Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Huge Relief For Sakshi Tv In Ap High Court1
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట

సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్‌ఆర్‌(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్‌ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాత్రికేయుల వాక్‌ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను తప్పుపట్టింది. లైవ్‌ షోలో ఓ ప్యానలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్‌ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సాక్షి మీడియాపై కుట్రతోనే..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక‌్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్‌ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్‌ షోలో ప్యానలిస్ట్‌ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్‌ న్యూస్‌ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్‌ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’ :::కొమ్మినేనికి బెయిల్‌ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Gill Creates History Becomes 1st Indian In 21st Century To Rare Feat2
Ind vs Eng 1st Test: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌

టీమిండియా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ప్రిన్స్‌.. మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, విరాట్‌ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. కాగా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జస్‌ప్రీత్‌ బుమ్రా పేరు తెర మీదకు రాగా.. తానే స్వయంగా రేసు నుంచి తప్పుకొన్నాడు. పనిభారం కారణంగా సెలక్టర్లు కూడా ఇందుకు అంగీకరించి.. రోహిత్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం (జూన్‌ 20) మొదలైన తొలి టెస్టు సందర్భంగా సారథిగా గిల్‌ తన ప్రయాణం ఆరంభించాడు.ఈ నేపథ్యంలో పలు అరుదైన రికార్డులను గిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ల జాబితాలో చేరిన ప్రిన్స్‌.. 21వ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు. ఇన్నాళ్లుగా కోహ్లి పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.అంతేకాదు.. ఇంగ్లండ్‌ గడ్డ మీద టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ పేరు మీదున్న రికార్డును కూడా గిల్‌ ఈ సందర్భంగా సవరించాడు. కాగా టెస్టుల్లో భారత్‌కు గిల్‌ 37వ కెప్టెన్‌.యంగెస్ట్‌ ఇండియన్‌ టెస్టు కెప్టెన్లు🏏మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ- 21 ఏళ్ల 77 రోజుల వయసులో- 1962లో బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..🏏సచిన్‌ టెండుల్కర్‌- 23 ఏళ్ల 169 రోజుల వయసులో- 1996లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏కపిల్‌ దేవ్‌- 24 ఏళ్ల 48 రోజులు వయసులో- 1983లో కింగ్‌స్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..🏏రవి శాస్త్రి- 25 ఏళ్ల 229 రోజుల వయసులో- 1988లో చెన్నై వేదికగా- వెస్టిండీస్‌తో పోరుతో..🏏శుబ్‌మన్‌ గిల్‌- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..21వ శతాబ్దంలో పిన్న వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్లుగా తొలి మ్యాచ్‌ ఆడింది వీరే.. ఒకే ఒక్కడు గిల్‌!🏏శుబ్‌మన్‌ గిల్‌- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..🏏విరాట్‌ కోహ్లి- 26 ఏళ్ల 34 రోజుల వయసులో- 2014లో అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏సచిన్‌ టెండుల్కర్‌- 26 ఏళ్ల 253 రోజుల వయసులో- 2000లొ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..🏏మహేంద్ర సింగ్‌ ధోని- 26 ఏళ్ల 379 రోజుల వయసులో- 2008లొ కాన్పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో..🏏వీరేందర్‌ సెహ్వాగ్‌- 27 ఏళ్ల 59 రోజుల వయసులో- 2006లో అహ్మదాబాద్‌ వేదికగా శ్రీలంకతో పోరుతో..ఇంగ్లండ్‌లో టీమిండియా యంగెస్ట్‌ కెప్టెన్లు వీరే..🏏శుబ్‌మన్‌ గిల్‌- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్‌ వేదికగా..🏏మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ- 26 ఏళ్ల 154 రోజుల వయసులో- 1967లో లీడ్స్‌ వేదికగా..🏏కపిల్‌ దేవ్‌- 27 ఏళ్ల 150 రోజుల వయసులో- 1986లో లార్డ్స్‌ వేదికగా..🏏మహ్మద్‌ అజారుద్దీన్‌- 27 ఏళ్ల 168 రోజుల వయసులో- 1990లో లార్డ్స్‌ వేదికగా..🏏జస్‌ప్రీత్‌ బుమ్రా- 27 ఏళ్ల 178 రోజుల వయసులో- 2022లో ఇంగ్లండ్‌ వేదికగా..👉 ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 92/2. ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ 42 పరుగులకు అవుట్‌ కాగా.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 42 పరుగుల వద్ద ఉన్నాడు. అరంగేట్ర ఆటగాడు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.చదవండి: IND vs ENG: పాపం నితీశ్‌ కుమార్‌.. అత‌డి కోసం ప‌క్క‌న పెట్టేశారు?

