
అనంతలో ఐదవ రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
అనంతపురం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.
ఉప్పరపల్లి, ఎర్రగుంట, కొడిమి గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాప్తాడు మండలం బండమీదపల్లిలో రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు.