచి ఈ భూముల్లో సాగు చేస్తున్నాం. ఈ భూములకు సంబంధించి పత్రాలు, పన్నులు చెల్లించిన పేపర్లు ఉన్నాయి. అప్పులు చేసుకుని బోర్లు వేశాం, కరెంట్ వేశాం. దివంగత వైఎస్ఆర్ కాలంలో మాకు పట్టాలు ఇచ్చారు. వైఎస్ఆర్ నుంచి నేనే స్వయంగా పట్టా తీసుకున్నా. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు పంటలు పండుతాయి. మాకు సెంటు భూమి కూడా లేకుండా మొత్తం తీసేసుకున్నారు. మేం ఇవ్వమన్నా అధికారులు నోటీసులు పంపుతున్నారు. సోలార్ ప్రాజెక్టులో మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. సెంటు భూమి లేదు. మేం ఎట్లా బతికేది? పరిహారం కూడా పూర్తిగా ఇవ్వలేదు. అడిగితే ఇస్తామని సంవత్సరం నుంచి చెబుతున్నారు. చంద్రబాబు గారు దయచేసి మా కన్నీళ్లు తుడవండి, మా పిల్లల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. -అమ్మాజాన్ పరిహారం కూడా ఇవ్వలేదు నాకు నాలుగు ఎకరాలు సాగుభూమి ఉంది. ఇవ్వనన్నా భూములను బలవంతంగా లాక్కున్నారు. వరి, వేరుశెనగ పంటలు పండిస్తాం. బోరు, పైపులైన్లు ఉన్నాయి. మాకు ఈ భూమే ఆదరవు. ఇది తప్ప వేరే ఏమీ లేవు. మా భూము లాక్కొని మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారు. తక్కువ ధరలకు భూములు తీసుకున్నారు. పరిహారం కూడా ఇవ్వలేదు. మేం బతికేది ఎట్లా? -హైదర్ అలీ మామిడిచెట్లకు పరిహారం ఇవ్వరట మా నాయన 10 ఎకరాలు సంపాదించాడు. కేరళ, ముంబై వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఐదు బోర్లు వేసుకున్నాం. బోర్లు ఉన్నాయి. నీళ్లు వస్తున్నాయి. మామిడి చెట్లు పెంచాం. పంటకు వస్తున్నాయి. బోర్లకు డబ్బులు ఇస్తామన్నారు. మామిడి చెట్లకు ఇవ్వమని చెప్పారు. ఇష్టంలేకున్నా భూములు తీసుకున్నారు. నోటీసులు ఇచ్చారు. కానీ పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పడు నా పరిస్థితి ఏమిటి? -బాబు జాన్ -
నీళ్లు పారే భూములనే సోలార్ ప్లాంటుకు ఇవ్వాలా?
రాయలసీమలో సాగునీటి వసతి ఉండి.. పంటలు పండటమే కష్టమని, అలాంటిది కాస్తో కూస్తో నీటి వసతి ఉండి.. పంటలు పండే భూములనే సోలార్ పవర్ ప్లాంటుకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు భరోసాయత్రలో భాగంగా నాలుగో రోజు ఆయన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పీ కుంట గ్రామంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఇలా భూములు లాక్కున్నా.. కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇక్కడివాళ్లకు సోలార్ పవర్ ప్లాంటులో ఉద్యోగాలు ఇవ్వలేదేమని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... సోలార్ ప్లాంటు పెట్టడం కోసం భారీ మొత్తంలో భూములను ఎన్టీపీసీకి ప్రభుత్వం ధారాదత్తం చేసింది. 7500 ఎకరాల్లో 750 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంటు పెడతామని, ఎన్నో ఉద్యోగాలు వస్తాయని అన్నారు ఒక్కరంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇవ్వడం లేదు సోలార్ పవర్ ప్రాజెక్టు ఇక్కడే ఉంటే.. ఇక్కడివాళ్లకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు? అలాంటప్పుడు ప్రాజెక్టుకు భూములు ఎందుకు ఇవ్వాలి ఆ భూములకు ఒకవైపు పెద్దపల్లి రిజర్వాయర్, మరోవైపు వెలిగొండ రిజర్వాయర్ ఉన్నాయి. భూమి మధ్యలో నుంచి హంద్రీనీవా కాలువ పోతూ ఉంటుంది సీమలో పంటలు పండని పరిస్థితిలో.. కాస్తో కూస్తో పండే భూములే అవి అక్కడే ఆ భూములే ఇవ్వడంలో అర్థమేముంది ప్రభుత్వానికి రవ్వంతైనా తెలివి ఉందా ఈ భూముల్లో దాదాపు 2220 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్నాయి వీటిని భూములు లేని పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చారు పేదవాడి భూములంటే చంద్రబాబు ఆయన అత్తగారి సొత్తనుకుంటారు 153 ఎకరాల పట్టాభూమికి రూ. 3.25 లక్షలు ఇస్తారు ఎసైన్డ్ భూములకు కేవలం రూ. 2.10 లక్షలు ఇస్తే సరిపోతుందంటారు పేదవాళ్లంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం.. వాళ్ల భూములు భూములు కావా పేదలు కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ ఇవ్వాలి లేదా సమానంగానైనా ఇవ్వాలి 1250 ఎకరాలను సాగుదారు రైతులు కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్నారు వాటికి పన్నులు కడుతున్నారు, బోర్లు వేశారు, కరెంటు బిల్లులు కడుతున్నారు వాళ్ల పేరుతో పట్టాలిచ్చి ఆదుకోవాల్సింది పోయి నీళ్లున్నచోట సోలార్ ప్రాజెక్టు పెట్టడం ఏంటి వీళ్లకు ఆ లక్ష రూపాయలలో రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు సర్వేలు, నోటీసులు అంటారు.. ఇంకొకటి అంటారు గానీ పరిహారం మాత్రం ఇవ్వరు ఎన్టీపీసీ వాళ్లు భూమలు మొత్తాన్ని చదును చేసేసి.. అక్కడ సోలార్ ప్యానళ్లు కూడా పెట్టేశారు ఇప్పుడు పక్క రైతులు ఆ భూములు మీవేనని చెబితే పరిహారం ఇస్తామంటారు చంద్రబాబుకు ఏమైనా బుద్ధి, జ్ఞానం ఉన్నాయా అని అడుగుతున్నా అసైన్డ్ భూములు కొనుక్కున్న , సాగుదారు రైతుల తరఫున అడుగుతున్నా ఇచ్చే 3.25 లక్షలే తక్కువ.. కనీసం దాన్నే అందరికీ అయినా వర్తింపజేయాలి రైతుల తరఫున పోరాడతాం, వారికి తోడుగా, బాసటగా ఉంటాం అనంతరం ఎన్పీ కుంటలో సోలార్ ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన వైఎస్ జగన్ ను పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. -
కదిరి నుంచి ప్రారంభమైన జగన్ రైతు భరోసా యాత్ర
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, వారికి భరోసా కల్పించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన ఐదోవిడత రైతు భరోసా యాత్ర నాలుగోరోజు శనివారం ఉదయం కదిరిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఆయన గాండ్లపెంటకు చేరుకోగా... పజలు ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేశారు. అక్కడి నుంచి ఎన్పీ కుంట దిశగా సాగిపోయారు. ఎన్పీ కుంట మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి పరిహారం లభించని బాధిత రైతులతో జగన్ సమావేశం కానున్నారు. -
యాడికిలో రైతు భరోసా యాత్ర ప్రారంభం.. ఉద్రిక్తత
అనంతపురం జిల్లా యాడికి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ఈ యాత్రను అడ్డుకునేందుకు టీడీపీకి చెందిన ఎంపీపీ వేలూరు రంగయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. బస్టాండ్ సెంటర్లో రెండుపార్టీల శ్రేణులు ఎదురుపడ్డాయి. దీంతో ఘర్షణలకు తావులేకుండా చూసేందుకు పోలీసులు టీడీపీ శ్రేణులను వెనక్కి పంపారు. దీనికి నిరసనగా టీడీపీ నాయకులు బస్టాండ్ సెంటర్లో బైఠాయించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ రోడ్డుషో ఆలస్యం అయ్యింది. టీడీపీ శ్రేణులను పూర్తిగా పంపించిన తర్వాతే రోడ్డుషోకు లైన్ క్లియర్ అవుతుందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు భారీగా మోహరించి, 144 సెక్షన్ అమలు చేశారు. -
తాడిపత్రిలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు గురువారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉదయం పెద్ద ఒడుగూరు మండలం పెద్దమేడిమాకులపల్లి నుంచి ఆయన రోడ్డు షో ప్రారంభమైంది. లక్ష్మింపల్లిలో ప్రజలు తమ అభిమాన నేత జగన్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ వారికి అభివాదం చేశారు. అనంతరం జగన్ కిష్టిపాడు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు నాగరాజు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి యాడికి మండలం నగురూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను పరామర్శిస్తారు. -
ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర
-
ముగిసిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నాలుగో విడత రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో మంగళవారం ముగిసింది. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటించారు. మొత్తం 28 మంది, రైతు చేనేత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ఈ పర్యటనలో రైతుల సమస్యలు ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాలో గ్రామాగ్రామాన వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. -
రామాంజనేయులు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
ఆరో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
-
ఆరో రోజు వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర
అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆర్డీటీ గెస్ట్హౌస్ నుంచి వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. సిండికేట్ నగర్, రాచానపల్లిలో వైఎస్ జగన్కు అక్కడి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తొలుత కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఆ తరువాత కోనాపురం గ్రామంలో రైతు నరేంద్ర కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. అనంతరం పాతపాలెంలో రైతు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
ఐదోరోజు రైతు భరోసా యాత్ర
-
మారుతి ప్రసాద్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
అనంతలో ఐదవ రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
అనంతలో ఐదవ రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఉప్పరపల్లి, ఎర్రగుంట, కొడిమి గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలం బండమీదపల్లిలో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. -
వైఎస్ జగన్ మూడో రోజు రైతు భరోసా యాత్ర
-
చంద్రబాబూ ఇదేం దగా..?
-
చంద్రబాబూ ఇదేం దగా..?
రైతు భరోసా యాత్రలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి * చంద్రబాబు పాలన అంతా మోసం.. మోసం.. * అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి * అవ్వా తాతల జీవితాలతోనూ ఆడుకున్నారు * బాబు సీఎం అయ్యారు కానీ నిరుద్యోగులకు జాబు రాలేదు * ఆయన వచ్చాక ధర్మవరంలోనే 16 మంది చేనేతల ఆత్మహత్య * ఇప్పటికైనా బాబుకు జ్ఞానోదయమైతే మేలు రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనంతా మోసం, దగాలతో కొనసాగుతోంది. ఎన్నికల తరువాత ఈ 20 నెలలుగా ఆయన రైతులు, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలు, చేనేతలు, చదువుకునే పిల్లలు, చివరకు అవ్వా తాతలను సైతం వద లకుండా అన్ని వర్గాలనూ మోసం చేశారు.’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని, ఆయన అందరినీ మోసం చేశారనే సత్యం ఇవాళ కళ్ల ముందు కనిపిస్తోందని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన నాల్గో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు గురువారం కూడా ధర్మవరంలో కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వేస్టేషన్కు ఎదురుగా చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. గంటకు పైగా చేనేతలతో గడిపి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ‘చేనేత కార్మికులకు చంద్రబాబు చేసింది సున్నా... వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం చేసిందే లేదు. ఎవరి జీవితాలూ బాగోలేవు. అందరి బతుకుల్లోనూ బాధలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పరిపాలన వచ్చిన తర్వాత పడుతున్న కష్టాలేమిటనేది చేనేతలను చూస్తే అర్థమౌతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. ధర్మవరంలోనే 16 మంది ఆత్మహత్య చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 20 నెలల కాలంలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, బహుశా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే ఇలా జరిగి ఉండదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు చేనేత కార్మికులు తమ బాధలను వివరించినపుడు జగన్ స్పందిస్తూ..‘చంద్రబాబుకు అర్థమయ్యే విధంగా సమస్యలన్నింటినీ ఇక్కడి నుంచి చెప్పగలిగాం. ఆయనలో మార్పు వచ్చి మంచి చేస్తాడని ఆశిద్దాం. మార్పు రాని పక్షంలో దేవుడు కచ్చితంగా ఆయనకు మొట్టికాయలు వేస్తాడు. ఆయన బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు త్వరలోనే వస్తుందని కూడా చెబుతున్నా. ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. మన పరిపాలన వచ్చే రోజులు వస్తాయ’ని అన్నారు. మోసం చేసే క్రమంలో బాబు వయోవృద్ధులైన అవ్వాతాతలను కూడా వదలలేదని, పింఛన్లు తక్కువ మందికిచ్చి ఎక్కువ మందికి కత్తిరించేశారని విమర్శించారు. రేషన్ బియ్యం ఇవ్వాలని అవ్వాతాతలు అడిగితే ‘మీ వేలి ముద్రలు మిషన్లో సరిగ్గా పడ్డంలేదు’ అంటూ బియ్యాన్ని కూడా కట్ చేశారన్నారు. ‘ఎన్నికల ముందు ఏ హామీలిచ్చాను.. ఇపుడు పరిపాలన ఎలా చేస్తున్నాను.. అనేది చంద్రబాబు గుండెల మీద చేయి వేసుకుని తనను తాను ప్రశ్నించుకోవాలి’ అని జగన్ సూచించారు. ఇకనైనా బాబుకు జ్ఞానోదయం కావాలి చంద్రబాబు పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న వారి ఇళ్లకు తాము వెళ్లినప్పుడు ఆ కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా ఆర్థికసాయం చేయలేదనే విషయం తెలిసిందన్నారు. ఒక్కరికంటే ఒక్క కుటుంబానికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. చేనేతలకు ఒక్క ఇంటిని కానీ, ఒక్క షెడ్డును కానీ నిర్మించి ఇవ్వలేదన్నారు. వారందరికీ ‘ఆర్టిసాన్కార్డు’ ఉన్నప్పటికీ ఒక్క బ్యాంకు కూడా రుణాలివ్వలేదని తెలిపారు. ఈ ఇబ్బందులను చంద్రబాబుకు గట్టిగా వినిపించే విధంగా ఇక్కడి నుంచి మాట్లాడాలని చేనేతలను జగన్ కోరారు. మీరు పడుతున్న కష్టాల గురించి మీరే చెప్పండి అంటూ చేనేతలను ఆయన స్టేజీ మీదకు ఆహ్వానించారు. వీటిని విన్న తర్వాత నైనా చంద్రబాబు నాయుడుకు జ్ఞానోదయం కావాలని జగన్ ఆకాంక్షించారు. ఐదు కుటుంబాలకు పరామర్శ ధర్మవరం: ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోయినా మన సర్కారు రాగానే అందరి సమస్యలూ తీరుస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు, చేనేత భరోసా యాత్రలో భాగంగా ఆయన గురువారం ధర్మవరంలో ఐదు కుటుంబాలను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. కష్టాలొచ్చాయని కుంగిపోవద్దని, ఆత్మస్థైర్యంతో జీవించాలని, త్వరలో మంచిరోజులు రానున్నాయని ధైర్యం చెప్పారు. బాబు ఆ హామీలు ఇచ్చారా.. లేదా? ‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, గోడ మీద రాతలు, అడ్వర్టయిజ్మెంట్లు చూసినా, చంద్రబాబు ప్రసంగాలు విన్నా ఒకటే హామీల వర్షం కురిసేది. ఏ గ్రామానికి వెళ్లినా ఫ్లెక్సీలు కట్టి వాటికి లైట్లు పెట్టి మరీ రాసిన రాతలు మనం చూశాం. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వినిపించేది. గట్టిగా రెండు చేతులెత్తి చెప్పండి. చంద్రబాబు ఆ హామీలు ఇచ్చారా..లేదా? రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న మాటలు వినిపించేవా...కాదా? చెప్పండి (ప్రజలంతా చేతులు పెకైత్తి... అవును, అవును అంటూ ప్రతి స్పందించారు). ఏ టీవీ ఆన్ చేసినా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ప్రకటనలు వినిపించాయా...లేవా? జాబు కావాలంటే బాబు రావాలని అన్నారా లేదా? ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారా.. లేదా? చేనేతల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు.. అవునా? కాదా? చేనేతలందరికీ లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నారా..లేదా? ప్రతి చేనేత కార్మికునికి ఒక ఇల్లు, ఒక షెడ్డు కట్టిస్తానన్నారు.. అవునా? కాదా? (అని జగన్ ప్రశ్నించినప్పుడు చేనేత కార్మికుల నుంచి అవును..అవును అనే సమాధానం వచ్చింది.) మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కదా..వీటిలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా’ అని జగన్ మళ్లీ ప్రశ్నించారు. ఈ సమయంలో సభికుల నుంచి లేదు..లేదు..అంటూ గట్టిగా కేకలు వినిపించాయి. -
వైఎస్ జగన్ను కలిసిన చేనేత సంఘం నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం చేనేత సంఘం నేతలు కలిశారు. చేనేత రంగాన్ని పరిరక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. అలాగే చేనేతలకు రుణమాఫీ వర్తించే చేయాలని, ముడి సరుకులు 50 శాతం సబ్సిడీకి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. ధర్మవరంలో పవర్లుమ్స్ ఉత్పత్తులను నియంత్రించాలని చేనేత సంఘం నేతలు కోరారు. కాగా చేనేత కార్మికుడు మల్లికార్జున కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం శాంతినగర్లో చేనేత కార్మికురాలు లక్ష్మీదేవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మీరే గడ్డిపెట్టండి
-
బంగారం వేలం వేసేశారు
-
వడ్డీలకు వడ్డీలు కడుతున్నాం
-
'జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు'
-
'మీటింగుకు వెళ్తే కార్డులు కట్'
-
'జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు'
అన్నదాతలు, చేనేత కార్మికుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటలు ఆడుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రెండోరోజు రైతు భరోసాయాత్రలో భాగంగా ఆయన ధర్మవరంలో గురువారం మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. రాష్ట్రంలో జరుగుతున్న పాలన, ఎన్నికలకు ముందు బాబు చెప్పిన మాటలు, ఎన్నికల తర్వాత ఆయన రైతులను, డ్వాక్రా అక్క చెల్లెళ్లను, చేనేతలను, పిల్లలను వదలకుండా అన్ని వర్గాలను మోసం చేశారో అందరికీ కనిపిస్తున్న సత్యం ఎన్నికలు జరిగేరోజున ఏ టీవీ ఆన్ చేసినా, చంద్రబాబు చేసిన ప్రసంగాలు వినిపించేవి. ప్రకటనలు కనిపించేవి. ఫ్లెక్సీలకు లైట్లు పెట్టి ప్రకటించేవాళ్లు బ్యాంకులో బంగారం బయటకు రావాలంటే బాబు సీఎం కావాలనేవాళ్లు. రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అనేవారు డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పేవారు జాబు కావాలంటే బాబు సీఎం కావాలని చెప్పేవాళ్లు తర్వాత తాను సీఎం అయ్యారు. ఆ తర్వాత ఈవాళ పరిస్థితి చూస్తున్నాం ఉన్నజాబులు ఊడబీకుతున్నారు రెండువేల నిరుద్యోగ భృతి ఏమైనా వస్తోందా? ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు.. నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం, గుడిసెలు లేకుండా చేస్తాం అన్నారు మీ అందరికీ కనీసం ఒక్క ఇల్లయినా కట్టించారా? చివరకు అన్నదాతలను కూడా వదల్లేదు పెన్షన్లు ఇస్తామన్నారు.. ఇచ్చేది కొద్దిమందికి, కత్తిరించేది ఎక్కువమందికి అయిపోయింది అన్నదాతల జీవితాలతో ఆయన ఎలా చెలగాటం ఆడుతున్నారంటే.. బియ్యం కూడా కటింగ్ చేస్తున్నారు బాబు పరిపాలన అంతా మోసం, దగాగా ఉంది చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేస్తామని, ప్రతి కార్మికుడికీ ఇల్లు, షెడ్ కట్టిస్తామని చెప్పారు ఒక్కరికి కూడా కట్టించిన పాపాన పోలేదు ప్రతి చేనేత కుటుంబానికి లక్షన్నర వడ్డీ లేకుండా ఇస్తామన్నారు రుణాలు మాఫీ చేస్తామన్నారు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదు, కొత్త రుణాలు రాలేదు సీఎం చంద్రబాబు అయిన ఈ 20 నెలల్లో ఇదే ధర్మవరంలోనే 16 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు బహుశా దేశచరిత్రలోనే ఎక్కడా ఇలా జరిగి ఉండదు వాళ్ల కుటుంబాలకు చేసింది సున్నా.. రూపాయి ఇవ్వలేదు, రుణాలు మాఫీ చేయలేదు ఒక్క బ్యాంకు కూడా వాళ్లకు రుణాలు ఇవ్వలేదు అందరి బతుకుల్లో బాధలే కనిపిస్తున్నాయి కందిపప్పు కిలో 150-180 వరకు ఉంటోంది.. ఏం కొనేట్టు లేవు, తినేట్టు లేవు ఇంటికి పోతే కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి, బజారుకు పోతే కూరగాయల ధరలు షాక్ కొడుతున్నాయి చంద్రబాబుకు జ్ఞానోదయం కలిగి, ఇప్పటికైనా వీళ్లకు అండగా నిలవాలి ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఈవాళ పరిపాలన ఏం చేస్తున్నారో గుండెల మీద చేతులు వేసుకుని తనను తాను పరిశీలించుకోవాలి లేకపోతే చంద్రబాబు పురుగులు పడిపోతాడని చెబుతున్నా మన బాధలేంటో చంద్రబాబుకు అర్థమయ్యేలా చెప్పగలిగాం ఇప్పటికైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.. మార్పు రాకపోతే దేవుడు ఉతికి ఆరేస్తాడు, బంగాళాఖాతంలో ముంచేస్తాడు మన పాలన వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మీరే గడ్డిపెట్టండి మీటింగుకు వెళ్తే కార్డులు కట్ జగన్ సమావేశానికి వెళ్తే బియ్యం కార్డులు తీసేస్తామని బెదిరిస్తున్నారు. రావాలని చాలామందికి ఉన్నా, ఇలా బెదిరించడంతో రాలేకపోతున్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, పింఛన్లు ఇవ్వడం లేదు. బ్యాంకులకు పోతే జగన్ పార్టీ వైపు వెళ్తున్నావని రుణాలు కూడా ఇవ్వట్లేదు. 600 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. లక్షన్నర రూపాయల వడ్డీ లేని రుణం కాదు కదా.. వడ్డీలకు వడ్డీలు పెంచి బ్యాంకులో రుణాలు ఎక్కువ కట్టించుకున్నారు. చంద్రబాబు చెప్పారు గానీ, అవి తమవరకు రాలేదని, అందువల్ల మొత్తం వడ్డీ కట్టాల్సిందేనని బలవంతపెడుతున్నారు. ఆ వడ్డీలు కట్టలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -చేనేత కార్మికురాలు వడ్డీలకు వడ్డీలు కడుతున్నాం నేను చేనేత కార్మికురాలిని, డ్వాక్రా గ్రూపులో కూడా లేవు. ఇంతకుముందు పావలావడ్డీ పడేది. 70 వేల రూపాయల రుణం ఉంది. దానికి వడ్డీకి వడ్డీలు కడుతూనే ఉన్నాం గానీ, మాఫీ మాట లేనే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అందరికీ దరిద్రం పట్టుకుంది. బ్యాంకుల్లో కూడా రుణాలు ఇవ్వడం లేదు. మనిషికి 3 వేలు ఇచ్చేవాళ్లు, ఇప్పుడు అవి కూడా మా సంఘానికి పడలేదు. ఇన్నాళ్లబట్టి ఎవరికీ చెప్పలేక ఊరికే ఉన్నాం. ముడిసరుకుల రేటు ఇంతకుముందు కంటే పెరిగింది. 3,500 వరకు పెట్టాల్సి వస్తోంది. ఒక మగ్గానికి 50 వేల పెట్టుబడి అవుతుంది. ఇంత పెట్టి చీరలు నేస్తే, ఎక్కువ ధరలకు కొనేవాళ్లు లేరు. చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం. రైతులతో పాటు చేనేత కార్మికులదీ ఇదే పరిస్థితి. -మీనాక్షి, మరో నేత కార్మికురాలు బంగారం వేలం వేసేశారు ఆర్టిజాన్ కార్డు ఉన్నా, బంగారం కుదువపెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాను. కానీ రుణమాఫీతో ఆ బంగారం బయటకు రాకపోగా.. వేలం వేసేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. వేలం పోగా, నేనే ఇంకా వడ్డీ బాకీ ఉన్నానని.. అది కట్టాలని బ్యాంకు వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చేనేత లోన్ పెట్టుకుంటే 20 బ్యాంకుల చుట్టూ తిరిగినా ఇంకా పెండింగ్ పెట్టారు. డబ్బు అన్నా కట్టాలని.. లేకపోతే వార్డు టీడీపీ నాయకుడితో మాట చెప్పిస్తే రుణం ఇస్తారన్నారు. -గోపాల్, చేనేత కార్మికుడు, ధర్మవరం -
రెండో రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర గురువారం రెండో రోజు కొనసాగనుంది. ధర్మవరం నియోజవర్గంలోని కొత్తపేట, శాంతినగర్, శివనగర్ లలో వైఎస్ జగన్ పర్యటిస్తారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న ఏడుగురు చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి కానున్నారు. -
రమాదేవి,రమేష్ కుటుంబానికి జగన్ పరామర్శ
-
వైఎస్ జగన్ 'రైతు భరోసా యాత్ర' ప్రారంభం
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి చేపట్టిన నాలుగో విడత 'రైతు భరోసా యాత్ర' ప్రారంభమైంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015 డిసెంబర్ 31 నాటికి అనంతపురం జిల్లాలో 146 మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ యాత్ర ప్రారంభించారు. ధర్మవరంలోని వైఎస్ఆర్ కాలనీలోని రమేష్, రమాదేవి దంపతుల కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఇటీవల రమేష్ దంపతులు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. వైఎస్ జగన్ వారిని ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బుధవారం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకున్న వైఎస్ జగన్కు పార్టీ నేతలు ఎమ్మెల్యే చాంద్ బాషా, శంకర్ నారాయణ, శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి ఘన స్వాగం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొడికొండ చెక్పోస్టు మీదుగా ధర్మవరం పట్టణానికి చేరుకున్నారు. భరోసా యాత్రను ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మూడు విడతల్లో 42 కుటుంబాలను పరామర్శించారు. నాలుగో విడత 'భరోసా యాత్ర'ను బుధవారం నుంచి 7 రోజులపాటు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొనసాగించనున్నారు. -
అనంతలో ముగిసిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
-
అనంతలో ముగిసిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర సోమవారం ముగిసింది. అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి, వారికి అండగా ఉంటామని ఓదార్చారు. రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారు. అనంతపురం జిల్లాలో వారం రోజుల్లో వైఎస్ జగన్ 725 కిలో మీటర్ల మేర పర్యటించినట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘరాం, శంకర్ నారాయణ చెప్పారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. 17 మంది అన్నదాతల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 42 రైతు కుటుంబాలకు భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. -
కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నాచేస్తాం
-
కేంద్రం దిగిరాకపోతే ఢిల్లీలో ధర్నా: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. కేంద్రం దిగిరాకపోతే 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్ర ఏడో రోజు కార్యక్రమంలో భాగంగా ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన ఏమన్నారంటే.. కేంద్రం, చంద్రబాబు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తాం రాహుల్ గాంధీ ఏనాడూ ప్రతిపక్ష పాత్ర పోషించలేదు ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది వైఎస్ఆర్సీపీనే చంద్రబాబు పాలన మోసపూరితం రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ నిర్మూలన పేరుతో యువతను మోసం చేశారు రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పోస్టుమార్టం రిపోర్టు ఉన్నా చాలామందికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడంలేదు పబ్లిసిటీ వచ్చేచోట మాత్రమే చంద్రబాబు పరిహారం ఇస్తారా? ఏరైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా పార్టీలతో సంబంధం లేకుండా 5 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశా మంగళగిరిలో ఇదే అంశంపై రెండు రోజుల దీక్ష కూడా చేశా -
ఏడో రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
-
ఏడో రోజు కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
అనంతపురం : రైతుల సమస్యలపై అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఏడో రోజు కొనసాగుతోంది. నేడు ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గుదిబండ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఉజ్జనిపురంలో రైతు మల్లప్ప, అలుపనపల్లిలో రైతు రామిరెడ్డి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించనున్నారు. -
అండగా ఉంటా!
- ఆరోరోజు రెండు కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా - ప్రజల బాగోగులు తెలుసుకుంటూ....సమస్యలు ఆలకిస్తూ సాగిన యాత్ర - కదిరేపల్లిలో పట్టురైతుల సమస్యలు తెలుసుకున్న జగన్ - జగన్తో సమస్యలు విన్నవించిన కూలీలు..ఉద్యోగులు...నిరుద్యోగులు సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎవ్వరూ అధైర్యపడొద్దని...వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇస్తూ రైతు భరోసా యాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోరోజు భరోసా యాత్ర మడకశిరలో మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్రెడ్డి నివాసం నుంచి మొదలైంది. మడకశిర నుంచి నేరుగా కదిరేపల్లికి చేరుకున్నారు. జగన్ను చూసేందుకు సెయింట్యాన్స్ పాఠశాల విద్యార్థులంతా రోడ్డుపైకి వచ్చారు. జగన్ రాగానే విద్యార్థులు, సిస్టర్లు జగన్కు పుష్పగుచ్చాలు అందించారు. పిల్లలందరినీ జగన్ ప్రేమ ముద్దాడి దీవించారు. తర్వాత లక్ష్మీనరసప్ప అనే పట్టు రైతు పొలంలోకి వెళ్లారు. జగన్ వస్తున్నారని పలువురు పట్టురైతులు అక్కడికి చేరుకుని సమస్యలను జగన్కు వివరించారు. పట్టుగూళ్ల తయారీ, పెట్టుబడి, ప్రభుత్వ తోడ్పాటు, కష్టనష్టాలపై జగన్ ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వంతో పోరడుతామని చెప్పారు. తర్వాత ఉగ్రేపల్లికి చేరుకున్నారు. అక్కడ మహిళలు భారీగా తరలివచ్చారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి ఉపాధ్యాయుల సమస్యలపై జగన్కు వినతిపత్రం అందజేశారు. తర్వాత బూదిపల్లి, జంబులగుండ మీదుగా మోపురుగుండు చేరుకున్నారు. ఇక్కడ పింఛన్ రావడం లేదని వృద్ధులు జగన్కు వివరించారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు...కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. పోరాడదాం, ధైర్యంగా ఉండండి’ అని జగన్ భరోసా ఇచ్చారు. ఉపాధిపనులు ఉండటం లేదని మహిళా కూలీలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. బతకలేక వలసపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. తర్వాత దేవరహట్టి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రంగప్ప కుటుంబానికి భరోసా ఇచ్చారు. తర్వాత అక్కడి ఎస్. రాయవరం మీదుగా మందలపల్లికి చేరుకున్నారు. ఇక్కడ జగన్ను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. యువకులతో కరచాలనం చేశారు. మహిళలనూ దీవించారు. ‘వృద్ధులు రాగానే...బాగున్నావా అవ్వా? పేరేంటి తాతా?’ అని పలకరించారు. అక్కడి నుండి ఎస్ఎస్ గుండ్లు చేరుకున్నారు. ఇక్కడి గ్రామస్తులు డప్పువాయిద్యాలతో జగన్కు స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత అక్కడి నుండి నేరుగా గుడిబండ సమీపంలోని ఫాంహౌస్కు చేరుకుని రాత్రికి బస చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, ఎమ్మెల్యే చాంద్బాషా, రాష్ట్రకార్యదర్శి మధుసూదన్రెడ్డి, మాజీ మంత్రులు నర్సేగౌడ, షాకీర్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, కోటి సూర్యప్రకాశ్బాబు, వైసీ గోవర్దన్రెడ్డి, రవిశేఖరరెడ్డి, శివకుమార్, చవ్వారాజశేఖరరెడ్డి, సంయుక్త కార్యదర్శి నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నేటి భరోసా యాత్ర ఇలా రైతుభరోసా యాత్ర 7వరోజు వివరాలను వైఎస్సార్సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ సంయుక్తంగా వెల్లడించారు. రొళ్ల మండలంలోని ఉజ్జయినీపురంలో ఆత్మహత్య చేసుకున్న మల్లప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత ఇదే మండలంలో అలుపనపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రామిరెడ్డి కుటుంబానికి భరోసా ఇస్తారు. దీంతో మూడో విడత యాత్ర ముగుస్తుందని వారు తెలిపారు. -
ఆరో రోజు రైతు భరోసాయాత్ర
-
అనంతలో ఆరో రోజు రైతు భరోసాయాత్ర
అనంతపురం : అనంతపురం జిల్లాలో ఆదివారం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసాయాత్ర ఆరవ రోజు ముగిసింది. మడకశిర నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి వారిని ఓదార్చారు. పత్తిరైతుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని, రైతుల తరఫున పోరాడుతానని వైఎస్ జగన్ తెలిపారు. దేవరహట్టిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రంగప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అప్పుల బాధలు తాళలేక ఎస్ ఎస్ గుండ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబాన్ని కలిసిన ఆయన వారికి దైర్యం చెప్పి, అండగా ఉంటామని భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ను అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కలిశారు. -
'వైఎస్ జగన్ వల్లే ప్రభుత్వం అంగీకరించింది'
అనంతపురం: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనంతపురం మున్సిపల్ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆరో రోజు ఆదివారం మడకశిర నియోజకవర్గంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ను దిన్నేహట్టిలో జేఏసీ నేతలు కలిశారు. వైఎస్ జగన్ ఒత్తిడితోనే వేతనాలను పెంచేందుకు ఏపీ సర్కార్ అంగీకరించిందని జేఏసీ నేతలు అభినందించారు. వైఎస్ జగన్ సమక్షంలో మున్సిపల్ జేఏసీ నేతలు స్వీట్లు పంచుకున్నారు. మున్సిపల్ జేఏసీ నేతలు వైఎస్ జగన్కు శాలువా కప్పి నంది చిత్రపటాన్ని బహూకరించారు. -
ఐదవరోజు రైతు భరోసాయాత్ర
-
'ఆ నిధులు కరెంట్ బిల్లులకూ సరిపోవు'
మడకశిర : హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం కరెంట్ బిల్లులకు కూడా సరిపోవని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసాయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. మడకశిరలో జరిగిన బహిరంగసభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్టాటకలో బోయ వర్గంవారు ఎస్టీలుగా ఉన్నారని, కానీ ఏపీలో మాత్రం బీసీలుగా ఉండిపోయారన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగే తొలి అసెంబ్లీ సమావేశాల్లో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవంటూ ఆయన ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తానన్నారు. రైతులు, మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీని గుడిసెలు లేని రాష్ట్రంగా చేస్తానన్న బాబు ఒక్క ఇల్లయినా కట్టించి ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచారని, గతంలో రూ. 200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.600 వస్తోందని తెలిపారు. చంద్రబాబు సర్కార్ మెడలు వంచైనా సరే హామీలు సాధించుకుందామని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
'స్పందించేది జగన్ ఒక్కడేనని తెలుసు'
అనంతపురం : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడేనన్న విషయం ప్రజలందరికీ తెలుసునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సు:ఖశాంతులతో ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. 'పి.కొత్తపల్లి గ్రామంలో రైతు లక్ష్మన్న మరణించి ఏడాది అవుతుంది. ఇప్పటివరకూ ఏ ఒక్కరూ పరామర్శించలేదు. ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. లక్ష్మన్నకు రూ.1.19 లక్షల అప్పుంది. రూ.19 వేలు మాఫీ అయింది. రూ.20 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయం లక్ష్మన్న కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు. వడ్డీకి సైతం సరిపోని విధంగా రుణమాఫీ అమలు చేస్తున్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులపై 14 శాతం అపరాధ రుసుం పడుతోంది. రైతులు తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది. ఇక హంద్రీ-నీవా ప్రాజెక్టులో చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. హంద్రీ-నీవా ప్రాజెక్టు తానే పూర్తి చేశానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను వంచించారు. ఒక్క కొత్త ఇళ్లు కట్టలేదు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. కరవు తట్టుకోలేక అనంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెంగళూరుకు వలస వెళ్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ వచ్చినచోట మాత్రమే పరిహారం చెల్లిస్తారు. రాహుల్ గాంధీ ఎప్పుడు దేశంలో ఉంటారో...ఎప్పుడు విదేశాల్లో ఉంటారో తెలియదు' అని అన్నారు. -
'స్పందించేది జగన్ ఒక్కడేనని తెలుసు'
-
లక్ష్మన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదో రోజు రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. రొద్దం మండలం పి.కొత్తపల్లి గ్రామంలో భరోసా యాత్ర చేరుకుంది. గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. వారికి ధైర్యాన్ని చెప్పారు. రుణాలు మాఫీ కాలేదని , కొత్త రుణాలు ఇవ్వడంలేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా జగన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మడకశిర నియోజక వర్గం తిరుమల దేవరపల్లి లో ఆత్మహత్య చేసుకున్న ఆనందప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత హనుమంతరాయునిపాళెంలో ఆత్మహత్య చేసుకున్న ఓబన్న అనే రైతు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
లక్ష్మన్న కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!
-
నాలుగో రోజు రైతు భరోసా యాత్ర
-
నాలుగో రోజు ముగిసిన జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో రోజు రైతు భరోసా యాత్ర ముగిసింది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటించారు. ఆత్మహత్యకు పాల్పడిన పలు రైతు కుటుంబాలను పరామర్శించారు. వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గౌనిమేకలపల్లి చేరుకుని రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను ఓదార్చారు. కొత్తపల్లికి చేరుకుని రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. రైతు భరోసా యాత్రంలో భాగంగా ఐదో రోజు శనివారం వైఎస్ జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రేపు పలు కుటుంబాలను పరామర్శించనున్నారు. -
మూడో రోజు రైతు భరోసా యాత్ర
-
'అవసరమైతే దండ.. లేకుంటే బండ వేస్తారు'
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవసరముంటే వాడుకుంటాదని, లేదంటే పక్కన పెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి కాంగ్రెస్ పార్టీ తనపై కేసులు పెట్టిందని ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే రోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. అవసరమైనపుడు దండ వేయడం, లేకుంటే బండ వేయడం రాహుల్కే చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి బొట్టుదాకా ఇందిరా గాంధీ కుటుంబం కోసం కష్టపడ్డారు వైఎస్ఆర్ బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు గొప్పవాడన్నారు కాంగ్రెస్లో కొనసాగినంత వరకు వైఎస్ జగన్ను మంచి వాడన్నారు వైఎస్ఆర్ కోసం ప్రాణాలు వదిలిన వారి కోసం ఓదార్పు యాత్ర చేస్తే నన్ను చెడ్డవాడన్నారు కాంగ్రెస్ చంద్రబాబుతో కలసి నాపై కేసులు పెట్టింది అవసరమైనపుడు దండ వేయడం, అవసరం లేకుంటే బండ వేయడం రాహుల్కే చెల్లింది రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి ఇప్పుడు అన్యాయం జరిగిందని రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సాధనకు అనేక పోరాటాలు చేశాం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైజాగ్లో ధర్నా, తణుకు, మంగళగిరిలో దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయడం రాహుల్కు గుర్తు రాలేదా? రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి దేశానికి తెలియజేసేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టాను 4 నెలల రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నా అనంతపురం జిల్లా రైతుల దుస్థితిని దేశం తెలుసుకునేలా చేశాం దీన్ని తెలుసుకునే రాహుల్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళలు అనేక బాధలు పడుతున్నారు ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు కట్టలేదు అనంతపురం జిల్లాలో 70 మంది రైతులు, 20 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిల్లాలో ఉపాధి కరువై రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు రైతులు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు చెప్పటం సిగ్గుచేటు రైతులకు వేరుశనగ విత్తనాలు సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వముంది అనంతపురం జిల్లా రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కావాల్సి ఉంటే కేవలం లక్షన్నర క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు ఆ విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు టీడీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు -
లక్ష్మీదేవమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
-
లక్ష్మీదేవమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గ పరిధిలోని వైటి రెడ్డిపల్లి, గోనిమాకులపల్లిలో యాత్ర నిర్వహిస్తున్నారు. వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం ఆయన గౌనిమేకలపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం కొత్తపల్లిలో రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.