TDP MLA Gummanur Jayaram Aggressive Comments On YSRCP 3
టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, అనంతపురం: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుందాం. వైఎస్సార్ సీపీ నేతలు టీడీపీలో చేరితే సరి లేదంటే కక్ష సాధింపు చర్యలు తప్పవు. నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా నేను మాత్రం ఊరుకోను.. అందరి సంగతి తేలుస్తా. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తా... ప్రతిపక్ష పార్టీ నేతల తోకలు కత్తిరిస్తా’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Thailand PM Uncle Call Row: Paetongtarn Shinawatra Apologized4
క్షమాపణలు చెప్పిన బ్యూటీఫుల్‌ ప్రధాని

థాయ్‌లాండ్‌ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా(38)కు అధికారం చేపట్టిన పది నెలలకే పదవీగండం ఎదురైంది. పొరుగుదేశం నేతకు ఆమె చేసిన ఓ ఫోన్‌ కాల్‌ లీక్ అవడం.. ఏకంగా ప్రధాని పీఠానికి ఎసరు పెట్టింది. ఆమెను రాజీనామా చేయాలంటూ ఒకవైపు డిమాండ్లు వెల్లువెత్తగా.. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.థాయ్‌లాండ్‌ బిలియనీర్‌, మాజీ ప్రధాని అయిన తక్సిన్‌ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్‌ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా((Thailand PM Paetongtarn Shinawatra). గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్‌లోనూ స్టైల్‌ ఐకాన్‌గా, బ్యూటిఫుల్‌ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.కాల్‌ సంభాషణ బయటకు..థాయ్‌లాండ్‌ (Thailand)కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్‌ సేన్‌(Hun Sen)కి థాయ్‌ ప్రధాని షినవత్రా ఫోన్‌ చేశారు. ‘‘అంకుల్‌’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బూన్‌సిన్‌ (Lt. Gen. Boonsin Padklangను ఉద్దేశించి) తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్‌ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్‌కాల్‌ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్‌లాండ్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్‌ సేన్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్‌ మానెట్‌ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్‌సేన్‌. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్‌లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది.సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్‌ భూమ్‌జాయ్‌థాయ్‌ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్‌ పార్లమెంట్‌లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షినవత్రాకు స్వల్ప మెజార్టీ(500 సభ్యులన్న పార్లమెంట్‌లో 254 సభ్యుల మద్దతు) మాత్రమే మిగిలింది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా.. మరో మిత్రపక్షం వైదొలిగినా.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది.చేతులు జోడించి..ఈలోపు ఈ బ్యూటీఫుల్‌ ప్రధాని డ్యామేజ్‌ కంట్రోల్‌కి దిగారు. ఫోన్‌ కాల్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్‌ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. నా ఉద్దేశం శాంతిని నెలకొల్పడమే. ఇకపై హున్ సేన్‌తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని తేల్చి చెప్పారామె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారామె. ఈ క్షమాపణ థాయ్‌లాండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా ఆపుతుందా చూడాలి.

Kuberaa Movie Review And Rating In Telugu5
Kuberaa: ‘​కుబేర’ మూవీ రివ్యూ

శేఖర్‌ కమ్ముల(Sekhar kammula)కు సెన్సిబుల్ దర్శకుడు అనే పేరుంది. అందమైన ప్రేమ కథలను, ఆకట్టుకునే కుటుంబ కథలను తెరకెక్కిస్తూ ఓ మంచి సందేశం ఇవ్వడం ఆయన స్టైల్‌. అందుకే సంవత్సరాల పాటు గ్యాప్‌ తీసుకొని వచ్చినా.. శేఖర్‌ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. లేట్‌గా వచ్చిన డిఫరెంట్‌ సినిమానే చూపిస్తాడనే నమ్మకం టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఉంది. లవ్‌స్టోరీ(2021) తర్వాత ఆయన నుంచి వచ్చిన చిత్రం కుబేర(Kuberaa Movie Review). తొలిసారి ధనుష్‌(Dhanush), నాగార్జున లాంటి బడా హీరోలతో ఆయన ఈ సినిమా తెరకెక్కించాడు. నేషనల్‌ క్రష్‌ రష్మిక ఇందులో మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో కుబేరపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్‌ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘‍కుబేరా’ కథేంటంటే..?దీపక్‌ (నాగార్జున) నిజాయితీ గత సీబీఐ అధికారి. కేంద్రమంత్రి అవినీతి బయటపెట్టడంతో అన్యాయంగా ఆయన్ను జైలుపాలు చేస్తారు. కోర్టుకు వెళ్లినా న్యాయం జరగదు. అదే సమయంలో తనకు సహాయం చేయడానికి దేశంలోనే బడా వ్యాపారవేత్త నీరజ్‌ మిత్రా(జిమ్‌ సర్భ్‌) ముందుకు వస్తాడు. ఓ ఒప్పందం చేసుకొని దీపక్‌ని బయటకు తెస్తాడు. ఆ ఒప్పందం ప్రకారం దీపక్‌ రూ.లక్ష కోట్ల బ్లాక్‌ మనీని కేంద్ర మంత్రుల బినామీల అకౌంట్లకు బదిలీ చేయాలి. అందులో రూ. 50 వేల కోట్లను వైట్‌లో మరో 50 వేల కోట్లను బ్లాక్‌లో బదిలీ చేయాల్సి ఉంటుంది(Kuberaa Movie Review). దాని కోసం దీపక్‌ నలుగురు బిక్షగాళ్లను తీసుకొచ్చి, వాళ్ల పేరు మీద రూ. 10 వేల కోట్ల చొప్పున అకౌంట్‌లో జమ చేస్తాడు. వారిలో ఒక భిక్షగాడే దేవా(ధనుష్‌). పని ఇప్పిస్తామని చెప్పి తిరుపతి నుంచి ముంబైకి తీసుకొచ్చి.. దేవా పేరుపై డబ్బులు జమ చేస్తారు. ఆ డబ్బులను మళ్లీ కేంద్ర మంత్రుల బినామీకి బదిలీ చేయించే క్రమంలో దేవా వారి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? నీరజ్‌ గ్యాంగ్‌ అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఏంటి? నీరజ్‌ గురించి దీపక్‌ని తెలిసి అసలు నిజం ఏంటి? కేంద్ర మంత్రులకు నీరజ్‌ మిత్రా రూ. లక్ష కోట్లను లంచంగా ఎందుకు ఇస్తున్నాడు? బిచ్చగాడైన దేవా..బడా వ్యాపారవేత్త నీరజ్‌కి చెప్పిన గుణపాఠం ఏంటి? చివరకి రూ. లక్ష కోట్లు చేతులు మారాయా లేదా? ఈ కథలో సమీరా(రష్మిక)పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సెన్సిబుల్ ‍కథలో డిఫరెంట్‌ సినిమాలను తెరకెక్కించడంలో శేకర్‌ కమ్ముల దిట్ట. సమాజంలో జరుగుతున్న పరిణామాలనే కథగా మలిచి.. ఎంటర్‌టైనింగ్‌గా చూపిస్తూనే ఒక మంచి సందేశం అందిస్తుంటాడు. అలా అని సందేశం ఇవ్వడానికి సినిమా తీసినట్లుగా అనిపించదు. సినిమా చూస్తే మనకే ఓ సందేశం అందుతుంది. కుబేర చిత్రాన్ని కూడా అలానే తెరకెక్కించాడు. కార్పోరేట్‌ వ్యవస్థలు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయి? రాజకీయ నాయకులు తన స్వార్థం కోసం ఎలాంటి అవినీతి పనులు చేస్తున్నారు? బ్లాక్‌ మనీ ఎలా చేతులు మారుతుంది? బినామీ వ్యవస్థలు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. దీని కోసం శేకర్‌ కమ్ముల చాలా లోతుగా అధ్యయనం చేసినట్లుగా సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రతీ విషయం డీటేయిల్డ్‌గా చూపించాలనే తాపత్రాయంతో నిడివిని అమాంతం పెంచేశారు. మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు అరగంటకు తగ్గించిన పర్వాలేదనిపిస్తంది. కట్‌ చేసినా పర్లేదు అనే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదొక్కటే సినిమాకు పెద్ద మైనస్‌. అయితే ధనుష్‌ , నాగార్జున తమ నటనతో ఆ సాగదీతను కొంతమేర కప్పిపుచ్చుకొచ్చారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బిచ్చగాడు.. ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక ధనవంతుడు.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ నిజాయితీ ఆఫీసర్‌.. ఈ మూడు రకాల పాత్రల చుట్టే కథ తిరుగుతుంది. ఆయిల్‌ స్కామ్‌ సన్నివేశంతో కథని ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జున పాత్ర ఎంట్రీ, బ్లాక్‌ మనీ బదిలీ ప్లాన్‌.. బిచ్చగాళ్ల ఎంపిక.. ఇవన్నీ చకచక సాగిపోతాయి. దాదాపు 30 నిమిషాల తర్వాత ధనుష్‌ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. దేవా తప్పించుకుపోయిన తర్వాత కథనం పరుగులు పెరుగుతుంది. అతన్ని ఎలా పట్టుకుంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో నాటకీయత ఎక్కైవైనట్లుగా అనిపిస్తుంది. వ్యాపారవేత్త నీరవ్‌ మిత్రా బిచ్చగాడిలా మారడం.. అధికార బలం ఉన్నా బిచ్చగాడిని పట్టుకోలేకపోవడం.. సినిమాటిక్‌గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శేకర్‌ లాజిక్‌ మిస్‌ అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది. ఎప్పటి మాదిరే తను చెప్పాలనుకున్న కథను శేఖర్‌ కమ్ముల చాలా నిజాయితీగా చెప్పేశాడు. ఎవరెలా చేశారంటే.. ధనుష్‌ నటన గురించి ప్రత్యేక్షంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతాడు. అలాంటి నటుడు శేఖర్‌ కమ్ముల లాంటి దర్శకుడికి దొరికితే ఎలా ఉంటుంది? కొత్త నటీనటులతోనే అద్భుతంగా నటింపజేసే శేకర్‌.. ధనుష్‌లోని టాలెంట్‌ని పూర్తిగా వాడేశాడు. బిచ్చగాడు దేవ పాత్రలో నటించలేదు..జీవించేశాడు. తెరపై ఓ స్టార్‌ హీరో ఉన్నాడనే సంగతే గుర్తుకురాదు. బిచ్చగాడే మన కళ్లముందు కనిపిస్తాడు. ఇలాంటి పాత్రను ఒప్పుకున్నందుకే అభినందించాలి. ఇక ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చిన తక్కువే అనిపిస్తుంది. నాగార్జున కూడా ఇందులో డిఫరెంట్‌ పాత్ర పోషించాడు. సీబీఐ ఆఫీసర్‌ దీపక్‌గా చక్కగా నటించాడు. ఆయన కెరీర్‌లో ఇది కూడా ఒక డిఫరెంట్‌ మూవీగా నిలిచిపోతుంది. రష్మిక తన పాత్రకు న్యాయం చేసింది. ఆమె ఎంట్రీ కామెడీగా ఉన్నా.. రాను రాను ఆమె పాత్ర ప్రాధాన్యత పెరుగుతుంది. విల‌న్‌గా జిమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై స్టైలీష్‌గా కనిపంచాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేవాడు. పాటలు సందర్భానుసారంగా వస్తుంటాయి. పోయిరా పోయిరా పాటతో పాటు అమ్మ సాంగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు బాగుంది. ముంబై సెట్‌తో పాటు ప్రతీది సహజంగా తీర్చిదిద్దారు. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో నిర్థాక్షిణంగా కట్‌ చేయాల్సిన సీన్లు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Ongoing Differences Between Congress And Shashi Tharoor6
Shashi Tharoor: కాంగ్రెస్‌-శశిథరూర్‌ విభేదాల్లో ట్విస్ట్‌

తిరువనంతపురం: కాంగ్రెస్‌ వర్సెస్‌ ఆ పార్టీ కేరళ ఎంపీ శశి థరూర్‌ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అందుకు నీలంబూర్‌ బై పోల్‌ ఎలక్షన్‌ ప్రచారం వేదికగా మారింది. మలయాళ సినీ ప్రముఖుడు ఆర్యదన్ షౌకత్ నీలంబూర్‌ బై ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుఫున పోటీ చేశారు. ఆ ఎన్నిక కోసం కేరళ కాంగ్రెస్‌ యూనిట్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఎంపీ శశిథరూర్‌ పేరు సైతం ఉందని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌ చెబుతున్నారు.కానీ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఎంపీ శశిథరూర్‌ చెప్పడం విశేషం. పార్టీ నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఎవరూ అడిగింది లేదు. ఎన్నికల ప్రచారం, స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితా గురించి నాకు ఫోన్‌ చేసింది లేదు. అయినప్పటికీ, ఆర్యధన్‌ షౌకత్‌ తరుఫున పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సమయంలో ఎక్కువ భాగం విదేశాలలో అధికారిక దౌత్య పర్యటనలో ఉన్నాను’ అని చెప్పారు. అయితే, శశిథరూర్‌ పై వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సన్నీ జోసెఫ్‌ ఘాటుగా స్పందించారు. ‘నీలంబూర్ ఉప ఎన్నికలో భాగంగా ఆర్యదన్ షౌకత్ తరుఫున ప్రచారం చేసేందుకు స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేశాం. ఆ జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాం. శశిథరూర్‌ ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఎక్కువ శాతం విదేశాల్లో తిరుగుతుంటారు. లేదంటే ఢిల్లీలో ఉంటారు. కేరళ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేనని ముగించారు. గురువారం శశిథరూర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. ఆ విభేదాలేంటి? అనే అంశాన్ని దాట వేశారు.పహల్గాం ఉగ్రదాడి అనంతరం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు భారత్‌ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల ఎదుట పాక్‌ను దోషిగా నిలబెట్టేలా కేంద్రం అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో అనూహ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు స్థానం కల్పించింది. నాటి నుంచి కాంగ్రెస్‌-ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మధ్య విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందం విదేశీ పర్యటన సమయంలో శశిథరూర్‌ ప్రధాని మోదీని ఆకాశానికెత్తారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిపిందంటూ ప్రశంసలు కురిపించారు. శశిథరూర్‌ చేసిన ఆ వ్యాఖ్యలే కాంగ్రెస్‌ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. అంతర్ఘతంగా శశిథరూర్‌ను తీరును పార్టీ పెద్దల ఎదుట తప్పుబట్టినట్లు సమాచారం. తాజాగా, కేరళలో జరిగిన ఉప ఎన్నికకు శశిథరూర్‌కు ఎటువంటి ఆహ్వానం అందకపోవడం గమనార్హం."I wasn't invited by party (for Nilambur by-election campaign). Yes, there are some differences b/w me & leadership. Those can be sorted out in closed-door conversations. So far, no one has reached out to me. When nation needs my service, I am always ready."- .@ShashiTharoor pic.twitter.com/NPzj89NJdr— BhikuMhatre (@MumbaichaDon) June 19, 2025

PM Benjamin Netanyahu Sensational Comments7
అమెరికాతో మాకేంటి.. ఇరాన్‌ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు

టెలీ అవీవ్‌: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్‌ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్‌ చేశారు.తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్‌లో ఫోర్డ్‌లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్‌ న్యూక్లియర్‌ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్‌లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్‌లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇరాన్‌ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్‌ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

AP Rappa Rappa Politics: Gorantla Butchaiah Chowdary Comments On YS Jagan8
వైఎస్‌ జగన్‌పై బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు

సాక్షి, విజయవాడ: ఏపీని రప్పా రప్పా రాజకీయం ఊపేస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కు ఉందా? నీ తల నరకొచ్చు కదా.. అంటూ జగన్‌ను ఉద్దేశించి ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయారాయన. ఇటీవలె ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను భూస్థాపితం చేస్తానంటూ చంద్రబాబు ఊగిపోయారు. ఇప్పుడు బాబు బాటలోనే బుచ్చయ్యచౌదరి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.నిన్న ఏం అంటావు నువ్వు .... గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టే నరుకుతామని అంటే ..దానిలో తప్పు ఏముందని అంటున్నావు .. నేను అంటున్నా .. నీతల నరకొచ్చుగా!::ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరివైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంలో.. ఓ యువకుడు పుష్ప2 చిత్రంలోనే ఫేమస్‌ డైలాగ్‌తో వైఎస్‌ జగన్‌ ఫొటోను ఫ్లెక్సీగా ప్రదర్శించారు. అయితే అందులో డైలాగ్‌ అభ్యంతకరంగా ఉందంటూ పోలీసులు అతనిపై కేసు పెట్టారు. గురువారం వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశంలో కొందరు పాత్రికేయులు ఈ విషయాన్ని జగన్‌ వద్ద ప్రస్తావించారు.అయితే ఆ ఫ్లెక్సీలో ఉన్న డైలాగును స్వయంగా విలేకరుల నోటి నుంచే జగన్‌ అడిగి తెలుసుకున్నారు. అంతేతప్ప .. ఆయన స్వయంగా ఏం ఆ డైలాగ్‌ను కొట్టలేదు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు, మేనరిజాలను పాటించే స్వేచ్ఛ కూడా లేదా? అంటూ చంద్రబాబును నిలదీశారు. అంతేకాదు.. ఆ పోస్టర్‌ ప్రదర్శించింది స్వయానా టీడీపీ అభిమానినే అని ఆధారాలు సైతం ప్రదర్శించారాయన.అయితే జగన్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మాటలను టీడీపీ ఘోరంగా వక్రీకరించింది. జగన్‌ నోటి నుంచి రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగ్‌ వచ్చిందంటూ గగ్గోలు పెట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల.. మరికొందరు నేతలు వరుసగా ప్రెస్‌మీట్‌లు పెడుతూ నరుకుడు డైలాగ్‌ కొట్టారంటూ జగన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు.. ఐటీడీపీ అండ్‌ కో తమ ఎడిటింగ్‌లకు పని చెప్పి సోషల్‌ మీడియాలోనూ జగన్‌ అనని ఆ డైలాగ్‌ను ఆపాదిస్తూ విషప్రచారాన్ని ఉధృతం చేసింది.

India Mandates ABS on All Two Wheelers Starting 20269
అన్ని టూవీలర్లలో ఏబీఎస్‌ తప్పనిసరి

రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.పెరుగుతున్న ప్రమాదాలుదేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్‌ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.త్వరలో రెండు హెల్మెట్లు..ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్‌ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అడ్వాన్స్‌గా ఆరు నెలల రెంట్‌.. ఆపై ఎన్నో ఛార్జీలుధరలు పెరుగుతాయా..?ఏబీఎస్‌ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.

Jadoo diet for weight loss Cardiologist assures shed at least 7 kg in 1 month10
నో డైటింగ్‌, ఓన్లీ జాదూ డైట్‌ : నెలలో 7 కిలోలు తగ్గడం పక్కా!

బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాలి.చెమటలు చిందించాలి చాలామంది మదిలో మెదిలే ఆలోచన ఇది. కానీ ఇవేమీ లేకుండానే హ్యాపీగా నెలకు 7 కిలల దాకా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ఒక వైద్యుడు. అదీ కఠినమైన డైట్ లేకుండా బరువు తగ్గడం సాధ్యమే అంటున్నారు. మరి ఆ జాదూ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా.. పదండి.. ఆలస్యం ఎందుకు..!నాన్-ఇన్వాసివ్ కార్డియాలజీలో నిపుణుడైన కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజెర్ సోషల్‌మీడియా ద్వారా తన ఫాలోయర్లకు అనేక ఆరోగ్య చిట్కాలను అందిస్తూ ఉంటారు. తాజాగా 'జాదూ డైట్ (మ్యాజిక్ డైట్) ఫర్ వెయిట్ లాస్' అంటూ కొన్ని వివరాలను షేర్‌ చేశారు. ఆయన షేర్‌ చేసిన వీడియో ప్రకారం ఇది శాకాహారంతో బరువు తగ్గించుకునే ఒక ప్రణాళిక. కడుపు మాడ్చుకోవాల్సి అవసరం లేకుండానే సరళమైన డైట్‌తో కేవలం ఒక నెలలో కనీసం 7 కిలోల బరువును తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని హామీ ఇస్తున్నారు కూడా.వెయిట్‌ లాస్‌ జర్నీ- చిట్కాలుడాక్టర్ బిమల్ ఛాజెర్ చెబుతున్న డైట్ సరళమైన, ఆరోగ్యకరమైన ఆహారాల కలయితో ఉంటుంది. బరువు తగ్గడం మాత్రమే కాకుండా ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిదనీ, ఆకలితో ఉండకుండా కేలరీల లోటును భర్తీ చేసి.శరీరం సహజంగా కొవ్వును కరిగించడానికి అనుమతిస్తుంది. ఇదీ చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్‌ డైట్‌తో'జాదూ డైట్ ఫర్ వెయిట్ లాస్'మనం మన కడుపును అధిక కేలరీల ఆహారంతో నింపితే, మన బరువు పెరుగుతుంది, అదే తక్కువ కేలరీల ఆహారంతో నింపితే, ఆకలీ వేయదు, బరువూ పెరగదు సింపుల్‌ మ్యాజిక్‌ అంటారాయన. స్వీట్‌ కార్న్‌, బీట్‌ రూట్‌, క్యారెట్లతో చేసిన సలాడ్‌, గుమ్మడికాయ, బీన్స్‌, ‍క్యారెట్‌ ముక్కలు, రాగిపిండితో చేసిన సూప్‌ ఇలాంటివి ఆయన షేర్‌ చేసిన వీడియో మనం చూడవచ్చు.జాదూ డైట్‌లో నిజానికి బాగా తినాలి, కానీ లో-కేలరీల ఆహారాలకు కట్టుబడి ఉండాలి. ఉదాహరణకు పండ్లు, కూరగాయలు, సలాడ్‌లు...ఇది శరీరాన్ని ఆహారం లేకుండా ఉంచకుండా వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఫలితంగా నెలలో 7 కిలోల బరువు తగ్గడం పక్కా..అది కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అని చెప్పారు. View this post on Instagram A post shared by Food Link (@ig_foodlink)ఆహారంగా ఇంకా ఏం తీసుకోవచ్చుబ్లాక్ టీ తాగవచ్చు. ఎక్కువ పండ్లు తీసుకోవాలి. ప్రోటీన్ , ఇతర పోషకాల కోసం మూంగ్ లేదా మసూర్ దాల్‌ తీసుకోవచ్చు. ఇందులో దోసకాయ, బీట్‌రూట్ క్యారెట్‌ ఇలా పచ్చి కూరగాయలతో కలిపి పప్పును తినవచ్చు.రాత్రి భోజనంలో సూప్‌తో పాటు సలాడ్ , ఉడికించిన కూరగాయలుఎన్ని రోజులు చేయాలి?ఈ డైట్‌ను కేవలం ఒక నెల పాటు మాత్రమే సాగించాలి.దీన్ని ఎప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదు. ఈ డైట్‌తో మీరు సుమారు 3 నెలల్లో 10-20 కిలోలు తగ్గవచ్చు. ఈ జాదూ డైట్ అద్భుతంగా పనిచేస్తుందనంటూ కోలకత్తాకు చెందిన ఒక మహిళ 86 నుంచి -62 కిలోలకు బరువు తగ్గిన వైనాన్ని ఉదహరించారు.గమనిక: ఈ కథనం డా. బిమల్‌ షేర్‌ చేసిన సమాచారం ప్రకారం అందించినంది మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో ఎల్లప్పుడూ వైద్య సలహాలు తీసుకోవడం ఉత్తమం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement