సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూపు-1 మెయిన్స్ రీ ఎగ్జామ్ను ఈనెల 14 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. హైదరాబాద్లోని 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. 14న పేపర్-1, 17న పేపర్-2, 19న పేపర్-3, 21న పేపర్-4, 23న పేపర్-5, 24న జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని వివరించారు. ఈ పరీక్షలకు 8,782 మంది హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 8:30 గంటల నుంచి 9:15 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. బయోమెట్రిక్ డేటా, ఫొటో, వేలిముద్రలు సేకరిస్తున్నందున 9:15 లోపే పరీక్ష హాల్లోకి వెళ్లాలని తెలిపారు. హాల్టికెట్తోపాటు వ్యాలిడ్ ఐడెంటిటీ కార్డు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. సెల్ఫోన్లు, క్యా ల్కులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి తీసుకెళ్తే డీబార్ చేస్తారని హెచ్చరించారు. 2 ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.