foundation stone
-
ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో అధునాతన టెక్నాలజీతో రూ.3,225 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాను న్న నాలుగు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.వీటికి అవసరమ య్యే లిథియం అయాన్ గిగా బ్యాటరీలను తయా రు చేసే అమరరాజా కంపెనీకి దివిటిపల్లిలో మహి ళా దినోత్సవం రోజే శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈసారి కేంద్ర బ డ్జెట్లో తెలంగాణకు రైల్వేశాఖ పరంగా రూ.5,337 కోట్లు కేటాయించామని, గత పదేళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అని తెలిపారు. అలాగే గత 11 సంవత్సరాల్లో మహిళలకు 10 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, 14 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, 54 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని వివరించారు.ఇక్కడి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివిటిపల్లి రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆయన అశ్వినీవైష్ణవ్ను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇవే.. రూ.1,900 కోట్లతో నిర్మించే అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1 మూడో దశ యూనిట్, రూ.800 కోట్లతో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందించే (అల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్) ఫ్యాక్టరీ, రూ.502 కోట్లతో చేపట్టే వ్యర్థాల ప్రాసెసింగ్ (లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ, రూ.23 కోట్లతో తలపెట్టిన ప్రత్యేక క్యాన్, క్యాప్లను తయారు చేసే (సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమలు ఉన్నాయి. -
అంతా బాబు షో!.. పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కొత్తగా భారీ ప్రాజెక్టులు ఇస్తున్నట్టు కేంద్రంలోని బీజేపీ ప్రకటిస్తుంటే.. అదంతా సీఎం చంద్రబాబు చలవే అని టీడీపీ, దాని తోక పార్టీలతో పాటు ఎల్లో మీడియా బాకాలూదుతోంది. వాస్తవం మాత్రం.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న రాష్ట్రంలో శంకుస్థాపన చేయనున్న మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే. గత ప్రభుత్వ హయాంలో భూమి లీజుపై ఒప్పందం చేసుకుని మరీ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు స్వయంగా ఎన్టీపీసీ గత ఏడాది ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సుమారు ఏడాది తర్వాత ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం హోరెత్తిస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై అనేక రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీపడి మరీ సాధించి 2020లోనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ అధికారికంగా కేంద్రం లెటర్ (31026/62/22)ను 2022లోనే పంపింది. అటువంటి బల్క్ డ్రగ్ పార్క్నకు ఇప్పుడు కొత్తగా ప్రధాని చేత శంకుస్థాపన చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. రైల్వేల్లో కొత్త లైన్ల ఏర్పాటు, రైల్వే జోన్కు భూ కేటాయింపు ఇలా ఒకటేమిటి.. ప్రధాని నేడు శంకుస్థాపన చేయబోయే మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినవే కావడం గమనార్హం.మెజార్టీ ప్రాజెక్టులదీ అదే తీరు » కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదానో, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విధంగా చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అయితే ఏడాది, రెండేళ్ల క్రితం ప్రకటించి.. భూ కేటాయింపులు, లీజు ఒప్పందాలు కూడా ముగిసిన పాత ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసేందుకు సిద్ధమవుతుంటే మహా ప్రసాదం ప్రభో అంటూ కీర్తించుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. » వాస్తవానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును పూడిమడకలో ఏర్పాటు చేయనున్నట్టు.. ఇందుకు ఏపీఐఐసీతో 1,200 ఎకరాల భూ లీజు ఒప్పందంపై 2024 ఫిబ్రవరి 20న అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎన్జీఈఎల్) సంతకం చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా రూ.1.85 లక్షల కోట్ల ఈ ప్రాజెక్టును తామే సాధించామన్నట్టుగా చంద్రబాబు గొప్పలకు పోతున్నారు. నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కు కోసం ప్రత్యేకంగా 2020లో ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ను గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. » రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ను కేటాయిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు ఈ పార్కులో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్(సీఐఎఫ్)ను ఏర్పాటు చేయాలంటూ 2022 నవంబర్ 7న కేంద్ర ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ శాఖ అండర్ సెక్రటరీ అధికారికంగా లేఖ (31026/62/2022) పంపారు. మొత్తం రూ.1,876 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొదటి విడత కింద రూ.223 కోట్లను మార్చి 2023లో విడుదల చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే.. ఇప్పుడు కొత్తగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్కు ప్రధాని చేత శంకుస్థాపన చేయించేందుకు సిద్ధమైంది. » రైల్వే జోన్కు ముడసర్లోవలో అవసరమైన భూమిని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే.. అసలు భూమి కేటాయించలేదని, అక్కడ భూమి నిర్మాణాలకు అనువైనది కాదంటూ తప్పుడు ఆరోపణలు చేసి.. ఇప్పుడు అదే ప్రాంతంలో రైల్వే జోన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయిస్తున్నారు.» ఇవేకాకుండా.. దువ్వాడ–సింహాచలం, విశాఖపట్నం–గోపాలపట్నం మధ్య 3, 4 రైల్వే లైన్ల నిర్మాణ పనులకు కూడా గతంలోనే అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా కొంత మేర ప్రారంభమయ్యాయి. ఇప్పుడు వీటిని కూడా కొత్తగా చేపడుతున్నట్టు జాబితాలో చేర్చారు. కృష్ణపట్నం వద్ద క్రిస్ సిటీ ఏర్పాటు, గుత్తి–పెండేకల్లు డబ్లింగ్ పనులు.. ఇలా ఒకటేమిటి మెజార్టీ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే కావడం గమనార్హం. -
అంబేడ్కర్ కృషిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు
ఖజురహో: దేశంలో జల వనరుల అభివృద్ధికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చేసిన కృషిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. 21వ శతాబ్దంలో తగనన్ని జల వనరులతోపాటు వాటి నిర్వహణలో మెరుగ్గా ఉన్న దేశాలే ప్రగతి పథంలో ముందుకు సాగుతాయని స్పష్టంచేశారు. 21వ శతాబ్దంలో నీటి సంరక్షణే అతిపెద్ద సవాలు అని తేలి్చచెప్పారు. బుధవారం మధ్యప్రదేశ్లో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఖజురహోలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. మన దేశంలో జల వనరుల బలోపేతానికి, నిర్వహణకు, డ్యామ్ల నిర్మాణానికి అంబేడ్కర్ దార్శనికత, దూరదృష్టి ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఏర్పాటు వెనుక అంబేడ్కర్ కృషి ఉందన్నారు. అతిపెద్ద నదీ లోయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. జల సంరక్షకుడు అంబేడ్కర్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. జల సంరక్షణ ప్రాధాన్యతను సైతం పక్కనపెట్టాయని విమర్శించారు. ఈ సందర్భంగా దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి సందర్భంగా ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణాన్ని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,153 అటల్ గ్రామ్ సేవా సదనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.437 కోట్లతో ఈ సదనాలు నిర్మిస్తారు. నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రాజెక్టులు ఆలస్యం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. నదుల అనుసంధానంలో భాగంగా దౌధన్ సాగునీటి ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కెన్–బెత్వా నదుల నీటిని నింపిన రెండు కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు. రెండు నదుల అనుసంధాన ప్రాజెక్టు నమూనా(మోడల్)లో మోదీ ఈ నీటిని ధారగా పోశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని లాంఛనంగా ఆరంభించారు. కెన్–బెత్వా నదుల అనుసంధానంతో బుందేల్ఖండ్ ప్రాంతంలో సౌభాగ్యం, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మోదీ ఉద్ఘాటించారు. రూ.44,605 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్లో 44 లక్షల మందికి, ఉత్తరప్రదేశ్లో 21 లక్షల మందికి తాగునీరు లభించనుంది. 2,000 గ్రామాల్లో 7.18 లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అలాగే 103 మెగావాట్ల హైడ్రోపవర్, 27 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతుంది. -
‘పోలీసు స్కూల్’కు శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మంత్రి శ్రీధర్బాబుతో కలసి ఈ ‘పోలీస్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయానికి దీనితో తెరతీసినట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ‘‘యూనిఫాం సర్వీసులవారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు శంకుస్థాపన చేశాం.ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసులను వారి పార్టీ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే.. మా ప్రభుత్వం మాత్రం పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తోంది..’’ అని ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని.. కులమతాలకు అతీతంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాగా.. పోలీసు కుటుంబ సభ్యులకు స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఇవి కేంద్రీయ విద్యాలయాలకు దీటుగా విద్యను అందిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల్లో మాదిరిగా.. పోలీస్ స్కూళ్లలోనూ ఇతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.యూనిఫాం సర్వీసుల సిబ్బంది అందరికీ..పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోపాటు ఇతర యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ సిబ్బంది పిల్లలకు విద్య అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
న్యాయం మరింత బలోపేతం: చంద్రచూడ్
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు. సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు. -
15న నేవీ రాడార్ స్టేషన్కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డిని.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ అధికారులు ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో గురువారం ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు.సీఎంతో పాటు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖకు కూడా వారు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ మేరకు మంత్రిని ఆమె నివాసంలో వారు కలుసుకున్న సందర్భంగా.. సురేఖ మాట్లాడుతూ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. దేశంలోనే రెండో రాడార్ స్టేషన్ కేంద్రంగా తెలంగాణకు మంచి గుర్తింపు లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. -
11న సమీకృత గురుకులాలకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టు’కు ఈనెల 11వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దసరా పండుగకు ముందురోజున రాష్ట్రవ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకుల పాఠశా లల నిర్మాణ పనులకు భూమిపూజ జరుగుతుందని తెలిపారు. ఏడాదిలో వాటి నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాల ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదివారం సచివా లయంలో సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పనులపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్తో కలిసి భట్టి మీడి యాతో మాట్లాడారు.‘‘సమీకృత గురుకుల విద్యాసంస్థల నిర్మాణాల కోసం 2024–25 బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావాల్సిన నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు.ప్రస్తుతం రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవు. 1,023 గురుకుల స్కూళ్లు ఉంటే అందులో 662 స్కూళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పక్కా భవనం లేనప్పుడు బోధన, అభ్యసన కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడుగు, బలహీనవర్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు.తొలుత 19 నియోజకవర్గాల్లో..ఇప్పటివరకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమి, ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయని భట్టి తెలిపారు. అందులో ఈ నెల 11న 19 చోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని.. మిగతా నియోజ కవర్గాల్లో పూర్తిస్థాయి సమాచారం అధారంగా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మా ణాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించా లని నిర్ణయించామని.. విద్యార్థులకే కాకుండా బోధన, బోధనేతర సిబ్బందికి అక్కడే క్వార్టర్స్ ఉంటాయని చెప్పారు. ఈ పాఠశా లల్లో చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి కూడా విద్యార్థులకు అందిస్తామన్నారు.ఒకరోజు ముందే దసరా పండుగ: మంత్రి వెంకట్రెడ్డిరాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 19 సమీకృత గురుకుల పాఠశాలల పనుల కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. గురుకుల పిల్లలకు ఒకరోజు ముందే దసరా పండుగ వచ్చినట్టేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న గురుకులాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మంచి భవిష్యత్తు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు.అన్ని నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలు: మంత్రి పొన్నంరాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేశామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో కొత్త నియామకాలు పూర్తి చేశామని.. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతులు చేపట్టామని చెప్పారు.11న శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకులాలు ఇవే..కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి. -
మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘ అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలుసు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను. హైదరాబాద్లో కాగ్నిజెంట్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. హైదరాబాద్లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది’’ అని అన్నారు. -
స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, దామోదర నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో యువతకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ స్కిల్ యూనివర్శిటీ అన్నారు. ఈ ఏడాదిలో ఈ నగరం రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
నేడు కల్కిధామ్కు ప్రధాని మోదీ శంకుస్థాపన
ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్లో నిర్మితం కానున్న కల్కి ధామ్కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్ పీఠాధీశ్వరులు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. 10:30 గంటలకు కల్కి ధామ్కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. కల్కి ఆలయ నమూనాను కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ప్రమోద్ కృష్ణం తెలిపారు. కల్కిధామ్ వేడుకలకు ప్రధాని హాజరు కానున్నారని తెలియగానే ఆచార్య ప్రమోద్ కృష్ణంను కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. కాంగ్రెస్ సభ్యుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం ఫిబ్రవరి ఒకటిన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి కల్కిధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై ప్రధాని సానుకూల వైఖరి ప్రదర్శించారు. ఈ నేపధ్యంలోనే ప్రమోద్ కృష్ణంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖలో తెలియజేసింది. -
ఏ అవగాహనా లేదు!
గువాహటి: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్ ఈశాన్య పర్యాటకానికి గేట్వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు. పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు. ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. ‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్ లేన్ హైవేలు, మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి. విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్.ఎన్.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. ‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు. ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
అభివృద్ధి నినాదమే సమర నాదం
బులంద్షెహర్/రేవారీ: ఉత్తరప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ లేదు లేదంటూనే ఎన్నికల ఊసెత్తి పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షెహర్ జిల్లాలో రూ.19,100 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం యావత్తూ ప్రచారధోరణిలోనే కొనసాగింది. ‘‘ నేను ప్రత్యేకంగా ఎన్నికల సమర నినాదం ఇవ్వాల్సిన పని లేదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. మోదీ గ్యారెంటీల బండి ప్రతి ఒక్క లబి్ధదారుని చెంతకొస్తుంది. ప్రభుత్వ పథకాలు చిట్టచివరి లబ్ధిదారునికి చేరిన నాడు సమాజంలో వివక్ష, అవినీతి అనేవే ఉండవు. అదే అసలైన లౌకికవాదం. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాకారమైనట్లు లెక్క. మీరే నా కుటుంబం. మీ కలలే నాకు సంకల్పాలు. మీలాంటి సాధారణ కుటుంబాలు ఆర్థికాభివృద్దితో సాధికారత సాధించినప్పుడే నా ‘ఆస్తి’ మరింత పెరిగినట్లు సంతోషిస్తా. మా ప్రభుత్వం ఏం చెబుతోందో దానిని చేసి చూపిస్తుంది. మీరు సంతృప్తి చెందే గ్యారెంటీ నాది. 100 శాతం లబి్ధదారులకు పథకాలు చేరేలా నేను కృషిచేస్తా’’ అని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్పై విమర్శలు ‘‘ చాన్నాళ్ల క్రితం ఒకరు గరీభీ హఠావో అని గట్టిగానే నినదించారు. కానీ సామాజిక న్యాయం కలగానే మిగిలిపోయింది. కొందరు మాత్రమే సంపన్నులై, వారి రాజకీయాలు మాత్రమే నడవడం పేదలు కళ్లారా చూశారు’’ అని కాంగ్రెస్ను విమర్శించారు. ‘‘ ఈ రోజు కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారానికి నేను శ్రీకారం చుడుతున్నానని మీడియాలో ప్రచారం జరిగింది. నేను ఆ పని అస్సలు చేయను. నాకు అవసరం లేదు కూడా. బీజేపీకి భవిష్యత్తులో కూడా ఆ అవసరం పడదు. ప్రజలే నా కోసం ఆ పని చేస్తారు. ప్రజలే నా కోసం ఎన్నికల సమర శంఖం పూరిస్తున్నపుడు నేను ప్రత్యేకంగా ప్రచారానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నా సమయమంతా ప్రజాసేవకే కేటాయిస్తాను. అభివృద్ది నినాదం మాత్రమే నేను ఇస్తా. దానినిప్రజలే ఎన్నికల సమర నినాదంగా దేశవ్యాప్తంగా మార్మోగిస్తారు’ అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ అన్నారు. కుటుంబ పారీ్టలను ఓడించండి మరోవైపు, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా యువ ఓటర్లతో మాట్లాడారు. ‘‘ లోక్సభ ఎన్నికల్లో కుటుంబ పారీ్టలను ఓడించండి. భారత దేశ దశ, దిశలను నిర్ణయించే సత్తా యువ ఓటర్లకు ఉంది. పది, పన్నెండేళ్ల క్రితం నాటి ప్రభుత్వాల పాలనలో నాటి యువత అంధకారంలో మగ్గిపోయింది. మేమొచ్చాక దేశాన్ని అంధకారం నుంచి బయటికి తెచ్చాం. ఇప్పుడు యువతరానికి అవకాశాలు మెరుగయ్యాయి. బీజేపీ మేనిఫెస్టోకు మీరూ సలహాలు, సూచనలను నమో యాప్ ద్వారా పంపండి. మీ చక్కని ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు బీజేపీ ప్రయతి్నస్తుంది’’ అని యువ ఓటర్లకు మోదీ సూచించారు. -
భారత్లోనే పెళ్లాడండి: మోదీ
అహ్మదాబాద్: సంపన్న కుటుంబాలు విదేశాల్లో పెళ్లాడుతున్న ఉదంతాలను ఉటంకిస్తూ భారత్లోనే పెళ్లాడండి (వెడ్ ఇన్ ఇండియా) అని ప్రధాని మోదీ మరోమారు పిలుపునిచ్చారు. గుజరాత్లోని ఆమ్రేలీ సిటీలో నిర్మించనున్న ఖోదల్ధామ్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నాక ఆ హాస్పిటల్ను నిర్వహించే ట్రస్ట్కు చెందిన లేవా పటిదార్ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ భారతీయులు విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సబబేనా?. సొంత దేశంలో వివాహ కార్యక్రమాలు చేసుకోలేమా? విదేశాల్లో కోట్లు ఖర్చు పెట్టి ఆడంబరంగా చేసే పెళ్లితో కోట్లాది రూపాయల భారతీయ సంపద విదేశాలకు తరలిపోతోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ ఇక్కడి నుంచి విదేశాలకు పెళ్లి కోసమే ప్రత్యేకంగా వెళ్లి వచ్చే పెడధోరణి రోగం మీ పటిదార్ వర్గానికి అంటకుండా జాగ్రత్తపడండి. ఇక్కడి దేవత ‘మా ఖోదల్’ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చుకదా. ‘మేడ్ ఇన్ ఇండియా’ తరహాలో ‘వెడ్ ఇన్ ఇండియా’ను పాటిద్దాం’’ అని కోరారు. ‘‘ పర్యాటనకు వెళ్లాలనుకుంటే ముందుగా స్వదేశంలోనే పర్యటించండి. దేశవ్యాప్తంగా సుందర, రమణీయ, దర్శనీయ స్థలాలను పర్యటించండి. పర్యాటక రంగాన్నీ ప్రోత్సహించండి’’ అని అన్నారు. దక్షిణాది ఆధ్యాతి్మక పర్యటన పూర్తి ధనుషో్కటి కోదండరామాలయ సందర్శన రామేశ్వరం(తమిళనాడు): గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం అక్కడి శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీలంకకు కూతవేటు దూరంలో ఉండే ధనుషో్కటి, అరిచల్ మునాయ్ల సమీపంలోనే ఈ ఆలయం ఉంది. ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సమీపంలోని అరిచల్ మునాయ్కు వెళ్లి అక్కడి జాతీయ చిహ్నం ఉన్న స్తంభం వద్ద నమస్కరించారు. అక్కడి సముద్రతీరంలో మోదీ కొద్దిసేపు ప్రాణాయామం చేశారు. సముద్ర జలాన్ని చేతులోకి తీసుకుని ప్రార్థనలు చేశారు. రామసేతుకు ప్రారంభ స్థానంగా పేర్కొనే అరిచల్మునాయ్ ప్రాంతం వద్దే మోదీ కొద్దిసేపు గడిపారు. బంగళాఖాతం, హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ సముద్రజలాలు కలిసే చోటునే తమిళంలో అరిచల్ మునాయ్ అంటారు. ఇక్కడి రామసేతుకు ఆడమ్స్ బ్రిడ్జ్ అని మరో పేరు కూడా ఉంది. అయోధ్యలో భవ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కోసం కఠిన దీక్ష చేస్తున్న ప్రధాని గత కొద్దిరోజులుగా రామాయణంతో ముడిపడి ఉన్న ఆలయాలు, ఆధ్యాతి్మక ప్రాంతాలను దర్శిస్తున్న విషయం తెల్సిందే. ఆదివారంతో దక్షిణ భారత పర్యటనను పూర్తిచేశారు. అరిచల్మునాయ్ నుంచి తమిళనాడుకు చెందిన పవిత్ర నదీజలాలతో నిండిన కలశాలను వెంట తీసుకుని మోదీ ఢిల్లీ చేరుకున్నారు. -
సుస్థిర ప్రభుత్వం వల్లే దేశ ప్రగతి, ప్రపంచ కితాబు: మోదీ
మెహసానా: దేశమంతటా ప్రస్తుతం కనిపిస్తున్న శరవేగమైన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసలకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం గుజరాత్లోని మెహసానా జిల్లా ఖెరాలు వద్ద రూ.5,950 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఓపెన్ టాప్కార్లో రోడ్ షో చేశారు. తర్వాత మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నెన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవచ్చో, ఎంతటి ప్రగతి సాధించవచ్చో చెప్పేందుకు గుజరాతే ఉదాహరణ అన్నారు. ‘‘మీ నరేంద్ర బాయ్ ఎలాంటివారో మీకు బాగా తెలుసు. మీరు నన్ను ప్రధానిగా కాకుండా మీ సొంత నరేంద్ర బాయ్గా చూస్తారు. నేనేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరతానని కూడా మీకు తెలుసు’’ అన్నారు. -
భారత్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
జోధ్పూర్: భారతదేశం గళాన్ని నేడు ప్రపంచ దేశాలు వింటున్నాయని, ఇది చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించే క్రమంలో భారత్ను వ్యతిరేకించడం ప్రారంభించిందని విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్లో మోదీ గురువారం పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోధ్పూర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కాంగ్రెస్ పారీ్టకి రైతుల పట్ల గానీ, సైనికుల పట్ల గానీ ఏమాత్రం శ్రద్ధ లేదని మోదీ ఆరోపించారు. ఆ పారీ్టకి అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. సొంత ఓటు బ్యాంకును ప్రేమించడం తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని కాంగ్రెస్పై మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని, ప్రపంచ దేశాల్లో మన ప్రభావం విస్తరిస్తోందని, విదేశాల్లో మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదంతా నచ్చడం లేదని అన్నారు. భారత్ త్వరలో ప్రపచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో తెలిసిందేనని పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచి్చన తర్వాత దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ‘ద వ్యాక్సిన్ వార్’పై మోదీ ప్రశంసలు బాలీవుడ్ చలనచిత్రం ‘ద వ్యాక్సిన్ వార్’పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని అన్నారు. వివేక్ అగి్నహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమా సెపె్టంబర్ 28న విడుదలైంది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి మన సైంటిస్టులు అహోరాత్రులు శ్రమించారని, వారి శ్రమను ఈ చిత్రంలో చక్కగా చూపించారని మోదీ కొనియాడారు. మన సైంటిస్టుల అంకితభావాన్ని తెరకెక్కించిన చిత్ర దర్శకుడు, నిర్మాతలను ప్రశంసించారు. -
అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్
మలక్పేట: బీఆర్ఎస్ స్టీరింగ్ సీఎం కేసీఆర్ చేతిలోనే ఉందని, ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలోనే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల్లో ఏమీ లేదని, అదానీ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. మలక్పేట ప్రభుత్వ క్వార్టర్స్లో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మలక్పేటలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్ను నిర్మించనున్నామని, దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తులతో 15లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. ఒకప్పుడు మలక్పేట అంటే టీవీ టవర్ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్ మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, వరుసగా రెండేళ్లపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోందని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం, హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారని.. హైదరాబాద్కే ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి అద్దం పట్టారని పేర్కొన్నారు. కాగా.. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీ అసదుద్దీన్ చెప్పారు. -
దుర్గ గుడి, శ్రీశైలంలో అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం శంకుస్థాపన
విజయవాడ దుర్గ గుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం దాదాపు రూ.225 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. శ్రీశైలం ఆలయం వద్ద మరో రూ.175 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దుర్గ గుడి వద్ద ప్రసాదం పోటు, అన్నదానం భవనం, శివాలయం నిర్మాణ పనులు, రాక్ మిటిగేషన్ (కొండ చరియలు విరిగిపడకుండా), ఆటోమేషన్ పార్కింగ్ వసతి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడున్న ఘాట్ రోడ్డు వాస్తుపరంగా అంత శుభప్రదం కాదని వాస్తు పండితులు పేర్కొంటున్నందున రాజగోపురం నుంచి భక్తులు వచ్చి వెళ్లేలా దుర్గానగర్లో ఎలివేటెడ్ క్యూలైన్ (ప్లై ఓవర్), క్యూ కాంపెక్స్ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆలయాల పక్కన రెండు అంతస్తులతో పూజా మండపాలు కడుతున్నామన్నారు. ఇక శ్రీశైలం ఆలయం వద్ద రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణంతో పాటు ఇటీవల అటవీ శాఖ నుంచి ఆలయం స్వాదీనంలోకి వచ్చిన 4,600 ఎకరాలకు ఫెన్సింగ్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబరు నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. -
Fact Check: అది బాబు వదిలేసిన పార్కే..
సాక్షి, అమరావతి: మెగా సీడ్ పార్క్ అంటూ చంద్రబాబునాయుడు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర అధికారంలో ఉన్నా ప్రాజెక్టుకు పైసా కూడా విదల్చలేదు. ఆయన వేసిన వేల శంకుస్థాపన శిలాఫలకాల్లో ఇదీ ఒకటిగా మిగిలిపోయింది. అయినా ఏనాడూ నోరుమెదపని రామోజీరావు ఈ పార్కును జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విషప్రచారానికి ఒడిగట్టారు. ఓ అబద్ధాల కథనాన్ని ఈనాడు అచ్చేసింది. విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్న చేయి పట్టుకొని నడిపిస్తున్న ప్రభుత్వంపై బురదజల్లుతూ ఈ కథనం వండివార్చింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. సాధారణంగా పంటల సాగు కోసం బ్రీడర్ సీడ్ నుంచి ఉత్పత్తి చేసిన ఫౌండేషన్ సీడ్ను రైతులకు ఇచ్చి వారి ద్వారా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా విత్తనోత్పత్తి చేస్తుంటారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తికి రాష్ట్రంలో తొమ్మిది సీడ్ ఫామ్స్ ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేస్తారు. ఈ సీడ్ను రైతులకు అందజేసి అవసరమైన విత్తనాన్ని తయారు చేస్తారు. ఏటా 10 లక్షల క్వింటాళ్ల వరి, వేరుశనగ, కందులు, శనగలు, చిరు ధాన్యాల విత్తనాలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇలా ఫౌండేషన్ సీడ్ ఉత్పత్తి చేసే ఫామ్స్లో కర్నూలు జిల్లా తంగడంచ సీడ్ ఫామ్ ఒకటి. 630 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సీడ్ ఫామ్లో స్థానికంగా డిమాండ్ ఉన్న కందులు, శనగల ఫౌండేషన్ సీడ్ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదే ప్రాంగణంలో రూ.670 కోట్లతో మెగా సీడ్ పార్కు నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. పైసా విదల్చకుండానే 2017 అక్టోబర్లో హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ దీనిని పట్టించుకోలేదు. అయితే ఈ తంగడంచలోని సీడ్ పార్కును వివిధ పంటల హైబ్రిడ్ సీడ్ మూల విత్తన ఉత్పత్తి క్షేత్రంగా రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాస్తవాలు ఇలా ఉంటే ఈ పార్కు కోసం 2018లోనే అప్పటి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందంటూ ఓ పెద్ద అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. నిజంగా ని«ధులు కేటాయించి ఉంటే శంకుస్థాపన చేసిన తర్వాత ఏడాదిన్నర పాటు అధికారంలో ఉన్న బాబు ఎందుకు గాలికొదిలేశారో రామోజీకే తెలియాలి. -
కుటుంబ పాలన.. ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. కర్తవ్యపథ్ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ను స్మరిస్తాయని, తాము గుజరాత్లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు. దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్గార్ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఈ నెల 9న జరిగే ‘క్విట్ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు. ‘అమృత్భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
నాంపల్లి, యాదాద్రి రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి షురూ
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: నిజాంకాలం నాటి చారిత్రక నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.309 కోట్ల నిధులతో చేపట్టిన నాంపల్లి రైల్వేస్టేషన్ రీడెవలప్మెంట్కు ప్రధాని లాంఛనంగా పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ అధికారి భరతేశ్కుమార్ పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 12 కొత్త ప్రాజెక్టులకు రైల్వేశాఖ రూ. 8,494 కోట్లు మంజూరుచేసిందని చెప్పారు. త్వరలో రూ.350 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మరో రూ.300 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. రూ.700 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మూడేళ్లలో అధునాతన సికింద్రాబాద్ స్టేషన్ వినియోగంలోకి వస్తుందన్నారు చర్లపల్లి స్టేషన్ అభివృద్ధి, విస్తరణ తుది దశకు చేరుకుందని, 2024లో సేవలు ప్రారంభమవుతాయని కిషన్రెడ్డి చెప్పారు. ఆర్టీసీ విలీనం చేయాల్సిందే కానీ... ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదని కిషన్రెడ్డి వ్యాఖ్యానించా రు. ఆర్టీసీకి ఉన్న రూ.వేల కోట్ల విలువైన స్థలాలను కాజేసేందుకే ఆగమేఘాల మీద విలీనం చేస్తున్నట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. రూ.25.24 కోట్లతో యాదాద్రి స్టేషన్ అభివృద్ధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయిగిరిలోని యాదాద్రి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.25.24 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్ అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని చిత్ర పటానికి భువనగిరి మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పాలాభిషేకం చేశారు. -
575 కోట్ల పెట్టుబడి 1,600 మందికి ఉపాధి
షాబాద్: రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో రూ.575 కోట్ల పెట్టుబడితో జపాన్కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీ ఏర్పాటుకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యో గ యువతకు కంపెనీల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కంపెనీల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకోవడం జరిగిందని, వారి అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోపెట్టుబడులు అభినందనీయం ‘తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. నిజానికి అక్కడ సహజ వనరులు తక్కువ. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలబడింది. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తి, నాణ్యత అంశంలో అందరికంటే ముందుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో తమ సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జపాన్ వస్తువు ఉంటుంది. అలాంటి దేశానికి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు రంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టడం అభినందనీయం..’ అని కేటీఆర్ చెప్పారు. మరిన్ని పెట్టుబడులకు సహకరించండి ‘స్థానిక నాయకులు, ప్రజల చొరవతో ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. టెక్స్టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెళ్లి ఎదుగుతుంది..’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరించాల్సిందిగా జపాన్ కాన్సులేట్ను కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు. జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9న ఒబెరాయ్ హోటల్స్కు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అన్నవరం సముద్ర తీర ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల విస్తీర్ణంలో ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్–2023)లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒబెరాయ్ గ్రూప్ చేసుకున్న ఎంవోయూ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. వర్చువల్ విధానంలో సీఎం వైఎస్ జగన్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో అన్నవరంలో ఏర్పాట్లుపై కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సమీక్షించారు. టూరిజం రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి అన్నవరంలో ఒబెరాయ్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అన్నవరం వద్ద రూ.350 కోట్లుతో 7స్టార్ లగ్జరీ రిసార్టులను నిర్మించనున్నారు. చదవండి: తొలి సంతకం.. చరిత్రాత్మకం.. రైతులకు ‘పవర్’ -
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాన కార్యక్రమం... డ్రోన్ వీడియో
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం
-
CM Jagan Srikakulam Tour: సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం (ఫొటోలు)
-
ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే: సీఎం జగన్
Updates దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా.. ‘‘మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ కీలక ప్రకటన ►శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామన్నారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం తెలిపారు. ►ఇవాళ నాలుగు మంచి కార్యక్రమాలు జరుపుకున్నాం: సీఎం జగన్ ►మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం ►నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేసుకున్నాం ►ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం ►ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయి ►గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారు ►ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుంది ►భవిష్యత్లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబై, మద్రాస్ కాబోతున్నాయి ►24 నెలల్లో పోర్ట్ పూర్తవుతుంది ►పోర్టు నిర్మాణానికి రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నాం ►పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35వేల మందికి ఉపాధి లభిస్తుంది ►పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి ►అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ►మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు ►గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి ►పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ►బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ►రాష్ట్రంలో ఇప్పటివరకు 4 పోర్టులు మాత్రమే ఉండగా.. మనం అధికారంలోకి వచ్చాక మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం తీరప్రాంత అభివృద్ధికి సంబంధించి గతంలో ఇలాంటి అభివృద్ధి ఎందుకు జరగలేదు? ►సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన చరిత్రలో గుర్తుండిపోయేలా.. ►చరిత్రలో గుర్తుండిపోయేలా మూలపేట పోర్టుకు ఈ రోజు శంకుస్ధాపన జరిగిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దాదాపు 30 నెలల్లో పూర్తి చేయనున్న ఈ పోర్టు ద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది స్ధానిక యువతకు ఉపాధి కల్పించబోతున్నారన్నారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులను అనేక ప్రభుత్వాలను చూశాం, ఈ రోజు మన రాష్ట్రానికి సహజసిద్దంగా ఉన్నటువంటి సముద్రతీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలని, తద్వారా ఈ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం 2019లో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేసి దాదాపు రూ. 16 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టు, మరో 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నారు. ఈ ఘట్టం శ్రీకాకుళం చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతుంది.రానున్న కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని మంచి కార్యక్రమాలు సీఎంద్వారా చేస్తామని మంత్రి అన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఇవాళ చరిత్రాత్మక ఘట్టం: ఎమ్మెల్సీ దువ్వాడ ►నవరత్నాల ద్వారా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. రైతులను విత్తనం నుంచి విక్రయం వరుకు ఆదుకుంటున్నారని శ్రీనివాస్ పేర్కొన్నారు. ►మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►సీఎం జగన్ మూలపేటలో పర్యటిస్తున్నారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ►సీఎం వైఎస్ జగన్ మూలపేటకు చేరుకున్నారు. కాసేపట్లో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ►శ్రీకాకుళం జిల్లా మూలపేట పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారు. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని నిర్ణయించారు. ►విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 594 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసానికి ప్రభుత్వం రూ.109 కోట్లు కేటాయించింది. అంతేగాక వీరికోసం నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీని సైతం నిర్మిస్తోంది. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25,000 మందికి ఉపాధి లభించనుంది. ►శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిర మండలం రిజర్వాయర్కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులకు కూడా బుధవారం సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం కాగా, కాకినాడ సెజ్ పోర్టులో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ►వచ్చే నెలలో మచిలీపట్నం (బందరు) పోర్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. పదేళ్లలో ఒక పోర్టు కడితేనే గొప్ప అనుకునే పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగేళ్ల లోపే నాలుగు పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం విశేషం. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట పోర్టుల నిర్మాణం చేపట్టింది. వీటి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా ఖర్చుకే ఎగుమతులు జరగనున్నాయి. -
ఈనెల 19న సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(బుధవారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, శ్రీకాకుళం పర్యటనలో మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఈ కార్యక్రమం జరుగనుంది. -
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి వచ్చే నెల 3న శంకుస్థాపన
-
కడపలో వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి శంకుస్థాపన
-
ఈ అమ్మాయి ఇంగ్లీష్ స్పీచ్కి సీఎం జగన్ ఫిదా
-
చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.986 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మీ' ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఈ ప్రాంతాన్ని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. మన ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నాం. వెనకబడిన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టాం. విద్యాపరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ రాబోతుంది. కొత్త మెడికల్ కాలేజ్ కారణంగా 150 మెడికల్ సీట్లు వస్తాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుంది' అని సీఎం జగన్ చెప్పారు. 'ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటాం. చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం. ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా పాలన చేస్తున్నాం. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం జరుగుతోంది. ఎల్లోమీడియా నిత్యం ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. మంచి చేస్తున్నా.. వారికి చెడే కనిపిస్తుంది. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు. 12:12 PM నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్రాకతో సంక్రాంతి పండగ ముందే వచ్చింది. రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం కాబోతుంది. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులను ప్రారంభించి.. మనకు సంక్రాంతి పండుగను ముందే తీసుకొచ్చారని ఎమ్మెల్యే ఉమాశంకర గణేష్ అన్నారు. 12:01 PM మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన నర్సీపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మించనున్నారు. రూ.470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. 11:47AM ►సభాస్థలికి చేరుకున్న సీఎ జగన్ 11:27AM ►రోడ్డు షోలో భారీ ఎత్తున పాల్గొన్న ప్రజలు ►రోడ్డుకు ఇరువైపులా నిలుచుని సీఎం జగన్కి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు ►ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తున్న సీఎం జగన్ 11:17AM అనకాపల్లి: ►విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బలిఘట్టం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు.. ఎమ్మెల్యేలు పెట్ల ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ధర్మశ్రీ అవంతి శ్రీనివాస్, కన్నబాబురాజు, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, పాల్గుణ, సీతం రాజు సుధాకర్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీ.. దాడి వీరభద్రరావు, చింతకాయల జమీల్ ►బలిఘట్టం నుంచి జోగినాథపాలెం వరకు ర్యాలీగా బయలుదేరిన సీఎం.. ►మరికాసేపట్లో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం.. 10:56AM ►గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నర్సీపట్నం బయల్దేరారు. 09:23AM తాడేపల్లి: నర్సీపట్నం బయలుదేరిన సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు లిఫ్టు ఇరిగేషన్ కెనాల్స్ అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం ►అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. టికెట్ కొని మెట్రో జర్నీ
ముంబై: దేశంలో మరో వందే భారత్ రైలు కూత పెట్టింది. జెండా ఊపి రైలును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ల మధ్య సేవలందించనుంది ఈ ట్రైన్. నాగ్పూర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న మోదీ.. ఆరో వందే భారత్ రైలుకు పచ్చ జెండా ఊపారు. ఈ సందర్భంగా రైల్వే సిబ్బంది, ప్రయాణికులతో ముచ్చటించారు మోదీ. దేశంలో సేవలు ప్రారంభించిన ఆరో వందే భారత్ రైలు ఇది. సాధారణ ప్రయాణికుడిలా మోదీ.. నాగ్పూర్లో రూ.8650 కోట్లతో నిర్మించిన మెట్రో ఫేస్ 1ని ప్రారంభించారు ప్రధాని. అనంతరం ఒక సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి.. ఫ్రీడం పార్క్ నుంచి ఖప్రీ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. విద్యార్థులతో పాటు జర్నీ చేస్తూ వారితో ముచ్చటించారు. అనంతరం రూ.6700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మెట్రో ఫేస్ 2కు శంకుస్థాపన చేశారు. ఆదివారం ఉదయం నాగ్పూర్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు స్వాగతం పలికారు. నాగ్పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం, నాగ్పూర్, అజని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. Maharashtra | Prime Minister Narendra Modi flags off the Vande Bharat Express train between Nagpur and Bilaspur, at Nagpur railway station. CM Eknath Shinde also present pic.twitter.com/7457ZaZQOG — ANI (@ANI) December 11, 2022 ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
-
సీఎం జగన్ రెండు రోజుల కడప పర్యటన.. షెడ్యూల్, పూర్తి వివరాలు..
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 2, 3 తేదీల్లో (శుక్ర, శని) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితర అధికారులు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఇడుపులపాయలో 2వ తేదీ రాత్రి బస చేయనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లింగాల మండలంలోని పార్నపల్లెలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్ద సీఎం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుండటంతో అక్కడ కూడా పటిష్ట పోలీసు బందోబస్తు నియమించారు. నేటి పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడి నుంచి బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. 12.00 నుంచి 12.30 గంటల వరకు బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్కు చేరుకుని 12.40 నుంచి 1.00 గంట మధ్యలో వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు లింగాల మండల నాయకులతో మాట్లాడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్హౌస్కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. రేపటి పర్యటన: శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ఎస్టేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 9.15 నుంచి 9.30 గంటల మధ్య కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్కు చేరుకుని సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు పోలీసుల రిహార్సల్స్ లింగాల: లింగాల మండలం పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో సీఎం పర్యటించే ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్తో రిహార్సల్స్ నిర్వహించారు. అలాగే ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేర్ణా, నీటిపారుదల శాఖ ఈఈ రాజశేఖర్, పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, డ్వామా పీడీ యదుభూషణ్రెడ్డి, తహసీల్దార్ శేషారెడ్డి, ఎంపీడీఓ సురేంద్రనాథ్, పీఆర్ ఏఈ మనోహర్రెడ్డి, మత్ప్యశాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీబీఆర్పై భారీ పోలీసు బందోబస్తు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా సీబీఆర్పై భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50మంది ఎస్ఐలతోపాటు 1500 మంది పోలీసు బలగాలు సీబీఆర్కు చేరుకున్నాయని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
యాంకరేజి పోర్టులో మంత్రి అమర్నాథ్ శంకుస్థాపనలు
సాక్షి, కాకినాడ: కార్గో ఎగుమతుల వార్షిక సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నులకు పెంచేందుకు సాగరమాల కార్యక్రమం కింద రూ.91 కోట్లతో మంజూరు చేసిన కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీ గీత, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పోర్టులో రెండు మెకానికల్ కార్గో హ్యాండ్లింగ్ వార్ఫులు, న్యూ పోర్టు ఏరియాలో 5 అదనపు లోడింగ్ పాయింట్ల నిర్మాణం, పోర్టు అనుబంధ, అంతర్గత రహదారుల అభివృద్ధి, కమర్షియల్ కెనాల్ గ్రోయిన్లు, రివిట్మెంట్ల మరమ్మతులు, కమర్షియల్, అప్రోచ్ కెనాల్ డ్రెడ్జింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు చేసేందుకు హైదరాబాద్ఉ చెందిన విశ్వసముద్ర హోల్డింగ్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏడాది కాలంలో ఈ పనులు పూర్తి చేయనున్నారు. చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) -
Narasapuram Tour: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Time: 01:16 PM టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం అన్నారు. Time: 12:46 PM నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. Time: 12:42 PM నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు. Time: 12:34 PM గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: మంత్రి అప్పలరాజు మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి అన్నారు. Time: 12:25 PM దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం: ప్రసాదరాజు మత్స్యకారులకు అండగా నిలిచిన సీఎం జగన్కు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రాకతో నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ప్రసాదరాజు అన్నారు. Time: 12:13 PM పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. Time: 12:05 PM పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. Time: 11:59 AM మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. 23 వేల మంది మత్స్యకారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు. Time: 11:05 AM సీఎం వైఎస్ జగన్ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. Time: 10:35 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవీ ప్రారంభోత్సవాలు ♦నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ♦నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ♦రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్స్టేషన్ పునరుద్ధరణ పనులు. ♦రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ♦రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్స్టేషన్ నిర్మాణ పనులు. ♦నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ♦రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ♦రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ♦రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ♦రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్ఫాల్ నాలుగు స్లూయీస్ల పునః నిర్మాణం. సీఎం జగన్ పర్యటన ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి యలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బయో ఇథనాల్ ప్లాంట్కు సీఎం జగన్ శంకుస్థాపన (ఫొటోలు)
-
రంగుమారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది: సీఎం జగన్
-
గుమ్మళ్లదొడ్డిలో బయో ఇథనాల్ ప్లాంట్కు సీఎం జగన్ శంకుస్థాపన
-
పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, ఆశీష్.. మంత్రులు గుడివాడ అమర్ నాధ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్ , అనురాధ,వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 'దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంతానికి మంచి చేసే ప్లాంట్ రాబోతోంది. రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్ను ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. పరిశ్రముల నెలకొల్పేందుకు ఏపీ మంచి వాతావరణం ఉంది. కేవలం ఆరు నెలల కాలంలోనే అనుమతులు మంజూరు చేసి.. ఈ రోజు భూమి పూజ కూడా చేశాం. 2లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ రాబోతుంది. ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్రోకెన్ రైస్తో ప్లాంట్లో ఇథనాల్ తయారీ చేస్తారు. ప్లాంట్తో పాటు బైప్రోడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుంది. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది' అని సీఎం జగన్ అన్నారు. కాగా, రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గుమ్మళ్లదొడ్డిలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.35కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ బయలుదేరి 10.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.40 గంటలకు అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 10.45 నుంచి 11.40 గంటల వరకు శంకుస్థాపన, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభా వేదిక నుంచి 11.45 బయలుదేరి రోడ్డు మార్గంలో 11.50 గుమ్మళ్లదొడ్డి హెలిప్యాడ్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. చదవండి: (టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్) -
CM YS Jagan: పోర్టులతో విస్తృత ఉపాధి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. అటు వైపు చెన్నై, ఇటు వైపు విశాఖపట్నం, మరో వైపు ముంబై, కోల్కతా.. ఇలా ఏ నగరమైనా పెద్ద నగరంగా, మహా నగరంగా ఎదిగిందంటే.. అక్కడ పోర్టు ఉండడమే కారణం అని అన్నారు. దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించాలని, పోర్టు రావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని.. తద్వారా ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్నారు. జల రవాణా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎగుమతి, దిగుమతులు వేగవంతం అవుతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి పలు విధాలా మేలు జరగడమే కాకుండా.. ఆయా ప్రాంతాల రూపురేఖలు మారతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ►రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా, అందులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీని ఆధారంగా పోర్టులు కానీ, దీనికి అనుసంధానంగా వచ్చిన పరిశ్రమలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అన్ని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతం వారికి మేలు జరగడంతో పాటు రాష్ట్రానికి కూడా ఊతం వస్తుంది. ►రాష్ట్రంలో కృష్ణపట్నం, కాకినాడలో 3, విశాఖపట్నం, గంగవరం ప్రాంతాల్లో పోర్టులు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం పోర్టు 70 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటే, మిగిలిన పోర్టుల కెపాసిటీ 158 మిలియన్ టన్నులు. రామాయపట్నం పోర్టు నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కొత్తగా 4 పోర్టులు.. 9 ఫిషింగ్ హార్బర్లు ►స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కేవలం 6 పోర్టులుంటే.. మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం. అంటే ఈ ఐదేళ్లలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం రానున్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్ టన్నుల కెపాసిటీ వస్తుంది. ►ఈ నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు.. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్ప, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నం, జువ్వలదిన్నె నిర్మాణం జరుగుతోంది. పోర్టులకు సంబధించిన నిర్మాణ పనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయి. మరో రెండు నెలల తిరక్కమునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమి పూజ చేసి పనులు వేగవంతం చేస్తాం. లక్ష మంది గంగపుత్రులకు ఉపాధి ►రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, పోర్టు కానీ కనిపించేలా రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. 9 ఫిషింగ్ హార్బర్లు పూర్తయితే.. వీటి ద్వారా లక్ష మంది మత్స్యకార కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గుజరాత్ వంటి ప్రాంతాలకో, మరెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ►కాకినాడ, మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల్లో నేరుగా ఒక్కో దాంట్లో కనీసం 3 – 4 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నాం. నాడు అంతా మోసం.. ►2019 ఏప్రిల్లో ఎన్నికలకు ముందు.. ఫిబ్రవరిలో అప్పటి పాలకుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. డీపీఆర్, భూసేకరణ లేకుండా ప్రజలను మోసం చేయాడానికి ఆ రోజు టెంకాయ కొట్టిపోయారు. ఐదేళ్ల పాటు ఏమీ చేయకుండా, ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన అంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే. ఇంతకన్నా అన్యాయం, మోసం ఎక్కడైనా ఉంటుందా? ►రుణ మాఫీ అంటూ రైతులు, అక్కచెల్లెమ్మలను.. ఉద్యోగాలంటూ చదువుకుంటున్న పిల్లలనూ మోసం చేశారు. ఏకంగా ప్రాంతాలను కూడా మోసం చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ రూ.3,743 కోట్లతో రామాయపట్నం ►రామాయపట్నం పోర్టు కోసం 850 ఎకరాల భూమి సేకరించి, రూ.3,743 కోట్లతో పనులకు ఇవాళ భూమి పూజ చేస్తున్నాం. ఈ పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మరో 6 బెర్తుల నిర్మాణానికి ఇదే ఇన్ఫ్రాస్చ్రక్టర్ సరిపోతుంది. ఒక్కోదానికి రూ.200 కోట్ల పెట్టుబడి పెడితే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. ►ఇప్పుడు నిర్మిస్తున్న 4 బెర్తుల ద్వారా 25 మిలియ¯న్ టన్నుల కార్గో రవాణా చేసే సామర్థ్యం లభిస్తుంది. మరో రూ.1200 కోట్లు పెట్టుబడి పెడితే.. ఏకంగా 50 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయవచ్చు. మన పిల్లలకు మంచి రోజులు ►ఈ ప్రాంతంలో పోర్టు రావడానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, రావూరు, చేవూరు, సాలిపేట గ్రామస్తులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ అడుగులు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. మన పిల్లలందరూ ఎక్కడికెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెదుక్కునే అవకాశం లేకుండా.. మన గ్రామాల నుంచే హోం టు వర్క్ రీతిలో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ►ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడార్ కూడా వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుందని కావలి ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పక్కనే ఉన్న కావలి నియోజకవర్గంలో రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇండస్ట్రియల్ కారిడార్ నెలకొల్పాలని అడిగారు. అది మంచి ఆలోచనే. రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తాం. రామాయపట్నం పోర్టు భూమిపూజ సందర్భంగా ముఖ్యమంత్రి బహిరంగసభకు హాజరైన నిర్వాసితులు, మత్స్యకారులు, ప్రజలు ►మంచి పోర్టు వచ్చి ఇక్కడ పరిస్థితులు మారుతున్నప్పుడు.. కందుకూరు పట్టణం పెద్ద హబ్గా తయారవుతుంది. అందువల్ల బైపాస్ రోడ్డు కోసం 6.2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కోరారు. భూసేకరణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. కందుకూరు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం కూడా సహకరిస్తాం. ►రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణకు సంబంధించి 8,500 ఎకరాలకు నీళ్లందించే పనుల కోసం మరో రూ.27 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఉలవపాడు మండలంలోని కారేడులో పీహెచ్సీకి శాశ్వత భవనం మంజూరు చేస్తున్నాం. ►ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, బీదా మస్తాన్రావు, ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి, డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జెడ్పీ చైర్పర్సన్లు బూచేపల్లి వెంకాయమ్మ, ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్, డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రామాయపట్నం పోర్టు అథారిటీ ఎండీ ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు చరిత్రాత్మకం ఈ రోజు ఒక చరిత్రాత్మక రోజు. 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వినియోగించుకుని రాష్ట్రానికి ఆర్థిక పురోగతి తీసుకురావాలని, మారిటైమ్ బోర్డు ద్వారా రూ.15 వేల కోట్లు ఖర్చు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇదివరకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు నిర్మిస్తున్నారు. తద్వారా పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అయ్యేలా అడుగులు పడుతున్నాయి. అదే చంద్రబాబు హయాంలో హడావుడి తప్ప ఏమీ ఉండదు. నాలుగు ఇటుకలు, ఒక తాపీ మేస్త్రిని తీసుకెళ్లి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేశారు. తర్వాత వాటిని మరిచిపోయారు. ఏ ప్రాజెక్టు అయినా సీఎం జగన్ అన్ని అనుమతులతో ముందుకు వెళతారు. - గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మా కల నెరవేరిందన్నా.. అన్నా.. పోర్టు అనేది మాకందరికీ ఒక కల. ఎప్పటి నుంచో పోర్టు వస్తుందన్నారు కానీ రాలేదు. ఈ రోజు అది సాకారం అవుతోంది. ఇక్కడ 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోర్టుకు మా భూమి ఒక ఎకరా ఇచ్చాం. దానికి రూ.15 లక్షలు ఇచ్చారు. మీకు ఎంతో రుణపడి ఉంటామన్నా. మేమంతా మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్లం. మమ్మల్ని మీరు ఎన్నో పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీరు పది కాలాల పాటు సీఎంగా ఉండాలి. - సుజాత, మెండివారిపాలెం ఈ ప్రాంతంలో పెద్ద పండుగ ఈ రోజు ఈ ప్రాంతానికి పెద్ద పండుగ. పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన మీకు (సీఎం) మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు. మా కష్టం గుర్తించి, మాకు అన్నీ అందేలా చేస్తున్నారు. ఇప్పుడు స్పాట్లోనే డీజిల్ సబ్సిడీ ఇస్తున్నారు. వేట సమయంలో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. ఎన్నో పథకాల ద్వారా అందరినీ ఆదుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు. - ఆవల జయరామ్, ఉలవపాడు -
కల సాకారం దిశగా.. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ (ఫొటోలు)
-
రామాయపట్నం పోర్టుకి సీఎం జగన్ భూమిపూజ
-
40వేల మందికి ఉపాధికల్పనే లక్ష్యంగా నిర్మాణం
-
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోర్టు ఏరియాలో భారీ బందోబస్తు
-
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
విత్తన్నం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే..
-
ప్రకృతి వ్యవసాయం గ్రామ స్థాయి నుంచి శిక్షణ: సీఎం వైఎస్ జగన్
-
Agnipath scheme: దేశ హితానికే నిర్ణయాలు
సాక్షి, బెంగళూరు: కొత్త నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అసమంజసంగా తోచినా, అసంతృప్తికరంగా అనిపించినా అంతిమంగా జాతి నిర్మాణానికే తోడ్పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరులో రూ.33 వేల కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు, కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. అనంతరం కొమ్మఘట్టదల్లిలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సరికొత్త లక్ష్యాలను, సంకల్పాలను సాకారం చేసుకునే దిశగా మనల్ని తీసుకెళ్లగలిగేది కేవలం సంస్కరణల పథం మాత్రమేనని పునరుద్ఘాటించారు. ‘‘దశాబ్దాల తరబడి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటుకు కూడా అవకాశం కల్పించడానికి అదే కారణం. 21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి అవకాశాలను, సంపదను సృష్టించే వారిదే. అందుకే ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం వారిని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. అధికార లాలసులైన వ్యక్తులు తమ భావజాలాన్ని మార్చుకోవాలి. బెంగళూరు సాధించిన ప్రగతి మనకు చెబుతున్న పాఠం కూడా అదే’’ అన్నారు. అగ్నిపథ్ ఆందోళనలపై మోదీ ఇప్పటిదాకా నేరుగా స్పందించలేదు. సదుద్దేశంతో చేసే పనులు కూడా రాజకీయ రంగు పులుముకోవడం దేశ దౌర్భాగ్యమంటూ ఆదివారం కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బెంగళూరులో బిజీబిజీ బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. బెంగళూరు–కొమ్మఘట్టదల్లి సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇదిప్పటికే 40 ఏళ్లు ఆలస్యమైందన్నారు. విద్యుద్దీకరణ చేసిన కొంకణ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) క్యాంపస్లో రూ.280 కోట్లతో నిర్మించిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)ను ప్రారంభించారు. దీనికి శంకుస్థాపన చేసింది కూడా తానే కావడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. బాగ్చీ–పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏ దేశమైనా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. బెంగళూరు కలలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని బెంగళూరు చక్కగా ప్రతిబింబిస్తోంది. లక్షలాది మంది కలల సాకారమే కొన్నేళ్లుగా నగర ప్రగతి రూపంలో ప్రతిఫలిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో ఎన్ని లాభాలుంటాయో, ప్రభుత్వం అతి జోక్యాన్ని తగ్గించి సరైన అవకాశాలు కల్పిస్తే భారత యువత ఎన్ని అద్భుతాలు సాధిస్తుందో చెప్పేందుకు బెంగళూరే నిదర్శనం. భారత యువతకు ఇదో కలల నగరి. పారిశ్రామిక చొరవ, ఇన్నోవేషన్, ప్రభుత్వ–ప్రైవేటు రంగాలను సమపాళ్లలో వినియోగించుకోవడం వంటివి బెంగళూరును ఇలా తీర్చిదిద్దాయి. బెంగళూరు వర్సిటీ ఆవరణలో అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయ(బేస్) క్యాంపస్ను, రూ.4,700 కోట్లతో రూపొందించిన 150 టెక్నాలజీ హబ్లను మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. ఉక్రెయిన్లో బాంబు దాడిలో మరణించిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులను పరామర్శించారు. మైసూరులోనూ పలు శంకుస్థాపనలు చేశారు. త్రివిధ దళాధిపతులతో నేడు విడిగా మోదీ భేటీలు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు. సైన్యం, నావికా దళం, వైమానిక దళాధిపతులు ప్రధాని మోదీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. మొదట నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రధానమంత్రిని కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాకు కుర్తా కుట్టిస్తావా? మైసూరులో కేంద్ర పథకాల లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి తాను 10 పథకాల ద్వారా లబ్ధి పొందానని అంబిక అనే మహిళ చెప్పింది. కుట్టుమిషన్ కూడా తీసుకున్నానడంతో, ‘అయితే నాకు కుర్తా కుట్టిస్తావా?’ అని మోదీ అడిగారు. ‘తప్పకుండా. మంచి కుర్తా కుట్టిస్తా’ననడంతో నవ్వారు. అనంతరం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం మైసూరు ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా ఉత్సవాల్లో మోదీ పాల్గొంటారు. -
ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాపన (ఫొటోలు)
-
సీమసిగలో మెగా పవర్ ప్రాజెక్ట్.. సీఎం జగన్ చేతులమీదుగా శంకుస్థాపన
-
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
వాజ్పేయికి ఆలయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది. -
రూ.36వేల కోట్లతో గంగా ఎక్స్ప్రెస్వే
షాజహాన్పూర్(యూపీ): ఉత్తరప్రదేశ్లోని 12 జిల్లాల మీదుగా సాగే ప్రతిష్టాత్మక ఆరు వరసల గంగా ఎక్స్ప్రెస్వే రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రూ.36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఉత్తరప్రదేశ్ వాయవ్య ప్రాంత జిల్లాల భవిష్యత్ రూపురేఖలు మారిపోతాయన్నారు. షాజహాన్పూర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్ధుడయ్యారని సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. యూపీలో మాఫియా భరతం పట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, యోగి ఎంతో ఉపయోగపడే ముఖ్యమంత్రిగా అవతరించారన్నారు. యూపీకి యోగి తోడైతే రాష్ట్ర ప్రజలకు మరెంతో ఉపయోగకరమంటూ, యూపీ+యోగి= ఉపయోగి (UP+ YOGI = U.P.Y.O.G.I) అనే కొత్త నిర్వచనాన్ని చెప్పి ఆదిత్యనాథ్పై మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. మీరట్, హర్పూర్, బులంద్షహర్, అమ్రోహా, సంభాల్, బదాయూ, షాజహాన్పూర్, హర్దోయీ, ఉన్నవ్, రాయ్బరేలీ, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్.. మొత్తంగా 12 జిల్లాల గుండా 594 కి.మీ.ల పొడవైన ఆరు వరసల రహదారిని నిర్మించనున్నారు. ‘ఈ గంగా ఎక్స్ప్రెస్వే పూర్తయితే ఈ జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటక రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. తద్వారా రైతులు, యువత సహా ప్రతి ఒక్కరికి వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని పశ్చిమప్రాంతంలో దేశీ తుపాకులతో మాఫియా రాజ్యమేలింది. కానీ, యోగి ప్రభుత్వమొచ్చాక గత నాలుగున్నరేళ్ల కాలంలో మాఫియా అక్రమ సామ్రాజ్యాలను బుల్డోజర్తో తొక్కించేశారు. గత ప్రభుత్వాలకు అభివృద్ధి, దేశ వారసత్వం అంటే అస్సలు పట్టదు. వారి ధ్యాస అంతా ఓటు బ్యాంక్పైనే. కొత్త ఎక్స్ప్రెస్వే నెట్వర్క్, నూతన విమానాశ్రయం, కొత్త రైలు మార్గాలతో నవీకరించిన మౌలికసదుపాయాలతో ఆధునిక యూపీ అవతరించబోతోంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ చేసిన యోగ ఉపయోగి వ్యాఖ్యలను ఎస్పీ, బీఎస్పీలు తిప్పికొట్టాయి. ఆయన ‘ఉత్తరప్రదేశ్కు పనికిరాడు, నిరుపయోగి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశాయి. -
ఆధునిక దేవాలయం: ఆ అపురూప ఘట్టానికి నేటికి 66 ఏళ్లు
Nagarjunasagar Project Marks the 66th Anniversary of The Foundation Stone: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటితో 66 ఏళ్లు నిండాయి. 1955 డిసెంబర్ 10న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్లో శంకుస్థాపన చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడి కాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్బహుదూర్ శాస్త్రి కాలువగా పిలుస్తారు. జవహర్ కాలువ సాగర్ ఆనకట్ట కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. ఈ కాలువ పనులను 10 అక్టోబర్ 1956న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఇది దక్షిణ విజయపురి (రైట్ బ్యాంకు) వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రిజర్వాయర్ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే లాల్బహుదూర్ శాస్త్రి కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది. దీని నిర్మాణాన్ని 1959లో ఆనాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ ప్రారంభించారు. ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. దీని కింద 10లక్షల 37వేల 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రెండు కాలువలకు 132 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించారు. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేయవచ్చు. 4 ఆగస్టు 1967న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొట్టమొదటిసారి నీటిని వదిలారు. లక్ష్యానికి దూరంగా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. సిమెంట్తో నిర్మించిన కాలువలు కాలక్రమేణా దెబ్బతినడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రపంచ బ్యాంకు రుణంతో చిట్టచివరి ఎకరం వరకు నీరందాలనే ఉద్ధేశంతో సాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అయినా ఇప్పటికీ చివరి భూములకు నీరందని కాల్వలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూడికతో రెండు పంటలకు అందని నీరు.. నాగార్జునసాగర్ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. అంతేకాకుండా ప్రాజెక్టు నిండిన సమయంలో అధికారులు సరైన ప్రణాళికలు తయారుచేయకపోవడంతో నీటి విడుదల ఆలస్యమై దుబారా అధికమవుతుంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు సాగవుతుందనే సమాచారం అధికారుల వద్ద లేదు. ఆయా తూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు. జలాశయంలోకి పూడిక చేరకుండా చూసి కాలువల స్థానంలో పైపులైన్లు అమర్చితే మరికొన్ని భూములకు సాగునీరందే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. తూములన్నింటికీ షట్టర్లు బిగించాలి.. ప్రధాన కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. పంటల అవసరాన్ని బట్టి రైతులు నీటిని వినియోగించుకునేలా తూములు డిజైన్ చేయాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంట కాల్వల వరకు ఏ తూముకు ఏ నెలలో ఎంత నీటిని విడుదల చేస్తే ఎంత భూమి సాగవుతుందనే విషయాన్ని బోర్డుల ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు. సాగర్ జలాశయం విస్తీర్ణం– 110 చదరపు మైళ్లు గరిష్ట నీటిమట్టం – 590 అడుగులు డెడ్ స్టోరేజీ లెవల్ – 490 అడుగులు నీటి నిల్వ సామర్ధ్యం – 408.24 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 312 టీఎంసీలు) నీటి నిల్వ డెడ్ స్టోరేజీ – 179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు) నీటి విడుదలకు ఉండాల్సిన కనీస నీటిమట్టం 510 అడుగులు -
విశాఖపట్నం: నేడు క్రూయిజ్ టెర్మినల్ పనులకు శంకుస్థాపన
దొండపర్తి (విశాఖ దక్షిణ): అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు విశాఖ పోర్టులో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాగూర్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి గురువారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులుతో పాటు ఓఆర్ఎస్ జెట్టీ మరమ్మతు పనులు, కవర్డ్ స్టోరేజ్ యార్డ్ నిర్మాణ పనులు, ఐఎన్ఎస్ డేగ వద్ద ట్రక్కు పార్కింగ్ టెర్మినల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటనలో ఆయన వెంట పోర్ట్ చైర్మన్ రామమోహనరావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. -
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
-
యాదాద్రికి రండి..ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆహ్వానించారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల మధ్య మంచి ముహూర్తం చేసుకుని ప్రారంభోత్సవం చేపడతామని.. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. శుక్రవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు వారు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు అంశాలను పరిష్కరించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి తగిన సాయం చేయాలని కోరుతూ.. పది అంశాలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. భేటీ అనంతరం సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం హామీలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని తెలిపింది. మరోవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం కూడా కేసీఆర్, మోదీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భేటీ చిత్రాలను ట్వీట్ చేసింది. ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచండి.. తెలంగాణ ఏర్పాటయ్యాక పాలన అవసరాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఉమ్మడి రాష్ట్రం నాటి జోనల్ వ్యవస్థ కారణంగా స్థానికులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు.. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించుకున్నాం. కొత్త జిల్లాలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్రంలో తొమ్మిది పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో.. 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటయ్యాయి. దీనికి అనుగుణంగా కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, కొత్త మల్టీజోన్లకు పోలీస్ ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల కనీసం 29 సీనియర్ డ్యూటీ పోస్టులు ఇస్తూ ప్రస్తుతమున్న 76 సీనియర్ డ్యూటీ పోస్టులను 105కు పెంచాలి. మొత్తంగా 139 మందిగా ఉన్న ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 195కి పెంచాలి. పోలీసు పరిపాలన అవసరాల రీత్యా దీనిని ప్రత్యేక అంశంగా, అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి. రెండు పారిశ్రామిక కారిడార్లు హైదరాబాద్– నాగపూర్, వరంగల్– హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలి. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా బలమైన ఆర్థిక పునాదిని సృష్టించడం, దీర్ఘకాలిక ప్రాజెక్టులతో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా>ం. ఢిల్లీ– ముంబై కారిడార్ తరహాలో హైదరాబాద్– నాగ్పూర్ మధ్య 585 కిలోమీటర్ల పొడవున పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలి. కీలక ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ను, మల్టీమోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్గా ప్రతిపాదించిన నాగ్పూర్ను ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య రైల్వే, ఎక్స్ప్రెస్ హైవే అనుసంధానం ఉంది. ఇది పారిశ్రామిక కారిడార్కు తోడ్పడుతుంది. కారిడార్తో రోడ్డు, రైలు మార్గాలకు ఇరువైపులా 50 కిలోమీటర్ల వెడల్పున తక్షణ ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రల పరిధిలోని జనాభాలో 27 శాతం అంటే 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదే తరహాలో వరంగల్–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. నాగ్పూర్–హైదరాబాద్ రైలు మార్గం వరంగల్ వరకు ఉంది. జాతీయ రహదారి కూడా హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకు అనుసంధానమై ఉంది. ఇవి కారిడార్కు తోడ్పడుతాయి. ఢిల్లీలో తెలంగాణ భవన్కు స్థలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలకు ఢిల్లీలో అధికారిక భవనాలు ఉన్నట్టుగానే తెలంగాణకు కూడా ప్రత్యేక అధికారిక భవనం నిర్మించాల్సి ఉంది. ‘తెలంగాణ భవన్’ పేరిట భవనం నిర్మించుకునేందుకు ఢిల్లీలో అనువైన చోట స్థలం కేటాయించాలి. సడక్ యోజన కింద అదనపు నిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 9, షెడ్యూల్ 13 ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల్లో రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ చెబుతోంది. అందువల్ల తెలంగాణలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై)’ పథకం కింద అదనంగా నిధులు ఇవ్వాలి. నాలుగు వేల కిలోమీటర్ల రహదారులను మంజూరు చేయాలి. వీటి నిర్మాణాన్ని 3.75 మీటర్ల వెడల్పుతో కాకుండా.. 5.5 మీటర్లతో చేపట్టాలి. మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో బయటి ప్రాంతాల అనుసంధానాన్ని (కనెక్టివిటీని) పెంచేలా కేంద్రం చేపట్టిన రహదారుల నిర్మాణం భద్రతా దళాలకు ఉపయోగకరం. ఆయా ప్రాంతాల అభివృద్ధికి కూడా చాలా కీలకం. ప్రస్తుతం నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారి పనులకు కేంద్రం, రాష్ట్రం 60ః40 నిష్పత్తిలో నిధులు భరిస్తున్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా మొత్తం 100 శాతం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలి. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ తెలంగాణలో ప్రధాన నగరాలకు నాణ్యమైన సాంకేతిక విద్యను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా కరీంనగర్లో పీపీపీ మోడల్లో ట్రిపుల్ ఐటీని స్థాపించాలని నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ ఉత్తర తెలంగాణలోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఒకటి. అందువల్ల ట్రిపుల్ ఐటీని త్వరగా మంజూరు చేయాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేలా ఉత్తర్వులు జారీ చేయాలి. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమిని, పీపీపీ విధానంలో కావాల్సిన నిధుల వాటాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఐటీ కంపెనీలు ఇందులో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహిస్తాం. గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్ 94లోని షెడ్యూల్ 13(3) ప్రకారం తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు మండలం జాకారంలో 200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. విభజన చట్టం స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకుని గిరిజన విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్రం నుంచి త్వరగా నిధులు ఇవ్వాలి. విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేలా కేంద్ర విద్యా శాఖను ఆదేశించాలి. హైదరాబాద్లో ఐఐఎం ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) ఉండాలనే ప్రణాళికలో భాగంగా కేంద్రం గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో కొత్త ఐఐఎంలను మంజూరు చేసింది. కానీ హైదరాబాద్లో ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ఉందన్న కారణంతో తెలంగాణకు మాత్రం కేటాయించలేదు. ఐఎస్బీలో భారీ ఫీజుల కారణంగా సాధారణ విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. అందువల్ల హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. దీనికి అవసరమైన భూమిని హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ప్రాంగణంలో అందుబాటులో ఉంది. వరంగల్ టెక్స్టైల్ పార్క్కు రూ.1,000 కోట్లు టెక్స్టైల్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు వరంగల్ సమీపంలో 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్స్టైల్ పార్క్’ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి ఎకరాలు సేకరించాం. అయితే పార్క్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,600 కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్గా మంజూరు చేయాలి. దేశంలో పత్తి ఉత్పత్తలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. నైపుణ్యమున్న కార్మికులు, ముడిసరుకు లభ్యత వల్ల టెక్స్టైల్ రంగం వృద్ధికి అపారమైన అవకాశం ఉంది. దీనికి కేంద్రం తోడ్పాటు ఇవ్వాలి. కొత్తగా 21 నవోదయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం.. ప్రతి జిల్లాలో ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతం రంగారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్(అర్బన్), నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోనే నవోదయ విద్యాలయాలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ (రూరల్), జనగాం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి గ్రామీణ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరు కావాల్సి ఉంది. గ్రామీణ పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఈ 21 నవోదయ విద్యాలయాలను వెంటనే మంజూరు చేయాలి. వీటికోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తులివీ... 1. తెలంగాణలో ఐపీఎస్ల సంఖ్యను 139 నుంచి 195కి పెంచండి. 2. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికారిక భవనం కోసం స్థలం కేటాయించండి. 3. హైదరాబాద్– నాగ్పూర్, వరంగల్– హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయండి. 4. గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులివ్వండి. 5. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 100 శాతం కేంద్ర నిధులతో రోడ్లు నిర్మించండి. 6. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయండి. 7. గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేయండి. 8. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయండి. 9. వరంగల్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ఇవ్వండి. 10. కొత్తగా 21 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయండి. చదవండి: KCR Delhi Tour: టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన -
టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, ఢిల్లీలో కార్యాలయాన్ని నిర్మించుకొని దేశ రాజకీయాల్లో ముద్ర వేసేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచే ఈ భవన నిర్మాణానికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 1:48 గంటలకు పునాదిరాయి వేశారు. వసంత్ విహార్లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది దసరాలోగా పూర్తి నిర్మాణ స్థలంలో వేద పండితులు గురువారం ఉదయం 11 గంటల నుంచే శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. మధ్యాహ్నం 1:14 గంటలసమయంలో సీఎం అక్కడికి చేరుకున్నారు. భూమిపూజకు ముందు జరిగిన హోమంలో కేసీఆర్, కేటీఆర్లు పాల్గొన్నారు. 2022 దసరాలోగా 1,100 చదరపు మీటర్ల స్థలంలో భవన నిర్మాణాన్ని çపూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేíసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత, దేశ రాజధానిలో సొంత కార్యాలయ భవనం నిర్మించుకున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీల జాబితాలో టీఆర్ఎస్ చేరనుంది. ఉత్కంఠ .. ఉత్సాహం .. ఉద్వేగం ఢిల్లీలో గత మూడురోజులుగా భారీ వర్షాలు కురవడంతో భూమిపూజ కార్యక్రమం ఎలా జరుగుతుందోనన్న ఉత్కంఠ మంత్రులు, పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే పూజా కార్యక్రమం మొదలయ్యే సమయానికి వర్షం తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా అక్కడికి చేరుకున్నారు. కానీ ఢిల్లీ పోలీసుల భారీ బందోబస్తు నేపథ్యంలో కేవలం ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించారు. కేసీఆర్, కేటీఆర్లు వచ్చిన సమయంలో కొందరు నేతలు, కార్యకర్తలు బారికేడ్లు తోసుకొని ప్రాంగణంలోనికి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. భూమిపూజ సమీప ప్రాంతానికి వెళ్లలేకపోవడంతో వారు ఉద్వేగానికి గురయ్యారు. హాజరుకాని హరీశ్, కొప్పుల, తలసాని సుమారు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పాల్గొన్నారు. ఎంపీలు కె.కేశవరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్కుమార్, బండ ప్రకాశ్, కేఆర్ సురేశ్రెడ్డి, లింగయ్య యాదవ్, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవిత, దయాకర్, వెంకటేశ్ నేత, రాములు హాజరయ్యారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిదులు, పార్టీ నాయకులు ఎల్.రమణ, తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్లు హాజరుకాలేదు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్లీలు, బ్యానర్లతో ఇండియాగేట్ సమీపంలోని తెలంగాణ భవన్, వసంత్విహార్, సీఎం అధికారిక నివాసం ఉన్న తుగ్లక్రోడ్డు సహా పలు ప్రాంతాలు గులాబీ మయం అయ్యాయి. పార్టీ శ్రేణులకు గర్వకారణం: కేటీఆర్ రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంటూ, చిక్కుముళ్లని విప్పుకుంటూ, తెలంగాణ గల్లీలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూనే అటు ఢిల్లీ పవర్ కారిడార్లలో లాబీయింగ్ ద్వారా తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ విస్తృతంగా మద్దతు కూడగట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. దక్షిణ భారతదేశానికి సంబంధించి ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్న తొలి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కావడం పార్టీ శ్రేణులకు గర్వకారణమని పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న ప్రొఫెసర్ జయశంకర్ మాటలను ఉటంకించారు. రెండు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణ ప్రయాణాన్ని ప్రస్తావించారు. తన తొలి అడుగే త్యాగంతో మొదలు పెట్టిన కేసీఆర్, ఢిల్లీ మెడలు వంచి ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని చెప్పారు. గత ఏడేళ్లుగా రాష్ట్రంలో తెలంగాణ భాష, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ ఒక మహత్తరమైన పునర్నిర్మాణ ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ సాధన, పునర్నిర్మాణం అనే రెండు చారిత్రక కర్తవ్యాలను విజయవంతంగా నెరవేర్చిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేశ రాజధానిలో ఒక గొప్ప కార్యాలయం నిర్మించుకునేందుకు పూనుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా, తెలంగాణ నుంచి వచ్చిన వందలాది మంది నాయకులు, కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమం ఒక పండుగలా జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఎంతో ఆనందంగా ఉంది: మంత్రి వేముల ఢిల్లీలో తెలంగాణ భవన్కు భూమిపూజ చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయడం మరిచిపోలేని విషయమన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రభుత్వ పనితీరును దేశం నలుమూలల తెలియజేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీపై ఉందని తెలిపారు. ఈ బాధ్యత నిర్వర్తించేందుకు ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణ భవన్ ఒక వేదిక కానుందని మంత్రి పేర్కొన్నారు. ఇదొక చారిత్రక సన్నివేశం తెలంగాణ గులాబీ పతాకం ఢిల్లీ గడ్డపై రెపరెపలాడటం ప్రతి తెలంగాణ బిడ్డకు ఒక గొప్ప భరోసాను ఇస్తుంది. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయానికి భూమిపూజ ఒక చారి త్రక సన్నివేశం. తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు టీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. – కేటీఆర్ -
YS Jagan: అభివృద్ధిలో టాప్గేర్
సాక్షి, కడప: వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులతో బద్వేలు, కడప రూపురేఖలు మారుస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా బద్వేలు, కడపలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో వెనుకబడిన నియోజకవర్గాల్లో బద్వేలు ఒకటన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, దివంగత ప్రియతమ నేత నాన్న గారి హయాంలో మాత్రమే ఈ నియోజకవర్గానికి మంచి జరిగిన పరిస్థితి కనిపించిందని చెప్పారు. అప్పట్లో బ్రహ్మంసాగర్లో 14 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశారన్నారు. ఆ తర్వాత నాలుగైదు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదన్నారు. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడం, మంచి చేయాలనే తపన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. బ్యాట్ పట్టి.. షాట్ కొట్టి.. కడప అర్బన్ / స్పోర్ట్స్: తాత వైఎస్ రాజారెడ్డి పేరుతో తండ్రి నిర్మించిన స్టేడియంలో మనవడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగారు. చూడముచ్చటైన షాట్లతో అలరించారు. ఈ అద్భుతమైన సన్నివేశం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో చోటుచేసుకుంది. ఈ మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఆవిష్కరణ, రూ.4 కోట్లతో ఫ్లడ్లైట్ల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ బ్యాట్ పట్టుకుని క్రీజ్లో నిలుచున్నారు. తొలుత కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బంతిని తిన్నగా వేయగా.. నిబంధనల మేరకు వికెట్ వైపు నుంచే బంతిని వేయాలని సూచించారు. దీంతో ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడిన వేణుగోపాల్, మధుసూదన్లు బౌలింగ్ చేయడంతో సీఎం జగన్ బ్యాట్ ఝుళిపించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులతో గ్రూప్ ఫొటో దిగారు. ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండుకుండలా ఉండాలి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో రెండేళ్లుగా ఇదే బ్రహ్మంసాగర్ నిండు కుండలా ఉందని సీఎం జగన్ అన్నారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనే ఉద్దేశంతో ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను తీర్చేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గత పాలకుల హయాంలో వెలుగోడు ప్రాజెక్టు 0–18 కిలోమీటర్ల వరకు కెనాల్ లైనింగ్ పనులను పట్టించుకోలేదన్నారు. దీంతో నీళ్లు కిందకు రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితి మారిస్తే తప్ప బ్రహ్మంసాగర్కు సెక్యూరిటీ ఉండదని భావించి రూ.300 కోట్లు మంజూరు చేసి, లైనింగ్ పనులు ప్రారంభించి దాదాపు 80 శాతం పూర్తి చేశామన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అక్టోబర్ నాటికి లైనింగ్ పూర్తయి, నీళ్లు నేరుగా బ్రహ్మంసాగర్కు వచ్చేలా చూస్తామని చెప్పారు. బ్రహ్మంసాగర్ ఎప్పుడూ నిండు కుండలా ఉండాలని భావించి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే కుందూ నది మీద లిఫ్ట్ ప్రాజెక్టు పనులకు రూ.564.60 కోట్లతో శ్రీకారం చుట్టామని తెలిపారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ..500 కోట్లతో అభివృద్ధి పనులు బద్వేలు నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి రూ.500 కోట్లతో పనులు చేస్తున్నాం. దీంతో నియోజకవర్గం రూపురేఖలు మారతాయి. బద్వేలు పట్టణంలో రూ.130.60 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శ్రీకారం చుట్టాం. పట్టణంలో సుమారు 140 కిలోమీటర్ల పొడవుతో కొత్త సీసీ రోడ్లతో పాటు మూడు పార్కులు, కూరగాయలు.. చేపల మార్కెట్, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఆరు శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. ►రూ.79.67 కోట్లతో దిగువ సగిలేరు ఎడమ ప్రధాన కాలువను 23 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేలు, బి.కోడూరు మండలాల్లో 35 చెరువులకు ఏటా నీళ్లు నింపుకునే వెసులుబాటు కలుగుతుంది. ►బ్రహ్మంసాగర్ ఎడమ, కుడి కాలువలకు సంబంధించి రూ.37.452 కోట్లతో పెండింగ్ పనులు చేపడుతున్నాం. తద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందించొచ్చు. మరోవైపు బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ ఆనకట్టకు ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రం కటాఫ్ వాల్ నిర్మాణ పనులకు రూ.46.68 కోట్లతో శంకుస్థాపన చేస్తున్నాం. ఇవన్నీ పూర్తయితే జలాశయాన్ని పూర్తి స్థాయిలో నింపొచ్చు. ►మనం వచ్చాక పూర్తి స్థాయిలో నీటిని పెట్టడంతో అక్కడక్కడ కొద్దిగా లీకేజీలు కనిపించాయి. వీటిని అరికట్టేందుకు రూ.46.68 కోట్లతో మరమ్మతులు చేస్తున్నాం. దీంతో 17 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడుతుంది. సభకు హాజరైన ప్రజలు మూడు ఎత్తిపోతల పథకాలు ►రూ.35.90 కోట్లతో బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలో మూడు ఎత్తిపొతల పథకాలను ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా 8,268 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిశెట్టిపల్లె, కొండ్రాజుపల్లె, వరికుంట్ల, గంగన్నపల్లె చెరువులకు తరలించొచ్చు. తద్వారా కాశినాయన మండలంలోని పలు గ్రామాల్లో 3,500 ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురాబోతున్నాం. ►రూ.పది కోట్ల వ్యయంతో ఐదు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించి ఐదు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పోరుమామిళ్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల మేర రెండు లేన్ల రోడ్లను నాలుగు లేన్ల రోడ్డుగా రూ.25 కోట్లతో విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ►రూ.20 కోట్లతో సగిలేరు నది మీద వేమలూరు వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. దీంతో 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది. బ్రహ్మణపల్లె సమీపంలో సగిలేరు నదిపై రూ.9.50 కోట్లతో మరో వంతెన నిర్మిస్తున్నాం. దీనివల్ల కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రవాణా మెరుగవుతుంది. ►బద్వేలు మార్కెట్ యార్డులో బద్వేలు, పోరుమామిళ్లలో రెండు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రైతుల కోసం రెండు గోదాములను నిర్మించే పనులకు శంకుస్థాపన చేస్తున్నాం. ►బద్వేలులో ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ ఆది చెన్నకేశవ దేవాలయంతో పాటు కాశినాయన మండలంలో మరో ఆరు దేవాలయాల అభివృద్ధి పనులకు రూ.4.70 కోట్లతో శంకుస్థాపనలు చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే ►బద్వేలు నియోజకవర్గ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆర్డీఓ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నాం. ఇదే విషయాన్ని ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారి కోరిక మేరకు మంజూరు చేస్తున్నాం. ►బద్వేలులో రూ.5 కోట్లతో ఆర్అండ్బీ బంగ్లా, రూ.15 కోట్లతో పంచాయతీ రాజ్ రోడ్లు, ఎంపీడీఓ, తహశీల్దార్, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం మంజూరు చేస్తున్నాం. బద్వేలు మండలం వీరబల్లి, కొత్త చెరువు ఎత్తిపొతల పథకానికి రూ.50 లక్షలు అందిస్తున్నాం. ►నియోజకవర్గంలో ఇండ్రస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పించే అవకాశాలు మెరుగవుతాయని మాజీ ఎమ్మెల్సీ కోరారు. ఆయన విన్నపం మేరకు మంజూరు చేస్తున్నాం. ►కడప జిల్లాకు ఎంత చేసినా తక్కువే. జిల్లా ప్రజలు నన్నెప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. మీరిచ్చిన చలువ వల్లనే ఈరోజు నేను రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాను. మీ ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేను. ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు. కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో వైఎస్సార్, రాజారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్ ఇక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్వేగంగా చెప్పారు. నాన్నగారి మరణం తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ కడపలో అభివృద్ధి పనులు చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇకపై అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మంచి నగరాల జాబితాలో కచ్చితంగా కడప ఉంటుందని భరోసా ఇచ్చారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్లో రోడ్లను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి మాట్లాడుతూ.. కడప నగరంలో దాదాపు రూ.459.29 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం సంతోషంగా ఉందన్నారు. గతంలో శంకుస్థాపన చేసిన పనులను కూడా వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. కడపలో అభివృద్ధి పనులు ఇలా.. ►జిల్లా కేంద్రమైన కడపలో మహావీర్ సర్కిల్ నుంచి పుట్లంపల్లె వరకు ఆరు వరుసలతో 80 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం.. రైల్వేస్టేషన్ నుంచి మహావీర్ సర్కిల్ వరకు నాలుగు లేన్లతో 60 అడుగుల వెడల్పుతో మరో రోడ్డు.. ఈ రెండు రోడ్లను సుమారు రూ.80 కోట్లకు పైగా వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్ది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ►ఇదే తరహాలో కడప నగరంలో మరికొన్ని రోడ్లను విస్తరించాలని సంకల్పించి శంకుస్థాపనలు చేస్తున్నాం. రూ.101 కోట్లతో కృష్ణా సర్కిల్ నుంచి దేవుని కడప వరకు రోడ్డును విస్తరిస్తున్నాం. అన్నమయ్య సర్కిల్ నుంచి కృష్ణా సర్కిల్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు రూ.74 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశాం. ►అంబేడ్కర్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు విస్తరణకు రూ.62 కోట్లు కేటాయించాం. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి పుట్లంపల్లె వరకు రోడ్డు విస్తరణ పనులను రూ.9.90 కోట్లతో చేపట్టనున్నాం. బుగ్గవంక కష్టాలు రాకుండా చర్యలు ►బుగ్గవంక వరద కష్టాలు నాకు తెలుసు. నాన్నగారి హయాంలో బుగ్గవంక నుంచి ప్రమాదం లేకుండా ఉండేందుకు ఐదు హైలెవెల్ బ్రిడ్జిలు, రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అనంతరం వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ►మరోసారి బుగ్గవంక వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు రూ. 49.60 కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేస్తాం. చెర్లోపల్లె, పుట్లంపల్లె, బుడ్డాయపల్లె, రామనపల్లె చెరువుల సుందరీకరణ పనులను రూ.5.73 కోట్లతో చేపట్టనున్నాం. ►చిన్నపాటి వర్షాలు కురిసినా నగరంలోని ఆర్కే నగర్, తిలక్నగర్, మృత్యుంజయకుంట, ఎస్బీఐ కాలనీ, ఎన్జీఓ కాలనీ, ఏఎస్ఆర్ నగర్, గంజికుంట తదితర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా వరద నీటి కాలువల (స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్) నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం. సూపర్ స్పెషాలిటీగా రిమ్స్.. ►రిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేలా నిర్ణయించి రూ.125 కోట్లతో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శిలాఫలకం వేశాం. ఆ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. డాక్టర్ వైఎస్సార్ మానసిక చికిత్సాలయానికి సంబంధించి సుమారు రూ.40 కోట్లతో పనులను యుద్ధ ప్రాతిపదికన చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. ►డాక్టర్ వైఎస్సార్ కేన్సర్ కేర్ సెంటర్కు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోంది. కడపలో రాజీవ్ మార్గ్ పనులు సుమారు రూ.4 కోట్లతో జోరుగా జరుగుతున్నాయి. దేవుని కడప చెరువు సుందరీకరణకు రూ.55 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ దశలో ఉంది. నెల రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకుని అద్భుత నిర్మాణాలకు శ్రీకారం చుడతాం. ►కడప, బద్వేలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప నగర మేయర్ సురేష్బాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో తామ్రపత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదర్శనీయుడు బ్రౌన్ కడప కల్చరల్ : తెలుగు భాషాసాహిత్యాన్ని కాపాడిన ఆంగ్లేయుడు, తెలుగుభాషాభిమాని చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ తెలుగు భాషాసాహితీ వేత్తలకు ఆదర్శనీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ కేంద్రం ఆవరణలో జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ, బ్రౌన్ గ్రంథాలయ సలహా మండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రౌన్ లేని తెలుగు సాహిత్యాన్ని ఊహించుకోలేమని, ఆయన బాషా సాహిత్య సేవలు తరతరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. అనంతరం ఛాయా చిత్ర ప్రదర్శన, తాళపత్ర గ్రంథాలు, రాత పరికరాలు, అరుదైన గ్రంథాలను తిలకించారు. ఈ కేంద్రం విస్తరణలో భాగంగా ప్రముఖ ఆడిటర్ సంపత్కుమార్ కుమార్తె చిత్రకూటం అమృతవల్లి సౌజన్యంతో రూ.5.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన నూతన భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమృతవల్లిని సత్కరించారు. బ్రౌన్ విగ్రహాన్ని రూపొందించిన జిల్లాకు చెందిన ప్రముఖ శిల్పి గొల్లపల్లి జయన్నను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం బ్రౌన్ కేంద్రం బాధ్యులు ముఖ్యమంత్రికి బ్రౌన్ గ్రంథాలయ రజతోత్సవ సంచికలను అందజేశారు. -
ఏపీ: ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
చక్రాయపేట/బి.కొత్తకోట: గాలేరు–నగరి సుజల స్రవంతి, ఏవీఆర్ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మించే ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకల చెరువు మండలం నాయనిచెరువు వద్ద చేపట్టే పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేసి ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. రూ.4,373 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించనున్నట్టు చెప్పారు. గండికోట రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్బాషా, వెంకటేగౌడ పాల్గొన్నారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆదివారం కాలేటివాగు వద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ పథకం నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపి కృష్ణా జలాలతో చక్రాయపేట మండలంలోని 45 చెరువులతోపాటు రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని 90 చెరువులకు కాలేటివాగు నుంచి నీటిని నింపనున్నట్టు వివరించారు. -
కృష్ణా నది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభంకానున్నాయి. ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగనున్నట్లు పేర్కొన్నారు. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్మించడంతో పాటు వెంకటాయపాలెం, రాయపూడి అవుట్ ఫాల్ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తామని వివరించారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానిస్తామని తెలిపారు. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. చదవండి: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ -
CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి
కెనడాను తలదన్నేలా.. ప్రపంచంలోనే అధునాతన వైద్య సదుపాయాలు కెనడాలో ఉన్నాయి. వైద్యాధికారులు కెనడాను విజిట్ చేసి.. అక్కడి ఆస్పత్రులను తలదన్నేలా వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీని నిర్మించాలి. ప్రపంచంలోని అన్ని విభాగాల వైద్య సేవలు ఒకేచోట రావాలి. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చుతాం. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్టోబర్ తర్వాతే థర్డ్ వేవ్.. లాక్డౌన్ మరిన్ని రోజులు పెడితే ప్రజలకు ఉపాధి పోతుంది. అన్ని అంశాలను పరిశీలించాకే ఎత్తేశాం. ప్రస్తుతం కేసులు పెరగట్లేదు. థర్డ్వేవ్ వస్తే గిస్తే అక్టోబర్ తర్వాతే వస్తుంది. ఈ మధ్య కాలంలో రాదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే నియంత్రించొచ్చు. కడుపు నిండా పరిహారం.. యాదాద్రిలో రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వడంతోపాటు నిర్మాణాల విలువను చెల్లిస్తాం. కడుపునిండా పరిహారం అందిస్తాం. ఆందోళన చెందే అవసరం లేదు. టెంపుల్ సిటీలో షాపులు కేటాయించడంలో ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. సాక్షి ప్రతినిధి, వరంగల్: హైదరాబాద్ కంటే వరంగల్ తక్కువేమీ కాదని.. వరంగల్ దేశంలోనే గొప్ప విద్యా కేంద్రం, వైద్య కేంద్రం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేర్రావు అన్నారు. తూర్పు తెలంగాణకు ఈ నగరం హెడ్ క్వార్టర్ కావాలని, అత్యంత అధునాతన వైద్య సేవలు ఇక్కడ అందాలని చెప్పారు. వరంగల్లో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్గా ఉండాలని.. ఏడాదిన్నరలోగా పూర్తయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీరియస్గా పనిచేయాలని ఆదేశించారు. తానే మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. సోమవారం వరంగల్లో పర్యటించిన సీఎం కేసీఆర్.. తొలుత హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేసి.. సమీకృత కలెక్టరేట్, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మాతా, శిశు సంరక్షణ కేంద్రం వరంగల్ ఎంజీఎం, ప్రాంతీయ కంటి వైద్యశాల, సెంట్రల్ జైలు, మెడికల్ కాలేజీ కలిపి చూస్తే 200 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లే. ప్రస్తుత ఎంజీఎం ఆస్పత్రి భవనాలు పాతబడినందున కూల్చివేసి భవనాలు నిర్మించాలి. దీనిని అత్యాధునికంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రంగా మారుస్తాం. దానికి రెండు మూడు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడం. వైద్య విభాగంలో ఉన్న అన్ని రకాల సేవలు హబ్గా వరంగల్లో అందుబాటులో ఉండేలా చేస్తాం. తెలంగాణ మొత్తం ఇంకా నాగరికంగా మారాలి. ప్రతీ పాత తాలుకా సెంటర్లో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు రావాలి. ఒక మినీ నీలోఫర్ సెంటర్ రావాలి. ఇందుకోసం ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తాం. పెట్టుబడులు రావాలి.. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతి పెద్దనగరం. ఇది గొప్ప విద్యా, వైద్య కేంద్రంగా మారాలి. వరంగల్కు డెంటల్ కాలేజీ, డెంటల్ హాస్పిటల్ను మంజూరు చేస్తున్నం. వరంగల్కు పెట్టుబడులు రావాలి. ఐటీ కంపెనీలను విస్తరించాలి. ఇందుకోసం పెట్టుబడులను ఆకర్షించేలా అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. త్వరలోనే మామునూర్ ఎయిర్పోర్టు రాబోతోంది. చైనా లాంటి టెక్నాలజీ రావాలి చైనాలో 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనం నిర్మించారు. ఆ తరహా నిర్మాణ పరిజ్ఞానం మనదగ్గర కూడా రావాలి. ప్రజల పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకత. ప్రజలు పైరవీలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండొద్దు. మిగతా 30 కలెక్టరేట్లు కూడా త్వరగా పూర్తి కావాలి. కలెక్టర్ హోదా పేరు కూడా మారిస్తే బాగుంటుంది. ఒకప్పుడు భూమి శిస్తు వసూలు చేసేవారిని కలెక్టర్ అనేవారు. ఇప్పుడు కలెక్టర్లకు శిస్తు వసూలు చేసే అవసరం లే దు. అందువల్ల వారి పేరు మారిస్తే బాగుంటుంది. జిల్లాలు అభివృద్ధి చెందాలి హైదరాబాద్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం హైదరాబాద్పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుంది. జిల్లాలు కూడా అభివృద్ధి చెందితే హైదరాబాద్పై భారం తగ్గుతుం ది. అందుకే హైదరాబాద్ ఈర్ష్య పడేలా వరంగల్ ను వైద్య, విద్య, ఐటీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. జూలై 1 నుంచి పల్లె ప్రగతి రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేసేందు కు యజ్ఞంలా పనిచేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి 10 వరకు పల్లెప్రగతి కార్యక్రమం చేపడతాం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కలిపి నిర్వహిస్తాం. స్థానిక సంస్థలకు ముందే నిధులు విడుదల చేస్తాం. ఈనెల 26న మంత్రులు, కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులతో సమావేశం ఉంటుంది. ఆ రోజు మొత్తం అజెండా ఫైనల్ చేస్తాం. ప్రతిష్టాత్మక దేవాదుల ప్రాజెక్టు నీరు వరంగల్కే అంకితం. ఉమ్మడి వరంగల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. మిగిలిన పనుల పూర్తికి రూ.100 కోట్లు కేటాయిస్తాం. కరోనాపై అతిగా ఆందోళన వద్దు కరోనాపై ఊహాగానాలతో ప్రజలను భయపెట్టేలా వార్తలు ఇవ్వొద్దు. ఇది మంచిది కాదు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. చాలా మంది భయాందోళనలతో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొని పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామర్థ్యానికి మించి వస్తున్నారు. వచ్చిన రోగులను తిరిగి పంపించకుండా వీలున్న చోట పడుకోబెట్టి చికిత్స అందించాల్సి వస్తది. ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నా. వారు ఉత్తమ సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులపై దాడులు సరికాదు. సిబ్బంది కరోనా ఉధృతి ఉన్నా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేశారు. కిట్లు అందించారు. -
ఆరోగ్య రాజధానిగా ఓరుగల్లు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రాబోతోంది. పోరా టాల పురిటిగడ్డ ఇక మీదట ఆరోగ్య రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. అత్యంత ఆధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. 24 అంతస్తులతో భారీ భవనాన్ని నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెలీ అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకునేలా 24వ అంతస్తుపై హెలీప్యాడ్ ఏర్పాటుతో పాటు ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. కాళేశ్వరం తర్వాత.. ఆ స్థాయిలో సాహసం ఎంబీబీస్ కోర్సు చేస్తున్న విద్యార్థులు ఇటు ఎంజీఎంతో పాటు, అటు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో అతిపెద్ద ఆస్పత్రి నిర్మించనుండటంతో నగరం హెల్త్ హబ్గా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర, దక్షిణ భారత్ మధ్య వారధి ఈ చారిత్రక నిర్మాణం వెనుక చాలాపెద్ద కసరత్తే ఉంది. హైదరాబాద్ రద్దీగా మారిన నేపథ్యంలో.. ఉత్తర భారతదేశానికి – దక్షిణ భారత దేశానికి మధ్య వారధిగా ఉన్న వరంగల్ను హెల్త్ హబ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆ సంకల్పంతోనే మే 21న సీఎం కేసీఆర్ వరంగల్లో పర్యటించి సెంట్రల్ జైలును తరలించాలని ఆదేశించారు. మూడు రోజుల్లోనే జైలును నేలమట్టం చేసి ఎంజీఎం ఆస్పత్రికి స్థలాన్ని అప్పగించారు. రెండేళ్లలో ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. సోమవారం మరోసారి ముఖ్యమంత్రి వరంగల్లో పర్యటించనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రజలకు అంకితం చేయడంతో పాటు, ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రి! నిర్మాణం పూర్తి అయితే ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా కీర్తి సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. చుట్టు పక్కల జిల్లాల వారే కాదు.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్యానికి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఎంజీఎం భవనాలు పాత పడడం, అత్యాధునిక వసతులు దృష్టిలో ఉంచుకుని మరో భారీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం సంకల్పించారు. నేడు, రేపు యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరి«శీలనతోపాటు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ప్రధానాలయంలో తాజాగా ఏర్పాటుచేసిన మేలిమివర్ణపు విద్యు ద్దీపాల అలంకరణ చిత్రీకరణను వీడియో ద్వారానే చూసిన ముఖ్యమంత్రి.. నేడు ప్రత్యక్షంగా చూడనున్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి దత్తత గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసి, గ్రామసభ నిర్వహించనున్నారు. గ్రామా భివృద్ధితోపాటు మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం, ఉపాధి, మహిళా సం ఘాలు, యువతకు వ్యక్తిగత రుణాలు ఇలా గ్రామ సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు. -
ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందాలన్నదే నా ఉద్దేశం: సీఎం జగన్
-
ఇంతవరకు వైద్యో నారాయణో హరి అనేవాళ్ళం..ఇప్పుడు జగనన్న నారాయణో హరి అని అంటాం
-
వైద్యరంగాన్ని బలోపేతం చేస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.8వేల కోట్లు.. ‘‘మెడికల్ కాలేజీల నిర్మాణాలకు దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పేదవారికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని’’ సీఎం తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు.. ‘‘మెడికల్ కాలేజీలతోపాటు 500 పడకల ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ పొందేలా అడుగులు ముందుకేస్తున్నాం. మూడేళ్లలో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 5 ఎకరాల భూమి ఉచితంగా కేటాయిస్తాం. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలను తీసుకొస్తున్నాం. రూ.246 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు చేశాం. 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశామని’’ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కోవిడ్ వైద్యం.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెన్షన్ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. బ్లాక్ ఫంగస్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చామని.. రెండేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రూ.5,215 కోట్లు చెల్లించామని సీఎం జగన్ తెలిపారు. 1180 వాహనాలు 108, 104లను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు.కోవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వర్కర్లుగా ఉండి మరణించిన వారికి కేంద్రం స్కీం వర్తించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేస్తామని సీఎం వెల్లడించారు. చదవండి: 2 Years Of YS Jagan Rule In AP: బీసీలకు వెన్ను దన్ను బాధిత చిన్నారులకు తక్షణమే భరోసా -
మరో కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కూల్చిన 9 ఆలయాల నిర్మాణంతో పాటు, 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. అందులో భాగంగానే కృష్ణానది ఒడ్డున సీతమ్మపాదాల వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీపీ బత్తిన శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్తో కలిసి పర్యవేక్షించారు. చదవండి: ('టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది') ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రామరాజ్యస్థాపనకు కృషిచేస్తున్నారు. కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్నారు. సీఎం జగన్కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోంది. అర్ధరాత్రులు ఆలయాలపై దాడులకు తెగబడుతూ కుట్రలు పన్నుతోంది. టీడీపీ పాలనలో పట్టపగలే ఆలయాలు కూల్చితే ప్రశ్నించని పవన్ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. రాజకీయ రాబందులకి రాష్ట్ర ప్రజలే గుణపాఠం నేర్పుతారు' అని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. చదవండి: (బాబుది నీచ బుద్ధి) -
‘రీజనల్’ కొలిక్కి తెస్తా
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం చుట్టూతా ఉన్న ప్రధాన పట్టణాలను అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టును కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు రాని కారణంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. తెలంగాణవ్యాప్తంగా నిర్మించిన ఆరు జాతీయ రహదారులను గడ్కరీ సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే మరో 8 హైవేల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, వీకే సింగ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని వేముల ప్రశాంత్రెడ్డి గడ్కరీకి చెప్పగా ఆయన త్వరగా కోలుకోవాలని గడ్కరీ ఆకాంక్షించారు. కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు తాను భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడ్కరీ రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన, చేపడుతున్న రోడ్ల నిర్మాణ వివరాలను... ఇందుకోసం కేటాయించిన నిధుల లెక్కలను వివరించారు. ఆరేళ్లలో 17,617 కోట్లతో కొత్త రోడ్లు... గత ఆరేళ్లలో రూ. 17,617 కోట్లతో 1,918 కి.మీ. కొత్త జాతీయ రహదారులను తెలంగాణకు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫలితంగా పెద్దపల్లి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయన్నారు. త్వరలో పెద్దపల్లికి కూడా రోడ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ. 4,793 కోట్లతో చేపట్టిన 841 కి.మీ. రోడ్లు పూర్తయ్యాయని, మిగతావి గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్మాలా పరియోజనలో భాగంగా తెలంగాణలో 1,730 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్టు గడ్కరీ వెల్లడించారు. డీపీఆర్ తయారీలో ఉన్న రూ. 24 వేల కోట్ల విలువైన రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత తొందరగా పనులు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రూ. 500 కోట్ల అదనపు సీఆర్ఎఫ్ పనులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం రూ. 250 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రతిపాదించిన మేరకు హైదరాబాద్లో వర్షాల వల్ల దెబ్బతిన్న జాతీయ రహదారి మరమ్మతుల కోసం వెంటనే పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి మేరకు రూ. 600 కోట్లతో చేపట్టే ఎల్బీ నగర్–మలక్పేట రోడ్డు క్యారెజ్ వే విస్తరణ పనలకు వచ్చే జనవరిలో ఆమోదం తెలపనున్నట్లు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరినట్లుగా నిజామాబాద్–జగ్దల్పూర్ రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్టు చెప్పారు. గగన్పహాడ్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ హైటెన్షన్ స్తంభాల తొలగింపును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కీలకమైన భారత్మాల ప్రాజెక్టు ఫేజ్–1కు సంబంధించి రూ. 24 వేల కోట్ల విలువైన పనుల్లో భూసేకరణను వేగిరం చేయాలని గడ్కరీ రాష్ట్రాన్ని కోరారు. 5,787 హెక్టార్లకుగాను ఇప్పటివరకు 160 హెక్టార్లు మాత్రమే సేకరించారని, సాధ్యమైతే సీఎం ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వెయ్యి కి.మీ. కొత్త హైవేలు కావాలి: వేముల రాష్ట్రం ఏర్పడ్డాక 3135 కి.మీ.నిడివి గల జాతీయ రహదారుల ఏర్పాటుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినా ఇప్పటివరకు 1,366 కి.మీ. నిడివిమేర మాత్రమే జాతీయ రహదారులుగా మార్చారని, మిగతాది పెండింగులోనే ఉందని మంత్రి వేముల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్హెచ్ సాంద్రత 3.49 కి.మీ.(100 చ.కి.మీ.లలో) మాత్రమేనని, ఇది జాతీయ సగటు కంటే తక్కువన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం వెయ్యి కి.మీ. కొత్త జాతీయ రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము ప్రతిపాదించిన 340 కి.మీ. రీజినల్ రింగు రోడ్డును మంజూరు చేయాలని కోరారు. ఇందుకు భూసేకరణలో 50 శాతం భరించేందుకు సీఎం సమ్మతించారని గుర్తు చేశారు. రూ.వేయి కోట్ల సీఆర్ఎఫ నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. సోమవారం ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అలాగే మరో 8 హైవేల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, వీకే సింగ్, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని వేముల ప్రశాంత్రెడ్డి గడ్కరీకి చెప్పగా ఆయన త్వరగా కోలుకోవాలని గడ్కరీ ఆకాంక్షించారు. కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు తాను భేటీ అవుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడ్కరీ రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన, చేపడుతున్న రోడ్ల నిర్మాణ వివరాలను... ఇందుకోసం కేటాయించిన నిధుల లెక్కలను వివరించారు. -
