రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన | double bedroom flats foundation in telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన

Published Thu, Oct 22 2015 2:30 PM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో  అత్యంత ప్రధానమైన హామీ అయినప్పటికీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా చేపట్టలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని విజయదశమి రోజున ప్రభుత్వం ఆరంభించింది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిమోజక వర్గాల్లో లాంఛనంగా ప్రారంభించింది. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఎంపీలు , ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా శంకుస్థాపనలు జరిపారు.

నిజామాబాద్: జిల్లాలోని బోధన్ మండలం ఆటోనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థలాలకు ఎంపీ కవిత భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షఖీల్, ఇతర నేతలు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్: వీరన్న పేటలో ఇళ్ల స్థలాలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ శ్రీదేవి లు భూమి పూజ చేశారు.

నల్లగొండ: జిల్లాలోని చౌటుప్పల్ లో ఇళ్ల స్థలాలకు మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముక్తాబాద్, గంభీరావు పేటలో నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement