Double Bedroom Housing Scheme
-
గజ్వేల్ లో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఆందోళన
-
‘ఇందిరమ్మ’గా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు..!
సాక్షి, హైదరాబాద్: పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లతోపాటు అసంపూర్తిగా ఉన్న వాటిని సిద్ధం చేసి.. ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయబోతోంది. తొలి విడత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్న వారికే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లున్న ప్రాంతాల్లో.. వాటిని సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించింది. దాదాపు లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు సొంత జాగా లేని ‘ఇందిరమ్మ’లబ్ధిదారులకు అందనున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2.90 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 2.28 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. కానీ, లబ్ధిదారుల ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపేసింది. సొంత నిధులను కావాల్సినన్ని కేటాయించకపోవటంతో ఆ ఇళ్ల నిర్మాణం మందగించింది. చివరకు పథకమే గందరగోళంగా మారింది. ఇప్పుడు ఆ ఇళ్లలో దాదాపు 60 వేలను లబ్ధిదారులకు మంజూరు చేయగా, మిగతావి వృధాగా ఉన్నాయి. పూర్తయిన వాటిని, అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేసి.. ఇందిరమ్మ పథకం కింద పంపిణీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. అసంపూర్తి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఆ పనులు జరుగుతున్నాయి. సొంత జాగా లేనివారికి కూడా జాబితాలో చోటు.. ఈ నెల 21 నుంచి ఊరూరా గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు. ఈ దఫాలో కేవలం సొంత జాగా ఉన్న వారికే ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కానీ, సొంత జాగా లేనివారిలో అర్హులైనవారిని గుర్తించి, వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. గ్రామ సభల్లో వారి జాబితాను కూడా ప్రదర్శించాలని పేర్కొంది. ప్రజా పాలనలో భాగంగా అందిన దరఖాస్తుల్లో సొంత జాగా లేని వారి వివరాలను కూడా తనిఖీ చేసి, వారు అర్హులైతే ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారు. తనిఖీ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో, ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాను రూపొందించటమే తరువాయి. అలా సొంత జాగా లేని అర్హులున్న గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉంటే.. వాటిని వారికి మంజూరు చేస్తారు. అందుకోసం కలెక్టర్లు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఇందిరమ్మ ఇంటికి ఇక్కట్లు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట.. పట్టణ ప్రాంతాల్లో అంతస్తులుగా నిర్మించే పేదల ఇంటికి లబ్ధిదారు వాటా ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ.. కేంద్రం పెట్టే నిబంధనలు పాటిస్తేనే.. పేదల ఇళ్ల కోసం ఢిల్లీ నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అంటే.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే గృహ సముదాయాలకు లబ్ధిదారులు వాటా చెల్లించాలి. లేదా ఆ వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి నిధులు అందుతాయి. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించే ప్రభుత్వ పథకాల విషయంలో లబ్ధిదారుల వాటా అంశాన్ని కేంద్రం తాజాగా తెరపైకి తెచ్చింది. అయి తే వ్యక్తిగత (ఇండిపెండెంట్) ఇళ్లకు లబ్ధిదారుల వాటా లేకున్నా.. అంతస్తుల వారీగా నిర్మించే గృహ సముదాయాల విషయంలో లబ్ధిదారుల వాటా ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టే పథకాలకు ఇది వర్తించకున్నా.. కేంద్ర ప్రభుత్వ చేయూతతో అమలు చేసే పథకాల్లో మాత్రం ఈ నిబంధనను అమలు చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేదలు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకునేందుకు సొంత జాగా ఉండటం కష్టమే. అందుకే అపార్ట్మెంట్ల తరహాలో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తోంది. గతంలో వాంబే పథకం, ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, ఇటీవల డబుల్ బెడ్రూం ఇళ్లు అదే తరహాలో నిర్మితమయ్యాయి. కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ పథకం కింద కూడా ఇళ్ల సముదాయాలనే నిర్మించి ఇవ్వనుంది. ఈ తరహా ఇళ్లకు లబ్ధిదారుల వాటా చూపాలని కేంద్రం అడుగుతోంది. పైసా అవసరం లేదన్న రాష్ట్ర సర్కారు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. కానీ కేంద్ర నిబంధన ప్రకారం.. యూనిట్ కాస్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం భరించే రూ.5 లక్షలకుతోడు లబ్ధిదారుల వాటాను కూడా చూపించాల్సి వస్తుంది. ఆ మొత్తాన్ని లబ్ధిదారులు చెల్లించడంగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంగానీ తప్పదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇక ఎక్కువ అంతస్తులుగా నిర్మించే ఇళ్లకు వ్యయం ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.ఏడు లక్షల నుంచి రూ.8 లక్షల చొప్పున ఖర్చయ్యాయి. ఈ క్రమంలో యూనిట్ కాస్ట్కు అదనంగా అయ్యే మొత్తాన్ని లబ్ధిదారు వాటాగా చూపే చాన్స్ ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రణాళిక ఏంటి? తొలుత ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్నవారికే మంజూరు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో సొంత జాగా ఉన్న పేదల సంఖ్య నామమాత్రమే. అలాంటప్పుడు పేదలకు ఇళ్లు ఎలాగనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ దిశగా ప్రభుత్వ ప్రణాళిక ఏమిటనే చర్చ జరుగుతోంది. -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలకు నిలయంగా మారిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
Hydra: కూల్చివేతలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీగర్భం, బఫర్ జోన్లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపునకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడటంతో రెవెన్యూ యంత్రాంగం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్ మార్కింగ్ నిలిచిపోగా, నివాసాలు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్లకు తరలిన కుటుంబాల ఇళ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూల్చివేశారు. మిగతా కూల్చివేత పెండింగ్లో పడింది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినా..వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. సర్కారు మాత్రం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా...నివాసితులకు పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది. ఆదిలోనే హంసపాదు మూసీ ప్రక్షాళనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నదీ పరీవాహకం పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్మార్కింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకాగా, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. మరోవైపు నివాసితులకు ప్రతిపక్ష పారీ్టల మద్దతు పెరగడంతో వారు సైతం ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నదీగర్భంలో రెడ్మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పరీవాహక పరిధిలో 12,184 పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీగర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా, అందులో 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు గల బఫర్జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు, ఇందులో 1032 బడా నిర్మా ణాలున్నట్లు అ«ధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది. పునరావాసంపై అయోమయం మూసీ నదీ గర్భంలోని నివాసితులు పునరావాసం సమస్యగా తయారైంది. అధికార లెక్కల ప్రకారం 2166 డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉంటుంది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను పునరావాసం కల్పించాల్సిన ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గహాలు 500కు పైగా కూడా లేనట్లు తెలుస్తోంది. నివాసాలు ఖాళీ చేసిన సుమారు 10 శాతం కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగారు. సైదాబాద్, హిమాయత్నగర్,æ నాంపల్లి మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్పేటలోని పిల్లిగుడిసెలు, జియా గూడ, ప్రతాపసింగారం, జంగంమెట్లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. మిగతా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
Operation Musi: మూసీ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా నిరసన గళం తీవ్రమవుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలకు రెండోరోజు శుక్రవారం తీవ్ర నిరసన ఎదురైంది. బాధితులు అడుగడుగునా అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. రోడ్లపై బైటాయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అధికారులను వెనక్కి పంపించారు. నిర్వాసితులకు కాంగ్రెసేతర పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. చైతన్యపురిలో బాధితుల ఆందోళనలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. కొత్తపేట మారుతినగర్లో ఒక యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. మూసీ పరీవాహక ప్రాంతం పరిధిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే బృందాలు మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మొదటి విడతగా మూసీ నదీగర్భం (రివర్ బెడ్) పరిధిలోని నిర్మాణాల కూల్చివేత కోసం మార్కింగ్ చేసే ప్రక్రియ గత రెండు రోజులుగా కొనసాగుతోంది. అయితే తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ అందిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి, పక్కా గృహాలు నిరి్మంచుకున్న వారు మాత్రం కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనకు దిగుతున్నారు. దీంతో మార్కింగ్కు ఆటంకాలు తప్పడం లేదు. పునరావాసంపై అయోమయం మూసీ నిర్వాసితులకు పునరావాసంపై అయోమయం నెలకొంది. అర్హులైన నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంటింటి సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసినప్పటికీ గతంలో జీఐఎస్ సర్వే ద్వారా గుర్తించిన గృహాలపైనే మార్కింగ్ వేస్తూ ఆ కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటిలో పక్కాగృహాలకు మార్కింగ్ వేయకపోవడం, ఆ కుటుంబాల వివరాలు సేకరించడం పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేక పోతున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా ఆరు నెలల క్రితం మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మా ణాలున్నాయో గుర్తించింది. వాటిని జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్)తో అనుసంధానం చేసింది. ప్రస్తుతం దాని ప్రకారమే రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించి ప్రత్యేక యాప్లో పొందుపర్చుతున్నారు.అన్ని గృహాలపై ఆపరేషన్ మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి విడతగా నదీ గర్భంలోని నివాసాలపై ఆపరేషన్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కూల్చివేత బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. దీంతో నదీగర్భం పరిధిలోని గల ఆర్బీ–ఎక్స్(రివర్ బెడ్) మార్కింగ్ పడిన గృహాలతో పాటు దాని వెంట ఉన్న గృహాలు సైతం కూలి్చవేయక తప్పని పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.నిర్వాసితుల తరలింపు మూసీ నిర్వాసితులైన 20 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించి పునరావాసం కలి్పంచినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం హిమాయత్నగర్ మండలంలోని శంకర్నగర్ కాలనీకి చెందిన 6 కుటుంబాలు, వినాయక వీధిలోని మూడు కుటుంబాలను మలక్పేట పిల్లిగుడిసెల సముదాయానికి, నాంపల్లిలోని 11 కుటుంబాలను ఆసిఫ్నగర్ జియాగూడ సముదాయానికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. వేల సంఖ్యలో నివాసాలు.. మూసీ పరీవాహక పరి«ధి పొడువునా..నదీ గర్భంలో వేల సంఖ్యలో గృహాలు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో మాత్రమే డ్రోన్ సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది. సర్వే ఆధారంగా ప్రభుత్వం నదీ గర్భంలో సుమారు 2166 నివాసాలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంటుంది. అందులో సుమారు 288 భారీ కట్టడాలు ఉన్నాయి. వాస్తవానికి ఒక్కో మండలంలోని పలు ప్రాంతాల్లో వందలాది గృహలు నదీ గర్భంలో ఉన్నప్పటికీ జీఐఎస్ డేటా ప్రకారమే గృహాలపై రెడ్ మార్కింగ్ వేస్తూ పునరావాసం కోసం వివరాలు సేకరించడం విస్మయానికి గురిచేస్తోంది. -
మా జోలికి రావొద్దు.. మేం ఖాళీచేయం
జనగామ, సాక్షి: పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్న కొన్ని కుటుంబాలను ఖాళీ చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. వాళ్లు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమను ఖాళీ చేయించొద్దని పాలకుర్తి రెవెన్యూ సిబ్బందిని వాళ్లు వేడుకున్నారు. అయినా అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో.. పెట్రోల్ బాటిల్తో ఆత్మహత్యాయత్నం చేస్తామని బెదిరింపులకు దిగారు. తమలోనూ అర్హులైన వాళ్లం ఉన్నామని, తక్షణమే గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కొందరు మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పోలీసుల సాయంతో వాళ్లను అడ్డుకుని ఖాళీ చేయించాలని యత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. -
‘మూసీ’ నిర్వాసితులకు ‘డబుల్’ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని చెరువులు, నాలాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నివసిస్తున్న అర్హులైన పేదలెవరూ నిరాశ్రయులు కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జల వనరుల పరిరక్షణలో పేదలు రోడ్డున పడవద్దని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. నీటి వనరుల పరిరక్షణకు వారు సహకరించేలా ఒప్పించడంతోపాటు అర్హులైన పేదలకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ మంగళవారం జూబ్లీహిల్స్లోని నివాసంలో మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు తేల్చండి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని.. ఆక్రమణల వివరాలన్నీ సేకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఏర్పాటు చేయాలని, దీనిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణపై పూర్తిస్థాయి డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలన్నారు. నేటి నుంచే ‘మూసీ’ పునరావాస ప్రక్రియ! మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్లలో నివాసమున్న వారికి పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో.. పునరావాస ప్రక్రియను బుధవారం ప్రారంభించనున్నారు. 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. బుధవారం నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు.. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరించనున్నారు. తొలుత రివర్ బెడ్లోని 1,600 ఇళ్లను తొలగిస్తారు. వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారు. ఇక మూసీ బఫర్జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సదరు నిర్మాణ ఖర్చుతోపాటు పట్టా ఉన్న భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కేటాయిస్తారు. -
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టులో నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ఈ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా మూసీ నదిని ప్రక్షాళన చేసి.. దానిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరిసరాల్లో నివసిస్తున్న కుటుంబాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్ బెడ్ రూం గృహాలను ఇవ్వనుంది ప్రభుత్వం.చదవండి: ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్కు కోర్టు ఆదేశంమూసీలో మొత్తం 10,200 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు.మరోవైపు రివర్ బెడ్లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలించనుంది ప్రభుత్వం. మూసీ బఫర్ జోన్లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. నిర్మాణ ఖర్చుతో పాటు, పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించనుంది. వీటితోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేటాయించనుంది. -
‘డబుల్’ ఇళ్లకు కావాల్సింది రూ. 4వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే...దాదాపు రూ. 4 వేల కోట్లు కావాలి. అయితే కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే నిధులు రూ.400 కోట్లు మాత్రమే. ఇటీవల రాష్టŠట్ర ప్రభుత్వం డబుల్ ఇళ్లను పూర్తిచేసి లబి్ధదారులకు వీలైనంత త్వరలో అందజేస్తామని శాసనసభలో ప్రకటించింది. కానీ బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు ఇందిరమ్మ పథకానికే సరిపోయే పరిస్థితి. దీంతో డబుల్ బెడ్రూం ఇళ్లకు నిధులు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. లబ్ధిదారుల జాబితా అందజేసినా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన డబుల్ బెడ్రూం పథకంలో కొన్ని ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. గత సర్కారు 2.90 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి టెండర్లు పిలిచింది. 2.28 లక్షల ఇళ్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలు జరిగాయి. అందులో 1.53 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగతావి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇంకా ఒప్పందం జరగని ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది.డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. అందులో తొలి విడతగా అప్పట్లోనే రూ.1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం..లబ్దిదారుల జాబితాను అందించాకే రెండో విడత నిధులు విడుదలవుతాయి. కానీ అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం లబి్ధదారుల ఎంపిక చేపట్టలేదు. దీంతో నిధులు ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా సరిపోక ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఆ ఇళ్లను పూర్తి చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 69వేల మంది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి అందించగా.. మలి విడతగా రూ.500 కోట్లు ఇటీవల విడుదల అయ్యాయి. దీంతో ఇప్పటివరకు రూ.1,600 కోట్లు అందగా, మరో రూ.400 కోట్లు మాత్రమే రావాల్సి ఉంది. కానీ డబుల్ ఇళ్లన్నీ పూర్తి చేయాలంటే రూ.4 వేల కోట్లు కావాలని లెక్కలు వేశారు. ఈ నిధుల సర్దుబాటు ఎలాగన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నే హడ్కోవంటి సంస్థల నుంచి రుణం పొంది ప్రారంభించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రూ.3 వేల కోట్ల రుణం మంజూరైంది. దీనికితోడు బడ్జెట్లో రూ.ఏడున్నరవేల కోట్లు ఇళ్లకు కేటాయించారు. ఇవన్నీ కూడా ఇందిరమ్మ పథకానికే సరిపోవని.. డబుల్ ఇళ్ల పూర్తి ఎలాగన్నది తేలడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
గూడు రాక.. గోస తీరక..
సాక్షి, పెద్దపల్లి: పేద, మధ్యతరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల తీరడం లేదు. సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ సామాన్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా అమలు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు నెలలు గడుస్తున్నా హక్కుపత్రాలు అందడంలేదు. దీంతో వారు ప్రత్యక్ష ఆందో ళనకు దిగుతున్నారు. కళ్లెదుటే ఇళ్లు కనిపిస్తున్నా.. వాటిని కేటాయించకుండా తాత్సారం చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.డబుల్బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పన పూర్తికాలేదని, అందుకే కేటాయించడం లేదని అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పిన అధికారులు.. ఇంకా కాలయాపన చేయడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే తమకు ఇళ్ల కేటాయించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటిని పంపిణీ చేస్తారా? లేక రద్దు చేస్తారా? అని పేద కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.డబుల్ ఇళ్లకు 2,17,925 దరఖాస్తులు..● ఇళ్లులేని, స్థలం ఉన్నా నిర్మించుకునే స్థోమతలేనివారి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది.● జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి తొలివిడతలో మూడు వేల ఇళ్ల చొప్పున కేటాయిస్తూ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.● ఈక్రమంలో జిల్లాకు 8,475 ఇళ్లు కేటాయించగా, 33,816 మంది దరఖాస్తు చేసుకున్నారు.● వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికార యంత్రాంగం.. అందులో 25,040 మందిని అర్హులుగా గుర్తించింది.● జిల్లాలోని ఒక్క మంథని నియోజకవర్గంలోని 454 మంది లబ్ధిదారులకే ఇళ్ల మంజూరుపత్రాలు అందజేసింది.● పెద్దపల్లి, రామగుండంలో ఐదుగురు చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు.● ఈక్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.● కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి, దానిస్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది.● దీనికింద కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారికి రూ.5లక్షల సాయం చేస్తామని హామీ ఇచ్చింది.● ఇందులో భాగంగా ఆరు రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ‘అభయహస్తం’ పేరిట దరఖాస్తులు స్వీకరించింది.● జిల్లావ్యాప్తంగా 2,17,925 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో మెజార్టీ కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.● అయితే, ఇళ్ల హక్కు పత్రాలు ఎప్పుడు కేటాయిస్తారో, తాము ఆ ఇళ్లలోకి ఎప్పుడు వెళ్తామోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.ఇవి పెద్దపల్లి సమీప కూనారం రోడ్డు, చందపల్లి ప్రాంతాల్లో నిర్మించిన 484 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. 2023 మార్చి 15న అధికా రులు డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెలలు గడుస్తున్నా నివాసయోగ్యానికి అవసరమైన ప్రొసీడింగ్ కాపీలు ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేదు.హక్కుపత్రాలు ఇవ్వాలని లబ్ధిదారులు ఇటీవల కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తామేమీ చేయలేమని అప్పటి కలెక్టర్ వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించివేశారు. కోడ్ ఎత్తివేశాక పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఇటీవల డబుల్బెడ్రూమ్ ఇళ్లు పరిశీలించారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.కలెక్టర్కు వినతిపత్రం అందిస్తున్న వీరు డబుల్బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియా, మాల్కాపూర్ శివారులో నిర్మించిన 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిజర్వేషన్ ప్రాతిపదికన గత ప్రభుత్వం 2023 మార్చి 16న డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఎవరికీ హక్కుపత్రాలు ఇవ్వలేదు. దీంతో సోమవారం వారు ప్రజావాణికి హాజరై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. -
‘గృహలక్ష్మి’ దరఖాస్తులు పరిశీలించొద్దు!
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం సేకరించిన 15 లక్షల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తోంది. మంజూరు చేసే వేళ ముంచుకొచ్చిన ఎన్నికలు గత ప్రభుత్వం తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ యూనిట్ కాస్ట్తో, దేశంలో ఎక్కడా లేనట్టుగా ఉచితంగా రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. కానీ వాటి యూనిట్ కాస్ట్ సరిపోవటం లేదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటం, సాంకేతికంగా కొన్ని లోపాలు చూపి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులు నిలిపేయటం, కొన్ని అంతర్గత లోపాలు.. వెరసి ఆ పథకం అంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఏడాది క్రితం.. దాని స్థానంలో గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. సొంత జాగా ఉండి ఇల్లు లేని పేదలకు రూ.3 లక్షలను అందించి వారే ఇళ్లను నిర్మించుకునేలా దీన్ని రూపొందించారు. ఇంచుమించు ఇందిరమ్మ పథకం తరహాలోనే డిజైన్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని దరఖాస్తులు ఆహ్వానించింది. 15 లక్షల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వాటిల్లో 12 లక్షలు అర్హమైనవిగా గుర్తించారు. వాటిల్లో నుంచి 4 లక్షల దరఖాస్తులు ఎంపిక చేసే వేళ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. చివరి తేదీ రాత్రి వరకు దాదాపు2 లక్షల దరఖాస్తులకు సంబంధించి జాబితాను సిద్ధం చేశారు. వారికి నిధులు ఇచ్చేందుకు వీలుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ, అప్పటికే ప్రచారం తారస్థాయికి చేరుకోవటంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ దరఖాస్తులను రిజెక్టు చేస్తుందేమోనన్న భయంతో కొందరు దరఖాస్తుదారులు కూడా అధికారులపై ఒత్తిడి చేయకుండా ఎన్నికలయ్యే వరకు వేచిచూసే ధోరణి అవలంబించాలని నిర్ణయించారు. వారు అనుకున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం తమ దరఖాస్తులను పరిశీలిస్తుందని వారు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఆ దరఖాస్తులను పరిశీలించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సభల్లో కొత్త దరఖాస్తులు.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాత ప్రభుత్వం సేకరించిన దరఖాస్తులను పక్కన పెట్టి కొత్తగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టులో గిరిజనప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ అంశంపై ఓ కేసు విచారణకు వచ్చింది. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాల్సి ఉంటుంది. గిరిజనులకు దక్కాల్సిన లబ్ధి గిరిజనేతరులు తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతో వారికి రక్షణగా ఈ నిబంధన ఏర్పాటు చేశారు. గృహలక్ష్మి పథకంలో దరఖాస్తుల స్వీకరణలో ఈ నిబంధనల పాటించలేదన్నదని ఫిర్యాదు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ జరిగిందన్న వాదనను ఇప్పుడు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. సరిగ్గా ఎన్నికల వేళ దరఖాస్తుల పరిశీలన జరిగిన నేపథ్యంలో మొత్తంగా ఆ దరఖాస్తులను పక్కనపెట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
వచ్చేవి గృహలక్ష్మి ఇళ్లా! లేక.. ఇందిరమ్మ ఇళ్లా!
దురాజ్పల్లి (సూర్యాపేట): గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుదారుల్లో సందిగ్ధ్దత నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తులు ఆమోదిస్తారా? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మళ్లీ స్వీకరిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్చి ఉంది. ఒకవేళ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తే గతంలో గృహలక్ష్మి పథకం కింద ఎంపికై ఇళ్ల మంజూరు పత్రాలు అందించిన చోట ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే ఇప్పటి వరకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు వృథాయేనా? అనే గందరగోళ పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూం సక్సెస్ కాకపోవడంతో.. గృహలక్ష్మి పథకానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. జిల్లాలో అనుకున్న స్థాయిలో ఆ పథకం సక్సెస్ కాలేదు. లబ్ధిదారులు ఎక్కువగా ఉండటం.. నిర్మించిన ఇళ్లు తక్కువ కావడంతో సర్వత్రా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సొంతస్థలం ఉన్న వారికి గృహ నిర్మాణం కోసం మూడు విడతల్లో రూ.3లక్షల నగదు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో మొత్తం 58,564 దరఖాస్తులు రాగా క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు పరిశీలించారు. వీటిలో 34,849 మందిని అర్హులుగా తేల్చి ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల యూనిట్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోకవర్గాల్లో 12వేల యూనిట్లకు మంజూరు పత్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. దీంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. మిగతా ఆశావహులు సైతం వారికి అందుతాయని భావించారు. ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం చకచకా జరిగిపోయాయి. తమ హామీల్లో భాగంగా గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం అమలు చేయాలని యోచిస్తోంది. దీంట్లో భాగంగా ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ప్రకటించింది. సాయం పెంపుపై అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నా.. కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తారో, విధివిధానాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో సుమారు 70 వేలకు పైగా కుటుంబాలు సొంతిల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తున్నట్టు సమాచారం. -
మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి గృహనిర్మాణ శాఖను పునరుద్ధరించబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల కోసం లక్షల సంఖ్యలో ఇళ్లను నిర్మించారు. ఆ సమయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలు చేస్తూ సీఐడీతో దర్యా ప్తు చేయించింది. చివరకు గృహ నిర్మాణ శాఖే లేకుండా చేసింది. రోడ్లు భవనాల శాఖలో ఓ విభాగంగా మార్చేసింది. అందులోని సిబ్బంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. కాగా త్వరలో సీఎం రేవంత్రెడ్డి గృహ నిర్మాణాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం అందటంతో, ఆగమేఘాల మీద అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శాఖను పునరుద్ధరించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. వైఎస్ హయాంలో 14 లక్షల ఇళ్లు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ పరిధిలో ఏకంగా 14 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మితమయ్యాయి. 2004–2009 మధ్యలో ఈ ఇళ్లు రూపొందగా, ఆ తర్వాత 2014 వరకు కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే నిర్మితమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అయితే తొమ్మిదేళ్లలో లక్షన్నర ఇళ్లను కూడా పూర్తి చేయలేకపోయింది. తర్వాత గృహలక్ష్మి పేరు తో ఇందిరమ్మ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా, దరఖాస్తులు స్వీకరించే సమయానికి ఎన్నికలు రావటంతో అది కాస్తా ఆగిపోయింది. ఇప్పు డు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. గృహలక్ష్మి పథకంలో లబ్ధిదారులకు రూ.3 లక్షలు చొప్పు న ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి యూనిట్ కాస్ట్ను రూ.5 లక్షలుగా ఖరారు చేసింది. అదనంగా సిబ్బంది కావాల్సిందేనా..? గృహనిర్మాణ శాఖలో 1983–87 మధ్య సిబ్బంది నియామకం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ మాత్రమే జరిగింది. కాలక్రమంలో చాలామంది పదవీ విరమణ చేశారు. అయితే రిటైర్మెంట్ వయసు పెంపు కారణంగా మొత్తం మీద 500 మంది వరకు ఉండగా, శాఖను రద్దు చేయటంతో 450 మంది వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. దీంతో కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించాలంటే పాత సిబ్బంది తిరిగి రావటమే కాకుండా, అదనపు సిబ్బంది కావాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకుంటే మంచిదన్న సూచనలు అందుతున్నాయి. ఆ దరఖాస్తులేం చేస్తారు? గత ప్రభుత్వం చివరలో ప్రారంభించిన గృహలక్ష్మి పథకం కోసం 14 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిల్లో అర్హమైనవి 11 లక్షల వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడా పథకమే లేకుండా పోనుంది. దీంతో ఆ దరఖాస్తులను ఏం చేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
రూ. లక్ష పెంచితేనే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల పనులు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు. అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్గా మారబోతోంది. ఎందుకు పెంచుతున్నారంటే.. ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది. కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది. -
కేసీఆర్కు దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయాలి
కొడంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం ఆయన కొడంగల్కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి నివాసానికి వెళ్లి దేశ్ముఖ్ కుటుంబ సభ్యులకు జమ్మి పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తన నివాసానికి చేరుకొని అభిమానులు, పార్టీ శ్రేణులతో ముచ్చటించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందన్నారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన అన్ని ప్రభుత్వ భవనాలను తానే మంజూరు చేయించినట్లు చెప్పారు. 2018లో పోలీసులను అడ్డు పెట్టుకొని తనను ఓడించారని, ఇప్పుడు కూడా పోలీసుల సాయంతో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్కు కేసీఆర్ అన్యాయం అన్ని విషయాల్లోనూ సీఎం కేసీఆర్ కొడంగల్ నియోజకవర్గానికి అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చి రైతుల కాళ్లు కడుతానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ ఊసేలేదని మండిపడ్డారు. కొడంగల్ను కేసీఆర్ రెండు ముక్కలు చేసి పాలనాపరమైన ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగులంతా ఏకమై కేసీఆర్ను ఇంటికి పంపాలని రేవంత్ పిలుపునిచ్చారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తామని, కేసీఆర్ చేసిన రుణమాఫీ బ్యాంకుల మిత్తీకి కూడా సరిపోలేదన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గంలోని 8 మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
డబుల్ కల నెరవేరేది ఎప్పుడు..?
మంచిర్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గత మార్చి 17న కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అప్పగించలేదు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పట్లో పేదల డబుల్ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. షెడ్యూల్ వస్తే మరింత జాప్యం అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు డ్రాలో వచ్చిందని మున్సిపల్ అధికారులకు, రెవె న్యూ అధికారులకు, కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 85 ఫిర్యాదులను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో మరోసారి సర్వే చేసి, 50 మందిని అనర్హులుగా గుర్తించారు. వారికి మినహా మిగతా వారికి డబుల్ బెడ్రూంలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే మరింత ఆలస్యంగా ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పునఃపరిశీలన పేరుతో అసలైన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించడం లేదు. రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేస్తున్నా అనర్హులను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నికల కోడ్ రాకముందే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 360 నిర్మాణాలు పూర్తి.. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన 330 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 5 వేల దరఖాస్తులు.. ఇక 330 ఇళ్ల కోసం 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొదటగా 2,958 మందిని అర్హులుగా గుర్తించారు. మండల రెవెన్యూ అధికారులతోపాటు, జిల్లాస్థాయి అధికారులు రెండుసార్లు సర్వే చేసి, అర్హులు 1,616 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారికి టోకెన్లు అందించారు. మార్చి 17న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టోకెన్లు తీసుకున్న వారి సమక్షంలోనే లక్కీడ్రా పద్ధతిలో 330 మందిని ఎంపిక చేశారు. స్థలం ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం డబుల్ బెడ్రూం ఇళ్లు లక్కీడ్రాలో పొందారని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, 50 మంది వరకు స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూం ఇళ్లను వదులుకున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రం ఇప్పటి వరకు ఇళ్లను అప్పగించలేదు. -
ఇలాంటి ఇళ్లు చూపిస్తే రాజీనామా చేస్తా
రామచంద్రాపురం (పటాన్చెరు): సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లు దేశంలో ఎక్కడైనా కట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సవాల్ విసిరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో పేదల కోసం ఇలాంటి ఆధునిక ఇళ్లు కట్టించిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయాలన్న లక్ష్యంతో రూ.కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా తానే తీసుకెళ్లి ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను చూపించానని తలసాని చెప్పారు. కానీ ఈ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియదన్నట్లు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారని, ఆయన వివేకానికే వదిలేశానని వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, దానం నరేందర్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
'ఇళ్ల స్థలాలు రాలేదని..' సెల్ టవరెక్కి ఇద్దరు వ్యక్తులు హల్చల్!
భద్రాద్రి: ధన్బాద్ పంచాయతీ రెండో వార్డు సభ్యుడు, మాయాబజార్కు చెందిన పిచ్చేటి శివకుమార్, దనసరి బన్ను తమకు ఇళ్ల స్థలాలు రాలేదని సోమవారం 5 ఇంక్లైన్లో సెల్ టవరెక్కి నిరసన తెలిపారు. మాయాబజార్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయే వారికి ఈ నెల 3న సింగరేణి ప్రధాన కార్యాలయం సమీపంలో సుమారు 347 మందికి 100 గజాల చొప్పున కొత్తగూడెం ఎమ్మెల్యే చేతుల మీదుగా స్థలాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ జాబితాలో పేర్లు లేకపోవడంతో శివకుమార్, బన్ను మనస్తాపం చెంది సెల్టవర్ ఎక్కా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తల్లి దండ్రుల కాలం నుంచి సుమారు 60 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని తెలిపారు. వీకే–7ఓసీ విస్తరణలో భాగంగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, వేరే చోట స్థలాలు ఇస్తామని సింగరేణి, రెవెన్యూ, పంచాయతీ అధికారులు చెప్పారని తెలిపారు. సర్వే చేసిన జాబితాలో ఉన్న పేర్లు, పంపిణీ జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పేర్లు చేర్చారని, తమకు మాత్రం అన్యాయం చేశారని వాపోయారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝెర్రా కామేష్ అక్కడికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. దీంతో బాధితులు టవర్ దిగారు. అనంతరం పొంగులేటి ఫోన్ ద్వారా సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. కామేష్ మాట్లాడుతూ వీకే–7ఓసీ విస్తరణ బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. జాబితాలో కొందరు బాధితుల పేర్లు లేకుండా చేశారని, యూనియన్ నాయకులు, సొంత ఇళ్లు ఉన్నవారి పేర్లు అక్రమంగా చేర్చారని పేర్కొన్నారు. నేడు జరిగే పట్టాల పంపిణీని నిలిపివేసి, మళ్లీ సమగ్ర సర్వే చేయాలని డిమాండ్ చేశారు. సెల్ టవరెక్కిన మరో నిర్వాసితుడు ఇంటి స్థలం మంజూరు కాలేదని సోమవారం రాత్రి ఎస్ఆర్టీ కాలనీకి చెందిన యువకుడు రవితేజ కూడా రుద్రంపూర్లోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఓసీ విస్తరణ నిర్వాసితులకు పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల జాబితాలో పేరు లేకపోవడంతో ఆర్కే స్వామి చిన్న కుమారుడు రవితేజ సెల్ టవరెక్కి సుమారు మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశాడు. త్రీ టౌన్ సీఐ మురళి, డీటీ తిరుమల తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పారు. డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యువకుడు సెల్టవర్ దిగాడు. -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
‘కాంగ్రెస్ నాయకురాలికి డబుల్ ఇల్లు ఇచ్చాం.. ఇప్పుడేమంటారు’
సాక్షి, దుండిగల్: మంత్రి కేటీఆర్ మేడ్చల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా దుండిగల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ మాత్రమే. అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజలపక్షమే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదింమని కోరుతున్నాను. పేదలను ప్రేమించే నాయకుడు కేసీఆర్. కొత్త లింక్ రోడ్డు, బ్రహ్మండమైన నాలాలు నిర్మిస్తున్నాం. గతంలో మంచినీటి కోసం ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మంచినీటి కష్టాలు లేవు. కేసీఆర్ ప్రజల మనిషి.. ఇల్లు కట్టిసూడు-పెళ్లి చేసిచుడు అంటారు పెద్దలు. కానీ కేసీఆర్ మాత్రం ఇళ్ళు నేనే కట్టిస్తా..పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లుకు 10లక్షలు ప్రభుత్వానికి ఖర్చు అయితే.. దాని విలువ 30లక్షలు ఉంది. గ్రేటర్ పరిధిలో 50వేల కోట్లు ఖరీదు చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతోంది. జగద్గిరి గుట్టలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలికి ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు 30వేల ఇండ్లను పంపిణీ చేశాం. వికలాంగులు, దళితులు, పేదలకు ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. గ్రేటర్ పరిధిలో 1లక్ష ఇండ్లను ఎన్నికల లోపు చేస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారా?. దుండిగల్కి త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోంది అభివృద్ధి చెప్పుకోలేక కొత్త మార్గాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హామీలు ఇస్తే తొందర పడొద్దు. వాళ్ళు ఇచ్చే హామీలకంటే మంచి హామీలు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ఇళ్ల పంపిణీలో ఎవరి జోక్యం లేదు కాబట్టే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలకు ఇల్లులు వచ్చాయి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సెల్ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం -
తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం..
సాక్షి, రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2200 డబుల్ బెడ్రూం ఇళ్లల్లోనూ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంతో ఆందోళనకు దిగారు స్థానిక ప్రజలు. కాగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంకాల, తుక్కుగూడ, రావిరాల్, సర్దార్ నగర్ , ఇమామ్ గూడ గ్రామ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమకు కాకుండా.. పాతబస్తీ మలక్పేట్, చార్మినార్, చాంద్రాయణ్గుట్ట , యాకత్పురకు చెందిన వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులందరూ కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడి మున్సిపాలిటీ బంద్కు పిలుపునిచ్చారు. జేఏసీ పిలుపు మేరకు ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ నిరసన ర్యాలీ ప్రారంభించారు... -
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పనులు..! సొంతింటి కల నెరవేరేనా..?
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా.. ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ.. జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. -
డబుల్ బెడ్రూం ఇళ్ల ‘డ్రా పద్ధతి’పై హైదరాబాద్ కలెక్టర్ ముద్ర
హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ‘డ్రా పద్ధతి’పై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనదైన శైలిలో ప్రత్యేకతను ప్రదర్శించారు. దేశంలోనే తొలిసారిగా సరికొత్త ఆన్లైన్ ర్యాండమైజేషన్ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బిట్స్ పిలానీ ఐఐటీ, సివిల్స్ టాపర్ అయిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అధికారుల సహకారంతో ఆధునిక సాంకేతికతతో కూడిన ప్రత్యేక ఆన్లైన్ ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఆమోదం లభించింది. ప్రత్యేక డిస్ప్లే స్క్రీన్ ద్వారా.. గత నెల 24న హైదరాబాద్ కలెక్టరేట్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రాస్, మేడ్చల్ కలెక్టర్ అమయ్కుమార్ సమక్షంలో ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలో జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రత్యేక ఆన్లైన్ డిస్ప్లే స్క్రీన్ ద్వారా అర్హత సాధించిన దరఖాస్తుల జాబితా, ఆ తర్వాత ర్యాండమైజేషన్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక నిర్వహించి తుది జాబితా ప్రదర్శించారు. లబ్ధిదారు పేరు, ఆధార్, ఫోన్ నంబర్లు ప్రదర్శించేలా పారదర్శకత పాటించారు. కేవలం 30 నిమిషాల్లోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా లబ్ధిదారుల ఎంపిక విజయవంతం కావడంతో ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో సైతం ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలోనే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేశారు. ఇళ్ల కేటాయింపు సైతం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన 24 అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలోనే ఎంపికై న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. నగర శివారులోని ఎనిమిది ప్రదేశాల్లో నిర్మించిన డబుల్బెడ్రూం నివాస సముదాయాల్లో సుమారు 11,700 మంది లబ్ధిదారులకు ఆన్లైన్ ర్యాండమైజేషన్ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా, సునాయాసంగా జరిగేలా ఆధునిక సాంకేతికతతో కూడిన ఆన్లైన్ ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ను రూపొందించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. -
‘డబుల్ ఇంజన్’లో అన్నీ ట్రబుల్సే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో కొందరు నేతలు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మాట్లాడుతున్నారని... డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నారా అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నిరుపేదలకు ఇలాంటి గృహాలు ఇవ్వట్లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలకు ఆత్మగౌరవ గృహాలను పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం గృహ సముదాయంలో శనివారం 11,700 ఇళ్లకు సంబంధించిన పట్టాలను పటాన్చెరువు, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, శేరిలింగంపల్లి, గోషామహల్ నియోజకవర్గాలకు చెందిన లబ్దిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్రావు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో అన్నీ ట్రబుల్సేనని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు నిత్యం నినాదాలు, ధర్నాలు చేస్తున్నాయని, ఆయా పార్టీలు జీవితాంతం అలాగే ఉంటాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేవలం మాటలకే పరిమితమవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ తీరుపైనా హరీశ్రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకొనే వారికి రూ. 60 వేలు ఇచ్చేదని, అందులో కొంత మొత్తం అప్పుగా ఉండేదని, దానిపై వడ్డీలు సైతం వసూలు చేసే వారన్నారు. ఇప్పుడు నయా పైసా ఖర్చు లేకుండా సుమారు రూ. 60 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇళ్లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు అరికెపూడి గాం«దీ, దానం నాగేందర్, కౌసర్ అహ్మద్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ‘డబుల్’ఇళ్లు దేశానికే ఆదర్శం: మంత్రి మహేందర్రెడ్డి పటాన్చెరు టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని చేపట్టారని సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామం ఫేజ్– 2లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం రాజేంద్రనగర్, నార్సింగి, బైరాగిగూడకు చెందిన 500 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఒకే రోజు ఎనిమిది ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మరో దశలో 1,620 ఇళ్లను దాదాపు రూ.140 కోట్లతో నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. -
‘వాళ్ల మాటలు కోటలు దాటితే, చేతలు పకోడిలా ఉంటాయి’
సాక్షి, సంగారెడ్డి: బీజేపీ వాళ్ళకు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని హరీష్ రావు మండిపడ్డారు. మాటలు కోటలు దాటుతాయి.. చేతలు పకోడిలా ఉంటాయని సెటైర్లు వేశారు. తెల్లపూర్ మున్సిపాలిటి పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ల ఇళ్ల పంపిణి కార్యక్రమం శనివారం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు తీసుకున్న వారిలో సంతోషం కనపడుతుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు పేదల సొంతమయ్యాయని పేర్కొన్నారు. విలువైన స్థలంలో ధనవంతులు ఉండే ప్రాంతంలో పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రశంసించారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు ధర్నాలే చేస్తాయని, పనిచేయవని విమర్శించారు. హైదరాబాద్ నలుమూలలా లక్ష డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నామన్నారు. ఇక్కడ ఇండ్ల వద్ద అన్ని వసతులు కల్పిస్తామని, ఆసుపత్రి, రేషన్ షాపుతో పాటు అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించినట్టు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా అన్ని మతాలను గౌరవించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆలయం, చర్చ్, మసీదు కూడా ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్ హాల్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. చదవండి: మేడ్చల్ జిల్లాలో రాజకీయ సంద‘ఢీ’.. ప్రత్యర్థులెవరు? ‘బీఆర్ఎస్ సర్కార్ అంటే మాటలు తక్కువ పనులు ఎక్కువ. ఇప్పుడు మంచినీళ్లకు ధర్నాలు లేవు. తాగు నీరు సరఫరా మంచిగా జరుగుతుంది. బీజేపీ వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నో చెప్పారు. ఇల్లు పోతే ఇల్లు, బండి పొతే బండి ఇస్తామన్నారు. బండి పోతే బండి.. గుండు పోతే గుండు అన్నారు. బండి లేదు గుండు లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎక్కడైనా డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చారా ? వీరిది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్. విలువైన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇల్లు ఇచ్చిన, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కేసీఆర్ను ఆశీర్వదించండి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యునిటీగా మారనుంది’ అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు లేవు? - మంత్రి శ్రీ @BRSHarish.#DignityHousing pic.twitter.com/Uddlkvy64E — BRS Party (@BRSparty) September 2, 2023 -
ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. -
సారూ.. మాకు ఇల్లొచ్చిందా?
సికింద్రాబాద్కు చెందిన మణెమ్మ నాలుగేళ్ల క్రితం మీ సేవలో డబుల్ బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. రెండు నెలల క్రితం ఇద్దరు ప్రభుత్వ సిబ్బంది వచ్చి విచారణ జరిపారు. అన్ని వివరాలు అడగటంతో పాటు ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ ప్రతులను తీసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల డ్రా ఉందని తెలుసుకున్న మణెమ్మ కలెక్టరేట్కు వెళ్లింది. అక్కడి ప్రాంగణంలో కనిపించిన వారికి మీ సేవ రసీదు చూపిస్తూ.. నాకు ఇల్లొచ్చిందా సారూ..? జర సూడండి అంటూ వేడుకోవడం కనిపించింది. ఇలా మణెమ్మ ఒక్కతే కాదు.. గత మూడు రోజులుగా కలెక్టరేట్కు వస్తున్న ఎంతో మంది పేదలది ఇదే గోస. హైదరాబాద్: నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావడంతో పేదవాళ్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గత మూడు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్లకు దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆన్లైన్ పద్ధతిలో మొదటి విడతగా నియోజకవర్గానికి 500 చొప్పున లబ్ధిదారుల ఎంపిక పక్రియ పూర్తి కావడంతో నిరుపేదల్లో ఆందోళన మొదలైంది. మీ సేవ రసీదులతో కలెక్టరేట్కు చేరుకొని హౌసింగ్ విభాగంలో ఎంపికై న జాబితాలో తమ పేరు ఉందో లేదో అని ఆరా తీసున్నారు. అక్కడి సిబ్బంది మాత్రం ఇళ్లు మంజూరైతే ఫోన్కు సమాచారం(ఎస్ఎంఎస్ ) వస్తోందని సమాధానం ఇస్తున్నారు. వాస్తవంగా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారులు ఎంపిక పూర్తయినా.. ఇంకా ఫోన్లకు సమాచార ప్రక్రియ ప్రారంభంకానట్లు తెలుస్తోంది.. ఇది తెలియక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల 2 నుంచి ఎంపికై న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడతలో 12 వేల ఇళ్లు గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి మొదటి విడతగా మొత్తం 12 వేల మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. ఏడు లక్షలపైగా దరఖాస్తులు ఉండగా క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం మూడున్నర లక్షల వరకు కుటుంబాలు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. వాటిలో విడతల వారీగా ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టారు. మొదటి విడత కింద గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజవర్గాలకు కలిపి 7,500, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని నాలుగు అర్బన్ నియోజకవర్గాలకు కలిపి రెండు వేలు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అయిదు అర్బన్ నియోజవర్గాలకు 2,500 మంది లబ్ధిదారులను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేశారు. మిగతా వారికి సైతం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నా.. దరఖాస్తుదారుల్లో మాత్రం ఆందోళన తొలగటంలేదు. -
లబ్ధిదారులకు ఇళ్లిచ్చిన తర్వాత పిటిషనా?
సాక్షి, హైదరాబాద్: మన్సాన్పల్లి ఫేజ్–1, ఫేజ్–2 లో రూ.180 కోట్ల విలువైన 2,400 డబుల్ బెడ్రూ మ్ ఇళ్ల కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్కు అప్పగించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అప్పగించిన తర్వాత ఇప్పడు పిటిషన్ వేయడం సమంజసం కాదంది. ఈ దశలో ఎ లాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ పిల్ని కొట్టివేసింది. టెండర్లు లేకుండా కాంట్రాక్టు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ నిజామాబాద్కు చెందిన జి.చందు హైకోర్టులో పిల్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించింది. మధ్యలోనే పనులు వదిలివేయడంతో... వేరే కంపెనీలు మధ్యలో పనులను వదిలేయడంతో 2020లో మన్సాన్పల్లి ఫేజ్–1, ఫేజ్–2లోని పెండింగ్ పనులను పూర్తి చేయాలంటూ ప్రభుత్వం డీఈసీ కంపెనీకి అప్పగించింది. దీనిపై వెంకట్ అనే వ్యక్తి గతంలో దా ఖలు చేసిన పిటిషన్ను ఇదే హైకోర్టు కొట్టివేసింది. డీఈసీ కంపెనీ నిర్మాణాలను పూర్తి చేసి 2022లో అప్పగించింది. కాంట్రాక్టు విలువ కంటే అదనంగా రూ.68 కోట్లు చెల్లిస్తున్నారని పేర్కొంటూ నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత పిటిషనర్ పిల్ దాఖలు చేశారు. దీంతో బిల్లులు చెల్లించవద్దంటూ జనవరిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం..ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగినట్లు పిటిషనర్ ఆధారాలు చూపలేదంది. 2022లో ఇళ్లు అప్పగించిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారని, దీనికి కారణం కూడా చెప్పలేదని వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ అప్పగించిన కాంట్రాక్ట్లో ఎలాంటి వివక్ష లేదని పేర్కొంది. కాంట్రాక్టర్కు బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
వారం రోజుల్లో తొలి విడుత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో బుధవారం జరిగిన ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ పరిధిలోని నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 70 వేల ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 70వేల ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని తెలిపారు. లక్ష ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పూర్తి అయిందని పేర్కొన్నారు. ఇందులో సుమారు 4,500 కు పైగా ఇండ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని తెలిపారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందదన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు పలు సూచనలను తెలియజేశారు. డఇండ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తుందని మంత్రులు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సూచించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు. -
మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
సాక్షి, హైదరాబాద్: సుమారు రూ.6 లక్షల కోట్ల అప్పుతో మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి విమర్శించారు. అనేక రాష్ట్రాలు తమ ఆదాయం పెంచు కుంటుంటే.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ సంస్థలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద.. ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి, పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రం స్థలం ఉండదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను స్వయంగా అనేక ఉత్తరాలు రాసి రైల్వే టర్మినళ్లకు, చర్లపల్లిలో రైల్వే స్టేషన్విస్తరణకు భూమి కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిభట్ల లాంటి అనేకచోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విమర్శించారు. పార్టీల పేరుతో పంచుకున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్రెండు పార్టీలు కుమ్మక్కై వందల కోట్ల విలువ చేసే భూములను పార్టీలకు కేటాయింపుల పేరుతో అక్రమంగా తీసుకున్నాయని కిషన్రెడ్డి ఆరోపించారు. విలువైన భూములను కాంగ్రెస్, బీఆర్ఎస్లు పంచుకున్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాతిపదికనైతే భూమి ఇచ్చామో, బీఆర్ఎస్కు అదే ప్రాతిపదికన తీసుకున్నామని సిగ్గు లేకుండా జీవోలో చెప్పుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, వాళ్ల అనుచరులు, బినామీల పేర్లమీద భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావితరాల కోసం భూములను రక్షించాల్సి న అవసరం ఉందని కిషన్రెడ్డి చెప్పారు. 4 నెలల తర్వాత అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భూమి కేటాయింపులకు సంబంధించిన జీవోలను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. భూముల వేలాన్ని కూడా బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కాగా సోమవారం బీజేపీ కార్యాలయానికి వచ్చిన సినీనటి జయసుధను ఈ సందర్భంగా సత్కరించారు. -
డబుల్ బెడ్రూం కోసం నడిరోడ్డుపై హల్చల్.. ఇంతలో ప్రమాదం..
సంగారెడ్డి: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని త్వరగా అందజేయాలని ఓ వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. మండల కేంద్రం పుల్కల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ గ్రామానికి చెందిన బట్టు చిరంజీవి రాజుకు అతని భార్య మమత పేరుపై పుల్కల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం మంజూరైంది. అయితే వాటిలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. దీంతో ఇల్లు మంజూరైనా కాలయాపన జరుగుతుండటంతో అసహనానికి గురైన చిరంజీవి రాజు శుక్రవారం ఉదయం పెట్రోలు సీసాతో పుల్కల్ ప్రధాన రోడ్డుపై హల్చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతు ఇబ్బంది కలిగించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తుండగా కింద పడిపోయాడు. గమనించిన డ్రైవర్ ఆపే ప్రయత్నం చేస్తుండగానే వెనుక చక్రాలు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ విజయ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రాజయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను గుర్తించామని, ఇళ్లను కూడా కేటాయించామని తెలిపారు. చిన్న చిన్న పనులు మిగిలిపోవడంతో కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు. -
బెడిసికొట్టిన జనసేన వ్యూహం! నాణ్యతకు కాంట్రాక్టర్ సవాల్!
సాక్షి, భీమవరం: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. పవన్కల్యాణ్ వలంటీర్ల వ్యవస్థపై చేసిన ఆరోపణలతో పరువు పొగొట్టుకోగా భీమవరం పట్టణంలో ఆ పార్టీ నాయకులు చేసిన మరో చిల్లర ప్రయత్నం బెడిసికొట్టింది. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పైపుల చెరువు వద్ద విస్సాకోడేరు లేఅవుట్లో సుమారు 3 వేలకు పైగా ఇళ్లు నిర్మించాల్సి ఉండగా పేరొందిన కాంట్రాక్టర్తో మాట్లాడి లబ్ధిదారుల ఇష్ట్రపకారం ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 200 ఇళ్ల శ్లాబ్ నిర్మాణం పూర్తికాగా మరో 300 ఇళ్లు శ్లాబ్ లెవల్కు, 600 ఇళ్లు బెస్మెంట్ లెవల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతలో రాజీపడకుండా నిర్మిస్తున్నాయి. అయితే జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతోపాటు కొంతమంది పార్టీ నాయకులు గత వారం ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేశారు. వారి ఆరోపణల్ని కాంట్రాక్టర్ పళ్ల ఏసుబాబు తిప్పికొట్టారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు నిరూపిస్తే ఆయా ఇళ్లను కూలగొట్టి తిరిగి నిర్మిస్తానని బహిరంగ సవాల్ విసిరారు. జగనన్న కాలనీ మునిగిపోతుందని, రోడ్డు అధ్వానంగా ఉందంటూ జనసేన చేసిన ఆరోపణను ఖండించారు. కాలనీకి రోడ్డు సౌకర్యం లేకుంటే ప్రతి రోజు 20 లారీల్లో వెయ్యి టన్నుల మెటీరియల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. గునుపూడి లే అవుట్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ చేసిన మరో ఆరోపణను అక్కడ భూముల కొనుగోలుకు సహకరించిన తిరుమల విజయ్రామ్, భూములు విక్రయించిన రైతులు తప్పుపట్టారు. లేఅవుట్కు 70 ఎకరాలు కొనుగోలు చేయగా ఎకరాకు రూ.కోటి 6 లక్షల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశారని, రైతుల నుంచి ఎవరికై నా ముడుపులిచ్చినట్లు జనసేన నాయకులు మావుళ్లమ్మ ఆలయంలో దీపం ఆర్పి ప్రమాణం చేసి నిరూపించగలరా? అని సవాల్ చేశారు. -
డబుల్ రాజకీయం..డొల్లతనానికి బాధ్యులెవరు...?
-
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం -
‘డబుల్’పై బీజేపీ డ్రామాలు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ విమర్శించారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర మేనని అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కిషన్ రెడ్డికి అధికారికంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఏం ఆశించి, ఎందుకోసం ఈ రాద్ధాంతం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని, పేద ప్రజల సంక్షేమం కోసం మీరేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే.. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తలసాని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకు న్నట్లు తెలిపారు. కొల్లూరులో రూ. 6,700 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్బెడ్ రూం ఇళ్ల కాలనీని ఇటీవలే సీఎం ప్రారంభించారన్నారు. గతంలో డబుల్బెడ్ రూం ఇళ్ల ప్రారంభ కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. -
‘డబుల్’ బాటకు బ్రేక్..
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: బీజేపీ ‘చలో బాటసింగారం’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డిని, ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు, ఇతర నేతలను అరెస్టు చేసి వారు బాటసింగారం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఇతర నాయకులను వారి వారి నివాసాల్లోనే నిర్బంధంలో ఉంచారు. కాన్వాయ్కి డీసీఎం అడ్డుగా పెట్టి.. హైదరాబాద్ శివార్లలోని బాటసింగారంలో మధ్య లో నిలిపేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పరిశీలించాలని కిషన్రెడ్డి నిర్ణయించారు. అక్కడే పేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించాలని భావించారు. దీంతో బుధవారం రాత్రి నుంచే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వివిధ స్థాయిల పార్టీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే వారిని, ఆఫీసు బాధ్యులను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన కిషన్రెడ్డి నేరుగా బాటసింగారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమాలు చేపట్టొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ధర్నాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా రఘునందన్రావు ప్రశ్నించారు. అంతా కలిసి ఔటర్ రింగ్రోడ్డు మీదుగా బాట సింగారం వైపు బయలుదేరారు. అయితే పోలీసులు ఓర్ఆర్ఆర్ వద్దే కాన్వాయ్కి ఎదురుగా డీసీఎంను నిలిపి అడ్డుకున్నారు. నా చర్మం ఊడిపోతోంది.. మీపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తా పోలీసుల వైఖరికి నిరసనగా కిషన్రెడ్డి, ఇతర నేతలు రోడ్డుపై వర్షంలో తడుస్తూనే బైఠాయించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసులకు సహకరించాలని పోలీసు కమిషనర్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో తనను రోడ్డు పైనుంచి లేపేందుకు ప్రయతి్నంచిన పోలీసులతో కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ చర్యలతో నా చర్మమంతా ఎరుపుగా మారి కమిలిపోయి ఊడి పోతోంది. మిమ్మల్ని లోక్సభ స్పీకర్ ముందు నిలబెడతా.. మీపై ఫిర్యాదు చేస్తా.. మీరు సీఎం కేసీఆర్ కుటుంబానికి కట్టుబానిసల్లా పనిచేస్తున్నారు. నన్ను చంపుతారా?..చంపండి..ఇంటికి మాత్రం వెళ్లను..’ అంటూ కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రిని బలవంతంగా ఆయన వాహనంలో కూర్చోబెట్టి పోలీసులే నడుపుతూ ఆరాంఘర్, పీవీ ఎక్స్ప్రెస్ వే, మాసబ్ ట్యాంక్, ఎర్రమంజిల్, ఖైరతాబాద్ మీదుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. కాగా కిషన్రెడ్డి, ఇతర నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ పార్టీ కార్యాలయం సమీపంలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టి»ొమ్మను దహనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచి్చంది. పార్టీ పరంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం: ఈటల బీజేపీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్మెట్, బాటసింగారం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు వైపు ఏ ఒక్కరినీ అనుమతించలేదు. ఎంపీ అరవింద్ను బంజారాహిల్స్లోని నివాసంలో, డీకే అరుణను జూబ్లీహిల్స్లోని నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. ఈటలను శామీర్పేటలోని ఇంటి వద్దే అడ్డుకోగా, ఆయన కార్యకర్తలతో కలిసి అక్కడే ధర్నాకు కూర్చొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేంద్రమంత్రి హక్కులను భంగం కలిగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అప్పులు తీసుకుని, రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన డబుల్ ఇళ్లను పేదలకు ఇంకా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యం అని అన్నారు. తార్నాకలో రాంచందర్రావు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డిలను గృహ నిర్బంధంలో ఉంచారు. -
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులపై విచారణ
-
పంపిణీకి నోచని డబుల్ బెడ్రూం ఇళ్లు..!
మెదక్: దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని చందంగా మారింది డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల పరిస్ధితి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా ఇళ్లు కట్టివ్వలేదు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతగా 160 ఇళ్లు, రెండో విడతకు 400 డబుల్ బెడ్రూం పంపిణీకి మంజూరు చేసింది. పట్టణ శివారులో జీప్లస్ టూ పద్ధతిన ఇళ్లు నిర్మించారు. ఎన్నో ఏళ్ల సొంతింటి కల నేరవేరిందని సంతోషం పడుతున్న లబ్ధిదారులకు కలగానే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇళ్ల మంజూరునకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, 1426 వచ్చాయి. ప్రస్తుతం 264 ఇళ్లు పూర్తికాగా మిగిలినవి చివరి దశలో ఉన్నా యి. లబ్ధిదారుల ఇళ్ల మంజూరునకు జిల్లా అధికా రులు సర్వే నిర్వహించారు. తొలి విడతలో 480 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో జా బితాలో అనర్హులు ఉన్నారంటూ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు రీ సర్వే చేపట్టారు. ఈ రీసర్వేలో 189 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. మొత్తం 560 ఇళ్లకు గాను 264 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఈ 264 ఇళ్లకోసం మొత్తం 342 మందిని ఎంపిక చేశారు. దీంతో మార్చి 22న డ్రా తీయగా, 264 మందికి ఇళ్ల పంపిణీ చేశారు. 78 మందికి నిరాశే మిగిలింది. 20 నుంచి 30 ఇళ్లు మిగిలాయి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. దాదాపు 20 నుంచి 30 ఇండ్లకు సంబందించి చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే సతీష్కుమార్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే లభ్దిదారులకు పట్టాలు ఇప్పించి గృహ ప్రవేశాలు చేయిస్తాం. – ఆకుల రజిత, మున్సిపల్ చైర్ పర్సన్, హుస్నాబాద్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ డబుల్ బెడ్రూం ఇళ్లను మే 5వ తేదీన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీ దుగా ప్రారంభించి కేవలం 5 గురు లబ్ధిదారు లకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్లు ఇవ్వలేదు. ఎంపిక చేసిన మిగితా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో వారు నిరాశతో ఉన్నారు. పట్టాలు తీసుకున్న వారికి ఇల్లు వచ్చిందనే సంతోషం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికై న వారికి కూడా సంతోషం లేకుండా పోయింది. ప్రతి రోజూ ఇళ్ల వద్దకు వెళ్లి చూసి సంతోషపడాల్సిందే తప్ప గృహ ప్రవేశం చేసింది లేదు. -
‘డబుల్ బెడ్రూం’ దరఖాస్తులపై డబుల్ విచారణ
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ శరవేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ బృందాలు రంగలోకి దిగి దరఖాస్తుదారుడి డోర్ టు డోర్ విచారణ నిర్వహిస్తున్నారు. కుటుంబాల పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సుమారు ఏడు లక్షలకు పైగా కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ద్వారా ఓటరు కార్డు, అవసరమైన వివరాలను అప్లోడ్ చేశారు. క్షేత్ర స్థాయి విచారణ విచారణ జరగలేదు. తాజాగా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కొంత డబుల్ బెడ్రూం కోటా కేటాయించడం దరఖాస్తులపై కదలిక వచ్చినట్లయింది. శివారులోనే అధికం.. ► జీహెచ్ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో ఎక్కువశాతం నగర శివారులోనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు. ► నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. ఇప్పటికే కొల్లూరులో సుమారు 15,660 గృహాలు నిర్మించి లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అన్ని అర్హతలు సాధించిన దరఖాస్తులు నియోజకవర్గాల వారీగా లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి కేటాయించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పిస్తామంటూ దళారులు దరఖాస్తుదారులకు గాలం వేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో పాత గృహాలు తొలగించిన (ఇన్ సీటు) 40 ప్రాంతాల్లో 8,898 గృహాలు, 71 ఖాళీ స్థలాల్లో 91,102 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మొత్తం మీద 71 ప్రాంతాల్లో 68,176 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. మిగతా 38 ప్రాంతాల్లో వివిధ ప్రగతి దశలో కలవు. రెండు లొకేషన్లలో 2,026 గహాలు వివిధ కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. 42 ప్రాంతాల్లో చేపట్టిన 62,516 రెండు పడకల గదులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మారో 29 లొకేషన్ (ఇన్ సీటు)పేదల పాత గృహాలు తొలగించి 5,660 కొత్త ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ► జీహెచ్ఎంసీ పరిధిలో 40 ఇన్ సీటు లొకేషన్ 8,898 రెండు పడకల గదులు, 17 వేకెంట్ ప్రదేశంలో 5,775 గృహాలు మొత్తం 57 లొకేషన్లలో 14,673 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ మధ్యలో 32 ఖాళీ ప్రదేశాల్లో 49,991 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఓఆర్ఆర్ బయట ఉన్న 22 ఖాళీ ప్రదేశాల్లో 35,336 ఇళ్లు కడుతున్నారు. జిల్లాల వారీగా ఇలా.. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఇన్ సిటు, ఓపెన్ గల 38 లొకేషన్లలో 13 నియోజకవర్గాల పరిధిలో 70.73 ఎకరాల స్థలంలో 9453 గృహాలు. రంగారెడ్డి జిల్లాలో 30 లొకేషన్లలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151.36 ఎకరాల స్థలంలో 23,908 ఇళ్లు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 లొకేషన్లలో 3 నియోజకవర్గాల పరిధిలో 38,419, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 191.79 ఎకరాల్లో 10 లొకేషన్లలో 28,220 గృహ నిర్మాణాలు చేపట్టారు. 111 ప్రాంతాల్లో 668.73 ఎకరాల స్థలంలో లక్ష ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. -
తెలంగాణలో కమలం ఉద్యమపథం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, మరీ ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందకొడిగా సాగుతున్న తీరు, పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీకి గానూ కొన్ని మాత్రమే పూర్తికావడాన్ని ప్రధాన సమస్యల్లో ఒకటిగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. పార్టీ పరంగా చేపట్టబోయే ఆందోళనల్లో ఆయా వర్గాలకు చెందిన బాధిత ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇందులో భాగంగా... అమెరికా నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి తిరిగి రాగానే ఈ నెల 20న నగరానికి సమీపంగా ఉన్న బాటసింగారంలో డబుల్ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తారు. 24న జిల్లా కేంద్రాల్లో నిరసన రాష్ట్రవ్యాప్తంగా పార్టీపరంగా డబుల్ ఇళ్లనిర్మాణంపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ధరణితో సహా రైతాంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆందోళనలు, నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. 21న కిషన్రెడ్డి బాధ్యతల స్వీకరణ... ప్రస్తుతం ఆషాఢమాసం కావడం, విదేశీ పర్యటనల్లో ఉండటంతో ఈ నెల 21న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ చేపట్టబోయే కార్యాచరణ, వ్యూహాలపై ఈ నెల 22న జరగనున్న కోర్ కమిటీ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ వర్గాల ప్రజలు, మేధావులను (30 వేల మందిని) కలుసుకుని పార్టీకి మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు. రాష్ట్రపార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందులో భాగస్వాములై తొమ్మిదేళ్లలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ శాసనసభా స్థానాల్లో చేపట్టే ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఒక్కో అసెంబ్లీ సీటు పరిధిలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత జనరల్ సీట్ల పరిధిలో సభలు జరుపుతారు. వచ్చేనెల 15 లోగా ఈ సభలను పూర్తిచేయాలని నిర్ణయించారు. 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల బస ఆగస్టు 16 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు (ఒక్కో నియోజకవర్గానికి ఒకరు చొప్పున) వారం రోజులపాటు బస చేస్తారు. అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన, పార్టీ బలం, బలహీనతలు తదితర అంశాలను పరిశీలించి జాతీయ నాయకత్వానికి వారు నివేదికలు ఇవ్వనున్నట్టు పార్టీవర్గాల సమాచారం. -
అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం!
Double Bedroom Flats : 14 ఫ్లోర్లు, 630 డబుల్ బెడ్రూం ఫ్లాట్లు. ఒక్కో ఫ్లోర్లో 1370 స్క్వైర్ ఫీట్లలో 2 బీహెచ్కే నిర్మాణం. ఇప్పుడా ఫ్లాట్లను అమ్మేందుకు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) సిద్ధమైంది. కొనుగోలు దారులకు హోమ్లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు సైతం అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఫలితంగా 2బీహెచ్కే ఫ్లాట్ ధరలు తక్కువ ధరకే అమ్ముతుండడంతో కొనుగోలు దారులు పెద్ద ఎత్తున అప్లయి చేసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు ఈస్ట్ కోనదాసపూర్ ప్రాంతంలో బీడీఏ 14 ఫ్లోర్లలో అపార్ట్మెంట్ నిర్మాణాలు చేపట్టింది.ఈ అపార్ట్మెంట్లలో నిర్మించిన 630 ఫ్లాట్లను అమ్మేందుకు జులై 1 ప్రత్యేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 1370 స్కైర్ ఫీట్లో రెండు బెడ్రూమ్లు, హాలు, కిచెన్ సౌకర్యాలు ఉన్నాయి. 1370 స్కైర్ ఫీట్లలో 806 స్కైర్ ఫీట్లలో కార్పెట్ ఏరియాను కేటాయించింది. ఒక్కో ఫ్లాట్ను ఒక్కో ధరకు అమ్మనుంది. ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లయి ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కార్పార్కింగ్ కోసం అదనం నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ల గృహ కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్కు ముందు అపార్ట్మెంట్ల జోన్ ఆధారంగా తగిన మొత్తానికి వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని బీడీఏ అధికారులు తెలిపారు. అదనంగా, కేటాయింపుదారులు సంబంధిత కాలానికి విడిగా జీఎస్టీ చెల్లించాలి. అందుబాటులో ఉన్న కవర్డ్ కార్ పార్కింగ్ స్థలం కోసం ప్రతి ఇంటికి అదనంగా రూ .2 లక్షలు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫ్లోర్ను బట్టి ధర మారుతుంది ఫ్లాట్ల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందు 24 నెలల మెయింటెనెన్స్ మొత్తాన్ని చెల్లించాలని బీడీఏ అధికారులు చెబుతున్నారు. మెయింటెనెన్స్ మొత్తం చెల్లించిన తర్వాత బీడీఏ స్వయంగా ఫ్లాట్లను రిజిస్టర్ చేస్తుంది. ఫ్లోర్ లెవల్ను బట్టి రెండు బీహెచ్కే అపార్ట్మెంట్ ధర మారుతుంది. మొదటి అంతస్తు ఫ్లాట్ ధర ఎంతంటే? మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు ఫ్లాట్ ధర రూ.48 లక్షలు, ఆరో అంతస్తు ధర రూ.48.24 లక్షలు, ఏడో అంతస్తు ధర రూ.48.72 లక్షలు. ఎనిమిదో అంతస్తు అపార్ట్ మెంట్ ధర రూ.48.96 లక్షలు. తొమ్మిదో అంతస్తు నుంచి 12వ అంతస్తు వరకు రూ.49.2 లక్షల నుంచి రూ.49.92 లక్షల వరకు ధరలు ఉన్నాయి. 13వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ధర సుమారు రూ.50.16 లక్షలు కాగా, 14వ అంతస్తు ధర సుమారు రూ.50.4 లక్షలు. అంతేకాకుండా ఈ భవనంలోని ప్రీమియం ఫ్లాట్ల ధర ఎక్కువగా ఉంటుంది. మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తు వరకు రూ.50.4 లక్షలు, ఆరో అంతస్తు నుంచి 13వ అంతస్తు వరకు రూ.50.65 లక్షల నుంచి రూ.52.65 లక్షల వరకు ధరలు ఉంటాయని బీడీఏ అధికారులు తెలిపారు. చదవండి👉 సొంతిల్లు కొంటున్నారా?, కేంద్ర ప్రభుత్వ రివర్స్ మార్ట్గేజ్ పథకం గురించి తెలుసా? -
పూడూరులో పిల్లర్ స్థాయి దాటని ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం..
పూడూరు: మండల కేంద్రంలో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల పనులు ముందకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. పూడూరు మండలానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. పూడూరు, మన్నేగుడ, మీర్జాపూర్ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. పూడూరులోని శ్మశానవాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 3,873 డబుల్ ఇళ్లు మంజూరయ్యాయి. సగానికిపైగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించగా, మరి కొన్ని ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పూడూరులో 50 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదుల పనులు పూర్తయి పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. పరిగి నియోజకవర్గానికి 680 ఇళ్లు మంజూరు కాగా పరిగి, దోమ, కులకచర్ల, గండ్వీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. నిధులు లేని కారణంగానే కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. పనులు వేగవంతం చేస్తాం పూడూరులో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ప్రస్తుతం బిల్లులు వచ్చాయి. పనుల వేగం పెంచి త్వరలో పూర్తయ్యేలా చూస్తాం. – మహేశ్, ఆర్అండ్బీ ఏఈ -
గందరగోళంలో ‘డబుల్’!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగా ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేసే గృహలక్ష్మి పథకాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న వేళ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం వ్యవహారం అగమ్యగోచరంగా మారింది. ఇళ్లను పూర్తి చేయాలంటే రూ. 7,500 కోట్ల నిధులు అవసరమవగా వాటిని సమకూర్చుకోవడం సర్కారుకు కష్టంగా మారింది. అలా అని వదిలేద్దామంటే 85 వేల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రుణం అంటే జంకుతున్న ఆర్థిక శాఖ.. ఇప్పటికే రూ. 9,800 కోట్ల రుణాన్ని హడ్కో నుంచి తీసుకొని ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. అయితే గత 9 ఏళ్లలో 1.40 లక్షల ఇళ్లనే పూర్తి చేయగలిగింది. అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తొలి విడత నిధులను సైతం ఖర్చు చేసింది. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) అయితే లబ్దిదారుల ఎంపిక ప్రాథమిక కసరత్తు పూర్తికాకపోవడాన్ని తప్పుబడుతూ కేంద్రం పీఎంఏవై మలివిడత నిధులిచ్చేందుకు నిరాకరించింది. దీంతో దాదాపు రూ. 1,200 కోట్ల నిధులు చేతికందకుండా పోయాయి. మరోవైపు ఇప్పటికే భారీగా రుణం ఇచ్చిన హడ్కో సైతం మరోసారి రుణం ఇచ్చేందుకు తటపటాయిస్తోంది. ఇంకోవైపు ఇప్పటివరకు కట్టిన ఇళ్లకు సంబంధించి రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వాటి సంగతేంటి? దాదాపు 90 శాతం పనులు పూర్తయి తుది మెరుగులకు సిద్ధంగా 50 వేల ఇళ్లున్నాయి. బేస్మెంట్, ఇటుక పని పూర్తయినవి మరో 35 వేల ఇళ్లున్నాయి. వాటిని పూర్తి చేయాలంటే రూ. 3,500 కోట్లు కావాలి. ఆ మేరకు నిధులిస్తేనే ఈ ఇళ్లను వేగంగా పూర్తి చేస్తామని గృహనిర్మాణ విభాగం పలుమార్లు ఆర్థిక శాఖను కోరింది. పనిలో వేగం తగ్గితే అసంపూర్తి నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంది. టెండర్లు పిలిచి ఇంకా పనులు ప్రారంభించని ఇళ్లు 62 వేల వరకు ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలంటే మరో రూ. 4 వేల కోట్లు కావాలి. ప్రస్తుతానికి వాటిని పెండింగ్లో పెట్టి తుదిదశకు చేరుకున్న ఇళ్లను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం తాజాగా 90 శాతం పనులు పూర్తయిన వాటి వివరాలను ఆర్థిక శాఖకు అందజేశారు. త్వరలో మంత్రుల కమిటీ సమావేశమై దీనిపై చర్చించే అవకాశం ఉంది. (వైట్హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) ఇళ్ల కేటాయింపు అంటేనే టెన్షన్.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 43 వేల ఇళ్లనే లబ్దిదారులకు కేటాయించారు. దాదాపు 88 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. గతంలో స్వీకరించిన దరఖాస్తులు కూడా అధికారుల వద్ద ఉన్నాయి. ఇళ్ల సంఖ్యకు కొన్ని రెట్లు ఎక్కువగా దరఖాస్తులు ఉండటంతో ఎంపిక కాని వారు ఆందోళనలు చేసే ప్రమాదం ఉంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటుందంటూ అధికారులు ఇళ్ల కేటాయింపును పెండింగ్లో పెట్టేశారు. కొల్లూరు డబుల్ ఇళ్ల దుమ్ము దులిపి... సీఎం కేసీఆర్ తాజాగా కొల్లూరులో 15,600 డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఇళ్లు దాదాపు రెండేళ్ల క్రితమే సిద్ధమైనా వినియోగంలో లేకపోవటంతో మొత్తం దుమ్ముకొట్టుకుపోయాయి. వాటి ప్రారంభానికి సీఎం వస్తుండటంతో అధికారులు 500 మంది కూలీలను పెట్టి దుమ్ము దులిపించారు. సీఎం పరిశీలించే ఇళ్లకు కొత్తగా రంగులు వేయించారు. పగిలిన కిటికీ అద్దాలను మార్పించారు. అయితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు 80 వేలకుపైగా డబుల్ ఇళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. (ఆదిపురుష్ విలన్కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?) -
‘డబుల్’ ఇళ్లు పూర్తయ్యేదెప్పుడో..! ఆరేళ్లుగా సాగుతున్న పనులు
బెల్లంపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో బెల్లంపల్లిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. కన్నాల శివారు జాతీయ రహదారిని ఆనుకుని 2017 జూన్ 10న ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై ఆరేళ్లు కావస్తుండగా ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక అవరోధాలతో అపసోపాలు పడుతూ ప్రస్తుతం సగానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తుది దశకు చేరాయి. రూ.968 లక్షల అంచనాతో 160 2బీహెచ్కే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణ వ్యయం యేటా పెరుగుతుండగా ఇప్పటికే పూర్తి కావాల్సిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. తుది దశలో పనులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు బిగించాల్సి ఉంది. ఆయా పనులు పూర్తయితే దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లే. 160 ఇళ్లకు గాను పైపులైన్ పనులు 100 ఇళ్ల వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్కు గత రెండేళ్లుగా బిల్లులు చెల్లించపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటాయిపులపై ఆశలు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తంతు ప్రారంభం కాకముందే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందస్తుగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను పేదల పరం చేసి ఎన్నికలకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు తుది దశలో ఉండడంతో పేదలు ఆశలు పెంచుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగానే అర్హులకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. గృహలక్ష్మి వైపు చూపులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈసారి కూడా పూర్తికాని పరిస్థితులు ఏర్పడితే లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం వైపు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతింటి స్థలం ఉన్న లబ్ధిదారులకు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో పేదల్లో ఆశలు రేకేత్తిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి లీజు భూములు ఉన్నాయి. ఇటీవలనే ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు పట్టాలు కూడా జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 వేల మందికి ఇళ్లపట్టాలు వచ్చే అవకాశాలు ఉండగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తికాని పక్షంలో నివేశన స్థలం ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సమాలోచనలు చేస్తున్నారు. పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లనిర్మాణ పనులు పూర్తి చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. బిల్లుల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. – పెద్దయ్య, ఆర్అండ్బీ ఇంచార్జి ఈఈ, మంచిర్యాల -
డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్లూరులో కేసీఆర్ నగర్ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. కాగా, సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్షిప్ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. ఈ టౌన్షిప్లో 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 ఇళ్ల నిర్మాణం జరిగింది. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్షిప్ నిర్మాణం జరిగింది. మొత్తం 117 బ్లాక్లు, బ్లాక్కి 2 లిఫ్ట్ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. టౌన్షిప్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మాణం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం? -
సంగారెడ్డి జిల్లా కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇండ్ల విశేషాలు
-
15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం భారీ స్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాజెక్టు ‘కేసీఆర్ నగర్ 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్’ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలం కొల్లూరులో రెండో దశ కింద ఈ టౌన్షిప్ను నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ఇళ్ల పట్టాలను అందించనున్నారు. కార్పొరేట్ స్థాయి హంగులతో.. కొల్లూరులో సుమారు 144.50 ఎకరాల్లో రూ.1,474.75 కోట్ల వ్యయంతో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోని విధంగా, సకల హంగులు, మౌలిక సదుపాయాలతో టౌన్షిప్ను నిర్మించారు. ఇక్కడ మొత్తంగా 117 బ్లాకుల్లో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. ఈ టౌన్షిప్లో మొత్తంగా 6 నుంచి 36 మీటర్ల వెడల్పు గల 13.50 కిలోమీటర్ల పొడవైన రోడ్లను నిర్మించారు. మొత్తంగా 2.1 కోట్ల లీటర్ల సామర్థ్యమున్న నీటి నిల్వ (అండర్ గ్రౌండ్ కలిపి) ట్యాంకులను ఏర్పాటు చేశారు. అండర్ గ్రౌండ్ ద్వారానే విద్యుత్ సరఫరా కేబుళ్లు వేశారు. లిఫ్టులకు, వాటర్ సప్లై, ఎస్టీపీలకు విద్యుత్ సరఫరా కోసం 30 కేవీఏ నుంచి 400 కేవీఏ వరకు 133 జనరేటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసే ఎస్టీపీలను, శుద్ధి చేసిన నీటిని సుందరీకరణ పనులకు వాడేలా పైప్లైన్ నిర్మించారు. 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, 10.05 కిలోమీటర్ల తాగునీటి పైప్లైన్, 10.60 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ పైప్లైన్, 137 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాల కోసం 528 స్తంభాలు ఏర్పాటు చేశారు. 54,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న 3 షాపింగ్ కాంప్లెక్స్లలో 118 షాపులు, ప్రతి బ్లాక్కు రెండు చొప్పున 234 లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. సామాజిక వసతులూ ఎన్నో.. ► టౌన్షిప్ వాసులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, ఆట స్థలం, ఓపెన్ జిమ్, ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, మల్టీపర్పస్ గ్రౌండ్, ఆంఫి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, బతుకమ్మ ఘాట్లనూ ఏర్పాటుచేశారు. ► కాలనీ వాసుల కోసం ఆధునిక కూరగాయల, మాంసాహార మార్కెట్, విద్యార్ధుల కోసం ప్లేస్కూల్, అంగన్వాడీ సెంటర్, బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక, ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్స్టాప్, పోలీస్స్టేషన్, ఫైర్స్టేషన్, మిల్క్ బూత్లు, పెట్రోల్ బంకు, పోస్టాఫీసు, ఏటీఎం, బ్యాంకు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. శంకర్పల్లిలో ప్రైవేటు రైల్వే ఫ్యాక్టరీని ప్రారంభించనున్న కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ’ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. వంద ఎకరాల్లో, సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ 2017–18లో శంకుస్థాపన చేయగా.. ఇటీవలే పనులు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైంది. దీనిని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఏటా 500 రైల్వేకోచ్లు, 50లోకోమోటివ్ల ఉత్పత్తి లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేశారు. వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. రైల్వే పరికరాల ఉత్పత్తిలోని ప్రైవేటు సంస్థల్లో పెద్దదైన మేధా సంస్థ.. భారతీయ రైల్వేకు కూడా వివిధ ఉత్పత్తులను మేధా సంస్థ సరఫరా చేస్తోంది. ఫాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికిపైగా ఉపాధి పొందనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కంపెనీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, అధికారులు పరిశీలించారు. పటాన్చెరులో బహిరంగ సభ కొల్లూరులో డబుల్ బెడ్రూం టౌన్షిప్ను ప్రారంభించిన అనంతరం పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. అనంతరం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో సభకు ఏర్పాట్లు చేశారు. వీటిని మంత్రి హరీశ్రావు బుధవారం పరిశీలించారు. 30 వేల మందితో ఈ సభను నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
డబుల్ పేరిట డబ్బులు దండుకుని
సాక్షి, మహబూబాబాద్/ ఇల్లందు/ గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు, గిరిజనుల అమాయకత్వం, పేదరికాన్ని ఆసరా చేసుకుని స్వచ్ఛంద సంస్థ ముసుగులో తక్కువ ధరకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని వారి నుంచి రూ.20 కోట్ల మేర డబ్బులు దండుకున్నారు. ఇళ్లు కట్టేస్తున్నామని ఐరన్, సిమెంట్ పంపిణీ చేసి ఉడాయించేశారు. ఇంటిసామగ్రి తెస్తామని చెప్పి వెళ్లిన వారు రెండేళ్లుగా పత్తా లేకపోవడంతో బాధితులు చివరికి పోలీసుల్ని ఆశ్రయించగా అసలు విషయం బయటకొచ్చింది. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ పేరుతో వచ్చి... పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి హోలీవర్డ్ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ 2020లో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో కొంతమంది ఏజెంట్లను నియమించుకుంది. కేవలం రూ.4,50,000లకే 693 చదరపు అడుగుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏజెంట్లను ఏజెన్సీ ప్రాంతాల్లోకి పంపించి ప్రచారం చేయించింది. వీరి మాటల్ని నమ్మేందుకుగాను పలుచోట్ల స్వచ్ఛంద సంస్థకు చెందిన అనుచరుల ఇళ్లను చూపించేవారు. తాము నిర్మించబోయే ఇళ్లకు 120 గజాల స్థలం ఉంటే చాలని, మొదటి కిస్తీగా రూ.1,65,000 చెల్లిస్తే సరిపోతుందని ప్రచారం చేయడంతో వీరిని నమ్మి డబ్బులు కట్టేందుకు మూడు జిల్లాల నుంచి గిరిజనులు ముందుకొచ్చారు. ఇలా ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15వేల నుంచి రూ.1,80,000 వరకు కట్టించుకున్నారు. ఇలా డబ్బులు చేతికిరాగానే ఇళ్లు కట్టేస్తున్నామని చెబుతూ కొంతమందికి ఐరన్, సిమెంట్ తెచ్చి పిల్లర్లు వేసి మిగతా వారిని కూడా నమ్మించారు. దీంతో మిగిలిన వారూ డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ విధంగా మూడు జిల్లాల్లో మొత్తం రూ.20 కోట్ల మేర వసూళ్లు చేశారు. రెండో కిస్తీ కట్టాకే మిగతా నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి సంస్థకు చెందిన ఏజెంట్లను ఉద్యోగాల నుంచి తీసేశారు. తర్వాత సంస్థ అడ్రస్ను కూడా మార్చేశారు. సంస్థకు చెందిన ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసేశారు. రెండేళ్లుగా వీరంతా పత్తా లేకుండాపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన కొంతమంది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిగిలినవారు కూడా ఆయా జిల్లాల్లో ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రామచంద్రాపురం: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం వివిధ శాఖల అధికారులు కొల్లూరుకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 10గంటలకు ఇళ్ల ప్రాంగణానికి చేరుకొని పైలాన్ ప్రారంభించి, ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అనంతరం 98వ బ్లాక్ వద్ద డబుల్ బెడ్రూం ఇళ్లను లాంఛనంగా ప్రారంభిస్తారు. అదే బ్లాక్లోని మొద టి అంతస్తులో సుమారు 6నుంచి 12 మంది లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కొల్లూరు వద్ద ఆసియాలోనే అతిపెద్ద టౌన్షిప్ను నిర్మించింది. 15 వేలకు పైగా డబుల్బెడ్రూం గృహాలను నిర్మించింది. సుమారు 60 వేల మంది నివసించేలా అక్కడ అన్ని మౌళిక సదుపాయాలను కల్పించింది. దీన్ని నిర్మించి దాదాపు ఐదేళ్లు దాటుతున్నప్పటికీ.. లబ్దిదారులకు అందించలేదు. గతంలో పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ గృహాలను గురువారం లబ్ధిదారులకు అందించనున్నారు. సీఎం పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్ సీఎం కేసీఆర్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎస్పీ రమణ కుమార్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నెల 22న పాల్గొననున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సీఎం కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుధ్య నిర్వహణ లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీఎంహెచ్ఓ గాయత్రి, జిల్లా పంచయతీ అధికారి సురేశ్ మోహన్, డీఎండబ్ల్యూఓ అరుణ్ కుమార్, గీత, డీఎస్పీ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొలుత ఆరుగురు లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇళ్ల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే గ్రేటర్ పరిధిలోని లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని ప్రారంభించే యోచనలో ఉన్న ప్రభుత్వం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. పైనుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో నగర శివార్లలోని సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడంతో లాంఛనంగా కొందరికి మాత్రం సీఎం చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ చేస్తారని, మిగతా వారికి తర్వాత పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. కేసీఆర్కు సెంటిమెంట్ నంబర్ 6 కావడంతో ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఆరుగురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పటాన్చెరు, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి ఇద్దరేసి వంతున మొత్తం ఆరుగురు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఆరుగురిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల నుంచి ఒక్కో లబ్ధిదారు ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘కేసీఆర్ నగర్, 2బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ’గా వ్యవహరించనున్న ఈ కాలనీ15,660 ఇళ్లతో ఓ టౌన్షిప్ను తలపిస్తోంది. ఇళ్లతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. 9 నియోజకవర్గాల వారికి అక్కడే.. గ్రేటర్ పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల వారికి కొల్లూరులోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో ఖాళీ స్థలాల్లేక నగర శివార్లలోని ఖాళీ స్థలాల్లో నిర్మించారు. పేదలు నివసిస్తున్న ఇళ్లనే కూల్చివేసి కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మాత్రం వారికే కేటాయించారు. ఎక్కడా ఎలాంటి ఇళ్లు లేని, అద్దె ఇళ్లల్లో నివసిస్తున్న వారికి కేటాయించేందుకు ఎక్కడ ఖాళీ ప్రదేశాలుంటే అక్కడ నిర్మించారు. అలా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను సమీపంలోని పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాలతో పాటు గోషామహల్, నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, బహదూర్పురా నియోజకవర్గాల్లోని అర్హులైన పేదలకు కేటాయించనున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల్లోని వారికి ఇతర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించనున్నారు. లక్ష ఇళ్లకు గాను దాదాపు 68 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల ఎంపికకు టీమ్లు.. అందిన దరఖాస్తులను ఇప్పటికే స్క్రూటినీ చేసిన అధికారులు వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకుగాను 150 టీమ్లను ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ టీమ్లకు వీరు సహకరిస్తారు. రెవెన్యూ టీమ్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాయి. అర్హులను ఎంపిక చేశాక, వారిలో నుంచి లాటరీ ద్వారా లబ్ధిదారులను సంబంధిత జిల్లాల కలెక్టర్లు గుర్తిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు సమయం పట్టనుంది. -
కౌన్సిలర్లు, అధికారులు కుమ్మక్కయారని ఆరోపణ..
-
డబల్ బెడ్ రూమ్ ఇల్లు మొత్తం డొల్లే...!
-
సొంతింటి ఆశలు తీరే సమయం!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎన్నోఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు త్వరలో తీరనున్నాయి. మంత్రి కేటీఆర్ కొత్త సచివాలయం ప్రారంబోత్సవం రోజున డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాల ఫైల్పైనే తొలి సంతకం చేయనున్నారు. దీనితో ల ర్థిదారుల ఎంపిక చేపట్టి, ఇళ్లను పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో.. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. కొనసాగుతున్న వివరాల అప్లోడింగ్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు 63వేల వరకు పూర్తయ్యాయి. ల ర్థిదారులను ఎంపిక చేయగానే వాటిని పంపిణీ చేయవచ్చు. మిగతా ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఏడు లక్షలమందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించి ఓటరు కార్డు ఆధారంగా వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 3.6 లక్షల మంది వివరాలు అప్లోడ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. కానీ పంపిణీ చేయకపోవడంతో.. పలుచోట్ల ఇళ్లలోని సామగ్రి దొంగల పాలైంది. మేడ్చల్ జిల్లా పరిధిలో ఎక్కువ ఇళ్లు జీహెచ్ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎక్కువశాతం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఆ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు. నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. మూడు కేటగిరీలుగా ‘డబుల్’ఇళ్లు అవసరాన్ని బట్టి, ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి జీహెచ్ఎంసీలో మూడు కేటగిరీల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ♦ సెల్లార్+స్టిల్ట్+9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు. ♦ స్టిల్ట్+ 5 అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. ♦ లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు. మౌలిక సదుపాయాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. పేదలకు ఇళ్ల పంపిణీపై కేటీఆర్ తొలి సంతకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనంలోని మూడో అంతస్తులో తనకు కేటాయించిన చాంబర్లోకి ఆదివారం మంత్రి కేటీఆర్ అడుగుపెట్టబోతున్నారు. ఈ కార్యాలయం నుంచే ఐటీ, మున్సిపల్, పట్ట ణాభివృద్ధి, పరిశ్రమల శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు. కొత్త సచివాలయం నుంచి విధుల నిర్వహణ సందర్భంగా కీలకమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ ఇది అని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
హనుమాన్ గుడి లేని ఊరు.. పథకాలు అందని ఇల్లు లేదు
సిరిసిల్ల: రాష్ట్రంలో ‘హనుమాన్ గుడిలేని ఊరు, కేసీఆర్ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం నాలుగు వందల మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ నీళ్లు, గురుకులాల్లో విద్య, ఆసరా పెన్షన్... ఇలా ఏదో ఒక్క పథకంలో పక్కాగా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధిపొందుతోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు రానివారికి ‘రూ.3 లక్షల ఇల్లు’పథకంలో అవకాశం కల్పిస్తామని అన్నారు. స్థలం లేని వారికి స్థలం, ఇల్లు కట్టుకోడానికి నిధులను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. అర్హులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మోదీకి ఇష్టం లేకున్నా.. మనమే నంబర్ వన్ తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేకున్నా.. దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్ వన్గా నిలిచిందని కేటీఆర్ అన్నారు. సోమవారం కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ విభాగంలో రాజన్న సిరిసిల్ల నంబర్ వన్గా ఉందని, రెండోస్థానంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని కాలేజీ విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రెండు వేల మందికి ట్యాబ్లు పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని పిల్లలకు మరో 3 వేల ట్యాబ్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో ట్యాబ్ విలువ రూ.86 వేలు ఉంటుందన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివే పిల్లలు ఐఐటీ, నీట్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలని, ప్రపంచంతో పోటీ పడేస్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలి వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే తొలి వృద్ధాశ్రమాన్ని మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో ప్రారంభించారు. ఎస్టీ హాస్టల్ భవనాన్ని రూ.40 లక్షలతో ఆధునీకరించి వృద్ధుల ఆశ్రమం, డే కేర్ సెంటర్గా మార్చారు. 25 పడకలతో కూడిన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి యోగా కేంద్రం, ఫిజియోథెరపీ, డాక్టర్ రూం, వ్యాయామ శాల, గేమ్స్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో మంత్రి కేటీఆర్ క్యారంబోర్డు ఆడారు. వారితో కలిసి భోజనం చేశారు. వృద్ధులతో చాలాసేపు ముచ్చటించారు. -
ఊ అంటారా..ఊహూ అంటారా?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఐటీ ఎగుమతులు, భూములు, ఇళ్ల విక్రయాలు, మద్యం, మాంసం, పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా జిల్లా నుంచే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్నా.. ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూరడం లేదు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. భారీ వర్షాలు, వరదలకు లోతట్టు ప్రాంతాలు నీట మునగక తప్పడం లేదు. శివారు మున్సిపాలిటీల్లో ఎస్ఆర్డీపీ పథకం కింద కొన్ని పనులు చేపట్టినా.. సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో ఏళ్ల తరబడి పనులు సాగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టే బడ్జెట్లో జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారో.. రిక్తహస్తం చూపిస్తారో వేచి చూడాలి. ‘పంచాయతీ’ పరిష్కరిస్తారా? జిల్లాలో 558 పంచాయతీలు, 13 మున్సిపాలిటీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. భూముల అమ్మకాలు, ఇళ్ల నిర్మాణాలు, ఐటీ అనుబంధ సంస్థలు, పారిశ్రామికవాడల ఏర్పాటుతో ప్రభుత్వానికి వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. వీటికి కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా స్థానిక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీధిలైట్లు, పారిశుద్ధ్య పనులు, నర్సరీల్లో మొక్కల పరిరక్షణ, ట్రాక్టర్ కోసం బ్యాంకులో తీసుకున్న అప్పులు, డీజిల్ ఖర్చులు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఇతర నిర్వహణ పనుల కోసం సర్పంచ్లు అప్పు చేయాల్సిన పరిస్థితి. గూడు గోడు తీరేనా? ప్రభుత్వం 2016–17లో జిల్లాకు 6,777 ఇళ్లకు పాలనా అనుమతి ఇచ్చింది. ఇందుకు 274.35 ఎకరాల భూమిని కేటాయించింది. వీటిలో 6,637 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా ఇప్పటి వరకు 2,445 మాత్రమే తుది దశలో ఉన్నాయి. మిగిలిన వాటిలో ఎలాంటి పురోగతి లేదు. తుది దశలో ఉన్న ఇళ్ల పంపిణీకి లబ్ధిదారులను కూడా ఎంపిక చేసింది. డ్రైనేజీ, వాటర్, విద్యుత్ పనులు పూర్తికాకపోవడంతో పంపిణీ నిలిచిపోయింది. ఇందుకు రూ.20 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇటీవల రూ.10 కోట్లు కేటాయించగా మరో రూ.10 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్లోనైనా వీటికి నిధులు కేటాయిస్తారో, లేదో వేచి చూడాల్సిందే. ఖాళీ స్థలాలున్న వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ బడ్జెట్లోనైనా దీనికి మోక్షం కలుగుతుందో లేదో చూడాలి. నిధుల్లేక నీరసించిన ‘మన ఊరు మనబడి’ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన ‘మన ఊరు– మనబడి’ పథకానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అప్పు చేసి పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడమే ఇందుకు కారణం. జిల్లాలో 1,309 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో తొలి విడతగా 464 స్కూళ్లను ఎంపిక చేసి రూ.97.88 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 30 స్కూళ్లలోనే పనులు పూర్తయ్యాయి. అదీ రంగులు, ఫరి్నచర్, ఎలక్ట్రిసిటీ, తాగునీరు వంటి పనులే జరిగాయి. అదనపు గదుల నిర్మాణం, కిచెన్, ఇతర కీలక పనులు పెండింగ్లో ఉన్నాయి. రూ.35 లక్షలకుపైగా వర్కులు ఉన్న స్కూళ్లకు టెండర్లు పిలిస్తే.. కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేదు. ఆ ‘రుణం’ ఈసారైనా తీర్చేనా? 2014 నుంచి 2018 డిసెంబర్ 11లోపు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీతో కలిపి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష రుణమాఫీ చేయనున్నట్లు తెలిపింది. మొదటి విడతలో రూ.25 వేలలోపు రుణాలున్న 10,940 మందికి రూ.16.73 కోట్లు, రెండో విడతలో రూ.50 వేలలోపు రుణాలున్న 24,013 మందికి రూ.82.49 కోట్లు మంజూరు చేసింది. మూడు, నాలుగో విడత రుణాల మాఫీని వి స్మరించింది. పాత రుణాలను మాఫీ చేయకపోవడంతో.. కొత్తగా రైతులకు అప్పు పుట్టడం లేదు. వీటి పరిస్థితి ఏమిటి? కోహెడలో రూ.450 కోట్ల అంచనా వ్యయంతో 178 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన పండ్ల మార్కెట్కు ఇప్పటి వరకు పైసా విదల్చలేదు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఆవరణలో 12 అంతస్తుల్లో రూ.900 కోట్లకుపైగా నిధులతో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి ఆరు నెలలైంది. నిధులు విడుదల చేసినా ఇప్పటి వరకు పునాది రాళ్లు కూడా పడలేదు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా 2017–18 వరకు సబ్సిడీపై రైతులకు అందించిన యంత్రాలు, డ్రిప్లు, విత్తనాలు, ఎరువులను ఆ తర్వాత నిలిపివేశారు. ఈ బడ్జెట్లోనైనా వాటి ప్రస్తావన ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరిసరాల్లోని 84 గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీఓను గత అసెంబ్లీలో ప్రభుత్వం ఎత్తేసింది. దాని స్థానంలో జీఓ నంబర్ 69 తెచ్చినా ఇప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. బీసీ సంక్షేమశాఖ ద్వారా స్వయం ఉపాధి పథకంలో భాగంగా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై బ్యాంకులు రుణాలిచ్చేవి. మూడేళ్ల నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇటు బ్యాంకుల నుంచి సబ్సీడీ రుణాలు అందక, అటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందిపడుతోంది. ఎస్టీ సంక్షేమశాఖ ద్వారా ఓనర్ కం డ్రైవర్ పథకంలో భాగంగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీపై వాహనాలు అందించేవారు. వేలాది మంది దరఖాస్తు దారులకు రెండేళ్లుగా ఎదురు చూపులు తప్పడం లేదు. జిల్లాలో 20 కేజీబీవీలుండగా ఏ ఒక్క దానికీ సొంత భవనం లేదు. దీంతో ఆయా విద్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొందుర్గు మండలం పులుసుమామిడి, కడ్తాల్ మండలాల్లో చేపడుతున్న కేజీబీవీలకు సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో పని చేస్తున్న వసతి గృహాలదీ ఇదే పరిస్థితి. జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వృత్తిదారులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లు మొత్తం 2,07,639 మందిని ఆసరా పెన్షన్లకు ఎంపిక చేసింది. కొత్తగా ఎంపికైన వారికి కార్డులు జారీ చేసినా నిధుల లేమితో నెలవారీ డబ్బులు ఇవ్వడం లేదు. దళిత బంధు పథకం కింద మొదటి విడతలో నియోజకవర్గానికి వంద చొప్పున లబ్థిదారులను ఎంపిక చేసి, వారికి ఆర్థిక సాయం అందజేశారు. రెండో విడత కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. నిధుల లేమితో ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదు. (చదవండి: ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు ) -
మా ఇంటికి వెళ్లేదెప్పుడు?
గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని జనం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వేల ఇళ్లు నిర్మాణం పూర్తయినా పేదల చేతికి రావడం లేదు. మరెన్నో ఇళ్లు వివిధ దశల్లో పనులు ఆగిపోయి బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రేటర్లో కలిసి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రాంతాల్లో 62 వేలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని వెంటనే పంపిణీ చేయాలని, తమ సొంతింటి కలను తీర్చాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు 2015లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ.. త్వరలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ఉంటుందని ప్రకటించింది. కానీ ఇది అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు 62 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక జరగకపోవడంతో పంపిణీ కాలేదు. దరఖాస్తుల అప్లోడింగ్ సగమే.. మొత్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. 50 వేల ఇళ్లను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ దాదాపు రెండేళ్ల క్రితం పేర్కొన్నారు. పంపిణీకి అర్హులైన పేదలను గుర్తించేందుకు ఆరు నెలల కింద క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. 7 లక్షల మందికిపైగా ‘డబుల్’ ఇళ్ల కోసం దర ఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు మూడున్నర లక్షల మంది వివరాలనే సంబంధిత యాప్లో అప్లోడ్ చేశారు. కరోనా సమయంలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఫోన్ నంబర్లు మారడం తదితర కారణాలతో వారికి సమాచారం అందలేదు. అర్హుల ఎంపిక ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారనే ప్రచారంతో చాలా మంది ఆశపడినా నిరాశే మిగిలింది. నిలిచిన పనులు.. సామగ్రి దొంగల పాలు పలుచోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయని, పాత ధరలతో ఇప్పుడు పనులు చేయలేమని కాంట్రాక్టర్లు అంటున్నారు. మరోవైపు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో ఇళ్లకు కాపలా సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు, శానిటేషన్ సామగ్రితోపాటు వివిధ అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటివి చోరీకి గురయ్యాయి. చివరికి ఇళ్ల గోడలు తొలిచి ఇటుకలనూ దొంగిలించినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటికే దాదాపు రూ.3కోట్ల విలువైన సామగ్రి దొంగలపాలు అయిందని.. లబ్ధిదారులకు కేటాయింపులు, గృహ ప్రవేశాలు జరిగితేగానీ మొత్తం ఏయే సామగ్రి పోయిందో, ఎంత విలువో తెలుస్తుందని అధికారులు చెప్తున్నారు. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మాణం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లను భారీ అపార్ట్మెంట్ల తరహాలో నిర్మిస్తున్నారు. వీటిలో మూడు రకాలున్నాయి. ►సెల్లార్+ స్టిల్ట్+ 9 అంతస్తులు, లిఫ్టులు, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలతో భవన సముదాయం. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.65 లక్షలు ►స్టిల్ట్+ 5అంతస్తులు, లిఫ్టులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.8.50 లక్షలు. ►లిఫ్టులు లేకుండా గ్రౌండ్+3 అంతస్తులు, మౌలిక సదుపాయాలతో భవనాలు. ఒక్కో ఇంటి వ్యయం రూ.7.75 లక్షలు. ►అన్ని రకాల్లోనూ 569 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. ఒక హాల్, 2 బెడ్రూంలు, ఒక కిచెన్, రెండు టాయిలెట్లు ఉండేలా నిర్మిస్తున్నారు. లక్ష ఇళ్లు ఇలా.. ►మొత్తం లక్ష ఇళ్లకుగాను కోర్టు కేసులు, వివాదాలతో 2,659 ఇళ్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. ►మిగతా వాటిలో 88,443 ఇళ్లను 27 ఖాళీ ప్రదేశాల్లో చేపట్టారు. వీటిలో 62,516 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావాటి పనులు 70–80 శాతం వరకు పూర్తయ్యాయి. ►నగరంలోని మురికివాడలు, ఇతర ప్రాంతాల్లో పేదల పాత ఇళ్లను కూల్చివేసి వాటిస్థానంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇలా 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటిని డిగ్నిటీ హౌసింగ్ కాలనీలుగా పిలుస్తున్నారు. ఇప్పటివరకు 26 డిగ్నిటీ హౌసింగ్ కాలనీల్లో 5,266 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని మాత్రం పంపిణీ చేశారు. మరో రూ. 2847 కోట్లు అవసరం ►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలతో కలిపి మొత్తం అంచనా వ్యయం: రూ.9,715 కోట్లు ►ఇందులో హౌసింగ్ విభాగం నుంచి అందిన నిధులు: రూ.6,868 కోట్లు ►పెండింగ్లో ఉన్న బిల్లులు: రూ. 150 కోట్లు ►ఇళ్లు పూర్తయ్యేందుకు ఇంకా కావాల్సిన నిధులు: రూ. 2,847 కోట్లు ►కేంద్రం నుంచి పీఎంఏవై ద్వారా రూ. 1,500 కోట్లు మంజూరైనా.. లబ్ధిదారుల ఎంపిక జరగనందున మొత్తం నిధులు రాలేదు. ఇప్పటివరకు దాదాపు రూ. 750 కోట్లు అందాయి. పంపిణీ యోచనలో ప్రభుత్వం ఉంది ‘‘కోవిడ్ కారణంగా అన్నిరంగాలు దెబ్బతినడం, ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలం పనులు నెమ్మదించాయి. 62 వేల ఇళ్లు పూర్తికాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. స్థానికత గుర్తింపు కోసం నియోజకవర్గ ఓటరు, ఆధార్ జిరాక్సులను జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ఇళ్ల కోసం ఏడు లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకోగా.. 3.50 లక్షల మంది డేటా అప్లోడ్ అయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సమాచారం నిమిత్తం పత్రికా ప్రకటనలు జారీ చేయడంతోపాటు జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేశారు. మూడు నెలలకోమారు 30 వేల కుటుంబాలకు చొప్పున ఇళ్లను పంపిణీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఉత్తర్వులు రాగానే ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. – కె.సురేశ్కుమార్, ఓఎస్డీ (హౌసింగ్), జీహెచ్ఎంసీ ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం డబుల్ బెడ్రూం ఇంటి కోసం ఐదేండ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆరు నెలల కింద ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తే ఓటరు ఐడీకార్డు, ఆధార్కార్డు వివరాలిచ్చాం. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేస్తారని ఆశిస్తున్నాం. – పద్మ, బాపునగర్, చిక్కడపల్లి కళ్లు కాయలు కాస్తున్నాయ్.. అదిగో ఇదిగో డబుల్ బెడ్రూం ఇళ్లొస్తున్నాయ్ అంటూ ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. నాలుగేళ్ల కింద దరఖాస్తులిచ్చినం. ఇప్పటివరకు ఏమీలేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. మా ఆయన కూలి పనికి వెళతాడు. కరోనా వచ్చినప్పటి నుంచి మరిన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇంటికోసం ఎదురు చూసీ చూసీ కళ్లు కాయలు కాస్తున్నాయ్. – ప్రశాంతి, ఉప్పల్ -
బాన్సువాడలో ‘డబుల్’ ధమాకా !
సాక్షి, కామారెడ్డి: బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చొరవతో నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలోని తాడ్కోల్లో నిర్మించిన 504 డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డిలతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన తరువాత స్పీకర్ పోచారం నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఏ నియోజక వర్గంలో లేని విధంగా బాన్సువాడకు 11 వేల ఇళ్లను మంజూరు చేయించారు. ఇప్పటివరకు ఏడు వేల పైచిలుకు ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా పట్టణ పరిధిలోని తాడ్కోల్ శివారులో మొదట ఐదు వందల ఇళ్లు నిర్మించారు. వాటిని ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అదే కాంపౌండ్లో నిర్మించిన 504 ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించారు. కేసీఆర్ నగర్గా ఈ కాంపౌండ్కు నామకరణం చేశారు. అక్కడే రూ.90 లక్షలతో కల్యాణ వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలనీలో షాపింగ్ కోసం కాంప్లెక్సు నిర్మించారు. కాలనీలోని ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు పోచారం పేర్కొన్నారు. కాగా తమకూ ఇళ్లు కావాలంటూ మరికొందరు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. -
మంత్రి కేటీఆర్కు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్
దౌల్తాబాద్: ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో తాము ఓట్లు అడగమని, మరి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వని గ్రామాల్లో మీరు ఓటు అడగకుండా ఉంటారా అని మంత్రి కేటీఆర్కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. హాథ్సేహాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గం పరిధిలోని దౌల్తాబాద్లో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తోందని నిందించారు. దేశాన్ని ఏకతాటి పైకి చ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని, రాహుల్ సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చేందుకు హాథ్సేహాథ్ జోడో కార్యక్రమాన్ని చేపడుతున్నా మని రేవంత్ చెప్పారు. ‘మీరు కష్టపడి నాటిన మొక్క నేడు ఒక వృక్షమై కొడంగల్కు గుర్తింపు తీసుకొచ్చింది వాస్తవం కాదా.. 119 నియోజక వర్గాల బీఫాంలపై సంతకం పెట్టే అవకాశం నాకు కల్పించారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గురునాథ్రెడ్డిని కలిసిన రేవంత్ కొడంగల్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాల మేరకు గురునాథ్రెడ్డిని కలిసినట్లు రేవంత్ తెలిపారు. గురునాథ్రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడని, కొడంగల్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. కొడంగల్కు కేటీఆర్ చేసిందేమీలేదు: రేవంత్ కోస్గి/మద్దూరు:మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొని కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండి తాను చేసిన అభివృద్ధికి, ప్రస్తుతం అధికారంలో ఉండి మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన సన్నాహక యాత్ర శుక్రవారం రాత్రి నారాయణపేట జిల్లా కోస్గికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక శివాజీ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో రేవంత్రెడ్డి మాట్లాడారు. -
డబుల్ అను‘గృహమే’దీ?
ఇదీ.. సంక్షేమ రంగంలోనే మేలిమలుపుగా దేశవ్యాప్త చర్చకు దారితీసిన ‘డబుల్ బెడ్రూం ఇళ్ల’పథకం ప్రస్తుత పరిస్థితి. ‘సింగిల్ కాదు.. డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం.. అదీ పూర్తి ప్రభుత్వ ఖర్చుతోనే!’.. అని ప్రభుత్వం చెప్పడంతో నిరుపేదలు తమ ఊహలకు రెక్కలు తొడిగారు. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ (ఇన్ఫెక్షన్ డిసీజ్ హాస్పిటల్) కాలనీ తరహాలోనే తమకూ కొత్త జీవితం వస్తుందని ఆశపడ్డారు. ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల నిర్మాణానికి వ్యూహరచన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. కానీ, ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు మాత్రం 2.76 లక్షలే. వీటిలో నిర్మాణం పూర్తయింది సగం కంటే తక్కువే. అదీగాక ఇళ్లు పూర్తయినా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇంకా తక్కువే. వీటికితోడు అన్ని సదుపాయాలు కల్పించిన ప్రాంతాల్లోనూ ఇళ్లు పంపిణీ చేయకపోవడం శోచనీయం. ఇన్ని అడ్డంకులు దాటుకుని తీరా కేటాయింపులు చేసే సమయంలో రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేస్తుండటంతో నిరుపేదల ఆశలు అడియాసలవుతున్నాయి. ఫలితంగా సమున్నత పథక లక్ష్యం పక్కదారి పట్టే పరిస్థితి కనిపిస్తోంది. – శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి దొంగలతో.. మళ్లీ మొదటికి.. మెదక్ జిల్లా రామాయంపేటలో చాలాకాలం క్రితమే 300 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ ఉన్న ఇళ్ల కంటే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే నిధుల కొరత ఉండటంతో మౌలిక సదుపాయాల కల్పనలోనూ జాప్యం చేశారు. ఈలోగా ఆ ఇళ్లలో దొంగలు పడి విద్యుత్ వైర్లను పూర్తిగా ఎత్తుకుపోయారు. దీంతో అన్ని ఇళ్లకు మళ్లీ వైరింగ్ చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తాన్ని ఎవరు భరించాలో స్పష్టత లేక అధికారులు తల పట్టుకుంటున్నారు. మరుగుదొడ్డిలో.. ఏడాదిగా.. మెదక్ జిల్లా రామాయంపేటలో డబుల్ బెడ్రూం ఇల్లు కోసం రామలక్ష్మి ఎదురుచూస్తోంది. మూడేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకుంది కూడా. అయితే ఆమెకు ఎక్కడా నిలువ నీడ లేక ఇప్పుడు కొడుకుతో కలిసి ఆర్ అండ్ బీ శాఖ వదిలేసిన అతిథి గృహంలోని మరుగుదొడ్డిలో నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో ఏడాది కాలంగా ఈ మరుగుదొడ్డిలో కాలం వెల్లదీస్తోంది. ఉన్న ఇల్లు ఖాళీ చేసి.. మేం ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. మేం ఇతరుల స్థలంలో రేకులతో షెడ్డు వేసుకుని చలికి వణుకుతూ, వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నాం. ఉన్న ఇళ్లు పోయి, డబుల్ బెడ్రూం రాక అవస్థలు పడుతున్నాం. –లాల్కోట రాజు, చౌదరిపల్లి, మహబూబ్నగర్ ప్రతి చోటా రాజకీయ స్వార్థం వద్దు ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా అర్హులకు చేరేలా పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేయాలి. కానీ రాష్ట్రంలో అలా కనిపించడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలోనూ నిజమైన నిరుపేదలను గుర్తించే బాధ్యతను అధికారులకు అప్పగించాలి. కానీ రాజకీయ సిఫారసు ఉంటేనే డబుల్ బెడ్రూం అయినా, మరోటి అయినా వచ్చే పరిస్థితి ఉంది. చాలాచోట్ల ఇళ్లు పూర్తయినా పంపిణీ చేయడం లేదు. ప్రతి పనిలో రాజకీయ స్వార్థం చూసుకోవడం వ్యవస్థకు మంచిదికాదు. –జస్టిస్ కె. చంద్రకుమార్ కొత్త ఇళ్లు.. పాత పడిపోయినా.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 720 ఇళ్ల నిర్మాణం ఎప్పుడో పూర్తయింది. మౌలిక సదుపాయాలకు నిధులు లేక పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. ఈలోగా ఇంటి అద్దాలు, ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. ఆశావహుల సంఖ్య వేలల్లో, ఇళ్లు మాత్రం వందల్లో ఉండటంతో ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నిలువ నీడ కోసం.. నిలువెల్లా కనులై.. కామారెడ్డిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలో తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఈ నిరుపేద దంపతులు నిలువెల్లా కనులతో ఎదురుచూస్తున్నారు. ఊరూరా తిరుగుతూ చిరు వ్యాపారం చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు అండ్రాసి సాయవ్వ, రంగయ్యలు. ఇప్పుడు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు వీళ్లు వెళ్లని ఆఫీసు, కలవని అధికారి లేడంటే అతిశయోక్తి కాదు. తొలి అడుగు పడిందిలా.. 2015 తొలినాళ్లలో సికింద్రాబాద్ బోయిగూడలో ఐడీహెచ్ కాలనీతోపాటు మరో నాలుగు మురికివాడల్లో ఇరుకుగదులు, కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ ఇళ్లలో ఉంటున్న వారిని ఒప్పించి రూ.37 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టు పద్ధతిన 33 బ్లాకుల్లో ప్రతి ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక వంటగది రెండు బెడ్రూంలను కేవలం 11 నెలల్లో నిర్మించి 396 మందికి అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.7.90 లక్షలు, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు ఇతర సదుపాయాల కోసం రూ.1.33 లక్షల చొప్పున ఖర్చు చేసి యాభై ఏళ్ల మురికివాడను క్లాస్ కాలనీగా తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ చొరవతో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో రాష్ట్రమంతటా డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం 2015 నవంబర్లో ప్రకటించింది. పేదలను వదిలి.. నాయకులకు.. మహబూబ్నగర్లో ఏటా నీటమునిగే బస్తీల్లో శిథిలావస్థకు చేరిన పేదల కోసం దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. అయితే ఇందులో ఇప్పటికే 100 ఇళ్లను ముఖ్యనాయకుల సిఫారసుల మేరకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను వార్డు, ఇతర ముఖ్యుల సూచన మేరకు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కేటాయింపుల కోసం భారీగా డబ్బులు వసూలు చేయడం, కొందరిని అరెస్ట్ చేయడం, మంత్రి పీఏ కుమారుడి ఆత్మహత్య లాంటి ఘటనలతో ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఫలితంగా అవన్నీ ఇప్పుడు పిచ్చిమెక్కలతో నిండిపోయాయి. కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో మౌలిక సదుపాయాల పనులు నిలిపేశారు. -
సిద్ధిపేట: వ్యక్తి హల్చల్ ఘటనలో ట్విస్ట్
సిద్ధిపేట: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా సిద్ధిపేటలో జరిగిన ఓ ఘటనను దానికి ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అయితే.. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి సృష్టించిన అలజడిపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. బిల్బోర్డ్ ఫ్రేమ్ను పట్టుకుని ఓ వ్యక్తి ఊగిసలాడడం, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమే అతనలా చేశాడంటూ జరిగిన ప్రచారం అంతా నిజం కాదని సిద్ధిపేట పోలీసులు స్పష్టత ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బుధవారం నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. బిల్బోర్డ్ పట్టుకుని వేలాడుతూ అధికారులకు చుక్కలు చూపించాడు. దానికి తోడు అతని వ్యవహారంతో ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. అయితే.. ఎలాగోలా అతన్ని కిందకు దించారు పోలీసులు. దీనిపై మంత్రి హరీష్రావు ఏమంటారంటూ బీజేపీ విమర్శకు దిగింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిరసనలో భాగమే ఇదంటూ ప్రచారం చేసింది. అయితే.. ఆ వ్యక్తి తప్పతాగి వీరంగం వేశాడని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ‘‘బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో సోయిలేక ఆ వ్యక్తి అలా చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమో మరేయితర దాని కోసమో అతను అలా చేయలేదు. కిందకు దించి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. అలాగే అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశాం’’ అని సిద్ధిపేట కమిషనర్ శ్వేత మీడియాకు వెల్లడించారు. This is the Situation in #Siddipet Mr.@trsharish Do you have an Answer?@BRSparty #KCRFailedTelangana pic.twitter.com/u5yzfRv5FD — Maruthi (@Maruthi0305) January 11, 2023 -
సీఎం గారూ.. ఇళ్లు కట్టిస్తేనే మీ మాటకు విలువ
సాక్షి ప్రతినిధి నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, ఇప్పుడు ఆ మాటకు విలువ పెంచాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 5 వేలు, ప్రతి గ్రామంలో 300 చొప్పున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేయాలని కోరారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో 20 వేల చొప్పున ఇళ్లు కట్టించారన్నారు. నల్లగొండలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు కట్టించడం లేదని ప్రశ్నించారు. సీఎం దత్తత తీసుకున్న నియోజకవర్గం అన్యాయం అయిపోతుందనే బాధతో తాను మాట్లాడుతున్నానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారన్నారు. ‘చేతులు జోడించి అడుగుతున్నా.. సీఎం గారూ.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వండి’అని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి సమీక్ష నిర్వహించి అభివృద్ధి చేయాలని సూచించారు. దళితబంధుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. దీనిపై కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు ముట్టజెప్పిన వారికి ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. లాటరీ పద్ధతిన అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు ‘పీసీసీ కమిటీలో నా పేరు లేకపోవచ్చు. ఢిల్లీలో హైపవర్ కమిటీలు చాలా ఉన్నాయి’అని వెంకట్రెడ్డి పేర్కొన్నారు. తాను మంత్రి పదవికే రాజీనామా చేసినవాడినని, తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజలు, కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకున్నాను కదా. రేపు ఏ కమిటీలో ఉంటానో మీకేం తెలుసు‘అని ప్రశ్నించారు. ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే రాజకీయాల గురించి మాట్లాడతానన్నారు. రెండు రాష్ట్రాలు కలవడం అనేది అసాధ్యమని, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావని, అలాంటి మాటలు మాట్లాడవద్దని సీరియస్గా చెబుతున్నానని అన్నారు. రాష్ట్రం ఏర్పాటైనా తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా కట్టుకోలేదని, ప్రజలు ఇళ్లు కట్టుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ మాత్రమే హ్యాపీగా ఉన్నారన్నారని అన్నారు. ఆయన బీఆర్ఎస్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా తెలంగాణ అనే పదం తీసేయడం బాధగా అనిపించిందన్నారు. -
పింఛన్ తొలగించారని.. దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, యాదాద్రి/ కొండపాక(గజ్వేల్)/ సాక్షి, రంగారెడ్డిజిల్లా /మంచిర్యాల అగ్రికల్చర్: పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాలు అందడం లేదంటూ.. అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ.. బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. తమ బాధలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు వస్తున్నారు. తమ సమస్య ఎప్పుడు తీరుతుందోననే మనస్తాపంతో ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు. సోమవారం పలు జిల్లా కలెక్టరేట్లలో నలుగురు ఇలాంటి ప్రయత్నాలు చేయడం కలకలం రేపింది. పింఛన్ తొలగించారంటూ.. దివ్యాంగుడు.. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురం గ్రామానికి చెందిన నాగపురి యాదగిరికి ఆగస్టులో ప్రభుత్వం వికలాంగుల పింఛన్ మంజూరు చేసింది. ఒక నెల పింఛన్ తీసుకున్న యాదగిరికి తర్వాతి నెలలోనే ఆపేశారు. తాను కృత్రిమకాలుతో నడుస్తున్నానని, భార్య కూలి పనిచేసి పోషిస్తోందని, తనకు పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే యాదగిరి సోమవారం కలెక్టర్లో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోబోయాడు. ఇది గమనించిన కలెక్టర్ సీసీ సోమేశ్వర్, సిబ్బంది ఆయనను ఆపారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించిన అనంతరం యాదగిరికి కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. అయితే యాదగిరి కుమారుడికి ట్రాక్టర్ ఉండటంతో పింఛన్ తొలగించినట్టు అధికారులు చెప్తున్నారు. భూమిని తమకు కాకుండా చేస్తున్నారంటూ.. మహిళ అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లికి చెందిన బి.జయశ్రీ తండ్రి సుర్వి భిక్షపతికి ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 67లో 1.35 ఎకరాల భూమి ఉంది. ఆయన భూమిని ముగ్గురు కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తమ భూమిపై రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు కన్నేశాయని.. తాము విక్రయించబోమని చెప్తున్నా తహసీల్దార్ అనితారెడ్డితో కలిసి తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాయని జయశ్రీ అనే మహిళా రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ధరణి పోర్టల్లో భూమి వివరాలు మార్చి కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్ అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బ్లేడుతో చేతులు కోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు, కాంగ్రెస్ నేతలు ఆమెను అడ్డుకుని.. అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ అంశాన్ని పరిశీలించి, న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ తిరుపతిరావు హామీ ఇచ్చారు. దుకాణం ఖాళీ చేయాలని వేధిస్తున్నారంటూ.. యువకుడు మంచిర్యాల అగ్రికల్చర్: అద్దె దుకాణం తొలగించొద్దని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సంతోష్ సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిపై నీళ్లు పోశారు. బాధితుడి వివరాల ప్రకారం.. చెన్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని దుకాణ సముదాయంలో ఓ షటర్ను పదేళ్లుగా అద్దెకు తీసుకుని టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం తొలగించాలని మూడు నెలల క్రితం ఎంపీడీవో, ఎంపీపీలు షటర్కు తాళం వేయించారు. ఎంపీ, ఎమ్మెల్యేకు గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. సోమవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని చెప్పడంతో కలెక్టరేట్కు వచ్చానని తెలిపాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నీళ్లు చల్లి అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేశారు. సంతోష్పై నీళ్లు పోస్తున్న పోలీసులు ఇల్లు మంజూరైన అడ్డుకుంటున్నారని ఆత్మహత్య పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో సిద్దిపేట జిల్లాలో కలకలం కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్ రూం ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చాక కూడా కేటాయించకుండా అడ్డుకుంటున్నారని మనస్థాపానికి గురైన ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కలెక్టరెట్ కార్యాలయం ఆవరణలో సోమవారం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణంలోని గణేశ్ నగర్లో నివాసం ఉంటున్న శీలసాగరం రమేశ్ ఆటో డ్రైవర్. పట్టణ శివారులో నిర్మించిన డబుల్ ఇల్లు కోసం భార్య లత పేరిట దరఖాస్తు చేసుకున్నాడు. మూడు పర్యాయాలు లబ్ధిదారుల జాబితాలో లత పేరు వచ్చింది. అయినా ఇల్లును కేటాయించలేదు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. 26వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తూ పురుగుల మందు తాగుతున్న సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలోనే కలెక్టరెట్ ఆవరణలో ఉన్న వాహనాల పార్కింగ్ వద్ద పడిపోయాడు. వెంటనే అక్కడున్న స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బంది మహేందర్, శ్రీనివాస్కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న రమేశ్ను అంబులెన్సులో సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని అంబులెన్సు సిబ్బంది మహేందర్ తెలిపారు. మృతుడి భార్య లత ఇల్లు మంజూరైనా పట్టా ఇవ్వకుండా కౌన్సిలర్ ప్రవీణ్ అడ్డుకుంటుడటంతో డబ్బులు కూడా ఇచ్చామని ఆరోపించింది. తన భర్త మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వేడుకుంది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ భాను ప్రకాష్ తెలిపారు. -
కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం..
నిర్మల్: ‘‘కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో. సొంత ఇంటిజాగా ఉన్నవాళ్లందరికీ రూ.5 లక్షలిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చినవ్. మాట తప్పి ఇప్పుడు రూ.3లక్షలే ఇస్తామంటున్నవ్. మాట తప్పి తప్పు చేశానంటూ అసెంబ్లీ సాక్షిగా లెంపలేసుకుని ప్రజలను క్షమాపణ కోరాలి. నీ పాలనలో పిల్లల్ని కనాలంటే భయపడుతున్నారు. పుట్టబోయే బిడ్డపైనా రూ.లక్షకుపైగా అప్పు చేసినవ్. నీకు పేదలంటే మంట. వానొస్తే మునిగిపోతున్న గుండెగాంను చూస్తే గుండె తరుక్కుపోతోంది. సమస్య తీరే దాకా ఈ సర్కారుపై పోరాడుదాం. ఈసారి వాన వచి్చనప్పుడు టీఆర్ఎస్ నేతలను తీసుకొచ్చి ఇక్కడ కట్టేయండి. మీ కష్టమేందో కేసీఆర్కు అప్పుడు తెలుస్తది..’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బుధవారం ప్రజాసంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాం, మహాగాం, కుభీర్ మండలం చాత మీదుగా లింబా(బి) శివారుకు చేరుకుంది. మా ఊరు తెలంగాణలో లేదా.. గుండెగాం వాసుల గోస ‘‘వర్షం వస్తే మా పరిస్థితిని మాటల్లో కూడా చెప్పలేం. గత ఏడేళ్లుగా పునరావాసం కోసం తిప్పలు పడుతున్నాం. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే మమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. ప్రశి్నస్తే మమ్మల్ని పోలీస్స్టేషన్లో వేస్తున్నారు. గుండెగాం గ్రామం తెలంగాణలో లేదా..? ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. బండి సంజయ్ వస్తున్నాడంటే... టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెండుసార్లు సర్వే చేశారు’’అంటూ గుండెగాం వాసులు తమ గోస వినిపించారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని పల్సికర్ రంగారావ్ ప్రాజెక్ట్ ముంపు గ్రామమైన గుండెగాం హనుమాన్ ఆలయం వద్ద గ్రామస్తులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. గుండెగాం ప్రజల గోస వింటుంటే గుండె తరుక్కుపోతోందన్నారు. కేసీఆర్ కమీషన్ల కోసం ప్రగతిభవన్, సచివాలయం కట్టుకుంటడు, కాళేశ్వరం కడతడు, కానీ కమీషన్లు రావని గుండెగాం ప్రజలను గాలికొదిలేసిండని మండిపడ్డారు. గుండెగాం ప్రజలు బాధపడొద్దని, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్ని హామీలు అమలు చేసినవ్.. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచి్చన హామీలేవీ అమలు కాలేదని బండి సంజయ్ ఆరోపించారు. భైంసా మండలంలోని మహాగాంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. తెలంగాణలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే వాటిని దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి సహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల గడువు దగ్గర పడుతుండడంతో కొత్త డ్రామాలకు తెరదీశాడన్నారు.చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ నోటికి మాటలు ఎక్కువన్నారు. కల్వకుంట్ల ఇంట్లోనే ముఖ్యమంత్రి పీఠం కోసం లొల్లి మొదలైందని సంజయ్ ఆరోపించారు. దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులనూ పొట్టనబెట్టుకుంటున్నరు.. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్ల కుప్పలపై రైతన్నలతోపాటు విద్యార్థులు సైతం ప్రాణాలను కోల్పోతున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మూల్యాంకనంలో చేసిన నిర్వాకం వల్ల సిరిసిల్లలో ఓ విద్యారి్థని ఆత్మహత్య చేసుకుందన్నారు. 37 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గడీలో తెలంగాణ తల్లి బందీ అయిందని, ఆ తల్లిని బంధ విముక్తి చేసేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నామని, ప్రజలంతా బీజేపీ వెంట ఉండాలని బండి సంజయ్ కోరారు. చదవండి: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు -
సంక్రాంతి నాటికి ‘డబుల్’ లబ్ధిదారుల గుర్తింపు
సిరిసిల్ల: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగులతో నిర్మించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అర్హులను సంక్రాంతి నాటికి గుర్తించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు 200 గురుకులాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి పెరిగిందని, ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నివేదికలను మార్చిలోగా రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరయ్యాయని వివరించారు. సంక్రాంతి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. సిరిసిల్ల మధ్యమానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు ట్రయల్ రన్ నిర్వహించాలని, రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, సొరంగంలో లైనింగ్ పనులు పూర్తి చేసి మధ్యమానేరు నీటితో మల్కపేటను నింపాలని సూచించారు. అనంతరం తనను కలిసిన గౌడ సంఘం జిల్లా నాయకులతో కేటీఆర్ మాట్లాడుతూ అర్హులైన గీత కార్మికులకు మోపెడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. -
జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 నాటికి పూర్తి చేయా లని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మలతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఆహారభద్రత కార్డులు, అద్దె ఇళ్లలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేయాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్కు పంపాలని పేర్కొన్నారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 91 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని వివరించారు. హైదరాబాద్ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా, 62 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల్లో విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. కాగా, సెక్రటేరియట్ భవనం, అమరవీరుల స్మారకచిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల, సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్ 10వఅంతస్తునుంచి పరిశీలించారు. 26లోగా పోడు సర్వే పూర్తి చేయాలి.. ఈ నెల 26లోగా పోడు భూముల సర్వే పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా వివరాలను సబ్ కమిటీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలను లక్ష్యాల మేరకు పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని కోరారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జీవో 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. డా.బి.ఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాలను బీఆర్కేఆర్ భవన్ పదో అంతస్తు నుంచి సీఎస్ సోమేశ్కుమార్తో కలిసి పరిశీలిస్తున్న -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్.. లబ్ధిదారుల ఎంపిక షురూ!
సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా తయారైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని దారిలో పెట్టేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది. పథకం ప్రారంభమైన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.29 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినా, లబ్ధిదారుల ఎంపిక జరగకపోవటంతో ఆ ఇళ్లలో గృహప్రవేశాలు లేకుండాపోయిన సంగతి తెలిసిందే. నామమాత్రంగా కొన్ని చోట్ల అధికారికంగా ఇళ్లను కేటాయించటం తప్ప మిగతా చోట్ల అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో కొందరు పేదలు వాటిని బలవంతంగా ఆక్రమించుకోవడంతో ఆ పథకమే గందరగోళంగా మారింది. ఇప్పుడు అధికారికంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రా రంభించాలని నిర్ణయించారు. ఈమేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంతరెడ్డి బుధవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ గృహసముదాయాల్లో మౌలిక వసతుల కల్పనను వేగిరం చేయాలని ఆదేశించారు. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇందులో స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది. లబ్ధిదారుల జాబితా ఇస్తే కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లు కేంద్రం ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి పేదల ఇళ్లను మంజూరు చేస్తోంది. ఈమేరకు మొదటి దఫా నిధులు కేటాయించింది. వాటి లెక్కలు సమర్పించే సమయంలో లబ్ధిదారుల జాబితాను కోరింది. ఆ జాబితా ఉంటేనే మలిదఫా నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, లేకుంటే ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అలా రాష్ట్రానికి అందాల్సిన రూ.12 వేల కోట్లు నిలిచిపోయాయి. అందుకే వీలైనంత తొందరగా లబ్ధిదారుల జాబితా సిద్ధంచేసి కేంద్రానికి పంపి ఆ నిధులు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం -
Hyderabad: మంత్రి శ్రీనివాస్గౌడ్ మాజీ పీఏ కుమారుడి ఆత్మహత్య
గచ్చిబౌలి/మహబూబ్నగర్ క్రైం: మంత్రి శ్రీనివాస్గౌడ్ వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడి (పీఏ)గా పనిచేసిన రెవెన్యూ ఉద్యోగి దేవేందర్ కుమారుడు కేసిరెడ్డి అక్షయ్కుమార్ (23) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాపూర్లో చోటుచేసుకుంది. అక్షయ్ మహబూబ్నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ స్కాంలో నిందితుడని పోలీసులు తెలిపారు. సోమవారం సీఐ గోనె సురేశ్ కథనం మేరకు వివరాలు ఇలా... మహబూబ్నగర్లోని మోనప్పగుట్టకు చెందిన అక్షయ్ కుమార్.. అమెజాన్ సంస్థలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్కు వచ్చాడు. కొండాపూర్లోని శిల్పవ్యాలీలో నివాసం ఉండే అక్క మల్లిక వద్ద ఉంటున్నాడు. ఈ నెల 19న అక్క మల్లిక, బావ నవీన్ ఊరికి వెళ్లి తిరిగి సోమవారం ఉదయం వచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్షయ్ని పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో వారు మరో తాళం చెవితో తలుపు తీశారు. బెడ్ రూమ్లోకి వెళ్లి చూడగా అక్షయ్ చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో వారు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల అక్షయ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు చెప్పినట్లు సీఐ తెలిపారు. తన తండ్రికి చెడ్డ పేరు వస్తుందని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. అక్షయ్ తండ్రి ప్రస్తుతం మంత్రి వద్ద విధులు నిర్వహించడం లేదని పోలీసులు చెప్పారు. స్కాం ఏంటంటే... మహబూబ్నగర్లోని దివిటిపల్లిలో సయ్యద్ కలాం పాషా అనే వ్యక్తికి బి–120 నంబర్ గల డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. అయితే ఆ ఇల్లు సమాధి పక్కనే ఉండటంతో పాషాకు నచ్చలేదు. ఈ విషయాన్ని అక్షయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, తాను పనిచేసి పెడతానని చెప్పి రూ.30వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు కావాలనుకుంటే ఇప్పిస్తానని చెప్పడంతో ఇస్తాషాద్దీన్ అనే వ్యక్తి రూ.70 వేలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినా కూడా పనిచేయలేదంటూ పాషా, ఇస్తాషాద్దీన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మహబూబ్నగర్ రూరల్ పోలీసులు సెప్టెంబర్ 30న అక్షయ్కుమార్ను రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు అక్షయ్ ఆత్మహత్య చేసుకోవడం.. పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. -
నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు
తార్నాక డివిజన్ లాలాపేట సాయి నగర్లోని మురికివాడలో తాత్కాలిక నివాసాలు, గుడిసెల్లో నివాసాలుంటున్న సుమారు 107 కుటుంబాలను డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పేరిట ఖాళీ చేయించారు. మూడు బ్లాక్లతో కూడిన ఇళ్ల సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ కూడా పూర్తి కాలేదు. అక్కడి నివాసితులు ఇతర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక ఇబ్బందుల మధ్య బతుకులీడుస్తున్నారు. నగరంలోని అడ్డగుట్ట డివిజన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ మురికివాడలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం అక్కడి 42 నివాసాలను ఖాళీ చేయించారు. 2015లో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడేళ్లుగా వీటి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పేద కుటుంబాలు ఇతర ప్రాంతాల్లో కిరాయి ఇళ్లలో ఉంటూ అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: గూడు కోసం నిరుపేదల ఏడేళ్లుగా నిరీక్షిస్తున్నారు. మురికివాడల రహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిదేందుకు పేదల నివాసాలను ఖాళీ చేయించి అక్కడే చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నత్తలకు నడక నేర్పిస్తున్నాయి. అయిదారేళ్లుగా ఇంటి అద్దె భారమై పేదలు నానా అవస్థలు పడుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ఆశలు అడియాసలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2015లో రెండు పడకగల గదుల ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. కానీ ఆశించిన రీతిలో ఇళ్ల నిర్మాణం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 40 ప్రాంతాలు.. 8,898 గృహాలు హైదరాబాద్ మహానగరంలో సుమారు రెండు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ప్రభుత్వం సేకరించింది. వాటిలో స్లమ్స్లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో ఇన్సిటూ పద్ధతిలో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే సింగం చెరువు తండా, చిత్తారమ్మ బస్తీ, కిడ్ కీ బాత్ అలీషా, సయ్యద్ సాబ్ కా బాడా, ఎరుకల నాంచారమ్మ బస్తీ, జియాగూడ, కట్టెలమండి, గోడే కీ ఖబర్ తదితర 25 ప్రాంతాల్లో రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అయిదేళ్లలో రూ.3.5 లక్షలపైనే .. నగరంలోని మురికి వాడల సమీపంలో నివాసాలకు నెలసరి అద్దె కనీసం అయిదు వేల రూపాయల వరకు ఉంది. అద్దెలన్నీ లెక్కిస్తే అయిదేళ్లలో చెల్లించింది రూ.3.5 లక్షలపైనే ఉంటుంది. ఇంటి అద్దె తలకుమించిన భారంగా మారడంతో పేద కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులందకపోవడంతోనే పనులు కుంటుపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అద్దెలు చెలించలేక అవస్థలు పడుతున్నాం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట సొంతింటిని ఖాళీ చేయించారు. అప్పటి నుంచి కిరాయి ఇంటిలోనే ఉంటున్నాం. ఏళ్లు గడుస్తున్నా..ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. యేటా పెరుగుతున్న అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాం. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే బాగుంటుంది. – జీలకర్ర నవీన్, ఆజాద్నగర్ అయిదో దసరా వచ్చింది మా ఇల్లు ఖాళీ చేయించి నిర్మాణాలు చేపట్టారు. దసరా పండగకు గృహ ప్రవేశం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి నాలుగు దసరా పండగలు గడిచిపోయాయి. అయిదోసారి దసరా దగ్గరకు వచ్చింది. – కొత్తపల్లి అనిల్ కుమార్, సాయినగర్ -
‘డబుల్’తో సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన 7.09 లక్షల దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నాయని, కులం, మతం, వయసు, ఓటరు గుర్తింపు కార్డు వివరాల సేకరణ మాత్రమే జీహెచ్ఎంసీ చేపట్టిందని ఆమె తెలిపారు. ఆయా వివరాలను సేకరించి పూర్తి సమాచారంతో సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. కమిషనర్ లోకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ ప్రసంగంలో ప్రధాన అంశాలివీ.. మురికి వాడల్లోని పేద నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రయోగాత్మకంగా శేరిలింగంపల్లి జోన్ చందానగర్ సర్కిల్లో ఏడాదికి 600 మందికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంచేందుకు త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. నగరంలోని అన్ని కాలనీల్లో నూరు శాతం పచ్చదనం లక్ష్యం సాధించేందుకు, దాని ద్వారా సెల్ఫ్హెల్ప్ గ్రూపుల్లోని మహిళలకు ఆదాయం లభించేందుకు తొలిదశలో 3 వేల కాలనీల్లో మొక్కల పెంపకం బాధ్యతల్ని అప్పగించాం. ప్రజల రక్షణ కోసం 1456 మురికివాడలు, 975 పార్కుల్లో రూ. 20 కోట్లతో దాదాపు 8వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలు, సహాయ పరికరాలను 4,749 మందికి త్వరలో పంపిణీ చేస్తాం. నగరంలోని 185 చెరువుల్ని దశలవారీగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టాం. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు ప్రస్తుతమున్న రెండింటికి తోడు మరో రెండు చారి్మనార్, సికింద్రాబాద్ల వైపు ఏర్పాటు కానున్నాయి. ఎస్సార్డీపీ ద్వారా 16 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, 6 ఆరోఓబీలు, ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మరో 18 çపనులు పురోగతిలో ఉన్నాయి. వాటిలో వీలైనన్ని పనుల్ని డిసెంబర్లోగా పూర్తిచేస్తాం. రహదారుల నిర్వహణలో భాగంగా రూ.409 కోట్లతో 1,740 పనులు పూర్తయ్యాయి. సీఆర్ఎంపీ ద్వారా ఇప్పటి వరకు 678.41 కి.మీ రోడ్ల రీకార్పెటింగ్కు రూ.783.16 ఖర్చయింది. రెండు దశల్లో రూ. 49.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 34 ఆధునిక వైకుంఠ ధామాల్లో 28 పూర్తయ్యాయి. (చదవండి: కంటోన్మెంట్ విలీనంపై.. తేలేదెప్పుడు?) -
డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట జోన్: ‘గత కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కిరాయి ఇంట్లో ఉంటున్న. డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. కానీ అనారోగ్యంతో ఉన్న కొడుకును పట్టుకొని డబుల్ బెడ్రూం కాలనీలో ఉండలేను. ఇల్లు అవసరం ఉన్న నాలాంటి పేద వారికి నా ఇల్లు ఇవ్వండి’ అని సిద్దిపేట పట్టణానికి చెందిన కూరేళ్ల రూప.. మంత్రి హరీశ్ రావుకు ప్రభుత్వం తనకిచ్చిన డబుల్ బెడ్రూం పట్టా పత్రాలు, ఇంటి తాళం తిరిగి ఇచ్చి ఆద ర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ఆమె నిజాయితీని అభినందించారు. అర్హులైన వారికి బుల్ బెడ్రూం ఇళ్లు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. (క్లిక్: ఒక్కో సహజ ప్రసవానికి రూ.3వేలు) -
పట్నంలో 50 గజాలు .. పల్లెల్లో 75 గజాలు!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే సరికొత్త గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర సర్కారు విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు పడక గదుల (డబుల్ బెడ్రూమ్) ఇళ్ల నిర్మాణ పథకం పూర్తిస్థాయి సవరణలతో, దానితో ఏ మాత్రం పోలిక లేకుండా కొత్త రూపుతో ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇంటికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరొక గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. వీటితో పాటు ఇతర విధివిధానాలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని భారీగా సవరించి చేపడుతున్న నేపథ్యంలో..కొత్త పథకంలో సీఎం కేసీఆర్ మార్పులు, చేర్పులు చేస్తారని భావిస్తున్నారు. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం విఫలమైందన్న ప్రచారానికి అవకాశం కల్పించకుండా, దీన్ని కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఆయన మార్పులు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్కు రాగానే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మార్పులు చేర్పుల ఆధారంగా తుది విధివిధానాలు రూపొందించి అధికారికంగా వెల్లడించనున్నారు. లేదంటే ప్రాథమిక అంశాలే తుది విధివిధానాలుగా ఖరారు కానున్నాయి. ఆదినుంచీ అవాంతరాలే.. రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆది నుంచి ఎదురవుతున్న అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు సాగనీయటం లేదు. మొత్తం 2.27 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అయితే 1.10 లక్షల ఇళ్లే పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు కనీసం 20 వేల ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదు. మిగతా వాటికి సంబంధించి అసలు లబ్ధిదారుల జాబితాలనే రూపొందించలేదు. దీన్ని తప్పుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సొంత ఇంటి పథకం మార్పు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రాథమికంగా విధివిధానాలు ఖరారు చేసింది. ప్రాథమికంగా ఇలా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రాథమికంగా రూపొందించారు. ►ఈ ఇళ్లను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి (బీపీఎల్) మాత్రమే మంజూరు చేస్తారు. ►ఈ ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన దాఖలాలున్నాయి. సొంత స్థలాలున్న వారి సంఖ్య అందుకు సరిపడా లేదనుకున్నప్పుడు జనాభాలో వారి శాతం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికి 12 శాతం ఇళ్లు కేటాయించాలి. ►ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రెండు గ్రామ సభల ద్వారా చేపట్టాలి. తొలి గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించాలి. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటి పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితా రూపొందించి రెండో సభలో వివరాలు వెల్లడించాలి. అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించాలి. ►ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను కేటాయిస్తారు. మరికొన్ని ఇళ్లు ముఖ్యమంత్రి విచక్షణాధికారం పరిధిలో ఉంటాయి. వెరసి 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు. ►ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.3 లక్షలు కేటాయిస్తారు. వాటిని ఇళ్ల నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు. ►కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు 58, 59 జీవోల ద్వారా కల్పించిన వెసులుబాటు పరిధిలో ఉన్నవారు ఈ ఇళ్లు పొందేందుకు అనర్హులు. -
డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించిన రఘునందన్రావు
దుబ్బాక టౌన్: దుబ్బాకలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జాప్యం అవుతుండటంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు స్వయంగా రంగంలోకి దిగి పలువురు లబ్ధిదారులతో శుక్రవారం గృహప్రవేశాలు చేయించారు. అయితే ఎమ్మెల్యే చర్యపై అధికార టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇంకా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండా... ఇళ్ల వద్ద పనులు పెండింగ్లో ఉండగానే ఎలా గృహప్రవేశాలు చేయిస్తారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఉదయమే వందలాది మందితో కలిసి... శుక్రవారం ఉదయాన్నే డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో చేరుకున్న ఎమ్మెల్యే రఘునందన్రావు కొంద రు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడం, లబ్ధిదారులతో కలసి గృహప్రవేశాలు చేయించడం తప్పా అని ప్రశ్నించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలను సాకారం చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని రఘునందన్రావు చెప్పారు. తొలి విడతగా ఎంపిక చేసిన 180 మంది లబ్ధిదారులకు ఇళ్లను ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులంతా శనివారంలోగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. శనివారం కూడా కొందరు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. భారీ పోలీసు బందోబస్తు.. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వస్తే గొడవలు జరిగే ఆస్కారం ఉందని గ్రహించి పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాలలో భారీగా మోహరించారు. -
తాళాలు పగులగొట్టి.. ఇళ్లు ఆక్రమించి
సాక్షి, మంచిర్యాల: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో విసిగిపోయిన లబ్ధిదారులు తాళాలు పగులగొట్టి ఇళ్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లలో ఈ నెల 20న మొదట మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంటిని ఆక్రమించాయి. బుధవారం దాదాపు 40 కుటుంబాల వరకు ఇళ్లు ఆక్రమించగా.. కొందరు అక్కడే ఉండి వంటలు చేసుకున్నారు. రాత్రి కూడా అక్కడే ఉంటామని లబ్ధిదారులు స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, వానాకాలంలో నిలువ నీడ లేని నిరుపేదలమైన తాము ఇక్కడే తలదాచుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సంఘటనపై స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. -
డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పేదలు
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన ప్రజలు
-
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన కేటీఆర్
-
330 చదరపు అడుగులు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు సొంత గూడు కల్పిం చేందుకు ప్రారంభించిన 2 పడక గదుల గృహాల పథకంలో మార్పులు జరగబోతున్నాయి. పథకం కొనసాగిస్తూనే.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకు నే లబ్ధిదారులకు డబ్బు సాయం అందిస్తామని ఇటీ వల బడ్జెట్లో ప్రకటించిన పథకానికి కొన్ని నిబంధనలు విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. సొంత స్థలంలో చేపట్టే ఇళ్ల కనిష్ట, గరిష్ట విస్తీర్ణం ఎంతుండాలో నిబంధనలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కనీస విస్తీర్ణం 330 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకుండా చూడాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. గరిష్ట విస్తీర్ణం పరిధిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. బడ్జెట్లో ఇళ్లకు రూ. 12 వేల కోట్లు ఇటీవలి బడ్జెట్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో సొంత స్థలంలో లబ్ధిదారులే నిర్మించుకునే ఇళ్లకు రూ.7,350 కోట్లను, ఇంతకాలం కొనసాగుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.4,650 కోట్లను ప్రతిపాదించింది. సొంత జాగాలో నిర్మాణానికి నియోజకవర్గానికి 3 వేలు చొప్పున ఇళ్లను కేటాయించింది. మరో 43 వేల ఇళ్లను సీఎం విచక్షణాధికారం పరిధిలో ఉంచింది. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలను ప్రభుత్వం సాయంగా అందిస్తుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్యోజన (పీఎంఏవై) పథకం కింద కేంద్రం నుంచి 4 లక్షల ఇళ్లు మంజూరవుతాయిని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో పట్టణ ప్రాంతాల ఇంటి యూనిట్ ధర రూ.2 లక్షలుండగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలుగా ఉంది. ఆ నిధులకు సొంత నిధులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. కేంద్రం పథకం విధి విధానాల్లో ఇంటి నిర్మాణ పరిధి 330 చదరపు అడుగులకు తగ్గకూడదన్న నిబంధన ఉంది. ఇదే నిబంధనను ‘సొంత స్థలంలో ఇళ్లకు’ విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. తేడా వస్తే కేంద్రం నిధులు ఆగిపోతాయని భావిస్తోంది. ఇక లబ్ధిదారులెవరైనా సొంత నిధులు కలిపి పెద్దగా ఇంటిని నిర్మాణం చేపట్టి మధ్యలో నిధులు సరిపోక చేతులెత్తేస్తే కేంద్ర నిధులకు ఇబ్బంది వస్తుంది. అలాంటి ఇళ్లను పరిగణనలోకి తీసుకోకుండా అంతమేర నిధుల్లో కేంద్రం కోత పెడుతుంది. దీంతో ఖర్చు మరీ ఎక్కువయ్యేలా పెద్దగా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా గరిష్ట పరిధిని కూడా నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జనానికి భారమే కనిష్ట పరిమితిపై నిబంధన విధిస్తే లబ్ధిదారుల జేబుపై భారం పడబోతోంది. కనీసం 330 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4.50 లక్షలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది రూ.3 లక్షలే. అంటే దాదాపు రూ. లక్షన్నర మేర లబ్ధిదారులే సొంతంగా ఖర్చు చేయాల్సి రానుంది. కొంతమంది ప్రస్తుతమున్న ఇంటికి కొనసాగింపుగా పక్కనే ఉండే ఖాళీ స్థలంలో ఒకట్రెండు గదులు నిర్మించుకుంటుంటారు. ఈ కొత్త నిర్మాణాన్ని ప్రభుత్వ పథకం కింద చూపుతారు. అలాంటి అనుబంధ నిర్మాణాలు 330 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉంటే కొత్త నిబంధన అమలులోకి వస్తే వాటికి అనుమతి రాదు. -
తాళాలు పగులగొట్టి.. ‘గృహప్రవేశం’.. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు
కోటగిరి (బోధన్): డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన ఆ పేదలు డబుల్ బెడ్రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవా రం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బస్వాపూర్ గ్రామానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి 50 డబుల్ ఇళ్లను మంజూరు చేయించారు. పేదలు తమ స్థలాలను అప్పగించగా, కాంట్రాక్టర్ జీ+1 పద్ధతిలో ఇళ్లు నిర్మించారు. రెండేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తికాగా, అధికారులు వాటికి తాళాలు వేశారు. వాడకంలో లేకపోవడంతో ఇళ్లపై అక్కడక్కడ మొక్కలు కూడా మొలిచాయి. రెండేళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇవ్వకపోవడం, ఎన్నిసార్లు అడిగినా చలనం లేకపోవడంతో పేదలు ఆగ్రహానికి గురయ్యారు. తమ కళ్ల ముందే ఇళ్లు పాతబడి పోతుండడంతో జీర్ణించుకోలేని లబ్ధిదారులు వాటి స్వాధీనానికి నడుం బిగించారు. అర్ధరాత్రి తర్వాత మూకుమ్మడిగా వెళ్లి తాళాలను పగులగొట్టి గృహ ప్రవేశాలు జరిపారు. తమ సామగ్రిని తెచ్చి సర్దుకున్నారు. మరోవైపు, లబ్ధిదారుల ఆగ్రహాన్ని గమనించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. -
సొంత జాగాలోనే ‘రెండు పడకలు’
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకం కొత్త రూపు సంతరించుకోనుంది. ఇప్పటివరకు ప్రభుత్వమే గుర్తించిన స్థలాల్లో అపార్ట్మెంటుల తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇకపై ఆ తరహా ఇళ్లకు బదులు, లబ్ధిదారులే వారికున్న సొంత స్థలాల్లో వ్యక్తిగత ఇళ్లుగా నిర్మించుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తరహాలో.. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. వాస్తవానికి 2014లోనే మేనిఫెస్టోలో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కానీ ఆ తర్వాత అది ఇప్పటివరకు అమలైన ఇళ్ల నిర్మాణం మోడల్లోకి మారింది. ఈ తరహాలో ఎన్నో సమస్యలు ఎదురై, పథకం సాఫీగా సాగని పరిస్థితి నెలకొనడంతో.. ప్రజలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న రీతిలో వ్యక్తిగత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనికి తాజా బడ్జెట్లో రూ.12 వేల కోట్లను కేటాయించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు చొప్పున 3.57 లక్షల ఇళ్లను నేరుగా కేటాయించనుండగా, ముఖ్యమంత్రి ఖాతాలో మరో 43 వేల ఇళ్లు మంజూరు కానున్నాయి. వెరసి మొత్తం 4 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది. పాత పథకానికి పీఎంఏవై నిధులు తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.12 వేల కోట్లు.. సొంత స్థలాలున్న వారికి మంజూరయ్యే ఇళ్లకే సరిపోనున్నాయి. మరి ఇప్పటివరకు అమలులో ఉన్న పద్ధతిలో కొనసాగుతున్న ఇళ్లకు నిధుల మాటేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్ల వరకు మంజూరు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆ నిధులను రెగ్యులర్ ఇళ్ల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తోంది. -
బడులు.. మడులు.. బడుగులు బారెడు పద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి కలిగేలా ‘దళిత బంధు’పథకానికి రూ.17,700 కోట్లను ఈసారి బడ్జెట్లో కేటాయించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. అందులో భాగంగానే సొంతంగా స్థలమున్న పేదలు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. రైతు బీమా తరహాలో నేతన్నలకు కూడా రూ.5 లక్షల బీమా సౌకర్యం, లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్లు ఇచ్చే పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటితోపాటు వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా భారీగా నిధులు కేటాయించారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా పింఛన్లు, వడ్డీ లేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమం తదితర పథకాలు, విభాగాలకు గణనీయంగా కేటాయింపులు చేశారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో.. కుటుంబాలకు, వ్యక్తులకు నేరుగా లబ్ధి కలిగే పథకాలను ప్రభుత్వం ప్రకటించిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం తొలి నుంచీ చర్చ జరుగుతున్న విధంగానే.. ఈసారి విద్య, వైద్య రంగాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను కేటాయించారు. మన ఊరు–మన బడి కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లకుపైగా కేటాయించారు. ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందే రోగులకు డైట్ చార్జీలను పెంచడంతోపాటు హైదరాబాద్లోని 18 మేజర్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు సబ్సిడీపై భోజన సదుపాయాన్ని కొత్తగా కల్పించారు. తద్వారా రోజుకు 18,600 మందికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఇందుకోసం రూ.38.66 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న బస్తీ దవాఖానాలను.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా విస్తరించేలా కొత్తగా 60 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. కొత్తగా మహిళా విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదిస్తూ.. చెరో రూ.100 కోట్లను కేటాయించారు. పాలమూరు, డిండి పూర్తిచేస్తాం.. తాజా బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లకుపైగా ప్రతిపాదించారు. కృష్ణానదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మరో ముఖ్య ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. రూ.50వేలలోపు ఉన్న రైతుల రుణాలు ఈ నెలలో మాఫీ అవుతాయని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్ల కోసం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని.. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లకు రూ.2,750 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే నిరుద్యోగ భృతిని మాత్రం బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మొత్తంగా ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు తగ్గకుండా చూసుకోవడంతోపాటు.. ప్రస్తుత సంక్షేమ పథకాల అమలు, కొత్తగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడం, దళితబంధుకు భారీ నిధులు వంటివి ఈసారి బడ్జెట్లో ముఖ్యాంశాలుగా హరీశ్రావు పేర్కొన్నారు. -
‘డబుల్’ రానివారికి డబ్బులు
సిరిసిల్ల: రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాని అర్హులైన పేదలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని, లబ్ధిదారులు సొంతస్థలంలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తుందని, జాగాలేనివారికి ప్రభుత్వమే స్థలం కేటాయిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శనివారం ప్రారంభించారు. అలాగే, వేములవాడలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు పనులకు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఖర్చులతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు.. వచ్చిన తరువాత ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. పొలిటికల్ టూరిస్టులు అబద్ధాలతో అసంబద్ధ విమర్శలు చేస్తున్నారన్నారు. ‘ఇటీవల ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న పథకాలలో ఒక్కటైనా వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్నాయా..? అమలవుతున్నట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. కాశీలో వెయ్యి కోట్లు పెట్టిన మీరు కరీంనగర్ ఎంపీగా వేములవాడకు రూ.100 కోట్లు తెచ్చే తెలివి ఉన్నదా..? అని మండిపడ్డారు. సంక్షేమానికి సమ్మెట సునీత ఒక నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి వెంకటాపూర్కి చెందిన సమ్మెట సునీతనే ఒక నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఆమెకు ఆసరా పెన్షన్ వస్తోందని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని, కూతురు పెళ్లికి కల్యాణలక్ష్మి కూడా రాబోతోందని కేటీఆర్ వివరించారు. సునీతను చూపిస్తూ ఇలాంటి పేద మహిళకు పైసా ఖర్చు లేకుండా ఇన్ని సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇదివరకు అందాయా.. అని ప్రశ్నించారు. కేటీఆర్ ఆమెను వేదికపైకి పిలిపించి చెబుతుండగా కన్నీటి పర్యంతమైంది. ఇదే గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజు కరెంట్షాక్తో చనిపోతే, రైతుబీమా రూ.5 లక్షలు, ‘సెస్’నుంచి మరో రూ.5 లక్షలు, టీఆర్ఎస్ పార్టీ పరంగా రూ.2 లక్షలు అందాయని చెప్పారు. నాకు 16 ఏళ్ల కిందటే షుగర్ వచ్చింది రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని వేములవాడ ఏరియా ఆస్పత్రిలో శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘పదహారేళ్ల కిందట హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పరీక్షలు చేయించుకుంటే నాకు షుగర్ ఉందని తేలింది.. అప్పటి నుంచి మితంగా తినడం, జాగ్రత్తగా ఉండటం అలవాటైంది’అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.రానున్న ఆరోగ్య ఇబ్బందులను, రోగాలను ముందే గుర్తించేందుకు, వైద్యరంగంలో అవసరం మేర మౌలిక వసతుల కల్పనకు హెల్త్ ప్రొఫైల్స్ ఉపయోగపడతాయన్నారు. -
హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని...
సాక్షి, బన్సీలాల్పేట్(హైదరాబాద్): చాచానెహ్రూనగర్ బస్తీలో విషాదం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ పథకం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. అన్నీ అర్హతలు ఉన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోవడంతో మనోవ్యథతో మంచం పట్టి ఇంటి పెద్ద మరణించడంతో.. భార్యా పిల్లలు రోడ్డు పాలయ్యారు. ఈ కన్నీటిగాథకు రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకుల తీరే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాచానెహ్రూనగర్ బస్తీలో వెల్డింగ్ పని చేసుకునే రవి(36) భార్య బాలమణి, ఐదుగురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఇల్లు ఉన్న రవి కుటుంబానికి ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు జరగలేదు. ఈ విషయమై రవి రెవెన్యూ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి తన గోడు వెళ్లబోసుకున్న ఫలితంగా లేకుండా పొయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రవి అస్వస్థతకు గురై మంచం పట్టాడని భార్య బాలమణి వాపోయారు. తీవ్ర మనోవేదనకు గురైన రవి అనారోగ్యంతో ఈ నెల 17న కన్నుమూశారు. శుక్రవారం తండ్రి రవి శవం ముందు ఆడపిల్లలు చుట్టూ కూర్చోని విలపించిన తీరు చూపరుల కంట తడి పెట్టించాయి. శుక్రవారం బన్సీలాల్పేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ రవి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సదరు కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించాలని కోరారు. చదవండి: Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చదవండి: దళిత మహిళా సర్పంచ్కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు -
మాటకు కట్టుబడి.. ఇళ్లు కట్టించి..
సిరిసిల్ల: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. పేదోళ్లందరికీ డబుల్బెడ్రూమ్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని కొద్దిగా వెనుకా.. ముందు అందరికీ ఇళ్లు వస్తాయని భరోసా ఇచ్చారు. పేదలకు మాట ఇస్తే సీఎం నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. పనీపాట లేక కొందరు విమర్శలు చేస్తున్నారని.. వారికి దమ్ము ధైర్యం ఉంటే దేశంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇచ్చిందో చూపెట్టాలని సవాల్ విసిరారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 2.80 లక్షల డబుల్బెడ్రూమ్ ఇళ్లను రూ.18 వేల కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చే ఒక్క అర్ర ఇల్లుకోసం కూడా చేయి తడపాల్సి వచ్చేది. ఇప్పుడు ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే చెంప మీద కొట్టండి.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఏదైనా పట్టుబడితే ఆ పని అయ్యే వరకు సీఎం కేసీఆర్ వదలిపెట్టరని, ఆయన జిద్దు మనిషని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 270 కోట్ల మొక్కలు నాటించిన ఘనత కేసీఆర్దే అన్నారు. రాష్ట్రంలో 62 లక్షల మంది రైతులకు రూ.52వేల కోట్లు రైతుబంధు కింద జమ చేశారని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో రూ.8,500 కోట్లు పంపిణీ చేశారని, 11 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారని వివరించారు. -
సిరిసిల్ల జిల్లా ముస్తానాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
-
డబుల్ బెడ్రూం లాక్కుంటాం అన్నారని..
మర్కూక్ (గజ్వేల్): తనకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇల్లు తీసు కుంటామని కొంత మంది గ్రామ నాయకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఎర్రవల్లిలో చోటు చేసు కుంది. ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుంట నర్సమ్మ (45) గతంలో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంట్లో కుటుంబంతో కలి సి ఉంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకు నేందుకు సిద్ధపడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రహరీ నిర్మించు కుంటే ఇల్లు తిరిగి తీసుకుంటా మని బెదిరింపులకు పాల్పడటంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. మ నస్తాపం చెందిన నర్సమ్మ శనివా రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫి ర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ లొల్లి
సిరిసిల్ల: రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా.. బాధితులు శుక్రవారం ఆందోళన నిర్వ హించారు. సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర చేశారు. అనంతరం కలెక్టర్ ఎదుట రెండుగంటలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల డ్రాలోనూ కొందరు అనర్హులకు దక్కాయని ఆరోపించారు. -
ట్రాన్స్జెండర్లకు అర్హతలు ఉంటే.. ‘డబుల్’ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపునకు సంబంధించి జారీచేసిన జీవో 10కి అనుగుణంగా ట్రాన్స్జెండర్లకు అర్హతలు ఉంటే వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేలా ఆదేశించాలంటూ సామాజిక కార్యకర్త సీహెచ్ ప్రియామూర్తితోపాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. రేషన్కార్డు ఉన్న వారే డబుల్ బెడ్రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని, ట్రాన్స్జెండర్లకు రేషన్కార్డులు లేవన్న కారణంగా వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ట్రాన్స్జెండర్లకు కేటాయించరాదన్న నిబంధన ఏమైనా ఉందా అని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది రాధీవ్రెడ్డిని ప్రశ్నించింది. అటువంటి నిబంధన ఏమీ లేదని, అయితే జీవో 10కి లోబడి అర్హతలు ఉన్న వారందరికీ కేటాయిస్తామని తెలిపారు. -
పుస్తెలమ్మి.. లంచం ఇమ్మంటుండ్రు.. డబుల్ బెడ్రూం అక్రమాలపై గొంతెత్తిన మహిళ
సిరిసిల్ల టౌన్: ‘ఓట్లప్పుడు మాలాంటి గరీబోళ్లకు డబుల్ బెడ్రూం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దానం చేసిండు. అదే ఆశతో ఉంటున్నాం. కానీ.. సిరిసిల్లలో అధికారులు లంచాలు ఇస్తేనే పని చేస్తున్నారు. డబుల్బెడ్రూం ఇల్లు కోసం పుస్తెలు అమ్మి లంచం ఇవ్వాలని వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్కు చెందిన నందగిరి మల్లిక మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. మల్లిక వివరాల మేరకు.. అధికారులు స్థానిక కమ్యూనిటీ హాలులో డబుల్బెడ్రూం ఇళ్ల అర్హుల లిస్టును మంగళవారం ప్రకటించారు. లిస్టులో మల్లిక కుటుంబం పేరు లేదు. దీంతో దివ్యాంగుడైన తన భర్త పేరు లిస్టులో రాలేదని, తాము ఏ రకంగా అర్హులం కాదని మల్లిక వేదికపై ఉన్న కమిషనర్ వెల్దండి సమ్మయ్యను నిలదీసింది. ‘మా ఆయనకు ఒక చేయి పూర్తిగా పనిచేయదు. నేను ఆ ఇంట్లో, ఈ ఇంట్లో పాచిపని చేసి ఇద్దరు పిల్లలతో పాటు అత్తను పోషిస్తున్న. పదమూడేళ్లుగా పద్మనగర్లోనే కిరాయికి ఉంటున్నం. డబుల్బెడ్రూం కోసం గంపెడాశతో దరఖాస్తు చేసుకున్న. ఆర్పీల ముందే ఇద్దరుసార్లు వచ్చి పార్కులో కూర్చుని రూ.లక్ష లంచం అడిగిండ్రు. అవే ఉంటే డబుల్బెడ్రూం ఇండ్లకోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటా? ఇప్పుడు లిస్టులో పేరు తీసేసిండ్రు. మాకు ఎక్కడా జాగలు, సొంతిల్లు లేవు. పుట్టింటి, అత్తింటి ఆస్తులు కూడా లేవు. ఏ విచారణకైనా సిద్ధం. మేము ఏవి«ధంగా అర్హులము కాదో చెప్పండి. నాకు న్యాయం కావాలి’ అంటూ వేదికపై తన బాధను వెలిబుచ్చింది. మల్లిక ఒక్కతే కాదు.. పద్మనగర్ వార్డుసభలో జాబితాలో పేర్లు రానివారి రోదనలు మిన్నంటాయి. అర్హులైన తమ పేర్లు లిస్టులో లేకపోవడమేంటంటూ వారు అధికారులు, ప్రజా ప్రతినిధులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోళ్లను లంచాలు అడిగి ఏం బాగుపడుతారంటూ వాపోయారు. దీంతో చివరకు అర్హులైన పలువురి పేర్లను డ్రాలో వేయించడానికి మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్య అనుమతించారు. -
‘డబుల్’ ఇళ్లకు కాపలా కష్టాలు.. ఆర్నెళ్లకు రూ.1.16 కోట్లు.. కేటాయింపులు ఎప్పటికో..?
సాక్షి, హైదరాబాద్: ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. కట్టిన ఇళ్లకు కాపలా కాయడం మరొక ఎత్తయిన ఘటన ఇది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం పేదలకు ప్రకటించిన ఉచిత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండగా, గ్రేటర్ నగరంలో మాత్రం ఏడాది క్రితం వరకు ఇళ్ల నిర్మాణం వడివడిగా జరిగింది. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వాటికి కాపలా కాయడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలోని విద్యుత్, వాటర్సప్లై శానిటరీలకు సంబంధించిన సామగ్రి,పరికరాలను అగంతకులు ఎత్తుకుపోతున్నారు. అంతటితో ఆగకుండా లిఫ్టులు, పంప్సెట్లు, అగ్నిమాపక పరికరాల వంటి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు బల్దియా దృష్టికి వచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన కాపలా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత పోలీస్ కమిషనర్లకు సైతం కొద్దికాలం క్రితం అధికారులు లేఖలు రాశారు. కానీ.. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. జీహెచ్ఎంసీలోని ఈవీడీఎం విభాగానికి చెందిన సిబ్బందిని కొన్ని ప్రాంతాల్లో కాపలా విధులకు నియమించారు. కానీ.. ఇంకా చాలా కాలనీల్లో కాపలా లేక దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కోటిరూపాయలకు పైగా విలువైన సామగ్రి మాయమైంది. తిరిగి మళ్లీ కొనుగోలు చేసి.. అమర్చడం ‘డబుల్’ పనిగా మారింది. ఈ నేపథ్యంలో కాపలాకు సెక్యూరిటీ గార్డుల్ని నియమించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆర్నెళ్ల వరకు అంటే.. జూలై నెలాఖరు వరకు ఆయా ప్రాంతాల్లో 133 మంది సెక్యూరిటీగార్డులు/వాచ్మన్లను నియమించనుంది. వారి వేతనాల కింద ఆర్నెళ్లకు వెరసి రూ.1.16 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు స్టాండింగ్కమిటీ సైతం ఆమోదం తెలిపింది. పేదలుంటున్న బస్తీల్లో వారి చిన్న ఇళ్లను కూల్చి అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినచోట దొంగల బెడద లేకున్నా, శివార్లలో కట్టిన ప్రాంతాల్లోనే ఈ బెడద ఉంది. భారీ సంఖ్యలో ఇళ్లున్న అహ్మద్గూడ, రాంపల్లి, మంఖాల్, బహదూర్పల్లి, దుండిగల్, బాచుపల్లి, ప్రతాపసింగారం, మురహరిపల్లి, నిజాంపేట, తట్టిఅన్నారం తదితర ప్రాంతాల్లో ఈ సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. 15వేలకు పైగా ఇళ్లున్న కొల్లూరులో మాత్రం కాంట్రాక్టు ఏజెన్సీయే కాపలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కేటాయింపులు ఎప్పటికో..? శివార్లలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు సైతం అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లోనూ ఇళ్లను ఎవరికీ కేటాయించలేదు. ఇంకా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడమే ఇందుకు కారణం. కేవలం ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే తమవని, కేటాయింపులతో తమకెలాంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ హౌసింగ్ అధికారులు తెలిపారు.లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లది కావడం తెలిసిందే. -
కొల్లూరు టౌన్షిప్: సారొస్తారా.. చూస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ హౌసింగ్ కాలనీ (టౌన్షిప్)గా జీహెచ్ఎంసీ నగర శివార్లలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిలకించనున్నారా ? అంటే అవును అనే వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ, అక్కడ జరుగుతున్న హడావుడి, స్వచ్ఛ కార్యక్రమాలు, తదితరమైనవి అందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అక్కడి డబుల్బెడ్రూం ఇళ్లను వచ్చే నెల మొదటివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులకు సమాచార మున్నప్పటికీ, ప్రధాని సందర్శనకు సంబంధించి సమాచారం లేదు. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన రామానుజుల విగ్రహావిష్కరణకు ప్రధాని హైదరాబాద్కు రానుండటం తెలిసిందే. అదే సందర్భంగా వీలును బట్టి హెలికాప్టర్నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఇళ్ల సముదాయాన్ని చూపించేందుకు అనుమతి పొందే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కొల్లూరు– 2 ప్రాజెక్టు అత్యంత పెద్దది. కేవలం ఇళ్లు మాత్రమే కాక మౌలిక సదుపాయాలతోపాటు ప్రజలకవసరమైన అన్ని సదుపాయాలు అక్కడ రానున్నాయి. దేశంలోనే ప్రభుత్వపరంగా ఇంత పెద్ద కాలనీ ఎక్కడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానికి చూపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఇళ్లకు పీఎంఏవై ద్వారా నిధులందజేస్తుండటం తెలిసిందే. కొల్లూరు టౌన్షిప్ ఇలా.. కొల్లూరు– 2 ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ పటాన్చెరు నియోజకవర్గంలో 15,660 డబుల్బెడ్రూం ళ్లు నిర్మించింది. వీటిల్లో సెల్లార్+స్టిల్ట్+ 9 అంతస్తులు, 10 అంతస్తులు, 11 అంతస్తులవి ఉన్నాయి. ఒక్కో ఇంటికి (అంతర్గత మౌలిక సదుపాయాలతో) రూ.8.65 లక్షలు ఖర్చు చేశారు. 2018 ఫిబ్రవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా, 2020 డిసెంబర్లో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వానలొస్తే నీటి నిల్వలు లేకుండా దాదాపు 14 కి.మీ మేర వీడీసీసీ రోడ్లు. రోడ్ల కటింగ్ జరగకుండా డక్ట్ ఏర్పాటు. లిఫ్టులకు పవర్బ్యాకప్తోపాటు కారిడార్లలో జనరేటర్ల సదుపాయం. 12,500 కిలోలీటర్ల నీరు నిల్వచేయగల 12 భూగర్భ సంపులు.విద్యుత్, తాగునీటి సదుపాయాలు,రూ. 10 కోట్ల వ్యయంతో 9 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ. వాననీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలు. భూగర్భ డ్రైనేజీ, వీధిదీపాలు, ట్రాన్స్ఫార్మర్లు. 118 దుకాణాలతో 3 షాపింగ్ కాంప్లెక్సులున్నాయి. వీటితోపాటు వాకింగ్ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్తో పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, మార్కెట్లు, బస్టర్మినల్, పోలీస్స్టేషన్ తదితర అవసరాలకు స్థలాలు అందుబాటులో ఉంచారు. -
నిధులివ్వడానికి లబ్ధిదారులుండాలిగా!
సాక్షి, హైదరాబాద్: ‘‘పేదల కోసం గృహాలు నిర్మిస్తుంటే ఆ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఉండాలిగా. అవే లేవు. అలాంటప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’పథకం కింద నిధులెలా ఇచ్చేది’’ ♦ఇది కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రశ్న. ‘‘మేం రాష్ట్రంలో అమలు చేస్తున్న రెండు పడకల ఇళ్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న విధివిధానాలు వేరు. కావాలంటే లబ్ధిదారుల వివరాలు త్వరలో అందిస్తామని అండర్టేకింగ్ ఇస్తాం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని మీరు పరిశీలించొచ్చు. ఆ పథకం తదుపరి కిస్తీని విడుదల చేయండి’’ ♦ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి ఇచ్చిన హామీ ‘‘లబ్ధిదారుల జాబితా చూడనంతవరకు నిధుల విడుదల కుదరదు’ ♦ఇది తాజాగా కేంద్రప్రభుత్వ యంత్రాంగం స్పష్టీకరణ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంతకాలం రుణాలు తీసుకొని ఆ పథకం కింద ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం.. కేంద్రం పథకం ప్రధానమంత్రి ఆవాజ్ యోజన (పీఎంఏవై) కింద ఇచ్చే మొత్తాన్ని కూడా వాటికి జతచేసి అక్కడికక్కడికి సరిపోయేలా ప్లాన్ చేసుకుంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న తీరు కేంద్రం ఇచ్చే నిధులు రాకుండా అడ్డుగోడలా మారింది. చకచకా పనులు కాని చ్చేసి కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన రూ. 900 కోట్ల బకాయిలను కేంద్రం నుంచి అందే నిధులతో తీర్చేద్దామనుకున్న తరు ణంలో నిబంధనలు వ్యతిరేకంగా ఉన్నాయంటూ పీఎంఏవై కింద ఇచ్చే నిధులు విడుదల చేయలేమని కేంద్రం తేల్చేసింది. మరోవైపు బకాయిలు ఇస్తేనే పనులు చేస్తా మని కాంట్రాక్టర్లు పనులాపేశారు. హడ్కో నుంచి అప్పు తెద్దామంటే గరిష్ట మొత్తం ఇప్పటికే మంజూరై ఖర్చయిపోయింది. దీంతో పథకాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం సొంత ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారుల జాబితా లేక.. గతంలో ఇందిరమ్మ పథకం కింద లక్షల్లో ఇళ్లను నిర్మించి పేదలకందించారు. పనులు మొదలయ్యేలోపే అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసేవారు. తర్వాత పనులు అయ్యే కొద్ది వారికి నిధులు విడుదల చేస్తుండేవారు. కేంద్రం తన వంతు వాటాగా నిధులిచ్చేది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో అర్హులకు సంబంధించి ఓ అంచనా మేరకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తోంది. వాటిని అందించే వేళ లబ్ధిదారుల జాబితాను రూపొందించి ఇళ్లను కేటాయిస్తోంది. 2.91 లక్షల ఇళ్లకు గాను 1.08 లక్షల ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో ఇప్పటివరకు 14,000 మందికే ఇళ్లను అందజేశారు. సిద్ధంగా ఉన్న మిగతా ఇళ్లకు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. కానీ కేంద్ర విధానం ప్రకారం ముందు లబ్ధిదారుల సంఖ్యను తేల్చి ఆ ప్రకారం ఇళ్లు నిర్మించాలి. దీంతో లబ్ధిదారుల జాబితానే సిద్ధంగా లేనప్పుడు ఏ సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేయాలని కేంద్రం ప్రశ్నిస్తోంది. సమాధానం లేకపోవటంతో నిధులు ఇచ్చేందుకు ససేమిరా అనేసింది. కనీసం 25 వేల మంది జాబితానిస్తే పరిశీలిస్తామన్న కేంద్రం కేంద్రం తాను మంజూరు చేసే పీఎంఏవై ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర చొప్పున కేటాయిస్తుంది. ఇందులో కొంతమొత్తాన్ని ముందుగానే విడుదల చేస్తూ రెండో కిస్తీగా 40 శాతం మొత్తాన్ని ఇస్తుంది. మిగతా మొ త్తాన్ని ఫైనల్ ఇన్స్పెక్షన్ తర్వాత విడుదల చేస్తుంది. తొలుత రూ.వేయి కోట్లకు పైగా కేంద్రం నుంచి రాగా, రెండో కిస్తీగా ఇప్పు డు రూ.800 కోట్లు రావాల్సి ఉంది. ఇది లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి సమర్పించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డబుల్ బె డ్రూమ్ ఇళ్లలో ముందుగా లబ్ధిదారుల జాబి తాను రూపొందించకపోవటంతో కేంద్రానికి సమర్పించలేదు. అందుకే నిధులు అం దలేదు. దీనిపై 3, 4 నెలలుగా రాష్ట్ర అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. జా బితా ఇవ్వకుండా నిధులు ఇవ్వటం సా«ధ్యం కాదని తేలడంతో మార్చి నాటికి జాబితా సిద్ధం చేసి ఇస్తామని రాష్ట్ర అధికారులు ఓ లేఖను సమర్పించారు. దాని కీ అధికారులు సంతృప్తి చెందలేదు. చివరగా కనీసం 25 వేల మందితో కూడిన జాబితాను సమర్పిస్తే పరిశీలిస్తామనగా అధికారులు ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్టు సమాచారం. -
‘డబుల్’కు డబ్బుల్లేవ్...
ఇది నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం బస్ డిపో సమీపంలోని రెండు పడక గదుల గృహ సముదాయం పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం 192 ఇళ్లను మంజూరు చేసింది. 2018లో రూ.12 కోట్లతో పనులు ప్రారంభించారు. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగు బ్లాకులుగా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కానీ ప్రస్తుతం నిధులు లేక పనులు ఆగిపోయాయి. దాదాపు మూడు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా చాలాచోట్ల కొన్ని నెలలుగా పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.850 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వారు పనులు నిలిపివేశారు. బకాయిలు చెల్లిస్తేనే తిరిగి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేస్తున్నారు. కొందరు పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం, తెచ్చిపెట్టుకున్న సిమెంటు పాడవుతుందన్న ఉద్దేశంతో ఏవో కొన్ని పనులు చేస్తున్నా.. చిన్న కాంట్రాక్టర్లు మాత్రం దాదాపు అన్ని చోట్లా పనులు ఆపేశారు. దీంతో అసలుకే ప్రారంభం కాని ఇళ్లతో పాటు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం సందిగ్ధంలో పడింది. నిండుకున్న నిధులు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రుణంపై ఆధారపడి జరుగుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి రూ.10,500 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. హడ్కో నుంచి రావాల్సిన రూ.8 వేల కోట్ల నిధులు దాదాపుగా వచ్చేశాయి. కేవలం రూ.120 కోట్లు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. మరోవైపు గృహనిర్మాణ శాఖ వద్ద నిధులు లేకుండా పోయా యి. ఫలితంగా కాంట్రాక్టర్లకు కొత్తగా బిల్లులు చెల్లించలేకపోతుండటంతో పనులు జరిగే కొద్దీ బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయి. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. చూస్తుండగానే బకాయిలు రూ.850 కోట్లకు చేరుకున్నాయి. అప్పటి నుంచి కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గృహనిర్మాణశాఖ అధికారులేమో ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిధులు అందకపోవడంతో కాంట్రాక్టర్లకు సర్దిచెబుతూ పనులు చేయించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. అయితే చిన్న కాంట్రాక్టర్లు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. అసలే అసంతృప్తి .. ఆపై బిల్లుల సమస్య ఈ పథకం యూనిట్ కాస్ట్ విషయంలో కాంట్రాక్టర్లలో అసంతృప్తి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్గా నిర్ధారించారు. ఇంత తక్కువ మొత్తంతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించటం సాధ్యం కాదంటూ కాంట్రాక్టర్లు తొలినాళ్లలో టెండర్లలో పాల్గొనలేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో సమావేశాలు నిర్వ హించి, భవిష్యత్తులో అవసరమైతే ఇతర పనులు అప్పగించటంలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పటం, ఇళ్ల డిజైన్లలో స్వల్పమార్పులు చేయటంతో వారు ఎట్టకేలకు అంగీకరించారు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన లేకపోవటంతో ఆయా చోట్ల పనులు ప్రారంభించలేదు. కాగా ఇప్పుడు చేసిన పనికి బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు మొండికేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో యూనిట్ కాస్ట్ రూ.7 లక్షలుగా ఉండటం, అంతస్తుల వారీగా నిర్మించే వాటికి మరింత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. నలిగిపోతున్న అధికారులు సెప్టెంబర్ రెండో వారంలో సుమారు 70 వేల ఇళ్లు చివరి దశకు చేరుకుని చిన్నచిన్న పనులు చేస్తే పూర్తయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. కేవలం 20 రోజుల పాటు పనులు చేస్తే అవన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిల్లో నాలుగు వేలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ అలాగే ఉండిపోయాయి. అప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో, ఫినిషింగ్ పనులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు అంగీకరించటం లేదు. ఆ పనులు పూర్తయితే ఇళ్లను కేటాయిస్తారని కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. కాగా కొన్ని చోట్ల బలవంతంగా ఇళ్లను ఆక్రమిం చుకుని గృహప్రవేశాలు చేసేసుకుంటున్నారు. చిన్నచిన్న పనులు పెండింగులో ఉన్నా.. అలాగే ఉంటామని చెబుతున్నారు. కానీ లబ్ధిదారుల ఎంపిక అధికారికంగా జరగకపోవటంతో అధికారులు వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో వారు అధికారులతో గొడవకు దిగుతుండగా.. కాంట్రాక్టర్లు వాగ్వివాదానికి దిగుతున్నారు. -
Hyderabad: ఆశలు ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్లు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం శుక్రవారం బన్సీలాల్పేట చాచానెహ్రూనగర్ (సీసీనగర్)లో 264 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనుంది. మురికివాడలు లేని విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పేదలు ఉంటున్న ప్రాంతాల్లోనే వారు నివసిస్తున్న ఇరుకు ఇళ్ల స్థానే కొత్తగా డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు ఏ ఆసరా లేని వారికి సైతం డబుల్ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టింది. లక్ష్యం 2 లక్షలు.. గ్రేటర్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించింది. వాటిల్లో స్లమ్స్లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 71 ఖాళీ ప్రదేశాల్లో మిగతా 91,102 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అన్నీ కలిపి మౌలిక సదుపాయాలతో సహా మొత్తం 4,038 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2,710 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా 1,328 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, శుక్రవారం సీసీనగర్లో 264 ఇళ్లను లబ్ధిదారులకు మంత్రులు కేటీఆర్, తలసాని పంపిణీ చేయనున్నా రు. సంబంధిత జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశాక మిగతా వాటిని పంపిణీ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కోసం.. దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. వాటిని పూర్తిచేస్తే లబ్ధిదారులకు పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. నిధుల లేమి.. ప్రభుత్వం నుంచి సకాలంలో అందాల్సిన నిధులందకపోవడంతో పనులు కుంటుపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి రూ. 300 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దాంతో వారిని వేగిరపెట్టే పరిస్థితి లేదు. ఇళ్లు ఇలా.. ► విస్తీర్ణం: 560 చదరపు అడుగులు ► 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, 2 టాయ్లెట్స్ ఖర్చు ► డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్కు మంజూరైన నిధులు: రూ.8598.58 కోట్లు ► పెరిగిన ధరలు, మౌలిక సదుపాయాలతో వెరసి అంచనా వ్యయం: రూ.9714.59 కోట్లు ► ఇప్పటి వరకు చేసిన ఖర్చు దాదాపు: రూ.6,507 కోట్లు ► పనుల పూర్తికి కావాల్సిన నిధులు: రూ.3,207 కోట్లు ► గ్రేటర్ పరిధిలోని జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి ► డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు: 6.50 లక్షలు. ► ప్రధానమంత్రి ఆవాస్యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన ఇళ్లు: 1,00,781 ► లక్ష ఇళ్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ: రూ.1500 కోట్లు. ► ఇప్పటి వరకు అందిన సబ్సిడీ: రూ.800 కోట్లు. కోవిడ్ దెబ్బ.. వాస్తవానికి పనులు చేపట్టిన అన్ని ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, గత సంవత్సరం కోవిడ్ కారణంగా నిర్మాణ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పనులు కొంత మేర మందగించినప్పటికీ, తిరిగి జరుగుతున్నాయి. బండ మైసమ్మనగర్లో 310 ఇళ్లు కూడా ప్రారంభానికి సిద్ధం చేసినప్పటికీ, లబ్ధిదారుల అభీష్టం మేరకు వచ్చేనెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. – వెంకటదాస్రెడ్డి, హౌసింగ్ ఈఈ -
ప్రారంభించకుండానే.. గృహప్రవేశాలు
జోగిపేట(అందోల్): డ్రా పద్ధతిలో డబుల్బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఎంపికలో అవకతవకలు జరిగాయని ప్రచారం. అయితే జాబితా మారుతుందన్న అనుమానంతో అనధికారికంగా కేటాయించిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్లో చోటుచేసుకుంది. డాకూరులో రూ.5.65 కోట్లతో 104 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ఈ నెల 6న లబ్ధిదారుల సమక్షంలో డ్రా పద్ధతిలో నంబర్లుసహా ఇళ్లను కేటాయించారు. 10న మంత్రి హరీశ్ సమక్షంలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పలు కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దయింది. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అధికారుల రీ సర్వేతో జాబితా మారుతుందన్న ఆందోళనలో ఆయా లబ్ధిదారులు పెట్టె, బేడ సదరుకొని కేటాయించిన ఇళ్లలోకి పరుగులు తీశారు. 2, 3 రోజులుగా వారంతా గృహ ప్రవేశాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఇళ్లను ప్రారంచేది ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
డబుల్ బెడ్ రూంకు ఇళ్లకు ఇంటిపత్రం సమర్పించాల్సిందే
-
డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వడం లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు అందజేసేలా ఆదేశించాలంటూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ వివరణ తీసుకున్న తర్వాత తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, హౌసింగ్ బోర్డు చైర్మన్, ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్లతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. వివరణ ఇవ్వాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం -
రెండు పడక గదులు .. వంద సమస్యలు!
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లు.. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించి, అబ్బురపరిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉదాత్త పథకం. లబ్ధిదారు జేబు నుంచి నయా పైసా ఖర్చు లేకుండా, ప్రభుత్వమే పూర్తి వ్యయాన్ని భరిస్తూ రెండు పడక గదులతో ఇంటిని నిర్మించి నిరుపేదలకు ఇవ్వటం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ పథకాన్ని చాలా రాష్ట్రాలు నిశితంగా గమనించి ఆశ్చర్యపోయాయి. ఇంతటి గొప్ప పథకానికి కూడా నిర్మాణ లోపాలు, లొసుగులు, అక్రమాలు, రాజకీయ జోక్యం, నాణ్యత లోపం శాపంగా మారాయి. ప్రభుత్వ ఉదాత్త సంకల్పానికి తగ్గట్టుగా యంత్రాంగం, నేతలు వ్యవహరించి ఉంటే మంచి ఫలితం దక్కేది. కానీ ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడిచేలా వ్యవహరించడంతో మొత్తం ఇళ్లల్లో మూడింట దాదాపుగా ఒకవంతు మాత్రమే సిద్ధం అయ్యాయి. కొన్ని పూర్తయినా తుదిమెరుగులు (ఫినిషింగ్) పూర్తికాలేదు. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్నిటికే అనుమతులే రాలేదు. ఇరుకు గదుల్లో ఇబ్బందులు చూసి.. గతంలో ఇరుకు గదులతో నిర్మించిన ఇళ్లలో పేదలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం 2016–17లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 2,91,057 ఇళ్లను, వాటి కోసం రూ.10,438.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. పనులు మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా గత సెప్టెంబర్ 15 నాటికి కేవలం 1,02,714 ఇళ్లను మాత్రమే పూర్తి (గృహ ప్రవేశాలకు సిద్ధం) చేయగలిగారు. మరో 70,602 ఇళ్లు తుది దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక 63,678 ఇళ్లకు సంబంధించి అసలు పనులే ప్రారంభం కాలేదు. దాదాపు 18 వేల ఇళ్లకు ఇంకా పరిపాలన అనుమతులు రాలేదు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన ఇళ్లలోనూ 40% ఖాళీ పూర్తయిన ఇళ్లలో 40 శాతం ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వాటి చుట్టూ చెట్లు, తుప్పలు పెరిగి పాడుబడ్డ ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి. వాటి కిటికీలు, తలుపులు, ఇతర సామగ్రిని దొంగలు తస్కరిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో లోపాలు, రాజకీయ నేతల మధ్య ఆధిపత్యపోరు దీనికి ప్రధాన కారణమవుతోంది. దివిటిపల్లి విషయానికొస్తే పాతతోట, పాత పాలమూరు ప్రాంతాల వారందరికీ ఈ ఇళ్లు దక్కాల్సి ఉంది. కానీ లబ్ధిదారుల జాబితాలో ఇతరుల (అనర్హులు కూడా ఉన్నారనే ఆరోపణలున్నాయి) పేర్లు కూడా చేర్చేశారు. దీనివెనుక రాజకీయ నేతల హస్తం ఉందని అర్హులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతూ పూర్తయిన ఇళ్ళు కూడా నిరుపయోగంగా ఉంటూ చుట్టూ చెట్లు, తుప్పలతో నిండిపోతున్నాయి. మరోవైపు ఇక్కడ కొన్ని ఇళ్లు పూర్తయినా తుది మెరుగులు పూర్తికాలేదని చెబుతున్నారు. ►నారాయణపేట జిల్లాకు 2,017 ఇళ్లు మంజూరైతే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా çపూర్తి కాలేదు. కేవలం 44 ఇళ్ల పనులు తుదిదశకు చేరుకున్నాయి. 1,117 ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదు. ►వికారాబాద్ జిల్లాకు 4,109 ఇళ్లను మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. అసలు 1,962 ఇళ్ల పనులు మొదలే కాలేదు. ∙నాగర్కర్నూలు జిల్లాకు 3,201 ఇళ్లను కేటాయిస్తే ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. 668 ఇళ్లు మాత్రం తుదిదశకు చేరుకున్నాయి. 2,034 ఇళ్ల పనులు ఇంకా మొదలే కాకపోవటం విశేషం. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,470 ఇళ్లు మంజూరు అయితే 1,865 ఇళ్ల పనులు అసలు మొదలే కాలేదు. వాటికి అసలు టెండర్లే పిలవకపోవటం విశేషం. సమన్వయ లోపంతో పనుల్లో జాప్యం పనుల్లో జాప్యానికి సమన్వయలోపం ప్రధాన కార ణంగా నిలిచింది. ఇళ్ల నిర్మాణానికి ముందు ఓ స్థలం ఎంపిక చేసి, ఆ తర్వాత రాజకీయ, ఇతరత్రా కారణాలతో మరో చోటకు మార్చారు. ►కొన్ని కాలనీలకు ఎంపిక చేసిన ప్రాంతం తమకు ఏమాత్రం యోగ్యంగా లేదంటూ స్థానికులు గృహ ప్రవే శాలకు ససేమిరా అంటున్నవి కూడా ఉన్నాయి. మహబూబ్నగర్ వీరన్నపేట కాలనీ దీనికో ఉదాహరణ. ఇక్కడ 800 ఇళ్లు నిర్మించారు. కానీ ఈ ప్రాంతం సరిగా లే దని లబ్ధిదారులు వాటిల్లోకి వెళ్లేందుకు నిరాకరిస్తూ దివి టిపల్లిలో నిర్మించిన ఇళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ►కొంతకాలం గృహనిర్మాణ సంస్థ, ఆ తర్వాత కలెక్టర్ల పర్యవేక్షణ.. ఇలా మారుతుండటం, నిధులు సకాలంలో విడుదల కాకపోవటంతో పనుల్లో జాప్యం జరిగింది. ►ఇళ్లకు ఖరారు చేసిన యూనిట్ కాస్ట్ ఏమాత్రం సరిపోదని, దానిప్రకారం నిర్మిస్తే నష్టాలనే మూటగట్టు కోవాల్సి ఉంటుందని తొలినాళ్లలో కాంట్రాక్టర్లు మొహం చాటేయటంతో ప్రధానపనులు చాలాకాలంపాటు మొదలు కాలేదు. ఆ తర్వాత రాయితీలు ప్రకటించటంతో ముందుకొచ్చారు. -
పేదలకు ఇళ్లస్థలాలు !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూంఇళ్లను పూర్తి ఉచితంగా ఇస్తున్నందున, హౌసింగ్ బోర్డు ద్వారా అఫర్డబుల్(తక్కువ ధర) ఇళ్లను నిర్మించి విక్రయించే ప్రతిపాదనలు లేవన్నారు. రాజీవ్ స్వగృహ పథకం విషయంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డబుల్బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో పట్టణ ప్రాంతాల్లో మైనారిటీలకు 10 శాతం కోటాను తప్పనిసరిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వారి సేవలుS కొనసాగిస్తాం: ఉద్యానవన శాఖలో 550 మంది మండలస్థాయి అధికారులు, 190 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను పూర్తిస్థాయిలో తొలగించలేదని, సంబంధిత ప్రాజెక్టు అమలు కాలపరిమితి ముగియడంతో వారి సేవలను నిలిపివేశామని వ్యవసాయమంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వారి సేవలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉద్యానవన డిప్లొమా, పీజీ కోర్సులకు అవకాశం కల్పించడానికి మంత్రి ప్రతిపాదించిన కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన వర్సిటీ సవరణ బిల్లు–2021ను శాసనసభ ఆమోదించింది. -
అసంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
-
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇలాంటి పనులా!
-
ప్రైవేటు టీచర్లకు ‘డబుల్’ ఇళ్లు
హుజూరాబాద్/ఇల్లందకుంట: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు డబుల్బెడ్రూం ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మరో 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని హుజూరాబాద్ పట్టణంలో ట్రస్మా నిర్వహించిన గురుపూజోత్సవంలో వెల్లడించారు. సంక్షేమ పథకాల్లో ప్రైవేటు టీచర్లను భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. హుజూరాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని సిటీ సెంట్రల్ హాల్లో ఏర్పాటు చేసిన రెడ్డిసంఘం సమావేశంలో చెప్పారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అంశం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంకకు చెందిన పలువురు యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాగా, బీజేపీ నేతలు పంచేందుకు ఇచ్చిన గోడ గడియారాలు, గొడుగులను మంత్రి సమక్షంలో పలువురు ధ్వంసం చేశారు. బిజిగిర్ షరీఫ్ దర్గాను దర్శించుకున్న మంత్రులు జమ్మికుంట మండలంలోని బిజిగిర్ షరీఫ్ దర్గాను మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి గంగుల, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పార్టీ నేత పాడి కౌశిక్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు
అసలే వృద్ధాప్యం.. ఆపై మనవరాళ్ల భారం.. పైగా పేదరికం.. వారినెలా పోషించాలో తెలియని అయోమయస్థితి. ఇద్దరు వృద్ధురాళ్ల దీనస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలు ఆ కలెక్టర్ను కదిలించాయి. గూడు చెదిరిన పక్షుల గోడుకు ఆయన స్పందించారు.. ఆపద్బంధుగా నిలిచారు.. కొడుకులు, కోడళ్లు తమ కళ్లముందే చనిపోయి ఒంటరిగా తల్లడిల్లుతున్న పేదతల్లులకు పెద్దకొడుకులా నిలిచారు. ఒకరికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇచ్చారు. మరొకరి ఇంటి మీద ఉన్న బ్యాంకురుణం తీర్చి గూడు నిలబెట్టారు. ఆయనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్. – సాక్షి, కామారెడ్డి చలించి.. చేయూతనిచ్చి.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్కి చెందిన కరిమంచి గంగవ్వ కొడుకు, కోడలు కొద్దిరోజుల క్రితం చనిపోయారు. వారి ముగ్గురు పిల్లలను పోషించాల్సిన బాధ్యత గంగవ్వపై పడిం ది. పొద్దున్నే చలిబువ్వ అడు కొచ్చి ఇద్దరు పిల్లలకు తినిపించేది. తర్వాత తాను కామారెడ్డి బస్టాండ్కు చేరుకుని భిక్షాటన చేస్తుండేది. గంగవ్వ దీనస్థితిని గమనించిన ‘సాక్షి’గతేడాది ఫిబ్రవరి 15న ‘ఫ్యామిలీ’పేజీలో ‘ముగ్గు రు పిల్లలు... నాయనమ్మ’అనే కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి కలెక్టర్ శరత్ చలించిపోయారు. అదేరోజు గంగవ్వను, పిల్లల్ని తన కార్యాలయానికి పిలిపించి తక్షణమే రూ.50 వేల సాయం అందించారు. పెద్ద మనవరాలు చామంతికి ఔట్సోర్సింగ్ పద్ధతిన ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగం కల్పించారు. మిగతా పిల్లల చదువుకు ఆసరా అవుతానని భరోసా ఇచ్చారు. పూరిగుడిసెలో నివసిస్తున్న గంగవ్వకు డబుల్ బెడ్రూం పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇచ్చారు. కలెక్టర్ తనకు పెద్ద కొడుకు లెక్క ఆదుకున్నరని, తన కుటుంబ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి రుణపడి ఉంటామని గంగవ్వ అంటోంది. అప్పుతీర్చి.. ఇల్లు నిలబెట్టారు... కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన బీమరి రాజేశ్(35), ఆయన భార్య స్రవంతి (31) ఇటీవల కరోనా బారిన పడి చనిపోయారు. దీంతో రాజేశ్ తల్లి సిద్ధవ్వ, అతని ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు. పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలంటూ సిద్ధవ్వ రోదిస్తున్న క్రమంలో రాజేశ్ కట్టిన ఇంటిపై రూ.18లక్షల అప్పు ఉందని బ్యాంకు నుంచి పిడుగులాంటి నోటీసు వచ్చింది. తెలిసిన వారినల్లా కలిసి కాళ్లావేళ్లా పడింది. అయినా అప్పు పుట్టలేదు. ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సిద్ధవ్వ కుటుంబ పరిస్థితిపై మే 30న ‘సాక్షి’ ప్రధాన సంచికలో (‘కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’) అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ శరత్ స్పందించారు. సిద్ధవ్వకు నెలకు రూ.5వేల వేతనం వచ్చేలా ఉద్యో గం ఇప్పించారు. కలెక్టర్ చొరవతో బ్యాంకు అధికారులు వన్టైం సెటిల్మెంట్ కింద రుణంలోంచి రూ.8 లక్షలు తగ్గించారు. ‘సాక్షి’ కథనాన్ని చదివిన పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కలెక్టర్ను కలిసి సాయం చేస్తామని ముందుకువచ్చారు. వారితోపాటు వివిధ వర్గాల ద్వారా సేకరించిన డబ్బులతో బ్యాంకు అప్పు తీర్చి సిద్ధవ్వను రుణవిముక్తి చేశారు. కలెక్టర్కు, సాక్షికి సిద్ధవ్వ కృతజ్ఞతలు తెలిపింది. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా
సాక్షి, చంచల్గూడ: ఇవి సాధారణ డబుల్ బెడ్రూం ఇళ్లు కావు.. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలు అని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. శనివారం మలక్పేట నియోజకర్గం చావణీ డివిజన్లోని పిల్లి గుడిసెల ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం, పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేదలకు అందిస్తున్న ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువ ఉంటుందన్నారు. ఇన్– సీటు పద్ధతిలో రూ.24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో ఫ్లాట్లు నిర్మించినట్లు ఆయన తెలిపారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు లబ్ధిదారుల వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇళ్లు ఇచ్చామన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మరికొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామన్నారు. గ్రేటర్లో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.9,700 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మరో 70 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రం మొత్తం రూ.18వేల కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చదవండి: ‘దళితబంధు’ సర్వే చకచకా.. అచ్చంగా.. అదే విధంగా.. సీఎం కేసీఆర్ ఇంట్లో ఏ రకమైన లిఫ్ట్ను వాడుతున్నారో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇళ్లల్లోనూ ఇదే రకం లిఫ్ట్ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్ మెయింటెనెన్స్కయ్యే ఖర్చులను గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించిన 16 షాపులను అద్దెకు ఇస్తామన్నారు. రూ.200 పెన్షన్ను రూ.2 వేలకు పెంచిన ఘనత కేసీఆర్కు మాత్రమే దక్కుతుందన్నారు. ఇతర ప్రభుత్వాలు 70 సంవత్సరాల్లో రాష్ట్రంలో కేవలం రెండు పెద్ద ఆస్పత్రులు నిర్మిస్తే తమ ప్రభుత్వం 4 దవాఖానాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని కేటీఆర్ చెప్పారు. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి నిర్మించామని, ప్రజల అవసరం దృష్ట్యా మరో మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చదవండి: విద్యుత్ సంస్కరణలతో రైతులపై భారం కొత్త, పాత నగరమనే తేడా లేకుండా.. మూసీనది శుద్ధికి ప్రస్తుతం ఉన్న ఎస్టీపీలకు తోడుగా మరో 335 ఎస్టీపీలను నిర్మిస్తామన్నారు. కొత్త, పాత నగరం అనే తేడా లేకుండా నగర సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మైనారిటీల విద్యాభివృద్ధికి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని అదే విధంగా చంచల్గూడ జైలును తరలించాలని ఎంపీ అసదుద్దీన్ చేస్తున్న విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతకుముందు లాటరీ ద్వారా 140 లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి తాళాలు అందించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు ఎంపీ కృతజ్ఞతలు చావణీలోని చంచల్గూడ జైలును ఇతర ప్రాంతానికి తరలించాలని జైలు స్థలంలో ఆస్పత్రులు లేదా విద్యా సంస్థలను నిర్మించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ఆయన కృతజ్ఞతలు. -
యాదాద్రిలో నీటమునిగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రాత్రి నుండి తెల్లవారుజామున వరకు కురిసిన కుండపోత వర్షానికి ఆలేరు నియోజకవర్గంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో వరద ఉధృతికి కొత్తగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు నీటమునిగాయి. రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుండి భారీగా వరదనీరు చేరుకోవడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల గ్రౌండ్ ఫ్లోర్ సగం వరకు నీట మునిగింది. యాదగిరి పల్లి నుండి యాదగిరిగుట్ట వచ్చే రహదారిపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదగిరి గుట్ట మున్సిపాలిటీ లోని యాదగిరిపల్లి లో పలు కాలనీలలో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. బిక్కేరు వాగు ఉధృతితో కొరటికల్-మురిపిరాల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, నాగిరెడ్డిపేట, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి: కుండపోత వర్షాలతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని లోతట్టు ప్రాంతాలు ప్రాంతాల్లన్ని జలమయ్యాయి. లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్, సాయి నగర్, మితులా నగర్, కాలనీల్లన్నీ నీటమునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నిత్యవసర సరుకులన్ని తడిసిపోయాయి. -
వీళ్లు మహా కి‘లేడీ’లు.. 950 మందిని బుట్టలో వేసుకున్నారు
సాక్షి, సనత్నగర్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ మహిళను సనత్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆమెతో పాటు ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించిన మరో మహిళను ఇప్పటికే జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ సైట్– 3లో నివాసం ఉండే మహిళా సంత సొసైటీకి చెందిన సోషల్ వర్కర్ సుప్రియ, అల్లాకే బందే ఫౌండేషన్ అధ్యక్షురాలు అయేషా తబస్సుంలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని రూ.లక్షలు వసూలు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తామని కూడా అందినకాడికి దండుకున్నారు. వీరి వలలో పడి డబ్బులు కట్టినవారిలో సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్లాపూర్నకు చెందిన పలువురు మహిళలు ఉన్నారు. మూడు నెలలైనా ఇళ్ల విషయం తేలకపోవడంతో సుప్రియపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఆమె పలుమార్లు మీటింగ్ ఏర్పాటు చేసి తన భర్త రాఘవను ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసి నమ్మించింది. ఇంకొన్నిసార్లు ఇళ్లు వచ్చేశాయంటూ తాళం చెవులు, విద్యుత్ మీటర్ నంబర్లను చూపించి నమ్మించి వారి నుంచి మరిన్ని డబ్బులు వసూలు చేస్తుండేది. ఇదే రకం వ్యవహరంలోనే అయేషా తబస్సును ఇటీవల జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితులు.. సుప్రియ కూడా తమను మోసం చేసిందని గ్రహించి సనత్నగర్ పోలీసులను ఆశ్రయించారు. వీరి వలలో చిక్కుకుని డబ్బులు చెల్లించిన నలుగురు బాధిత మహిళలు ముందుకువచ్చారు. మొత్తం 950 మంది వరకు బాధితులు ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఏ1 గా అయేషా తబస్సుం, ఏ2 గా సుప్రియలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదని యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): డబుల్బెడ్రూం ఇంటిని తనకు కేటాయించలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చిలువేరి గౌతమ్(32) హైదరాబాద్లో ప్రైవేట్ కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికంగా నిర్మించిన డబుల్బెడ్రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా అర్హుల జాబితాలో గౌతమ్ పేరు వచ్చింది. అయితే చివరి కేటాయింపు లిస్టులో తన పేరును అధికారులు తొలగించడంతో గౌతమ్ పదిరోజుల క్రితం ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగాడు. తండ్రి పేరిట సొంతిల్లు ఉన్నందున డబుల్ బెడ్రూం ఇల్లు రాదని అధికారులు తేల్చి చెప్పడంతో గురువారం వేకువజామున భార్య, పిల్లలు నిద్రలో ఉండగా దూలానికి ఉరేసుకున్నాడు. అతడికి భార్య ప్రవళిక, కుమారుడు గణేశ్(4), కూతురు లాస్య(2) ఉన్నారు. కాగా, గౌతమ్ తండ్రి గంగప్రసాద్కు సొంతిల్లు, ఆ పక్కనే రెండు గుంటల ఖాళీస్థలం ఉండటంతో అతడి దరఖాస్తును తిరస్కరించినట్లు తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. -
గొర్రెలు బాగా అయినయ్: నవ్వులు పూయించిన సీఎం కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు పూసాయి. తను ప్రవేశపెట్టిన పథకాలు, తనయుడు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో గొర్రెలు బాగా అయినయ్.. ఇవన్నీ కేసీఆర్ గొర్రెలు అంటున్నరు. ఇంకా నయం కేసీఆరే గొర్రె అంటలేరు.’ ‘ఎస్సారెస్పీ వరద కాల్వలో నీళ్లు బాగా ఉండటంతో మోటర్ పెడితే.. ఐదు గజాలు చిమ్ముతున్నయ్.. ఆ నీళ్లు కేసీఆర్ నీళ్లు అని రైతులు చెబుతున్నరు.’ ‘మీకు ఆకలి అయితుందా. నాకైతే కడుపుల గోకుతుంది. మా రాము.. మీకు అన్నమైన పెడుతుండా..? లేదా..?.. ఓ సారి వరంగల్ వెళ్తే.. పొద్దంతా పని చేయించుకుని నాలుగ్గొట్టంగ ఉట్టిగనే నన్ను ఎల్లగొట్టిండ్రు’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ మార్కెట్ యార్డును సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. -
ఆ నీళ్లు కేసీఆర్ నీళ్లు అని రైతులు చెబుతున్నరు
-
కనిపించని కత్తెర...కేసీఆర్ ఆగ్రహం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలోని కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రాగా.. భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర మరిచిపోయారు. కత్తెర ఏదీ అంటూ కేసీఆర్ ఆరా తీయగా కనిపించలేదు. కొద్దిసేపు వేచి చూసిన సీఎం ఒకింత ఆగ్రహానికి గురై రిబ్బన్ ను పక్కకు జరిపి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. -
నా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు: సీఎం కేసీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తన ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరన్నారు. లక్ష్యంగా దిశగా వెళ్తున్నాం.. ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. 9 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్సీఐకి ఇచ్చామని, రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెల పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. వలస వెళ్లినవారు తిరిగి ఊళ్లకు వస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మిషన్ కాకతీయ కారణంగా భూగర్భ జలాలు పెరిగాయి. తెలంగాణలో నీళ్ల కోసం 500-600 మీటర్లు లిఫ్ట్ చేయాలని ప్రధాని అంటే.. నేను తీవ్రంగా వ్యతిరేకించా. తెలంగాణలో 50 మీటర్లు లిఫ్ట్ చేస్తే నీళ్లు వస్తాయని ప్రధానికి చెప్పా. కాళేశ్వరం పూర్తవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఇప్పుడు అద్భుతంగా కళ్లముందు కనిపిస్తోంది. డిస్కవరీలో కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రసారం చేశారని’’ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులపై రాద్ధాంతం చేస్తున్నారు. రైతుల కోసం కాళేశ్వరానికి రూ.10వేల కోట్ల బిల్లులైనా భరిస్తా. ఏప్రిల్, మే నెలలో అప్పర్ మానేరు నిండుతుందని ఎవరు ఊహించలేదు. అప్పర్ మానేరు నుంచి గోదావరిలో కలిసే వరకు సజీవ జలధారగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలకు నీళ్లు. మిషన్ భగీరథ ఒక అద్భుతం. 11 రాష్ట్రాల నుంచి వచ్చి మిషన్ భగీరథను పరిశీలించారు. చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చాం.చేనేత కార్మికులకు బీమా కల్పిస్తాం. ఒక్కో చేనేత కార్మికుడికి రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తాం. రూ.10 వేల కోట్లతో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నాం. వేములవాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. దళితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం. త్వరలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికి వృద్ధాప్య పింఛన్ అందిస్తామని’’ సీఎం కేసీఆర్ తెలిపారు. -
సెల్టవర్ ఎక్కిన యువకుడు.. కారణం తెలిస్తే షాక్..
సాక్షి, చందంపేట(నల్లగొండ) : మండల కేంద్రానికి చెందిన ఇరగదిండ్ల మల్లేశ్ అనే వ్యక్తి తనకు డబుల్ బెడ్రూం ఇల్లు లక్కీ డ్రాలో రాలేదని గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్టవర్ ఎక్కాడు. తనకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించే వరకు కిందికి దిగిరానని భీష్మించాడు. మల్లేశ్కు మద్దతుగా అతడి భార్య, కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో లక్కీడ్రాలో ఇళ్లు రాని మరికొంత మంది కూడా బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సందీప్నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ఫోన్లో మాట్లాడి మల్లేశ్ను కిందికి దించే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కిందికి దిగనని మల్లేశ్ చెప్పాడు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించాడు. సర్పంచ్ కవితఅనంతగిరి ఎమ్మెల్యేను ఫోన్ ద్వారా సంప్రదించారు. రాబోయే విడతలో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామ ని హామీ ఇవ్వడంతోపాటు, ఎంపీడీఓ రాములునాయక్, ఇన్చార్జ్ తహసీల్దా ర్ ముక్తార్, ఎస్ఐ సందీప్నాయుడు బాధితుడు, అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో మల్లేశ్ టవర్ దిగాడు. చదవండి: దొరికితే దొంగ.. లేదంటే దొర -
అంబేద్కర్ నగర్లో 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
ఇక్కడ ఒక్కో డబుల్ బెడ్రూం విలువ కోటిన్నర: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ నగర్లో 330 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టిన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో దశలవారీగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పీవీ మార్గ్లోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమ్మద్ అలీ , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపు చుక్కలకు అంబేద్కర్ నగర్ వనికి పోయేదని, కోటిన్నర విలువ చేసే డబుల్ బెడ్రూం ఇల్లు పేదలకు ఉచితంగా అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇళ్లు, పేదలకు పెళ్లి ఖర్చు కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. పేదలకు ఇంత పెద్దగా ఇళ్లు కట్టిస్తున్ననగరం ఏదీ లేదన్నారు. ఇక్కడే ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 శాతం గ్రీనరీ పెరిగిందని, ఈ శాతాన్ని ఇంకా పెంచాలన్నారు. హుస్సేన్ సాగర్లో వ్యర్థాలు వేయకుండా చూసుకోవాలని అధికారును ఆదేశించారు. ‘హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. పరిశుభ్రత, పచ్చదనంపై దృష్టి పెట్టాలి. 10 లిఫ్టులు ఉన్నాయి. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 560 చదరపు అడుగులు. ఒక్కో యూనిట్కు 8 లక్షల 50 రూపాయల ఖర్చు చేసింది. జీహెచ్ఎంసీ అద్వర్యంలో 9 వేల కోట్ల పై చిలుకు రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. హుస్సేన్ సాగర్ తీరాన , లేక్ వ్యూ దగ్గర ఒక్క డబుల్ బెడ్రూం విలువ కోటిన్నర రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఫ్రీ గా ఇస్తుంది. హుస్సేన్ సాగర్ కు పూర్వ వైభవం తెస్తున్నాం’. అని అన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ నగర్లో ఇరుకు గదుల్లో ఉంటున్న వారి ఇబ్బందులను చూసి చలించిపోయి హుస్సేన్ సాగర్ తీరాన మంచి డబుల్ బెడ్రూం ఇళ్ళు కేసీఆర్ కట్టించారన్నారు. ఇక్కడ డబుల్ బెడ్రూం ఇల్లు విలువు కోటి 50 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. -
ప్రతిపక్షాలకు మంత్రుల సవాల్.. నిరూపిస్తే రాజీనామాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తెలంగాణను అన్యాయం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ ప్రాజెక్టులను విరమించుకోవాలని.. లేకుంటే ప్రజాయుద్ధం తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్ మొండి అని.. మంచికి మంచి, చెడుకు చెడుగా ఉంటారని.. తెలంగాణకు నష్టం వాటిల్లేలా ఆంధ్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తూ ఊరుకోరన్నారు. త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మంత్రి వేముల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర సీఎం రాయలసీమ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడి కాల్వ కట్టి తీసుకుపోతున్నారని మండిపడ్డారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతుంటే.. పాలమూరు జిల్లాకు చెందిన అప్పటి మంత్రి మంగళహారతులు పట్టారని విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎక్కడ ఉన్నా ఆంధ్రోళ్లేనని.. తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు బతకొద్దా... ఎవరి బతుకులు వాళ్లు బతకాలని, రైతులు ఎక్కడ ఉన్నా రైతులేనని.. తెలంగాణలోని రైతులు కూడా బతకొద్దా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్ట్లపై మరో ప్రజాయుద్ధం చేయాల్సి ఉందని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్నింటా ముందంజలో ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు.. లాంటి పథకాలు మీరు పాలించే ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలంటూ వేముల ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. వారు మొరిగే కుక్కలని.. ఇవి తప్పని నిరూపిస్తే తనతో పాటు మంత్రి శ్రీనివాస్గౌడ్ సైతం రాజీనామా చేస్తారంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు అన్యాయం జరిగే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరన్నారు. కాగా, సభ చివరలో ఆంధ్ర నిర్మించే అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్నా.. చదవండి: ఈ సీఎం కేసీఆర్ మీ చేతిలో ఉన్నాడు -
Mallanna Sagar: మనోవేదనతో చితి పేర్చుకుని దూకేశాడు
సాక్షి, సిద్ధిపేట్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్లో ఇళ్లు కోల్పోయి ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధుడు చితి పేర్చుకుని, ఒంటిపై కిరోసిన్ పోసుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తొగుట మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తొగుట మండలం వేములగాట్కు చెందిన మల్లారెడ్డి భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నాడు. కూతురి కుమారుడు(మనవడు) అప్పుడప్పుడు తాత దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. కొన్ని నెలల క్రితం మల్లారెడ్డి ఉన్న ఇంటి జాగా మొత్తం మల్లన్న సాగర్ ప్రాజెక్టులో పోయింది. ఈ నేపథ్యంలో మృతుడు డబుల్ బెడ్ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఆయనకు ఇంటిని మంజూరు చేసి ఒంటరి వాడన్న కారణంతో వెనక్కు తీసుకున్నారు. ఇంటిని ఖాళీ చేయించారన్న మనో వేదనతో గురువారం అర్థరాత్రి తను నివాసం ఉండే ఇంట్లో చితి పేర్చుకుని..కిరోసిన్ పోసుకుని అందులో దూకాడు. దీంతో సజీవ దహనమయ్యాడు. మల్లారెడ్డి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
KTR: కేసీఆర్ను తిడితే పెద్ద లీడర్లు అయిపోరు
సిరిసిల్ల: తెలంగాణను అత్యంత ప్రేమించే సీఎం కేసీఆర్ను తిట్టినంత మాత్రాన పెద్ద లీడర్లు అయిపోరని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నోరుందని కొందరు సీఎం కేసీఆర్ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలా తిట్టే పిచ్చివాళ్లకు మీరే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డితో కలిసి రైతువేదికను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలోనూ ఎక్కడా సంక్షేమం ఆగలేదని చెప్పారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, కోనసీమను దాటి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని.. ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత కాదా అని కేటీఆర్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనకు, తెలంగాణ స్వరాష్ట్ర పాలనకు కొదురుపాక పాత బ్రిడ్జి.. కొత్త బ్రిడ్జి సాక్ష్యాలని పేర్కొన్నారు. కొదురుపాకలో తన అమ్మమ్మ, తాతయ్య జోగినిపల్లి లక్ష్మి, కేశవరావు జ్ఞాపకార్థం సొంత డబ్బులతో కేటీఆర్ రైతువేదికను నిర్మించారు. అమ్మమ్మ ఊరు కొదురుపాకతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే.. రాష్ట్రంలోని అర్హులందరికీ వెనకా ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేటల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. ఇప్పుడు ఇళ్లు రానివారు నారాజు కావద్దని, భవిష్యత్లో తప్పకుండా వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ దేశంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరు సంపాదించారన్నారు. ఆయన చొరవతో ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, 19వేల ఎకరాల్లో, రూ.75వేల కోట్లతో ఫార్మా హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు, కొత్తబట్టలు అందించారు. వారితో కలిసి మంత్రులు సహపంక్తి భోజనాలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సిరిసిల్లలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్, కొదురుపాకలో రైతు వేదిక, విలాసాగర్లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డే పాల్గొన్నారు. గల్ఫ్ బందీల విడుదలకు భరోసా సిరిసిల్ల శివారులోని పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు 15 ఏళ్లుగా దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ బందీల విడుదలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. గతంలో వీరి విడుదల కోసం రూ.15 లక్షలు చెల్లించామని, దౌత్యపరమైన చర్చల ద్వారా వారి విడుదలకు కృషిచేస్తామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఉందా? రైతుబంధు ఇచ్చే సంస్కారం ఉందా? రైతుబీమా కల్పించే ఆలోచన ఉందా..? ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి ఇస్తున్నారా..? రైతు వేదికలు ఉన్నాయా? అని ప్రతిపక్షాలను కేటీఆర్ ప్రశ్నించారు. -
‘సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలి’
సాక్షి, రాజన్న సిరిసిల్ల: త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతికి తావులేకుండా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో 264 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను బుధవారం మంత్రి కేటీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు హజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..డబల్ బెడ్రూమ్ ఇల్లు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా రూపాయి ఖర్చు లేకుండా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పగించామన్నారు. ఇళ్ల వద్ద ఖాళీ స్థలంలో హరితవనం పెంచాలని సూచించారు. వచ్చే ఏడాది సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే నాటికి వనం పెరగాలని తెలిపారు. చెట్లు పెంచితే కరోనాకష్ట కాలంలో ఆక్సిజన్ సమస్యే ఉండదని హితవు పలికారు. నాలుగు లక్షల 75 వేల మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఎంతో మంది సీఎంలు.. ఆడబిడ్డలకు, బీడీలు చుట్టే మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడాలేని పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, రైతుబందు, ఉచిత విద్యుత్ను సీఎం కేసీఆర్ ఇచ్చారని కొనియాడారు. -
నాలాల వెంబడి ఇళ్లలోని పేదలకు డబుల్ ఇళ్లు
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో నాలాలు, వరద ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి తగిన ప్రణాళిక రూపొందించి, ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాల్సిందిగా పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులకు సూచించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో నాలాల పరిస్థితులపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతియేటా చేస్తున్న పనుల వల్ల శాశ్వత పరిష్కారం లభించక ప్రజాధనం దుబారా అవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలా కాకుండా నాలాల్లో పూడికతీత పనులకు ఆధునిక టెక్నాలజీ, మెషినరీ ఎక్కడ ఉన్నా వినియోగించేందుకు, వాటి లభ్యతపై అవసరమైతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పర్యటించి అధ్యయనం చేసేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా పూడికతీత పనుల్లో మనుషులను వినియోగించడం కూడా తగ్గుతుందని, తద్వారా వారి ఆరోగ్యానికి రక్షణ కలి్పంచినట్లవుతుందని పేర్కొన్నారు. పేదలకు డబుల్ ఇళ్లు... నాలాలపై నిరి్మంచిన అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుతో పునరావాసం కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, అందుకు అవసరమైన సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం దాదాపు రూ.45 కోట్లతో నాలాల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాల వల్ల వరద నీటి ప్రవాహానికి అంతరాయాలు ఏర్పడుతున్నాయని పలువురు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్షాప్ నాలాల పూడిక తొలగింపు పనులు, నాలాల నీటి మళ్లింపు, అభివృద్ధి, చెరువుల పరిరక్షణ తదితర అంశాలపై మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్ షాప్ జరుగనున్నట్లు తలసాని తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులు తదితర అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై అధికారులు తగిన విధంగా స్పందించాలన్నారు. నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నేతృత్వంలో నిపుణుల కమిటీని వెంటనే నియమించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్కు సూచించారు. క్షేత్రస్థాయిలోకి.. ఈ నెల 14వ తేదీ సోమవారం నుంచి వారాంతం వరకు జీహెచ్ఎంసీలోని ఇంజినీరింగ్ అధికారులంతా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్ వంటి ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, నాలాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. పనుల జాప్యంపై అసంతృప్తి.. నాలాలకు సంబంధించిన పనులు జనవరిలోనే జరగాల్సి ఉండగా, మార్చిలో చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరగడం లేవని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్లను ఈ సమావేశానికి ఆహ్వానించి ఉంటే.. జరగని పనులపై ప్రశ్నలతో సమావేశం జరిగే పరిస్థితి కూడా ఉండదన్నారు. దాదాపు 221 కిలోమీటర్లకుగాను 207 కిలోమీటర్లలో దాదాపు 4.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించినట్లు సీఈ దేవానంద్ సమావేశంలో పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జియోట్యాగింగ్ ద్వారా పనులు పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యాలయంలో మానిటరింగ్ సెల్ ఉందన్నారు. సమావేశంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మా, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తాళాలు పగులగొట్టి గృహప్రవేశం
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రం బాణాపురంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలను పగులగొట్టి ఏసీరెడ్డి నగర్ వాసులు కుటుంబ సభ్యులతో కలసి బుధవారం గృహప్రవేశం చేశారు. నాలుగేళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటున్నామని, డబుల్ ఇళ్ల కేటాయింపులో ఆలస్యం చేస్తున్నారని నిరసిస్తూ ఈ ఆందోళనకు దిగారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి ఆధ్వర్యంలో 200 కుపైగా కుటుంబాలు ఇళ్ల ఎదుట బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ మధు మోహన్, తహసీల్దార్ రవీందర్, ఆర్ఐ కృష్ణప్రసాద్, సీఐ మల్లేష్ వారికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో రాత్రి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఏసీరెడ్డినగర్లో ఇరవై ఏళ్లకు పైగా నివాసముంటున్న గుడిసెవాసులను 2017లో ఖాళీ చేయించి కలెక్టరేట్ నిర్మాణానికి స్థలాన్ని తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించినా కేటాయించకపోవడంతో బాధితులు అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, ఇళ్లలోకి వచ్చిన బాధిత కుటుంబాలు భోజనం చేసి ఇక్కడే ఉండిపోయారు. ఈ విషయమై ఆర్డీఓ మధుమోహన్ మాట్లాడుతూ.. అర్హుల జాబితా ప్రకారం ఇళ్లను కేటాయిస్తామని, మిగతా వారి విషయంలో విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
మేమంతా నిరుపేదలం..బెదిరించడం ఏమిటీ.. ఖాళీ చేసేదిలేదు
సాక్షి, చిలుకూరు (కోదాడ) : ‘మేమంతా నిరుపేదలం.. మాకు సెంటుభూమిలేదు. ఉండడానికి ఇల్లు లేదు. మాకోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి పోతే బెదిరించడం ఏమిటీ? ఎట్టిపరిస్థితుల్లో ఖాళీ చేసేదిలేదు. కేసులకు భయపడం’ అని డబుల్బెడ్రూం ఇళ్ల ఆక్రమణదారులు స్పష్టం చేశారు. చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామశివారులో నిర్మించి ఉన్న 40 డబుల్బెడ్రూం ఇళ్లలోకి అదే గ్రామంలోని ఎస్సీకాలనీకి చెందిన 40కుటుంబాలవారు ఆదివారం రాత్రి గృహప్రవేశాలు చేసినవిషయం విదితమే. ఈనేథ్యంలో ఆ ఇళ్లను ఖాళీ చేయించేందుకు తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్ఐ నాగభూషణ్రావు, పంచాయతీరాజ్ డీఈ సతీష్బాబు, ఏఈ లక్ష్మారెడ్డి కలిసి సోమవారం అక్కడికి వెళ్లారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్ నేటి వరకు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించలేదని, వీటిలో కనీస వసతులు లేవని , తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని, ఇలా ఆక్రమణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. మేమంతా అర్హులమే కాబట్టి మాకే కేటాయించాలని, ఖాళీ చేసేదిమాత్రంలేదని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రైతులు ప్రభుత్వ భూమిని ఆక్రమించినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు నిరుపేదలమైన ముమ్మలను మాత్రం ఇబ్బందులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నాగభూషన్రావు తెలిపారు. ఎంతనచ్చచెప్పినా ఖాళీ చేయడానికి మొండికేయడంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగారు. చదవండి: ‘ఈటలపై తోడేళ్ల దాడి... తప్పించుకోవడానికే ఢిల్లీకి’ -
రాత్రికిరాత్రే గృహప్రవేశాలు.. ఇళ్లలోకి చొరబడి తాళాలు!
సాక్షి, చిలుకూరు : డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో విసిగివేసారిన కొందరు నిరుపేదలు రాత్రికిరాత్రే గృహప్రవేశాలు చేశారు. ఈ సంఘటన చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో మూడేళ్ల కిత్రం 40 డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించినా లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. దీంతో 40కుటుంబాల వారు ఆ ఇళ్లలోకి చొరబడి తాళాలు వేసుకున్నారు. ఇళ్లు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని పలువురు తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేయనప్పటికీ గృహప్రవేశం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజేశ్వరీదేవి హెచ్చరించారు. సిబ్బందిని పంపించి గృహాలను ఖాళీ చేయిస్తామన్నారు. -
కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా
సాక్షి, గజ్వేల్: కన్నతల్లిలాంటి ఊరు.. అక్కడి మట్టితో బంధాన్ని తెంచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని మల్లన్నసాగర్ నిర్వాసితులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానే కొత్త ఆశలు.. ఆకాంక్షలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్పల్లి ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కాలనీలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 2000కుపైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. నిన్నమొన్నటి వరకు పచ్చని పంట పొలాలు, ప్రాణాధారంలాంటి చెరువులు, కుంటలు, పాడిపశువుల మధ్య స్వేచ్ఛగా గడిపిన వీళ్లంతా కాంక్రీటు వనంలో కొత్త అనుభవాలను ఎదుర్కోబోతున్నారు. నిర్వాసితుల ఉద్విగ్న పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉపాధిపై ఆందోళన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చే ముట్రాజ్పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో రూపుదిద్దుకున్న ఆర్అండ్ఆర్ కాలనీలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వాసితులంతా ఆర్అండ్ఆర్ కాలనీకి తరలివస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కొత్త బతుకును వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాసం పక్కనపెడితే... ఇకపై తమ ఉపాధి పరిస్థితి ఏమిటనే అంశంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. ముంపు గ్రామాల ప్రజలకు 650 ఎకరాల్లో 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముట్రాజ్పల్లి, సంగాపూర్లో గతంలో 300 ఎకరాలు సేకరించగా.. ఇటీవల మరో 350 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులు కోరిన ప్రకారం ఇళ్లను ఎంత మందికి అవసరమైతే అంత మందికి నిర్మించి ఇవ్వడానికి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ముందే నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు వద్దనుకునేవారికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలను అందిస్తున్నారు. ఇప్పటికే 2,400 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 2 వేలకుపైగా పంపిణీ చేశారు. మరో 3,400 మందికి ఓపెన్ ప్లాట్లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటిని 250 గజాల్లో సుమారు 563 ఎస్ఎఫ్టీ వైశాల్యంతో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి పోగా మిగిలిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రెండు ఫంక్షన్ హాళ్లు, ఒక మార్కెట్, 8 అంగన్ వాడీ కేంద్రాలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. 200 కోట్లకుపైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది. కొన్ని నెలలుగా నివాసం ఆర్అండ్ఆర్ కాలనీని సకల సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు ఆర్అండ్ఆర్ కాలనీ పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే లక్ష్మాపూర్కు చెందిన 175 ఇళ్లు, ఎర్రవల్లికి చెందిన 553, సింగారానికి చెందిన 181 ఇళ్లలో కొత్తగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. కొన్ని రోజులుగా వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన నిర్వాసితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి దాదాపు 986 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి. ఇదిలా ఉండగా ఆర్అండ్ఆర్ కాలనీ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి. చదవండి: వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు -
గుడిసెలేని ఊరు.. మోహినికుంట
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రతీ మనిషికి సొం తిల్లు ఓ కల.. జీవితాంతం కష్టపడి సంపాందించినా ఇల్లు కట్టుకోలేని పేదలు అనేకమంది ఉన్నారు. పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు.. ఆకాశన్నంటే భూములు ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతిం టి కలను అందని ద్రాక్షగానే మిగుల్చుతోంది. అయితే సీఎం కేసీఆర్ పేదలకు ఇచ్చిన డబుల్బెడ్రూమ్ ఇళ్ల హామీ ప్రస్తుతం నిరుపేదల్లో ఆనందం నింపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామం ఇప్పుడు గుడిసెలు, రేకుల ఇళ్లు లేని ఊరుగా రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తోంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న డబుల్బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద ఇక్కడి సామాన్యులు ఆత్మగౌరవంతో జీవించే హక్కును అందుకున్నారు. మోహినికుంటలో కేసీఆర్ నగర్ పేరిట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో 65 డబుల్బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. మంత్రి కేటీఆర్ శనివారం వాటిని అర్హులైన పేదలకు కేటాయించారు. లబ్దిదారులంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలతో గృహప్రవేశాలు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సొంతింటికి రాకముందు, వచ్చాక లబ్ధిదారుల అనుభూతులు వారి మాటల్లోనే.. నెత్తిమీద సామాన్లు పెట్టుకుని ఊరంతా తిరిగినం ఏనిమిదేండ్లు కిరాయి ఇంట్ల ఉన్నం. నేను కోళ్లవ్యాన్ డ్రైవర్ను. నా భార్య బీడీలు చేత్తది. ఇద్దరు కొడుకులు. మోహినికుంటలనే నా పెండ్లి అయ్యింది. అప్పటి సంది కిరాయి ఇంట్లనే ఉంటున్నం. ఏడాదికొక ఇల్లు మారేటోళ్లం. గప్పుడు నెత్తిమీద సామాన్లు పెట్టు కుని ఊరంతా తిరిగేటోళ్లం. మస్తు బాధ అనిపిస్తుండేది. ఇల్లు కట్టుకునే స్థోమతలేదు. గింత జాగలేదు. మా బాధలు ఎట్ల తీరుతయి దేవుడా అనుకునేటోళ్లం. కారం మెతుకులు తిన్నాసరేగానీ సొంత ఇల్లు ఉండాలే అనుకున్నం. నాలాంటి డ్రైవర్ ఇల్లు ఎట్ల కడుతడు. జీవితమంతా గిదే బతుకనుకున్నం. కానీ, కేటీఆర్ సార్ మాకు ఈడ ఇల్లు ఇప్పించిండ్రు. ఇప్పుడు మస్తు ధైర్యం వచి్చంది. పిల్లలను మంచిగా చదివించుకోవాలే అని డిసైడ్ అయినం. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. – మహ్మద్ రజాక్, కౌసర్బేగం పెండ్లి చేసుకునుడే.. కిరాయి ఇంట్ల ఉంటున్నమని పిల్లను ఇచ్చేతందుకు సంబంధాలు వస్తలేవు. నేను ట్రాక్టర్ డ్రైవర్గా పనిజేస్తున్న. కిరాయి ఇంట్ల ఉంటే ఎవరూ విలువ గూడ ఇస్తలేరు. కనీసం మనిషిగా గుర్తిస్తలేరు. డ్రైవర్ పనిజేసేవాళ్లకు పిల్లను ఎవరు ఇస్తరు. మా ఇబ్బందులు గిట్లున్నయి. మా సర్పంచ్ డబుల్బెడ్రూమ్ ఇప్పించిండ్రు. అమ్మానాన్న నాకు పెళ్లి సంబంధాలు జూస్తున్నరు. సొంతింట్లకు అచ్చి నం. ఇగ పెండ్లి చేసుకునుడే. – శేఖర్ కిరాయి ఇంట్ల నుంచి డబుల్బెడ్రూమ్ ఇంట్లకు.. మా ఊరులో సొంతిల్లు లేదు. చాలా అవస్థలు పడ్డం. కూలి పనులు జేసుకునే మాకు సొంతిల్లు కట్టుకునే పరిస్థితి వస్తదోరాదో అనుకున్నం. కిరాయి ఇంట్లనే ఏండ్లకొద్దీ ఉన్నం. నెలకు రూ.500 కిరాయి. ఇప్పుడు డబుల్బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. కేటీఆర్ సార్ మా ఇంట్లకు వచ్చి గృహప్రవేశం జేసిండ్రు. గాయిన జేసిన సాయం మరిచిపోలేం. – గునుకంటి పావని (చదవండి: మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు ) -
‘త్వరలో లక్ష ఇళ్ల పంపిణీ’
సాక్షి, హైదరాబాద్: త్వరలో 1.03 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 52 వేల ఇళ్లు పూర్తి చేశామని, వీటిల్లో చాలా ఇళ్లు గృహప్రవేశాలు పూర్తి చేసుకున్నాయని, మరో 1.03 లక్షల ఇళ్లు 90 శాతం పనులు పూర్తి చేసుకున్నాయని సభకు తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇలా ప్రభుత్వం పేదల కోసం ఉచితంగా ఇళ్లను కట్టించి ఇచ్చే పథకం లేదన్నారు. ఇప్పటివరకు ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.10,054 కోట్లు ఖర్చయ్యాయని, ఇందులో రూ.8,743 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులని, కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ.1,311 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. బిల్లులు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 9,650 కోట్లు అందించామని, రూ. 400 కోట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటినీ త్వరలో ఇస్తామన్నారు. క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనలో ఉందని చెప్పారు. రాంపల్లిలో టన్నెల్ ఫామ్ టెక్నాలజీ, దుండిగల్లో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీలను వినియోగించి ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులకు సంబంధించి పీఎంఏవై గ్రామీణ్ కింద రూ. 385 కోట్లకుగాను రూ. 190 కోట్లే విడుదల చేసిందని, ఇదే పథకం అర్బన్ విభాగంలో రూ. 2,305 కోట్లకుగాను రూ. 1,120 కోట్లే ఇచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఈ ఇళ్ల మొత్తం వైశాల్యం 12 కోట్ల చదరపు అడుగులన్నారు. 75 వేల మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి, అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధమైన వారు సొంత స్థలాల్లో నిర్మించుకుంటే ఈ పథకం కింద సాయం చేస్తామన్నారు. -
కలెక్టర్ పీఏను.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ
హస్తినాపురం: తాను కలెక్టర్ పీఏగా పనిచేస్తున్నానని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఎంతో మందిని మోసం చేసిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం హైకోర్టు కాలనీకి చెందిన ఎల్లంకి బ్రహ్మచారికి కొత్తపేట హుడా కాంప్లెక్స్లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యా పారి సుబ్రమణ్యంతో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో తాను కలెక్టర్ పీఏగా పనిచేస్తున్నా నని, తాను డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తానని సుబ్రమణ్యం మాయమాటలతో బ్రహ్మచారిని నమ్మించాడు. దీంతో ఆయనతోపాటు మరో పది మంది ఇళ్లు వస్తాయనే ఆశతో 2016లో రూ.27 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడు బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు సుబ్రమణ్యం ఉంటున్న కొత్తపేట హుడా కాంప్లెక్స్కు వెళ్లిచూడగా అక్కడ నుంచి వెళ్లిపోయాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగినా.. మేం.. హరీశ్రావు
పాపన్నపేట (మెదక్ జిల్లా): కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వాళ్లు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా నీటి తీరువా రద్దు చేశారా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా..ఎకరానికి రూ.10 వేలు ఏ రాష్ట్రమైనా ఇస్తోందా? అని నిలదీశారు. పేదింటి అమ్మాయి పెళ్లికి రూ.లక్ష, రైతు బీమాకు రూ.5 లక్షలు ఎక్కడైనా ఇస్తున్నారా అని అడిగారు. మన పథకాలే కేంద్రం కాపీ కొడుతోందని పునరుద్ఘాటించారు. మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాజులగూడెం, ఛత్రియాల్లో 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బుధవారం ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల సొంత జాగాలో ఇళ్లు కట్టుకోలేకపోయామని తెలిపారు. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగిందని తెలిపారు. అయినా కూడా కల్యాణలక్ష్మి, రైతుబంధు, పింఛన్లు ఆపలేదని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. రైతులంతా ఆలోచన చేయాలని సూచించారు. రుణమాఫీ, సొంత జాగాలో ఇల్లు మాత్రమే ఆగాయని చెప్పారు. ఉగాది తర్వాత ఈ కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తాం అని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి తీరువాను రద్దు చేసి ఎకరానికి రూ.పది వేలు ఇస్తోందని తెలిపారు. 2014 తర్వాత నీరు వదలమని హైదరాబాద్కు ఒక్క రైతన్నా వెళ్తున్నాడా అని ప్రశ్నించారు. అప్పుడు ఊరికి 2 జీప్లలో రైతులంతా హైదరాబాద్ వెళ్లి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచుతున్నామని.. నీటికి ఇబ్బంది లేదని తెలిపారు. కాళేశ్వరం నీటిని పాపన్నపేటకు తెస్తున్నట్లు చెప్పారు. సింగూరుకు కాళేశ్వరం నీరు నింపుతాం.. రెండు పంటలు పండించుకుంటామని పేర్కొన్నారు. మూడో పంట వేయాలన్న ఆలోచన వచ్చే రీతిలో పరిస్థితులు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దివ్యాంగులకు 5 శాతం ‘డబుల్’ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ పథకంలో దివ్యాంగులకు 5 శాతం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దివ్యాంగుల పరికరాల పంపిణీ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, విద్య, ఉపాధి పథకాల్లో 5 శాతం, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దివ్యాంగులకు పరికరాలను అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి దరఖాస్తులు ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ఫిబ్రవరి ఆరో తేదీ వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి 15 నుంచి పరికరాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. -
‘డబుల్’పై ప్రభుత్వాన్ని నిలదీసిన స్థాయి సంఘం
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ఎందుకు పెట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం నిలదీసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కలిపి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రధాని మోదీ ఫొటో పెట్టాలని స్పష్టం చేసింది. గ్రేటర్ వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయి?.. ఈ ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దారి మళ్లించింది?.. ఎందుకు ఆలస్యంగా విడుదల చేసింది?.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పుడు విడుదల చేస్తుంది?.. అని ప్రశ్నల వర్షం కురిపించింది. లోక్సభ ఎంపీ జగదాంబిక పాల్ నేతృత్వంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్లమెంటరీ స్థాయి సంఘం మంగళవారం నగరంలోని ఓ హోటల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కేంద్ర పట్టణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు మొత్తం రూ.1500 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఎందుకు విడుదల కాలేదని స్థాయి సంఘం సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో సహా ఇతర సభ్యులు తెలంగాణ అధికారులను నిలదీశారు. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ వేశారా? మూడు నెలలకోసారి ఈ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయా? ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనులను ఇంకా ఎందుకు ప్రారంభించలేదు? అని అధికారులను ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ లేఖలకు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కేంద్రం మంజూరు చేసిన నిధులను సమానంగా రూ.392 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 80 వేలకు పైగా గృహాలను ఎందుకు లబ్ధిదారులకు కేటాయించడం లేదని సభ్యులు ప్రశ్నించగా, వీటికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. -
సారూ.. నా ఇల్లు వేరొకరికి ఇయ్యండి
‘నాకు సిద్దిపేటలో కేసీఆర్ నగర్లో అధికారులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చిండ్రు. నేను నా కూతురు ఇద్దరం.. మా తమ్ముడి వద్ద ఉంటున్నం. రేపోమాపో నా కూతురికి పెళ్లయి వెళ్లిపోతది. తర్వాత ఒంటరిగా ఉండే నాకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అవసరం ఉండదు. నాకు వచ్చిన ఆ ఇంటిని అధికారులకు తిరిగిస్తున్నా. నా లాంటి పేదవారికి దాన్ని ఇవ్వండి. ఇదీ ఈ పేదింటి మహిళ గొప్ప మనసు.. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట కేసీఆర్ నగర్లోని ఆడిటోరియంలో లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సిద్దిపేటకు చెందిన రచ్చ లక్ష్మి తన కూతురు, తమ్ముడితో కలసి వేదికపైకి వచ్చింది. తన భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడని.. కొంతకాలంగా కూతురుతో కలసి తమ్ముడు నగేష్ వద్ద ఉంటున్నా మని తెలిపింది. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని వెనక్కి ఇస్తున్నట్లు మంత్రికి వివరించింది. మరో పేదరాలికి ఆ ఇంటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇంటి ధ్రువీకరణ పత్రాలు, తాళం చెవిని మంత్రి హరీశ్ సమక్షంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అప్పగించింది. లక్ష్మి నిర్ణయాన్ని మంత్రి అభినందించారు. -
‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలే..!’
సాక్షి, సిద్దిపేట: పేదల మోముల్లో ఆనందపు వెలుగులు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్లో 180 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎఫ్డీసీ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అర్హులైన నిరుపేదలకు ఇళ్లు దక్కడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో... నర్సాపూర్లో 2460 రెండు పడక గదుల ఇల్ల నిర్మాణం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ఇండ్ల సముదాయాలకు ధీటుగా పూర్తి చేశామన్నారు. ఈ ఇళ్ళు నిర్మించేందుకు మాకు నాలుగేళ్ల సమయం పట్టిందని మంత్రి తెలిపారు. ఈ నాలుగేళ్లలో నాలుగు వందల సార్లు నిర్మాణ స్థలాన్ని సందర్శించి స్వంత ఇంటి మాదిరి మనసు పెట్టి ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామని మంత్రి తెలిపారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి ఏలాంటి ఆరోపణలకు తావులేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా అధికారులతో సహా 200కు పైగా అధికారులు అహర్నిశలు శ్రమించారని మంత్రి గుర్తు చేశారు. ఇండ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తొలి దశలో ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది లబ్ధిదారులు.. ఈ రోజు 180 మంది గృహ ప్రవేశాలు చేశారన్నారు. ప్రతీ ఇంట్లో విద్యుత్, నల్లా, గ్యాస్ కనెక్షన్, పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నాయో లేదో సరి చూసుకుంటూ దశల వారీగా లబ్ధిదారులకు పట్టాలు అందిస్తూ గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తున్నామన్నారు. ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించి పున: పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు హరీశ్ రావు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో సాంకేతికత దన్నుగా బిగ్ డేటా తో సరిపోల్చుతూ...అర్హులు మాత్రమే లబ్ది పొందేలా చూస్తున్నామన్నారు.మరో 1000 ఇండ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా వెంటనే మంజూరు చేశారన్నారు హరీశ్ రావు. (చదవండి: ఇళ్లు అవే.. ఎన్నికలే వేరు) జోర్డార్ వసతులతో.... నయా పైసా ఖర్చు లేకుండా బహిరంగ విపణిలో రూ.15 లక్షలు విలువ చేసే డబుల్ బెడ్ రూం ఇండ్లను సకల సౌకర్యాలతో పేదలకు ఉచితంగా అందిస్తున్నామన్నారు హరీశ్ రావు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలోనే.... పట్టా ఉత్తర్వుతో పాటు..నల్లా కనెక్షన్ మంజూరు పత్రం, కరెంట్ కనెక్షన్ , ఇంటి నెంబర్, పైపుడ్ గ్యాస్ కనెక్షన్ లు అందజే స్తున్నా మన్నారు. అంతే కాకుండా స్వంత అన్నయ్య లా ఆశీర్వదిస్తూ.. నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నాము. కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యత లబ్ధిదారుదే అన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అక్తర్ పటేల్, సుడా(ఎస్యూడీఏ) వైస్ చైర్మన్ రమణ చారి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నగర్ ప్రజల సౌకర్యార్థం మంత్రి తన్నీరు హరీష్ రావు బస్సు సేవలను ప్రారంభించారు. ప్రతీ రోజూ కేసిఆర్ నగర్ నుంచి కోటి లింగాలు, కాల కుంట వరకు బస్సు సేవలు అందుబాటులో కి వచ్చాయి. నిరుపేదల మోముల్లో ఆనందపు వెలుగులు నిన్న మొన్నటిదాకా కిరాయి ఇంట్లో ఉంటూ... నేడు స్వతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల్లో డబుల్ సంతోషం వెల్లివిరిసింది. గృహ ప్రవేశాలు సందర్భం గా లబ్ధిదారులు తమ సంతోషాన్ని సమాచార శాఖ తో పంచుకున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.... (చదవండి: ‘వారిద్దరూ తోడు దొంగలు’) నిన్నటి దాకా అద్దింట్లో .. నేడు ఆత్మగౌరవంతో సొంతిట్లో మాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు.నిన్న మొన్నటి వరకూ సిద్దిపేట బాలాజీ నగర్లోని అద్దింట్లో ఉన్నాం. దినసరి కూలీ తో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. డబుల్ బెడ్ రూం కోసం అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాం. అనేక వడపోత ల తర్వాత మాకు ఈ రోజు సొంత ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా స్వంతింటి కల సాకారం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు సదా రుణ పడి ఉంటాం.- చింది యాదగిరి - సంతోషి దంపతులు స్వంతిల్లు... సొంతం అవుతుంది అనుకొలే పెండ్లైనప్పటి సుంది కిరాయికే ఉంటున్నాం. నా భర్త జహీరుద్దిన్ డ్రైవర్గా పని చేస్తూ ప్రమాదంలో గాయపడి అనారోగ్యానికి గురయ్యారు. మాకు 5 గురు సంతానం. బట్టలు కుడుతూ కుటుంబానికి అండగా ఉంటున్నాను. మా పెండ్లైన ప్పటి నుండి కిరాయికే ఉంటున్నాం. స్వంతిల్లు సొంతం అవుతుంది అనుకోలే.. హరీశ్ రావు సార్ మా కలను నెరవేర్చాడు. -మహ్మమదీ -
వనస్థలిపురంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించిన కేటీఆర్
-
డబుల్ ఆత్మగౌరవం : కేటీఆర్
హైదరాబాద్ : రాష్ట్రంలో జరుగుతున్న స్లమ్ ఫ్రీ అభివృద్ధి పనులు దేశంలోని మరే రాష్ట్రంలో జరగడం లేదని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే.టీ.రామారావు అన్నారు. వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో రెండెకరాల విస్తీర్ణంలో రూ. 28.03 కోట్ల వ్యయంతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూం ఇళ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో రూ. 9,714 కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అందులో దాదాపు 90 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుందని చెప్పారు. ఇప్పటికే 10 వేల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల వంటివి మరే రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు. నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారని మంత్రి వివరించారు. వనస్థలిపురంలో సెల్లార్, స్టిల్ట్, 9 అంతస్తులలో మూడు బ్లాకుల్లో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూం ఇళ్ల విలువ మార్కెట్లో దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ఇక్కడ భూమి విలువ గజానికి రూ.లక్షకు పైగానే ఉంటుందని చెప్పారు. సీఎం కార్యాలయానికి ఏ లిఫ్ట్లు అయితే వాడుతున్నారో, ఇక్కడ కూడా ఆ కంపెనీకి చెందిన లిఫ్ట్లు వాడుతున్నామన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులకు యాజమాన్య పట్టాలను, ఇంటి తాళం చెవులను కేటీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఇంట్లో ఉండే లిఫ్ట్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు!
సాక్షి, హైదరాబాద్ : వనస్థలిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రూ.28 కోట్లతో3 బ్లాక్ల్లో 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అయిదేళ్ల క్రితం జై భవాని నగర్లో గుడిసెలు ఉండేవని, ఇక్కడున్న వారి కోసం ఆనాడు వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేశామన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే లిఫ్ట్ ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఏర్పాటు చేశామని తెలిపారు. చదవండి: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో పేదవారి ఆత్మగౌరనికి ఈ డబుల్ బెడ్ రూమ్లు ప్రతీక అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 40 నుంచి 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎక్కడ తక్కువ కాకుండా పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నీ ప్రైవేట్ గేటెడ్ కమ్మునిటీ ని తలపిస్తున్నాయి. ఉచితంగా ఇల్లు పొందిన ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. -
సిద్దిపేటలో సామూహిక గృహ ప్రవేశాలు
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటనకు సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబైంది. రూ.870 కోట్ల వ్యయం తో చేపట్టిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు గురువారం సీఎం చేతుల మీదుగా జరగనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం పథకంలో భాగంగా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన ఇళ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించనున్నారు. నర్సాపూర్ శివారులో నిర్మించిన 2,461 డబుల్ బెడ్రూం ఇళ్లలో మొదటి దశలో 144 లబ్దిదారులు గురువారం సామూహిక గృహ ప్రవేశాలు చేయనున్నారు. 9వ బ్లాక్లోని 3వ నంబర్ నివాసగృహంలో లబ్దిదారుడి కుటుంబంతో సీఎం దగ్గరుండి గృహప్రవేశం చేయిస్తారు. అంతకుముందు భారీ పైలాన్ను ఆవిష్కరిస్తారు. పొన్నాల శివార్లలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిర్మిస్తున్న జిల్లా కార్యాలయాల్లో ప్రారంభం జరుగుతున్న మొదటి పార్టీ ఆఫీసు ఇదే. మరోవైపు మెడికల్ కళాశాల, రంగనాయకసాగర్ అతిథిగృహం, సిద్దిపేట పట్టణంలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, రైతు వేదికలను ప్రారంభిస్తారు. వెయ్యి పడకల ఆసుపత్రి, ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేటలో బహిరంగ సభ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతగడ్డ సిద్దిపేటకు రానున్న క్రమంలో మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం సభకు 10 వేల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. సీఎం పర్యటనలో హరీశ్రావుతో పాటు ఇతర మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిలు పాల్గొననున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్.. – ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి నుంచి సీఎం రోడ్డు మార్గాన సిద్దిపేటకు బయలుదేరుతారు. – 11 గంటలకు కొండపాక మండలం దుద్దెడకు రాక. – 11.10కి ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన. – 11.20కి పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు – 11.40కి మిట్టపల్లిలో రైతు వేదికను ప్రారంభిస్తారు – 12 గంటలకు ఎన్సాన్పల్లి శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. అక్కడే వెయ్యి పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. – 12.30కి కోమటిచెరువును సందర్శించి నెక్లెస్రోడ్డును తిలకించనున్నారు – 12.45 గంటలకు నర్సాపూర్ శివారులోని డబుల్ బెడ్రూం మోడల్ కాలనీలో (కేసీఆర్ నగర్) గృహప్రవేశాలు చేయించనున్నారు – 1.20కి సిద్దిపేట పట్టణంలోని చింతల్ చెరువు వద్ద నిర్మించిన మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభం. – 1.40 గంటలకు చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ మధ్యలో నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే మంత్రులతో కలిసి మధ్యాహ్నభోజనం చేస్తారు. – 3 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
పైరవీలకు తావులేకుండా ఇళ్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: జియాగూడలో మంత్రి కేటీఆర్ సోమవారం పేదలకు డబుల్ బెడ్ రూం ఫ్లాట్ పట్టాలను అందజేశారు. కట్టల మండిలో 120 డబుల్బెడ్ రూం ఇళ్లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘జియాగూడలో ఈరోజే దసరా జరుగుతున్నట్టుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు. ఇప్పుడు దేశ చరిత్రలో నేనే ఇల్లు కట్టిస్తా, పేదింటి బిడ్డలకు పెళ్లి చేస్తా అని కేసీఆర్ చెప్తున్నారు. పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. హైదరాబాద్లో మొత్తం లక్ష ఇళ్లు కట్టి సిద్ధంగా ఉంచాం. దశలవారీగా పేదలకు అందిస్తాం. గత ప్రభుత్వాల్లో పేదల ఇళ్ల పేరుతో అవినీతి జరిగింది. ప్రభుత్వానికి 9 లక్షలు ఖర్చయినా ఇవాళ మార్కెట్లో వీటి విలువ 50 లక్షల వరకు ఉంటుంది. తెలంగాణ మొత్తంలో 2 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మిస్తున్నాం. సొంతంగా సొసైటీ ఏర్పాటు చేసుకోండి. 56 షాపులు నిర్మించాం. వాటి రెంట్తో లిఫ్ట్లు, పారిశుధ్యం మెయింటెనెన్స్ చేసుకోండి. పైరవీలకు తావు లేకుండా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయి. మూసీ సుందరీకరణ త్వరలోనే చేపడతాం’ అని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ‘హైదరాబాద్ని స్లమ్ లేని నగరంగా చేయాలనేది కేసీఆర్ స్వప్నం. తెలంగాణ రాక ముందు కరెంట్ ఉంటే వార్త. ఇపుడు కరెంట్ పోతే వార్త. చిన్నప్పుడు ఆబిడ్స్లో చదువుకున్నాను. అప్పట్లో గొడవలు జరిగి, కర్ఫ్యూలు ఉండేవి. ఇప్పుడు నగరంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. 60 ఏళ్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం’ అని అన్నారు. చదవండి: తెలంగాణ: భారీగా తగ్గుతున్న కరోనా కేసులు -
పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
-
డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పేద ప్రజలకు శుభవార్త. డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ సోమవారం పంపిణీ చేయనున్నారు. జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్లో 192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి ఈరోజు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆయా ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇళ్లను కూడా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. (చదవండి: ‘కోవాక్సీన్’ బిహార్ కోసమేనట!) తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించింది. ఇళ్లు లేని నిరుపేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో మినహా అనేక చోట్ల ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తైన ప్రాంతాల్లో ఇళ్ల పంపిణీ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే విడతలుగా ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్తో కలిసి ముషిరాబాద్ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు మంత్రిని కలసి ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించినా.. కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తమదన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తనమని మండిపడ్డారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్లను వాడుకుంటోందని మంత్రి కిషన్రెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని తెలిపారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్లో 7లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్లో దాదాపు 20లక్షల మంది పేదలకు ఇళ్లు లేవన్నారు. అందరికీ ఇళ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అదే విధంగా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. నియోజకవర్గంలో 431 ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఆశగా చూపి మూడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు వేయించుకుందని విమర్శించారు. -
అంతా బోగస్: భట్టి
సాక్షి,హైదరాబాద్: లక్ష ఇళ్లు కట్టాం.. కావాలంటే వెళ్లి చూసుకోండని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం చెప్పిన మాటల్లో నిజం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ ఎంపీలు హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్తో కలసి మంగళవారం శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ’డబుల్’ లిస్ట్ పూర్తిగా బోగస్ అని వ్యాఖ్యానించారు. కట్టకపోయినా కట్టినట్టు లిస్ట్లో చూపించారని, కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు నిజాలను చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం చెబుతున్న లక్ష ఇళ్ల జాబితాలోని ఒక్కో ప్రాంతాన్ని మీడియాకు చూపించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. మంత్రి కేటీఆర్ కార్పొరేట్లతో ఏసీ రూముల్లో చర్చలు జరపడం సరికాదని, బస్తీ ప్రజల బాధల్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం చెప్పిన ప్రాంతంలో దుర్బిణీ వేసి వెతికినా ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాకే టీఆర్ఎస్ నాయకులను బస్తీల్లోకి అడుగుపెట్టనివ్వాలని ప్రజలకు భట్టి పిలుపునిచ్చారు. -
తప్పు జరిగింది.. సరిదిద్దుకుంటాం: మంత్రి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అయితే కోర్టులో కాంగ్రెస్ కేసులు వేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిరలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ చెక్కులు భట్టి విక్రమార్క పంపిణీ చేస్తారని తెలిపారు. ఓపెన్ నాళాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అధికారుల పొరపాటుతో తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామన్నారు. (మంత్రి కేటీఆర్, మేయర్పై సుమేధ తల్లి ఫిర్యాదు) హైదరాబాద్ అబివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కేటీఆర్ పనితనం గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ సబ్యులు లొకేషన్ తెలుసుకొని వెళ్ళాలని, లక్ష బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అప్జల్ సాగర్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతారన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు.150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరకరని విమర్శించారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని సూచించారు. (నాలుగు స్థానాలు గులాబీ ఖాతాలోకే..!) -
‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు’
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం బోగస్ లెక్కలు చెబుతోందని సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనేక ప్రాంతాల్లో కట్టని ఇళ్లను కూడా కట్టినట్టు జాబితాల్లో తప్పుడు లెక్కలు చూపుతుందని పేర్కొన్నారు. నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో తప్పుడు లెక్కల వివరాలను భట్టి మీడియాకు వివరించారు. ప్రభుత్వ మోసాలను భట్టితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా మీడియాకు చూపించారు. గ్రేటర్ హైదరాబాద్లోని 24 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గానికి 10 వేల చోప్పున 2 లక్షల 40 వేల ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని భట్టి తెలిపారు. -
ఇళ్లు అవే.. ఎన్నికలే వేరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇండ్లు అవే, కాకపోతే ఎన్నికలే మారిపోతున్నాయని కాం గ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ ఇండ్లను చూపెట్టి ఓట్లు దండుకున్నారని, ఇప్పుడు మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికలవేళా వాటినే చూపెట్టి ప్రజలను మరోమారు మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. రెండ్రోజులపాటు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి నగరంలో డబుల్బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన భట్టి శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్లో లక్ష ఇళ్లు కట్టామని, వాటిని చూపెడతామని అసెంబ్లీలో మంత్రి ప్రగల్భాలు పలికారని, కానీ కట్టింది మాత్రం 3,428 ఇండ్లేనని, వాటిని మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాను చూశానని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపె నింగ్కు వస్తా.. కోడికూర, కల్లు తెచ్చిపెట్టండి, దావత్ చేసుకుందామని గతంలో కేసీఆర్ చెప్పారని, కానీ కల్లు పులిసిపోతోంది.. కోడికూర కుళ్లిపోతోంది.. కానీ ఇండ్లు మాత్రం రెడీ కాలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లక్ష ఇండ్లు చూపిస్తామన్న ప్రభుత్వం వాటిని చూపించలేక పారిపోయిందని అన్నారు. ఇంకెంతకాలం మోసం చేస్తారు ‘మహేశ్వరం నియోజకవర్గంలో ఇండ్లు చూపెట్టి ఇవే గ్రేటర్ ప్రజలకు అంటున్నారు.. మరి స్థానికులకు ఎక్కడ ఇస్తారు? తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇవే ఇండ్లు చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడు ఇవే గ్రేటర్ ప్రజలకు అంటున్నారు. మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో చూపించి అవి జీహెచ్ఎంసీ ఇండ్లు అంటున్నారు’అని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. లక్ష ఇండ్ల పేరుతో ప్రజల్ని ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రతినిధులతో ఇండ్ల పరిశీలనకు వెళ్లడంతో ఇప్పుడు తన ద్వారా గ్రేటర్ ప్రజలకు వాస్తవాలు తెలిశా యని అన్నారు. గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదన్న విషయాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి డివిజన్లో ప్రచారం చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్కుమార్ యాదవ్, నాయకులు దాసోజు శ్రావణ్, ఫిరోజ్ఖాన్, మూల విక్రమ్గౌడ్, బల్మూరి వెంకట్రావు, అనిల్కుమార్ యాదవ్, నాగరిగారి ప్రీతం తదితరులు పాల్గొన్నారు. -
తలసాని కోసం 40 నిమిషాలు ఎదురు చూశాం
సాక్షి, హైదరాబాద్: లక్ష ఇళ్లు చూపిస్తా అన్నా తలసాని రెండో రోజు పర్యటన మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్లారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా మండి పడ్డారు. మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతు మమ్మల్ని వదిలేసిన ప్రాంతంలోనే మళ్లీ వస్తారని 40 నిమిషాలు వేచి చూశామని తెలిపారు. శనివారం ఇందిరా భవన్ పీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. ‘కేసీఆర్ నుంచి కేటీఆర్, తలసాని వరకు అందరూ గ్రేటర్ సిటీ ప్రజలను ప్రతి ఎన్నికల సమయంలో మోసం చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు. ఎన్నికల సమయంలో పేదల అవసరాలను ఓట్లుగా మలుచుకొని ఆ తరువాత ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. 2016 అసెంబ్లీలో కేసీఆర్.. 2017 లో కేటీఆర్.. 2020లో తలసాని అసెంబ్లీలో లక్ష ఇళ్లు అన్నారు. గత ఎన్నికల్లో ఒక్క ప్రాంతంలో ఇళ్లు కట్టి గ్రేటర్ సిటీ ఓట్లు దండుకున్నారు. 150 డివిజన్లలో 96వేలు ఇళ్లు ఉండాలి.. కానీ ప్రభుత్వం చూపించింది 3,400 మాత్రమే. 24 నియోజవర్గాల్లో 96వేల ఇళ్లు ఉండాలి.. నాలుగు నియోజవర్గాల్లో 3వేల ఇళ్లు మాత్రమే చూపించారు’ అని తెలిపారు భట్టి. (చదవండి: ‘డబుల్’ కాక) ‘గ్రేటర్లోనే ఇళ్లు చూపిస్తా అన్న తలసాని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ నియోజావర్గంలో ఉన్నవి చూపించారు. మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్లు ఇప్పటి కావు 2016లోవి. అక్కడి ప్రజల ఇండ్లను గ్రేటర్ సిటీ ఇళ్లు అని మాయ చేస్తున్నారు. హైదరాబాద్లో కేవలం 3,400 ఇళ్లు మాత్రమే కట్టారు.. ఒక లక్ష ఇళ్లు అన్న మాట అవాస్తవం. నాలుగేళ్ల క్రితం 150 కుటుంబాలను అంబేద్కర్ కాలనీలో ఖాళీ చేయించారు.. ఇప్పటి వరకు ఆ కాలనీ అంతా ఖాళీగానే ఉంది. మల్లెపల్లిలో సైతం శంకుస్థాపన చేసి ఖాళీగా వదిలేశారు. నాలుగేళ్ల నుంచి పేదల ఇబ్బందలు పట్టించుకోవడం లేదు. మోసాలకు పాల్పడే టీఆర్ఎస్ను మళ్ళీ నమ్మితే పేదలకు న్యాయం జరగదు. ప్రభుత్వ మోసాలను గ్రేటర్ సిటీలో ప్రతి డివిజన్లో తిరిగి చెప్తామన్నారు భట్టి. -
‘డబుల్’ కాక
లక్డీకాపూల్/తుక్కుగూడ/రామచంద్రపురం (హైదరాబాద్): డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై అసెంబ్లీ సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన సవాల్ వేడి మరింత రాజుకుంది. రెండో రోజు శుక్రవారం ఇళ్ల పరిశీలన సవాల్ ప్రతి సవాల్ మధ్య సాగింది. ‘చెప్పింది ఒకటి.. చూపింది ఒకట’ని ప్రతిపక్షం విమర్శించగా.. ‘జాబితా ఇస్తాం.. మీరే చూసుకోండి’ అంటూ అధికారపక్షం పేర్కొంది. చివరికి ఇళ్ల పరిశీలన సైతం అర్థాంతరంగా ముగిసింది. దీనిపై భట్టి పారిపోయారంటూ మంత్రులు ఎద్దేవా చేయగా, ప్రభుత్వమే పారిపోయిందంటూ భట్టి ఎదురుదాడి చేశారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు రోడ్ నం.14లోని భట్టి నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అక్కడి నుంచి భట్టి, మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో కలసి మంఖాల్లో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. అనం తరం రాంపల్లిలో ఇళ్ల పరిశీలన కొనసాగుతుండగా కాంగ్రెస్ నాయకులు అర్ధంతరంగా విరమించుకొని వెనుదిరిగారు. ఆ తర్వాత కొల్లూరులో ఇళ్లను మంత్రులు తలసాని, మల్లారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మల్లెపల్లి లలితా సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్లో ‘లక్ష’ చూపించగలరా?: భట్టి గ్రేటర్ హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు చూపిస్తామని శాసనసభలో చెప్పిన మంత్రి వాటిని జీహెచ్ఎంసీలోనే చూపించగలరా అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన ఇళ్లను చూపి ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని, త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ వీటినే చూపించి లబ్ధిపొందడానికి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను గ్రేటర్ ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్లో కట్టిన ‘డబుల్’ఇళ్లను చూపించలేక శివారుకు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. మొత్తం ఇళ్లను చూపించమని అడిగితే జాబితా ఇస్తాం చూసుకోండంటూ అధికారపక్షం తప్పించుకు పారిపోయిందని భట్టి విమర్శించారు. జాబితా ఇస్తాం తనిఖీ చేసుకోండి లక్ష ‘డబుల్’ఇళ్ల జాబితా ఇస్తామని, కాంగ్రెస్ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్లి తనిఖీ చేసుకోవచ్చని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి సవాల్ విసిరారు. కొల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో చేసిన సవాల్ మేరకు స్వయంగా భట్టి విక్రమార్కను తీసుకెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపించామన్నారు. ఈ రోజు కూడా వాటిని చూపించేందుకు తీసుకెళ్లగా, భట్టి మధ్యలోనే వెళ్లిపోయారని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విలువైన భూముల్లో పేదలకు రెండు పడకల ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటిలో ఆధునిక సదుపాయాలు సైతం కల్పిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు అగ్గిపెట్టెలాంటి ఇళ్లు నిర్మించారని, వాటిలోకి ఇప్పటివరకు ఎవరూ రాలేదని మంత్రులు విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ విలువైన భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేదన్నారు. వీటిని చూసి తట్టుకోలేకే భట్టి విక్రమార్క మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కు: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ విమర్శించారు. శనివారం ‘జూమ్’లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... 2019 డిసెంబర్ నాటికే 2 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని టీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు. జీహచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో బీజేపీ ముందు ఉండి.. టీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోతుందన్న సమాచారం సీఎం కేసీఆర్కు ముందుగానే వచ్చిందన్నారు. రెండు రోజులు జీహెచ్ఏంసీ పరిధిలో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూం ఇండ్ల క్వాలిటీపై మాట్లాడకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్-కాంగ్రెస్ కలుస్తందనడానికి ఇదే సంకేతమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ లేదని తానే స్వయంగా పరిశీలించానని చెప్పారు. బీజేపీని ఎదురుకోలేక కాంగ్రెస్-టీఆర్ఎస్ కలిసి తిరుగుతున్నాయని, జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని కేటీఆర్ ఉరుకులాడుతున్నాడరని అరుణ విమర్శించారు. బీజేపీకి భయపడే అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్తో కలిసిందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని భావించే కాంగ్రెస్ను టీఆర్ఎస్ పెంచిపోషిస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీచేసేటట్లు కనిపిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్-కాంగ్రెస్లు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని పేర్కొన్నారు. ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నాయో ప్రకటన చేయాలన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ప్రధాన మంత్రిని విమర్శించే స్థాయి తలసానికి లేదని ఆమె మండిపడ్డారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేక గాలులు విస్తున్నాయన్నారు. సీఎం అనుమతి లేకుండా తలసాని.. భట్టి ఇంటికి వెళ్లగలరా అని డీకే అరుణ ప్రశ్నించారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఇల్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మా , వేంకటేశ్వర రాజు, సత్య కృష్ణ వర ప్రసాద్లు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో బాధితుడు దగ్గర లక్షా 20 వేల రూపాయల నుంచి లక్షా 70 వేల రూపాయల వరకు వసూలు చేశారు. దాదాపు 89 మంది దగ్గర 1 కోటి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బాలా నగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ( గ్రేటర్ బయట ఇళ్లను చూపిస్తే ఎలా? ) ముగ్గురిలో ఇద్దరు నిందితులు సైతం డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మోసపోయారని పోలీసులు గుర్తించారు. వీరశెట్టి వెంకట్ సాయి కృష్ణ ప్రసాద్ అనే నిందితుడు గతంలోనూ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో తేలింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రజలు మోస పోవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారానే ఇళ్లు వస్తాయని, అక్రమ పద్దతిలో రావని స్పష్టం చేశారు. -
గ్రేటర్ బయట ఇళ్లను చూపిస్తే ఎలా?
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తామని చెప్పి మంత్రి, నగర మేయర్ పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ‘డబుల్’ ఇళ్ల పరిశీలనలో భాగంగా తుక్కుగూడలోని మంకల్లో వారంతా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లు చూపిస్తామని 3428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. జీహెచ్ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలని అన్నారు. గ్రేటర్ బయట కట్టిన ఇళ్లను కూడా చూపిస్తే ఎలా? అని ప్రశ్నించారు. (చదవండి: ప్రగతి భవన్: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం) మరోవైపు లక్ష ఇళ్ల జాబితా ఇస్తాం.. మీరే చూసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగర శివారులో కట్టిన ఇళ్లు కూడా నగర వాసుల కోసమేనని మంత్రి తెలిపారు. దీంతో స్థలాలు చూపిస్తాం.. నగరంలోనే ఇళ్లు నిర్మించాలని భట్టి మరోసారి సవాల్ విసిరారు. స్థలాలు చూపిస్తే ఇళ్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి తలసాని జవాబిచ్చారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే కాదు.. హైదరాబాద్లో అభివృద్ధిని కూడా చూపిస్తామని తెలిపారు. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం తమకున్నాయని మంత్రి తలసాని మీడియాతో పేర్కొన్నారు. (చదవండి: బస్తీమే.. సవాల్!) -
దమ్ము, ధైర్యం మాకున్నాయి
సాక్షి, హైదరాబాద్: కొద్దిసేపటి క్రితమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించే క్రమంలో భాగంగానే శుక్రవారం మరోమారు భట్టి ఇంటికి మంత్రి తలసాని వచ్చారు. కాసేపట్లో ఇరువురు కలిసి కొల్లూరు, కుత్బుల్లాపూర్, జవహర్నగర్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్లో పర్యటించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. 'భట్టి ఇంటికి వచ్చాము. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూపిస్తున్నాం. దళారులకు డబ్బులు ఇస్తే మోసపోతారు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తుంది. ఇళ్ల కేటాయింపుపై లబ్ధిదారులు అడుగుతారు. ఈ రోజు వెళ్లి చూపిస్తాం. రేపటి నుంచి ఆయా ప్రాంతాల్లో అధికారులు వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చూపిస్తారు. ఇవి మున్సిపల్ ఎన్నికల కోసం కట్టే ఇళ్లు కావు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లే కాదు.. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూపిస్తాం. లాక్డౌన్ సమయంలో రోడ్లు వేశాము. వర్షం పడితే నీళ్లు రాకుంటే.. నిప్పు వస్తదా..?. అభివృద్ధిని చూపించే దమ్ము, ధైర్యం మాకున్నాయి. మాకు నిజాయితీ ఉంది. చూసే వాళ్లకు కూడా నిజాయితీ ఉండాలి' అని మంత్రి తలసాని వివరించారు. (బస్తీమే.. సవాల్!) తలసాని వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి స్పందిస్తూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తాం అన్నారు. జీహెచ్ఎంసీలో కట్టిన ఇళ్లను మాత్రమే చూపించాలి. అలా కాకుండా గ్రేటర్ బయట కటట్టిన ఇళ్లను చూపిస్తే ఎలా అంటూ' భట్టి ప్రశ్నించారు.