మూడు రిజర్వాయర్లకు సీఎం శంకుస్థాపన
సాక్షి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో కొత్తగా 3 రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం. అదనంగా 3.3 టీఎంసీల కెపాసిటీ పెంచాం. హంద్రినీవా ద్వారా సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాం కు నీరు తరలించేందుకు 803 కోట్లతో టీడీపీ అంచనాలు వేసింది. అదే డబ్బుతో మేము నాలుగు రిజర్వాయర్లు అదనంగా నిర్మించి పేరూరు డ్యాంకు నీరందిస్తున్నాం. 75,000 ఎకరాలకు సాగునీరు, చాలా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నాం. ప్రాజెక్టు కాస్ట్ పెంచకుండా ఎక్కువ లబ్ది చేకూరుస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ దోపిడీ చేసింది. టీడీపీ పాలనలో లంచాలు ఏస్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది. పేరూరు డ్యాం, ఇతర నాలుగు రిజర్వాయర్ల పరిధిలోని 75,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో జనతా బజార్లు తెస్తాం. రానున్న రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చబోతున్నాం' అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం) సీఎం జగన్కు రైతు ప్రయోజనాలే ముఖ్యం: తోపుదుర్తి రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా నుంచి పేరూరుకు నీరిస్తామని వైఎస్సార్ హామీ ఇచ్చారు. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న సీఎం జగన్కు ధన్యవాదాలు. పేరూరు డ్యాం సహా నాలుగు రిజర్వాయర్లకు నీరివ్వటం వల్ల మా ప్రాంతంలో కరవు పోతుంది. పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలి. సాగునీటి ప్రాజెక్టుల్లో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. సీఎం జగన్కు రైతు ప్రయోజనాలే ముఖ్యం. జగన్కు జిల్లా రైతులు జీవితాంతం రుణపడి ఉంటారు' అని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. కాగా, రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. చదవండి: (మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం) ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
పులివెందులలో అపాచీ లెదర్ కంపెనీ
సాక్షి, కడప: పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రఖ్యాత లెదర్ కంపెనీ అపాచీ ‘ఇంటిలిజెంట్ ఎస్ఈజెడ్’ ఏర్పాటుకు ఆతిథ్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హరి కిరణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అపాచీ ఫుట్వేర్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సంకల్పించారన్నారు. జిల్లాలోని యువతకు విస్తృతంగా ఉద్యోగం, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ (పాడా) పరిధిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్కు (ఐడీపీ)లో 27 ఎకరాల స్థలాన్ని సుప్రసిద్ధ అపాచీ ఫుట్వేర్ కంపెనీకి కేటాయించారన్నారు. ఇంటిలిజెంట్ ఎస్ఈజెడ్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ లెదర్ పరిశ్రమ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగళూరు వద్దనున్న ప్రధాన శాఖకు అనుబంధంగా నడుస్తుందన్నారు. ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ఈ లెదర్ పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్వర్మ, అపాచీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిమోగ్ చెంగ్, అపాచీ ఫుట్వేర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వైస్ జనరల్ మేనేజర్ (బిజినెస్) గోవిందస్వామిముత్తు, పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి, జిల్లా పరిశ్రమలశాఖ జీఎం చాంద్బాషా పాల్గొన్నారు. చదవండి: (వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి ప్రకాష్రెడ్డి) స్థలాన్ని పరిశీలించిన కంపెనీ ప్రతినిధులు పులివెందుల: పులివెందులలోని జేఎన్టీయూ వెనుక వైపున నిర్మించనున్న అపాచి లెదర్ కంపెనీ ఏర్పాటు స్థలాన్ని సోమవారం ఆ కంపెనీ ప్రతినిధులు పాడా ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఏపీఐఐసీ భూములలో 27.94 ఎకరాల విస్తీర్ణాన్ని ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి కంపెనీ ప్రతినిధులకు చూపించారు. స్థలాన్ని పరిశీలించిన వారిలో అపాచి కంపెనీ ప్రతినిధులు స్పెషల్ అసిస్టెంట్లు సైమన్, హరియన్, వైస్ జీఎం ముత్తు గోవిందుస్వామి, సివిల్ ఇంజినీర్ గుణ, పీఆర్ఓ రాజారెడ్డిలు ఉన్నారు. చదవండి: (మనం కట్టేవి 'ఊళ్లు') -
మత్స్య రైతులకు అండగా...
-
ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: మత్స్యకారుల అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో శనివారం శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతోపాటు 25 ఆక్వాహబ్ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీలో 974 కి.మీ తీరప్రాంతం ఉంది. మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం పాదయాత్రలో చూశా. సరైన సౌకర్యాలు లేక గుజరాత్లాంటి ప్రాంతాలకు వలస పోవడం చూశాం. పెద్ద సముద్రతీరం ఉన్నా అవసరమైన ఫిషింగ్ హార్బర్లు లేవు. మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం. నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్లకు శంకుస్థాపన చేశాం. మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ల నిర్మిస్తున్నాం. దీంతోపాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం చేపడుతున్నాం. జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తాం. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణాన్ని చేపడుతాం. వేట నిషేధ సమయంలో ఆదాయం కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున లక్షా 2వేల 337 కుటుంబాలకు ఇచ్చాం. డీజిల్ సబ్సిడీని రూ.6 నుంచి రూ.9కి పెంచాం. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారులు చనిపోతే అందించే రూ.5 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం. ఆక్వా రైతులకు యూనిట్ కరెంట్ను రూపాయిన్నరకే అందిస్తున్నాం. క్వాలిటీ కోసం ఆక్వా ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేశాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ తెచ్చాం’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో రూ.355 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం వీవీనగర్ వద్ద ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడ నుంచి నేరుగా కళ్యాణమండపానికి చేరుకొని మాజీ మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఉన్నారు. నాడు తండ్రి... నేడు తనయుడు.. ఏలూరు ప్రజలకు తమ్మిలేరు ముంపును తప్పించడం కోసం చేసిన ప్రయత్నాలను జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఏలూరు నగరం చుట్టూ ప్రవహించే తమ్మిలేరు వరదల సమయంలో ఉగ్రరూపం దాల్చుతోంది. ఏలూరు నగరంలోని పల్లపు ప్రాంతాలకు తమ్మిలేరు మంపు ప్రమాదం పొంచి ఉంటోంది. 2006లో భారీ వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు పర్యటనకు వచ్చారు. నగరమంతా కలియతిరిగారు. తమ్మిలేరు ముంపును నివారించాలంటే ఏం చేయాలని ఇరిగేషన్ అధికారులతోనూ అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నానితోను చర్చించారు. ఏలూరు నగరంలో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం కోసం రూ.17 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగానే అప్పటికప్పుడు మంజూరు చేశారు. వెంటనే పనులు మొదలు పెట్టారు. నగరంలో చాలావరకూ రిటైనింగ్ వాల్ కారణంగా ముంపు ముప్పు తప్పింది. తమ్మిలేరు వరదల నుంచి ఏలూరు ముంపునకు గురికాకుండా ఉండేందుకు 1960వ దశకంలో మిత్రా కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా నాగిరెడ్డిగూడెంలో తమ్మిలేరు రిజర్వాయర్ను నిర్మించారు. 1995, 2006, 2012, 2020లలో తమ్మిలేరుకు భారీ వరదలు వచ్చాయి. నగరం పెరిగిపోవడంతో తమ్మిలేరు కొంతమేర కుంచించుకు పోయింది. తమ్మిలేరు తూర్పు, పశ్చిమ పాయల సామర్ధ్యం 29 వేల క్యూసెక్కులు కాగా గత నెలలో వరద 41 వేల క్యూసెక్కుల వరకూ వచ్చింది. దీన్ని అధిగమించేందుకు ఎస్ఎంఆర్ నగర్ వద్ద గండి కొట్టాల్సి వచ్చింది. నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి వచ్చే వరదతో పాటు దిగువన పులివాగు, ఉప్పువాగు, విజయరాయి అనికట్, తమ్మిలేరు పరీవాహక ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చింది. ఈ నేపథ్యంలో ఏలూరు నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏలూరులోని మిగిలిన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.80 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయా పనులకు వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చారు. బుధవారం ఆయన స్వయంగా ఏలూరులో తంగెళ్లమూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్వాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తమ్మిలేరు పశ్చిమ పాయ దిగువ భాగంలో సాయినగర్, పోణంగి, మాదేపల్లి, జాలిపూడి ప్రాంతాలలో రిటైనింగ్ వాల్తో పాటు, అశోక్నగర్, బాలయోగి వంతెన, కేపీడీటీ స్కూల్, చేపలరేవు ప్రాంతాలలో రిటైనింగ్వాల్ ఎత్తు పెంచి పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఏలూరు అభివృద్దికి కట్టుబడి ఉన్నారు ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏలూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించడం, నిధులు కేటాయించడం జరుగుతోంది. ఏలూరులో రూ.330 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. -
కళాశాల భవనాలకు సీఎం జగన్ శంకుస్థాపన
-
నరసరావుపేటలో జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో జేఎన్టీయూ శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.80 కోట్లతో వ్యయంతో పరిపాలనా,బోధన,హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలని తమ ప్రయత్నం అని, ఈ కాలేజీ శంకుస్థాపనే దీనికి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరికి మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. (వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి) ‘‘2016లో ఫస్ట్బ్యాచ్ పిల్లలను తీసుకున్నారు. మనం శంకుస్థాన చేసేసరికి అప్పుడు చేరిన పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్కు వచ్చేశారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన ఇప్పటివరకూ చేయలేదు ఇప్పటివరకూ ప్రైవేటు కాలేజీలు, ల్యాబుల్లో నడుపుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులను మార్చాలని మనం ప్రయత్నంచేస్తున్నాం. వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మేలు జరుగుతోంది. రూ.80 కోట్లు ఈ సంవత్సరానికి శాంక్షన్ చేశాం. వచ్చే సంవత్సరం మరోరూ.40 కోట్లు శాంక్షన్ చేస్తాం. మొత్తంగా రూ.120 కోట్లు ఖర్చు చేస్తున్నామని’ సీఎం జగన్ తెలిపారు. -
‘ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతాం’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో రూ. 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశారు. (విశాఖ బీచ్ కోతని అరికట్టేందుకు..) ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ‘పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నాం. ఈ రోజు(శుక్రవారం) రూ. 4.5 కోట్లతో మధురవాడ ప్రాంతంలో అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశాం. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. . రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. విశాఖ నగరం 2019 కి ముందు...ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారు. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్...ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నం. అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. (13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభం) -
రామ మందిర శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం
పాట్నా: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటికే మందిరానికి భూమి పూజ జరగ్గా, త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో పర్యటించాలని ప్రధాని మోదీకి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేఖరాసింది. కరోనా వైరస్ కారణంగా ఎక్కువ మంది గుమిగూడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ సంధర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ, ‘అయోధ్యలో పర్యటించి, రామమందిర నిర్మాణ పనులను ప్రారంభించాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాశాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఎక్కువ మంది గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. రావడం వీలు కాకపోతే వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అయిన శంకుస్థాపన చేయాలని కోరాం’ అని తెలిపారు. (2022 నాటికి మందిర్ సిద్ధం..) ఆలయ నిర్మాణ పనులు శ్రావణ మాసం చివరి రోజు ఆగస్టు 5 న జరగవచ్చని నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ఇది హిందూ క్యాలెండర్లో పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది.రామ జన్మ భూమి గ్రౌండ్ లెవలింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తున్నాయి. చెక్కిన రాళ్లను శుభ్రపరిచే పనులను ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈ పనిని పూర్తి చేయడానికి రెండు డజన్లకు పైగా స్పెషలిస్ట్ కార్మికులు అయోధ్యకు చేరుకున్నారు. 1990 లో విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన వర్క్షాప్ లో ఈ రాళ్లను చెక్కారు.అంతకుముందు ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామ జన్మభూమి స్థలాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామ మందిర్ నిర్మాణం కోసం సీఎం తన వ్యక్తిగత సొమ్మును రూ .11 లక్షలు విరాళంగా ఇచ్చారు. (ఆకాశాన్నంటే రామ మందిరం) -
ఇస్లామాబాద్లో హిందూ ఆలయ నిర్మాణం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో తొలిసారి హిందూ ఆలయాన్ని నిర్మించనున్నారు. పది కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇస్లామాబాద్లోని హెచ్-9 ప్రాంతంలో సుమారు 20 వేల చదరపు గజాల స్థలంలో శ్రీ కృష్ణ మందిర్ ఆలయ నిర్మాణం కోసం బుధవారం శంకుస్థాపన చేశారు. పాక్ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హీ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్హీ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్లో 1947కు ముందు కట్టిన అనేక హిందూ ఆలయాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. వాటిలో సైద్పూర్ గ్రామంతో పాటు రావాల్ నది దగ్గరలో పలు పురాతన ఆలయాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో వాడకంలో లేవన్నారు. (నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా!) ఆలయ నిర్మాణం కోసం కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల శాఖా మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి తెలిపారు. ప్రస్తుతం పది కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం మొదలుపెట్టామన్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుమతితోనే ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఇస్లామాబాద్లో ఉన్న హిందూ పంచాయత్ కొత్త ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ అని పేరు పెట్టింది. ఆలయం నిర్మిస్తున్న స్థలాన్ని క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ 2017లో హిందూ పంచాయత్కు అప్పగించింది. ఆలయం సమీపంలో హిందూ శ్మశానవాటికను కూడా నిర్మించనున్నారు. -
దక్షిణాదిపై చిన్నచూపు లేదు: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మంగళవారం ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాడు పోరాటం చేశామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అందరి కోసం పని చేస్తానని మాట ఇచ్చారని, దానికి కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. దక్షిణ భారత్ను నిర్లక్ష్యం చేశారనడం అవాస్తవమన్నారు. ‘కాంగ్రెస్ హయాంలోనే సౌత్ సెంట్రల్ రైల్వేను నిర్లక్ష్యం చేశారు. ప్రధాని మోదీకి దేశమంతా ఒక్కటే, రూ.258 కోట్లు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పటి బడ్జెట్లో పదింతలు ఎక్కువ నిధులు ఇచ్చాం. కేంద్రం ఎంత ఇచ్చిందో నా దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయని’ వివరించారు. రూ.258 కోట్లతో తెలంగాణలో రైలు మార్గాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 2008లో ప్రారంభించిన పెండింగ్ పనులు అన్ని పూర్తి చేశామన్నారు. ఎంఎంటీఎస్ కోసం 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని.. రాష్ట్రం ఇంకా డబ్బులు ఇవ్వలేదని..అది ఇస్తే పనులు పూర్తవుతాయన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఆగదలేదని ఆయన తెలిపారు. ఎంఎంటీఎస్, సబ్బరన్ రైళ్ల సంఖ్య పెంచాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య అని..సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వేల మంది ప్రయాణిస్తారని..చర్లపల్లి రైల్వేస్టేషన్ వద్ద శాటిలైట్ టర్మినల్ ఏర్పాటుతో రద్దీ భారం తగ్గుందన్నారు. ఎంఎంటీఎస్, సబ్బరన్ రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని ఆయన కోరారు. యాద్రాది వరకు ఎంఎంటీస్పై కేంద్రం దృష్టిపెడితే రైల్వే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. 427 రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైపై సౌకర్యం కల్పించడం మంచి పరిణామం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపాలి.. సౌత్ సెంట్రల్ రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్రం ప్రతిసారి నిర్లక్ష్యం చూపుతోందని..ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ ను ఘట్కేసర్ వరకు పొడిగించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. -
నాన్న బాటలో... ఉక్కు సంకల్పం
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ప్లాంట్ నిర్మాణాన్ని తలపెట్టారు. పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్రెడ్డిని ఇందుకోసం ఒప్పించి 2007 జూన్ 7న శంకుస్థాపన చేశారు. 10,670 ఎకరాలను కేటాయించారు. విమానాశ్రయానికి మూడువేల ఎకరాలు కేటాయించారు. రూ.20వేల కోట్లతో పది బిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంటును ప్రతిపాదించారు. నేడు వైఎస్జగన్మోహన్రెడ్డి... కేంద్ర ప్రభుత్వం నిర్మించకపోతే అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే తమ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తుందని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. జూలై 8న జమ్మలమడుగులో జరిగిన రైతు సభలో డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ కేబినెట్ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. సాక్షి, జమ్మలమడుగు: పుష్కరకాలం తర్వాత జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వచ్చేనెలలో పునాది రాయి పడనుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబరు 26న శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె– పెద్దదండ్లూరు పంచాయతీల మధ్య కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి జిల్లా ప్రజలు హర్షాతిరేకం వ్యక్తంచేస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంబవరం పంచాయతీలో చిటిమిటి చింతలలో శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఆయన మరణానంతరం పాలకులెవరూ దీని గురించి పట్టించుకోలేదు. టీడీపీ ఎన్నికల ముందు కంటితుడుపుగా శంకుస్థాపన చేసి గాలికొదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి వైఎస్సార్ మాదిరిగా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బలంగా అడుగులు వేస్తున్నారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్రెడ్డి విభజన హామీ విస్మరణ రాష్ట్ర విభజన సందర్భంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం గాని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గాని ఈ హామీని పూర్తిగా విస్మరించాయి. మైలవరం మండలం కంబాలదిన్నెలో ఎన్నికల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కుబడిగా శంకుస్థాపన చేతులు దులుపుకొన్నారు. కనీసం భూమిని కూడా కేటాయంచలేదు. ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించలేదు. అన్ని సానుకూలంగా: కర్మాగారానికి సున్నపురాళ్లు–పెద్దదండ్లూరు మధ్య ప్రాంతం అనువైనదని ప్రభుత్వం భావించింది. ఇక్కడ దాదాపు 90శాతంపైగా ప్రభుత్వ భూములున్నాయి.డీకేటీ భూములు కూడా ఉన్నాయి. సమీపంలోనే ఆర్టీపీ పీ ఉంది. దక్షిణ కాలువతో పాటు ఆర్టీపీపీ పైప్లైన్, సమీపంలోనే రైల్వే లైన్ కూడా ఉన్నా యి. ఫలితంగా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. స్టీల్ప్లాంటుకు ప్రభుత్వం 3200 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే ఏపీ హైగ్రేడ్ స్టీల్కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సీఎండీగా పనిచేసి రిటైరైన మధుసూధన్రెడ్డిని ఈ సంస్థ అధికారిగా నియమించింది. రెండు రోజుల్లో భూమిని సర్వే చేసి డిసెంబరు 26న శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నారు. ఉక్కు భూముల పరిశీలన జమ్మలమడుగు రూరల్: స్టీల్ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే డాక్టర్మూలే సుధీర్రెడ్డిలు గురువారం పరిశీలించారు. మండల పరిధిలోని సుగుమంచిపల్లె–పెద్దదండ్లూరు గ్రామాల మధ్య 3200 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసందే. ఈనేపథ్యంలో జిల్లా అధికారులు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు భూములను పరిశీలించారు. సున్నపురాళ్లపల్లె నుంచి కన్యతీర్థం సమీప ప్రాంతం నుంచి కోసినేపల్లి రహదారి వరకు గల భూములను పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా రెండుమూడు చోట్ల భూములను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండటంతో పాటు సమీపంలో ధర్మల్ పవర్ ప్రాజెక్టు, రైల్వే ట్రాక్ , నీటి వసతులు ఉన్నందున సున్నపురాళ్లపల్లి– పెద్దదండ్లూరు పంచాయతీల మధ్య ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. ఇక్కడి పనులను ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్రెడ్డి మాట్లాడుతూ జూలైలో జరిగిన రైతు సభలో డిసెబర్ 26వతేదిన స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రికి జమ్మలమడుగువాసులపై ఎనలేని ప్రేమ ఉందన్నారు. స్టీల్ఫ్లాంట్ నిర్మాణం జరిగితే జమ్మలమడుగుతో పాటు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. వారి వెంట ఆర్డీఓ వి,నాగన్న, తహసీల్దార్ మధుసూధన్రెడ్డి, సర్వేయర్లు వైఎస్సార్సీపీ నాయకులు, ఇతర అధికారులు ఉన్నారు. -
నెరవేరిన వైద్య‘కల’శాల..
సాక్షి, ఏలూరు: జిల్లా కేంద్రం ఏలూరులోని కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని కృషితో జిల్లాకే తలమానికంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు మార్గం సుగమమైంది. ఏలూరు పర్యటనలో భాగంగా స్థానిక సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ఉదయం 10.25 గంటలకు దిగిన సీఎం వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఉదయం 10.40 గంటలకు చేరుకున్నారు. వైద్య కళాశాల భవనాల నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్ సెంటర్లో పనిచేస్తోన్న సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సమస్యలను సావధానంగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అనంతరం 10.55 గంటలకు సీఎం ప్రభుత్వాసుపత్రి నుంచి స్థానిక ఇండోర్స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బయలుదేరివెళ్లారు. వైద్య కళాశాల నిర్మాణం ఇలా.. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 100 మంది విద్యార్థులకు తొలి ఏడాది ప్రవేశాలు కల్పిస్తూ ప్రతిపాదించిన వైద్య కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.266కోట్లు నిధులు ఇప్పటికే మంజూరు చేసింది. ఆసుపత్రిలోని 12.22 ఎకరాల్లో కళాశాల భవనాల నిర్మాణాలు చేపడతారు. మెడికల్ కౌన్సిల్ ప్రమాణాలకు అనుగుణంగా 5 లెక్చర్ హాల్స్, పరిపాలనా విబాగం, సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ వర్క్షాప్, 13 వైద్య విభాగాల బ్లాక్లతోపాటు, బాలురు, బాలికలకు హాస్టల్, స్టాఫ్ క్వార్టర్లు, కిచెన్, కాంటీన్ తదితర సదుపాయాలు ఇందులో చేపడతారు. ఈ నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, జిల్లా ఇన్చార్జి మంత్రి, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్చంద్రబోస్, జిల్లా మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్, రఘురామకృష్ణంరాజు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, కలెక్టర్ ముత్యాలరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు, మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ట్రామాకేర్ సిబ్బందికి న్యాయం చేస్తా ఏలూరు ప్రభుత్వాసుపత్రి ట్రామాకేర్ యూనిట్లో పనిచేస్తోన్న సిబ్బంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ ప్రతి నెలా వేతనాలు సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటానని, ట్రామాకేర్ సిబ్బంది క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. దీనిపై ట్రామాకేర్ సిబ్బంది ఎం.రమేష్, బి.రవి, కిశోర్, సుధారాణి తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు వరాల జల్లు ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో చాలీచాలని వేతనాలతో పనులు చేస్తున్నామని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన తమకు రూ.11,500 ఇవ్వాలంటూ జీవో ఇచ్చినా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తమను ఎవరూ పట్టించుకోలేదని గోడు చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ మున్సిపల్ కార్మికులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తోన్న పారిశుధ్య కార్మికులకు రూ.18 వేలు వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇక ఔట్ సోర్సింగ్ విధానంపై పరిశీలించి అందరికీ న్యాయం చేస్తానంటూ సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. వెంటనే స్పందించారు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాసుపత్రిలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. ఔట్సోర్సింగ్ విధానం కావటంతో చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. గత చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా గోడు చెప్పుకోగానే ఆయన వెంటనే మాకు జీతాలు పెంచుతానని భరోసా ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ విధానం కూడా తీసేస్తానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్కు మా జీవితాంతం రుణపడిఉంటాం. – లక్ష్మణమూర్తి, ఎస్కే కరీమా, పారిశుధ్య కార్మికులు, ఏలూరు -
మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి(ఏలూరు): ఏలూరు నగరంలో రూ. 266 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఆధునిక ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఏలూరు నగరంలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత టీడీపీ పాలకులు ఏలూరులో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని బీరాలు పలికినా ఆచరణలో మొండిచేయి చూపారు. అయితే సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఏలూరు జిల్లా ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. దీనిలో భాగంగా ప్రభుత్వం మెడికల్ కళాశాల భవనాల నిర్మాణానికి ఇప్పటికే రూ.266 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ మెడికల్ కాలేజీలో తొలుత 100 సీట్లు కేటాయిస్తారు. దీని ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో 25 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సేకరించి, కాలేజీ నిర్మాణానికి సిద్ధంగా ఉంచగా, అవసరమైతే మరికొంత స్థలాన్ని సేకరించేందుకు మంత్రి నాని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కళాశాల ఏర్పాటుతో జిల్లాలోని విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రానుండడంతో పాటు, పేద ప్రజలకు ఆధునిక వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. వైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు, ఆధునిక వైద్య సౌకర్యాలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.266 కోట్ల నిధులు మంజూరు మెడికల్ కళాశాలకు రాష్ట్ర సర్కారు రూ.266 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019–2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులను వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్టోబర్ 1న జీవోనెంబర్ 114ను ప్రభుత్వం విడుదల చేసింది. వైద్య కళాశాల ప్రారంభంలో మొదటి ఏడాది 100 సీట్లు భర్తీ చేస్తారు. నాలుగేళ్ళకాలంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన, హాస్టల్ ఏర్పాటుకు భారీఎత్తున భవంతులను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటారు. ఎంసీఐ నిబంధనల మేరకు మొత్తం 380 మంది విద్యార్థులకు గాను హాస్టల్ భవనాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ స్టాల్స్ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా.. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి 518 బెడ్లతో అన్ని వసతులు కలిగి ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఏలూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఏ విధమైన ఆటంకాలు లేవు. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాలు, సేవలు, బెడ్స్, స్థలం, మెడికల్ బృందం ఎంసీఐ నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, ఆప్తాల్మజీ, టీబీ అండ్ సీడీ, స్కిన్ అండ్ ఎస్టీడీ, ట్రామాకేర్, ఐసీయూ ఇలా అనేక విభా గాలు ప్రజలకు సేవలు అందిస్తున్నా యి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా కేంద్ర ఆసుపత్రిని సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్ళ పాటు ఏలూరు లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని చెప్ప డం మినహా చేతల్లో విఫలమయ్యారు. అదిగో నిధులు, ఇదిగో పనులు అంటూ ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చతికిలపడ్డారు. నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పి చివరకు ముఖం చాటేశారు. -
తెలంగాణకు తలమానికంగా అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే చట్ట సభల భవన సముదాయం తెలంగాణకు తలమానికంలా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అభిలషించారు. భవన నమూనా తెలంగాణ వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండటమే కాకుండా ఆ భవన పరిసరాలు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భవనం చుట్టూ అందమైన ఉద్యానవనం ఉండాలని, దానికి తగినంత స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమపద్ధతిలో నిలిపేలా ప్రణాళికాబద్ధమైన పార్కింగ్ ఉండాలని ఆదేశించారు. ఇందుకోసం భవన నమూనా తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. భూ ఉపరితలంలో కాకుండా సెల్లార్ పార్కింగ్ అవసరమని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన వేదపండితుల సమక్షంలో తెలంగాణ శాసనసభ, శాసనమండలి భవన సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రమంజిల్లోని రోడ్లు భవనాలశాఖ భవనం ముందు భూమిపూజ నిర్వహించారు. నిజాం జమానాలో నిర్మించిన ఎర్రమంజిల్ ప్యాలెస్ భవనాన్ని తొలగించి శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్యాలెస్ కాకుండా పక్కనే ఉన్న నీటిపారుదలశాఖ కార్యాలయ భవనం, దాని ముందున్న రోడ్లు భవనాలశాఖలోని ఓ విభాగం కొనసాగుతున్న పురాతన కార్యాలయ భవనాన్ని తొలగించి చుట్టూ ఉన్న ఖాళీ స్థలం కలుపుకొని కొత్త భవనాలను నిర్మించాలనేది ప్రణాళిక. దీనికి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో కాసేపు చర్చించారు. అసెంబ్లీ కార్యాలయ భవనంగా ఆర్ అండ్ బీ కార్యాలయం.... ఎర్రమంజిల్లో కొత్తగా నిర్మించిన రోడ్లు భవనాలశాఖ ప్రధాన కార్యాలయ భవనాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్గా వాడుకోనున్నారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ భవనంలో కలియతిరిగారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్లోని కార్యాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత ఏడో అంతస్తుకు వెళ్లి అక్కడి కార్యాలయాలను చూశారు. ప్రతి ఫ్లోర్కు ఓ ప్రధాన చాంబర్, ఇతర అధికారుల కార్యాలయాలు, సిబ్బంది గదులు, వాష్రూమ్లు... ఇలా అన్ని వసతులు ఉన్నందున అది అసెంబ్లీ సెక్రటేరియట్గా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. ఆ తర్వాత ఏడో అంతస్తు కారిడార్ నుంచి కొత్త భవనం నిర్మించబోయే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచే అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధాన భవనం ఎక్కడ వస్తుంది, దాని చుట్టూ ఖాళీ స్థలం ఎంత మేర ఉంటుంది, అందులో ఉద్యాన వనాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, వాహనాల పార్కింగ్ ఎలా ఉంటుంది, భవనానికి అప్రోచ్ రోడ్డు ఎలా ఉండనుందనే విషయాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన భవనానికి రెండు వైపులా రెండు మార్గాలుండే అవకాశం ఉందని అధికారులు సూచించారు. ప్రధాన రోడ్డు నుంచి భవనం మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంటుందని, అందులో చక్కటి ఉద్యానవనాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. స్తంభించిన ట్రాఫిక్... నూతన అసెంబ్లీ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఎర్రమంజిల్కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. నేతలంతా ఎవరికివారుగా కార్లలో రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యేలు విడతలవారీగా రావటంతో, వారు వచ్చినప్పుడల్లా ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ను నియంత్రించారు. దీంతో ఇటు పంజాగుట్ట నుంచి అటు ఖైరతాబాద్ కూడలి వరకు ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎర్రమంజిల్ రోడ్డుకు ఇరువైపులా నివాస సముదాయాలు, పెద్ద సంఖ్యలో వాణిజ్య భవన సముదాయాలు ఉండటం, రోడ్డు చాలా ఇరుకుగా ఉండటం, మెట్రో రైలు స్టేషన్, ఆ పక్కనే మెట్రో మాల్ ఉండటంతో ఇప్పుడే ట్రాఫిక్ చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. నూతన అసెంబ్లీ అందుబాటులో కి వస్తే సమావేశాలు జరిగే సమయాల్లో పరిస్థితి మరింత తీవ్రంగానే ఉంటుందని, ఈ సమస్య పరిష్కారానికి కూడా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
-
నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్ : నూతన సచివాలయ భవన నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్లు హాజరయ్యారు. రూ. 400 కోట్లతో నూతన సచివాలయ భవన నిర్మాణం జరగనుంది. అనంతరం ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్అండ్బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 100కోట్లతో తెలంగాణ అసెంబ్లీ భవన నిర్మాణం జరగనుంది. చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. -
నేడు సచివాలయం, ‘అసెంబ్లీ’కి శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డీ–బ్లాక్ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 12 గం.కు ఎర్రమంజిల్ ప్యాలెస్, ఆర్అండ్బీ కార్యాలయ భవన సముదాయం మధ్య ఖాళీస్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహిస్తారు. చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లను ఆహ్వానించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ వీరికి విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్తో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై చర్చించనుందని అధికారవర్గాలు తెలిపాయి. -
డూప్లికేట్ శిలాఫలకాలకు చెక్
సాక్షి, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నాయకులు ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పేరుతో ప్రభుత్వ సొమ్మును నిలువునా దోసుకున్నారు. రూ. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను రాబంధుల్లా తన్నుకు పోవడం వంటి అక్రమాలకు తెగపడ్డారు. అయితే అభివృద్ధి పేరుతో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి కందుకూరు నియోజకవర్గంలో ఎంతో హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజేందుకు విచ్చలవిడిగా శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలను ఆవిష్కరించారు. అది కూడా ప్రజలను ఆకట్టుకొని ఓట్లు వేసే విధంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేశారు. వాస్తవం గ్రహించిన ప్రజలు ఓట్ల రూపంలో ఆపార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. పనులు చేయకుండా ఏర్పాటు చేసిన డూప్లికేట్ శిలాఫలకాలకు చెక్ పెట్టేందుకు ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పటైన రెండేళ్ల తరువాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీఓఏపీ) పథకం కింద కందుకూరు మున్సిపల్ అభివృద్ధికి 15 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకముందే జీఓను చేతపట్టుకొని 35 పనులకు అంటే సీసీ రోడ్లు, డ్రైనేజిలు నిర్మించడానికి టెండర్లు పిలిశారు. దీంతో టెండర్లు దక్కించుకున్న తెలుగుదేశం సానుభూతిపరులైన కాంట్రాక్టర్లు 13 పనులను ప్రారంభించారు. వెంటనే ఆపార్టీ నాయకులు నిధులు విడదలైనట్లే, పనులన్నీ పూర్తి చేసినట్లే, అదిగో అభివృద్ధి, ఇదిగో అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకున్నారు. మా వల్లనే కందుకూరు అభివృద్ధి సాధ్యపడుతోందని అబద్ధాల ప్రచారానికి తెరలేపారు, అయితే పనులు మొదలు పెట్టిన కాంట్రాక్టర్లు వాటిని పూర్తి చేసి బిల్లుల కోసం మున్సిపల్ ఆఫీసు చుట్టూ కాళ్లుఅరిగేలా తిరుగుతున్న సందర్భంలో తోటి కాంట్రాక్టర్లు బిల్లులు రావనే కారణంతో పనులను ప్రారంభించలేదు. ఈ క్రమంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసి వారి లైసెన్స్లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్లు బిల్లులు రావన్న నెపంతో పనులు మొదలు పెట్టడానికి సాహసించలేదు. ఈ మోసపు మాటలు, అబద్ధాపు ప్రచారం ఎన్నికలకు 5 నెలల ముందు వరకు జరిగింది. చివరికి ప్రభుత్వం జీఓఏపీ గ్రాంటును రద్దు చేసింది శంకుస్థాపనలు, శిలాఫలకాల ఏర్పాటు టీడీపీ నాయకులు మరలా ప్రజలను నమ్మించి ఓట్లు గుంజుకొనేందుకు ఎన్నికలకు మూడు నెలల ముందు అభివృద్ధిపేరుతో హడావుడిగా శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. పట్టణంలో సీసీ రోడ్లు, శ్మశానవాటికలు, ప్రజలకు తాగునీటి సరఫరాకు అవసరమైన నూతన పైపులైన్ల నిర్మాణం, మురుగునీరు బయటకు పోవడానికి అవసరమైన డ్రైనేజి నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం స్లిప్ గ్రాంటు కింద రూ. 14.56 కోట్లు విడదల చేసింది, ఫిబ్రవరి నెలలో ముత్యాలగుంట వద్ద శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎలాంటి టెండర్లు పిలవలేదు. ఈ స్కీమ్ నిబంధనల ప్రకారం ఒక లక్షకు 10 వేలు మున్సిపాలిటీ పెట్టుకోగా, మిగిలిన రూ. 90 వేలు ప్రభుత్వమే బ్యాంకు నుంచి మంజూరు చేస్తుంది. బ్యాంకు నుంచి తీసుకున్న నగదును మున్సిపాలిటీ వడ్డీతో కలపి నెలనెలా బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రజలపై భారం పడక తప్పదు. ఇలాంటి విషయాలన్నీ కప్పిపెట్టి ప్రజలకు చెప్పకుండా, టెండర్లు పిలవకుండా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి శిలాఫలకాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అంతేకాకుండా పట్టణంలో రోడ్డు వైడింగ్, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద పలు కాలనీల్లో రోడ్లు నిర్మాణం వంటి అభివృద్ధిల పేరుతో శంకుస్థాపనలు చేశారు. ఈ విషయమై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలకు ముందు ప్రారంభించి, 25 శాతం కన్నా పనులు ప్రారంభం కాని పనులను రద్దు చేసినట్లు తెలిపారు. -
నడిరోడ్డులో శిలాఫలకం
సాక్షి, వికారాబాద్ అర్బన్: పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో నడిరోడ్డులోనే శిలాఫలకం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి కొత్తగా వాహనాలపై వచ్చే వారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శిలాఫలకాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
నిధుల్లేకుండానే చంద్రబాబు శిలాఫలకాలు,శంకుస్థాపనలు
-
ఉత్తర్ప్రదేశ్: ఘాజీపూర్లో ప్రధాని మోదీ పర్యటన
-
కీర్తి కిరీటంలో మరో శంకుస్థాపన రాయి
-
‘కర్తార్పూర్’కు శంకుస్థాపన
గురుదాస్పూర్: పాకిస్తాన్లోని గురుద్వార దార్బార్ సాహిబ్ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్పూర్ కారిడార్కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్పూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలపడం విదితమే.16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్పూర్ సాహిబ్ గురుద్వార పాకిస్తాన్కు వెళ్లింది. భారత్లోని గురుదాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్తో ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ పాక్కు హెచ్చరికలు చేశారు. భారత్ శాంతికి ప్రాధాన్యమిస్తుందనీ, కానీ భారత్కు భారీ, శక్తిమంతమైన సైన్యం ఉందన్న విషయాన్ని పాక్ గుర్తించాలన్నారు. సరిహద్దుల్లో భారత సైనికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల, సైనికుల దాడులకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వానే కారణమన్నారు. -
డిసెంబర్ 6న రామ మందిర నిర్మాణం ప్రారంభం : సాధ్వి ప్రాచి
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ 6న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది వేస్తానంటూ విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనకు ఎవరి ఉద్దేశాలతో, తీర్పులతో పని లేదని సాధ్వి ప్రాచి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని హిందువులందరికి ఇదే నా ఆహ్వానం. రామ మందిర నిర్మాణంలో పాల్గొనండి. ఈ డిసెంబర్ 6న ధూమ్ ధామ్గా వెళ్లి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. ఇందుకు మనకు ఎవరి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పండి’ అంటూ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ మాత్రమే రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉందని తెలిపారు. -
ఫౌండేషన్ స్టోన్ మాదే
నర్సంపేట, (వరంగల్): గోదావరి జలాలను నర్సంపేటకు తరలించాలలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నిధులు మంజూరు చేయగా ఫౌండేషన్ స్టోన్ వేసింది తామేనని, పనులు ప్రారంభించింది కూడా తామేనని ఏఐసీసీ సభ్యుడు, తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తూ పెద్ది సుదర్శన్రెడ్డి జలయాత్ర పేరుతో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులను తరలించి అబద్దపు ప్రచారంతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. వాస్తవానికి 2008–09లోనే ఫేజ్–3 ప్యాకేజీ–5 కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.330 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ పనులు జరుగుతున్న క్రమంలోనే 2014లో టీఆర్ఎస్ ప్రభ్వుం ఏర్పాటయ్యాక రీడిజైన్ పేరుతో స్వార్థం కోసం రైతులకు నష్టం కలిగే పనులు చేశారని ఆరోపించారు. జూరాల–పాకాల వాగ్దానం ఏమైందని, ప్రస్తుతం ఆ మాటను ఎందుకు దాటేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు గోదావరి–పాకాల అంటూ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని, దీనిని రైతులు గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలకే మేలు జరుగుతున్న విషయమై కలెక్టర్ చొరవ తీసుకుని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజవర్గ కన్వీనర్ ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగె మురళీ, కౌన్సిలర్ పుల్లూరి స్వామి, పట్టణ యూత్ అధ్యక్షుడు కోల చరణ్, వైనాల కార్తీక్, నియోజకవర్గ యూత్ నాయకులు వేముల ఇంద్రదేవ్తోపాటు పాల్గొన్నారు. -
‘ముందస్తు’ శంకుస్థాపనలు
హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు... నేడు అసెంబ్లీ రద్దు ఊహాగానాల నేపథ్యంలో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం హడావుడిగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి ఒక్కరోజే గడువు ఉందని సీఎం కేసీఆర్ అనధికారికంగా పార్టీ నేతలకు తెలియజేయడంతో జిల్లాల్లో ఈ హంగామా కనిపించింది. అధికారులు, ఇతర టీఆర్ఎస్ నేతలు ఉరుకులు పరుగుల పెట్టారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్ష నేతలూ తమ నియోజకవర్గ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఒక్కరోజే వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. మరిన్ని వందల కోట్ల పనులు ప్రారంభం అయ్యాయి. పలుచోట్ల వివిధ పథకాల చెక్కుల పంపిణీ జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రులు కేటీఆర్, సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఇతర మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. మెదక్లో డిప్యూటీ స్పీకర్ సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత... పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారు. పార్లమెంట్ సభ్యులు కూడా పలుచోట్ల ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
మాది అభివృద్ధి యజ్ఞం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్ని వర్గాలకు మంచి చేయాలన్నా టీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన సీఎం తొలుత రాజోలి మండలంలో జరుగుతున్న తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షించారు. అనంతరం గట్టు మండలం పెంచికలపాడు వద్ద గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ‘నడిగడ్డ ప్రగతి సభ’పేరిట ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే... వాళ్లు సగం అంధకారంలో తెలంగాణను చాలా కష్టపడి సాధించుకున్నం. నేను కూడా చావు నోట్ల తలపెట్టి సాధించుకున్న రాష్ట్రం ఇది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు, ప్రజల సమస్యలంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం. కానీ నేడు టీఆర్ఎస్ అలా కాదు. ఇదో యజ్ఞం. ఇదో పెద్ద టాస్కు.. చాలెంజింగ్గా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు పారే వరకు టీఆర్ఎస్ ఒక యజ్ఞంలా ప్రయత్నం చేస్తుంది. అలాగే కరెంట్ సమస్య అధిగమించినం. కరెంట్ ఇక జన్మల పోనియ్య. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్కుమార్రెడ్డి అనే ఒక వ్యక్తి కర్ర పట్టుకుని చూపించిండు. అంధకారమైపోతరన్నడు. కానీ వాళ్లే సగం అంధకారం అయ్యారు. మనం పూర్తి వెలుగులో ఉన్నం. దేశం మొత్తంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని గర్వంగా ప్రకటిస్తున్నా. ఆ పథకాన్ని అలాగే కొనసాగిస్తం. సంక్షేమంలో మనమే నంబర్ 1 సంక్షేమ పథకాల అమలులో యావత్ దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.42 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం. రూ.25 వేల కోట్లతో రైతులను ఆదుకుంటున్నం. రూ.96 వేల కోట్లతో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చకచకసాగుతున్నాయి. కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి మన పథకాలు చూసి అభినందిస్తున్నరు. మన ఆడబిడ్డలు తలెత్తుకునే మరో అద్భుతమైన కార్యక్రమం మిషన్ భగీరథ త్వరలో పూర్తవుతుంది. చిన్నచిన్న ఉద్యోగస్తులకు మనవి చేస్తున్నా.. టీఆర్ఎస్ను గెలిపించండి. ఆశీర్వదించండి. భవిష్యత్తులో మరింత మంచి జరుగుతది. అలాగే రాష్ట్రం మొత్తంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఒక్కో విద్యార్థి కోసం రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 584 మండలాలు ఉన్నాయి. ప్రతీ మండలానికి బీసీ రెసిడెన్షియల్ రావాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో మరో 119 బీసీ రెసిడెన్షియల్స్ మంజూరు చేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. వీటిపై వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తాం. అప్పుడే బంగారు తెలంగాణ.. నేను కూడా రైతునే. మేలో మంచిగ రెండు వానలు పడితే 60 ఎకరాలలో మక్కజొన్న పంట వేసిన. ప్రతీ రెండ్రోజులకు ఒక్కసారి ఫోన్ చేసి అడుగుత. వ్యవసాయంలో ఎన్ని కష్టాలు ఉంటయో నాకు తెలుసు. వ్యవసాయంలో ముందు దోపిడీ బంద్ కావాలి. రైతులకు నేను పెట్టుబడి ఇచ్చిన. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నరు. భూస్వాములకు ఇచ్చినవంటున్నరు. తెలంగాణలో భూస్వాములు ఉన్నరా? ల్యాండ్ సీలింగ్ పెట్టినం. 54 ఎకరాలకు మించి లేకపాయే. ఇక భూస్వాములు ఎక్కడున్నరు? వాళ్ల పిచ్చి మాటలు కాకపోతే! అలాగే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పక్కాగా ఉండేలా పాసు పుస్తకాలు అందజేస్తున్నం. పట్టాదారు పాసు పుస్తకంలో ఖాస్తుదారు పేరు ఎత్తేసి.. రైతు పేరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నాం. హైదరాబాద్లో రూ.కోట్లు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కడతరు. వాటిల్లో కిరాయికి ఇస్తరు. వాటిల్లో కూడా అనుభవదారు పేరు రాద్దామా? రైతు ఏమైన అగ్గువ దొరికిండా? ప్రాణం పోయిన సరే.. పెట్టుబడి పథకం పట్టాదారు రైతుకే ఇస్తం. ఇలా మొత్తంగా రైతుల అప్పులు పోయి.. జేబులో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటనే బంగారు తెలంగాణ సాధించినట్లు. తెలంగాణకు వచ్చి నేర్చుకోవాలే.. రాష్ట్రంలో నాలుగు లక్షల టన్నుల గోదాముల మాత్రమే ఉండే. ఈ నాలుగేళ్లలో 23 లక్షల టన్నుల నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకున్నం. రాబోయే రోజుల్లో గ్రామ గోడౌన్లను నిర్మించే ఆలోచన చేస్తున్నం. ఏ ఊరి గోదాము ఆ ఊరిలో ఉంటే.. ఎరువుల, ధాన్యం అన్ని పెట్టుకునే పరిస్థితి ఉంటది. రైతు సమన్వయ సమితి ద్వారా రైతులకు దిశానిర్దేశం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అందరూ ఒకేసారి ఒకే పంట వేయడం వల్ల ధరలు పడిపోతున్నాయి. అందుకే మార్కెట్లో ఉండే ధరలను రాబట్టుకోవాలి. అందుకు వచ్చే ఏడాది నుంచి సలహాలు, సూచనలు అందజేసే వెసులుబాటు కలుగుతుంది. వాతావరణానికి తగ్గట్లు పంటలు, భూముల వివరాలు, నీటి లభ్యత వంటి వాటిని తెలియజేసే ‘ఆగ్రో క్లెమైట్ కండిషన్’’అందుబాటులోకి వస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు పూర్తికాగానే రాష్ట్రమంతా పంట కాలనీలను విభజించి మనం పండించే ప్రతీ గింజ డిమాండ్కు అనుగుణంగా సాగు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాం. దేశంలో మిగతా 28 రాష్ట్రాల రైతులు తెలంగాణకు పోయి నేర్చుకోవాలనే విధంగా పద్ధతులను తయారు చేస్తున్నం. కరెంట్, పెట్టుబడి, గిట్టుబాటు ధర రాబట్టే విషయంలో గొప్పగా చేసుకోబోతున్నాం. కాంగ్రెస్–టీడీపీ జట్టా.. సిగ్గుసిగ్గు?: హరీశ్రావు సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ముఖ్యంగా పాలమూరు ప్రాంతానికి చేసిన నష్టం అంతా ఇంతా మంత్రి టి.హరీశ్రావు అన్నారు. ఈ ప్రాంతాన్ని చంద్రబాబు దత్తత తీసుకొని ఏమీ చేయకపోగా... ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్టీఆర్ మద్రాసులో కొన్నాళ్లు ఉన్నాననే విశ్వాసంతో తెలుగు గంగ చేపట్టారన్నారు. చంద్రబాబు మాత్రం దత్తత తీసుకున్న జిల్లా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ నిస్సిగ్గుగా జతకడతామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఒక సోషల్ ఇంజనీరుగా అవతారమెత్తి కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. గోదావరి జలాలను ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లా, ప్రస్తుత యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు కూడా అందజేస్తామని వెల్లడించారు. కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లా, రంగారెడ్డి, నల్లగొండలో మిగిలిపోయిన భాగానికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సి.నిరంజన్రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు కె.దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి, అంజయ్య యాదవ్తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తుమ్మిళ్ల డిజైన్లపై సీఎం సీరియస్ ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డిజైన్ల విషయంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ఆయన డిజైన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగభద్ర నుంచి నీటిని పంపింగ్ చేసే అప్రోచ్ చానల్ ఏర్పాటు సరిగా లేదన్నారు. నది చివరి నుంచి అప్రోచ్ చానల్ ఏర్పాటు చేయడం వల్ల ఆశించిన మేర నీరు తీసుకోలేమని, తద్వారా చివరి ఆయకట్టు వరకు ఎలా నీరు అందిస్తామని అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు డిజైన్ రూపకల్పన విషయంలో ఈఎన్సీ మురళీధర్రావు, సీఈ తీరుపై మండిపడ్డారు. ఇలా చేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తుమ్మిళ్ల డిజైన్ మార్పు వల్ల రూ.4 కోట్ల పనులు వృథా అయినా ఫర్వాలేదని రైతులకు లబ్ధి జరగడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. తుమ్మిళ్లకు నీటి లభ్యతను పెంపొందించడం కోసం ఎగువన మరో అప్రోచ్ చానల్ నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఎగువన అప్రోచ్ చానల్ నిర్మించడానికి నదిలో సిల్టు ఎక్కువగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి కేసీఆర్ స్పందిస్తూ.. ‘అయినా ఫర్వాలేదు... ప్రాజెక్టులు మళ్లీ మళ్లీ నిర్మించలేం.. ఈ డిజైన్ ఎట్టి పరిస్థితిలో మార్చాల్సిందే. ఆర్డీఎస్ రైతాంగానికి న్యాయం జరగాలి. అలాగే రిజర్వాయర్ల కెపాసిటీని కూడా కాస్త పెంచండి’అని ఆదేశాలు జారీ చేశారు. -
‘ఫ్లైఓవర్లతో ప్రయాణం ఇక సుఖమయం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం నగరంలో రూ.1523 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రాజెక్ట్లకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య గల ఎన్హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్హెచ్ 765డీలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్కరీ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోన్న హైదరాబాద్ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో రోల్ మోడల్గా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలోని (ఎస్పీడీఆర్) ప్రాజెక్టులకు కూడా కేంద్ర సహకారం ఉంటే త్వరగా పూర్తి చేయొచ్చని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకు తెలంగాణ ప్రభుత్వం స్కైవే నిర్మించాలనే ప్రతిపాదన చేసిందని వివరించారు. ఈ స్కైవే నిర్మాణానికి రక్షణ శాఖ అధీనంలోని 100 ఎకరాల భూమి అవసరమవుతోందనీ, కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఎకరాల రక్షణ శాఖ స్థలానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే, శాశ్వత ప్రాతిపదికన ప్రతి ఏటా 30 కోట్లు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర, రాష్ట్రాల నిధులతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. -
రహదారుల నిర్మాణాలకు గడ్కరీ పునాది రాయి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నాలుగు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పునాది రాయి వేయనున్నారు. శనివారం రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరవుతారు. రూ.1,523 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణాలకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో హైదాబాద్-బెంగళూరు ఎన్హెచ్ 44, ఆరాంఘర్– శంషాబాద్మార్గాన్ని ఆరు లేన్ల రహదారిగా తీర్చిదిద్దడం, ఎన్హెచ్ 765డి లో హైదరాబాద్ జౌటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు ఉన్నరోడ్డు స్థాయిని పెంచడం, అంబర్పేట్- ఉప్పల్ ఎక్స్ రోడ్ రోడ్డును నాలుగు లేన్లగా తీర్చిదిద్దడం, ఉప్పల్-నారాపల్లి రోడ్డును ఆరు లేన్లుగా తీర్చిదిద్దే నిర్మాణాలు ఉన్నాయి. -
ప్రతి డివిజన్లో కూరగాయల స్టాల్స్ ఏర్పాటు
హైదరాబాద్ : రైతు బజార్ మాదిరిగానే రైతుకు, వినియోగదారునికి అనుకూలంగా ప్రతి డివిజన్లో ‘మన కూరగాయలు’ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రామంతపూర్ కేసీఆర్ నగర్లో రైతు బజార్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ , ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ , కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ..కొంత ఆలస్యమైనా కూడా రామంతపూర్లో అత్యాధునిక సౌకర్యాలతో, ఎన్ని నిధులైనా కూడా మంచి రైతు బజార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 50 స్టాల్స్ ప్రారంభించామని, త్వరలో అన్ని డివిజన్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
అమృత యూనివర్సిటీకి శంకుస్థాపన
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కూరగల్లులో అమృత విశ్వవిద్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం భూమిపూజ చేశారు. 200 ఎకరాల్లో దశల వారీగా 2వేల కోట్లతో విద్యాసంస్థలు నిర్మాణం జరగనుంది. తొలుత ఇంజినీరింగ్ విభాగానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి అమృత స్వరూపానంద పూరీ, మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ....‘ విలువలతో కూడిన అమృత విశ్వవిద్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయడం అభినందనీయం. మాతా అమృతానందమయి ట్రస్ట్ సమాజం కోసం ఎనలేని సేవలు చేస్తోంది. సునామీ కబళించిన సందర్భంలో ఈ ట్రస్ట్ చేసిన సేవలు విలువ కట్టలేం. ప్రపంచంలో అమృత విశ్వవిద్యా పీఠం సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమరావతిలో కూడా కొనసాగాలి. ఈ విశ్వవిద్యాలయం వల్ల అమరావతికి శోభ వస్తుంది. సైన్స్, ఇంజినీరింగ్, ఇన్నోవేషన్, సోషల్ సైన్స్, గ్లోబల్ పీస్ వంటి అనేక టెక్నాలజీలతో కూడిన శిక్షణ తరగతులు అందుబాటులోకి వస్తాయి.’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే రాజధానిలో తొమ్మిది నగరాలు వస్తున్నాయని, చరిత్రలో లేనివిధంగా రైతులు వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రాబోయేవి ఆషామాషీ నగరాలు కావంటూ.. ప్రపంచస్థాయి నగరాలకు ధీటుగా అమరావతిని హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎన్నిక కష్టాలు వచ్చినా సరే సంకల్పంతతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇక కృష్ణానదిపై అయిదు రిజర్వాయర్లు రాబోతున్నాయని, విజయవాడ..గుంటూరు నగరాలను మెగా సిటీలుగా రూపురేఖలు మార్చుతామని తెలిపారు. మోసం చేశారని మండిపడ్డ మహిళలు అమృత యూనివర్సిటీ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు డ్వాక్రా బృందాలతో భారీగా మహిళల్ని తరలించారు. అయితే సభకు వచ్చినవారికి చీరలు ఇస్తామని చెప్పి నిర్వాహకులు టోకెన్లు ఇచ్చి, చీరలు పంచకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు వస్తే చీరలు ఇచ్చి భోజనం పెడతామని తమను తీసుకు వచ్చి మోసం చేశారని మహిళలు మండిపడ్డారు. -
త్వరలో గొల్ల, కురుమల భవన శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: గొల్ల, కురుమల సంక్షేమ భవన శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో గొల్ల, కురుమలు హాజరుకావాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని నాగోల్లో జరిగిన గొల్ల, కురుమ సంఘాల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. గొల్ల, కురుమల సంక్షేమ భవనం కోసం 10 ఎకరాల భూమి, రూ. 10 కోట్లు మంజూరుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని అన్నారు. దీనిలో 5 ఎకరాలు గొల్ల కులస్తులకు, మరో 5 ఎకరాలు కురుమ కులస్తులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. త్వరలో జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి గొల్ల, కురుమలు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గొర్రెల సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్య యాదవ్, భిక్షపతి యాదవ్, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
20న వరంగల్ ఓఆర్ఆర్కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ నెల 20న శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణానికి రూ.669 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కేంద్రం ఓవైపు ఓఆర్ఆర్ నిర్మాణం చేపడుతుండగా, రాష్ట్రప్రభుత్వం కూడా పనులు చేపట్టనుంది. వరంగల్ ఓఆర్ఆర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు శంకుస్థాపనకు అంగీకరించిన కేసీఆర్కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఓఆర్ఆర్ ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించడంలో కడియం ప్రత్యేక చొరవ తీసుకున్నారని సీఎం కొనియాడారు. అదే స్ఫూర్తితో నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని కడియంను కోరారు. -
నగరంలో డబుల్ ఇళ్లకు శంకుస్థాపన
హైదరాబాద్: నగరంలోని మారియట్ హోటల్ వద్ద 180 యూనిట్ల డబుల్ బెడ్రూం అపార్ట్మెంట్ల నిర్మాణానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు శనివారం ఉదయం భూమిపూజ చేశారు. రూ.15.57 కోట్ల వ్యయంతో బన్సీలాల్పేట్ డివిజన్లోని జీవైరెడ్డి కాంపౌండ్ కవాడిగూడలో వీటిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమం అనంతరం మంత్రి కేటీఆర్ బస్నీలాల్ పేటలో పర్యటించారు. -
కరీంనగర్లో 'డబుల్' ఇళ్ల శంకుస్థాపన
కరీంనగర్ : కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మానగర్లో మంత్రి ఈటెల రాజేందర్ గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి విడతలో 1400 ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, మరో 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తామని తెలిపారు. అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని, రాజీవ్ గృహకల్పలో ఆగిపోయిన ఇండ్లను కూడా పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పలువురు నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అమరావతికి ఏడు డైమండ్లు
-
అమరావతికి ఏడు డైమండ్లు: చంద్రబాబు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో ఏడు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతిలో పరిపాలన భవనాలకు చేరుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఏడు రహదారుల నిర్మాణానికి సీఎం భూమిపూజ చేశారు. రూ.915 కోట్లతో నిర్మించనున్న ఈ ఏడు రోడ్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు రోడ్లు రాజధానికి ఏడు డైమండ్లు అని అభివర్ణించారు. ఈ ఏడు రోడ్లను వచ్చే ఉగాదికల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. భవిష్యత్లో ఒలింపిక్స్ ఇక్కడే నిర్వహించేలా అమరావతిని తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడు ప్రధాన రహదారులతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుందన్నారు. స్థిర నివాసంతో పాటు పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు అమరావతి కేంద్రం అవుతుందని చంద్రబాబు అన్నారు. ఇక ఉండవల్లి, పెనుమాక, నిడమర్రులో కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదని, వారు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి భూములు ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా ఈ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 331 ఎకరాలను సమీకరించింది. అయితే యర్రబాలెంలో మరో 12.50 ఎకరాలను రైతులు సమీకరణకు ఇవ్వలేదు. మరోవైపు రహదారుల నిర్మాణానికి రూ.915 కోట్లను ప్రపంచ బ్యాంక్ ఇస్తుందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నప్పటికీ ... ఆ ప్రతిపాదనలకు ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంక్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. దీంతో హడావుడిగా శంకుస్థాపన చేసినా...పనులు జరగడం కష్టమేనని కొందరు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పొగడ్తలు.. పాదాభివందనాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అపర భగీరథుడు.. అభినవ కాటన్.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే జనం దృష్టిలో దేవుడు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనకు పాదాభివందనం చేయడానికీ పోటీపడ్డారు. మంత్రి రావెల కిషోర్బాబు అయితే ఓ కవిత రాయించి గాయనితో పాడించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో స్పిల్ వే కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. దీనికి ముందు సుదర్శన, వాస్తు హోమాలు నిర్వహించి.. గోదావరి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచింగ్ ప్లాంట్ (కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్)ను ప్రారంభించారు. ఆ తరువాత స్పిల్వే వద్ద పూజలు చేసి కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరిఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఏడు ముంపు మండలాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమవుతుందని భావిం చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ఆ మండలాలను ఏపీలో విలీనం చేయించానని బాబు చెప్పారు. ఈ మండలాలను విలీనం చేయకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కూడా ప్రధాని వద్ద చెప్పానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని స్పందించి ఏడు మండలాలు విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఇది తన ఘనతేనని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కొత్త భూసేకరణ చట్టం వర్తింపునకు చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ఆ ప్రకారమే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. జనవరి 7, 14వ తేదీల్లో ఇక్కడకు వచ్చి ప్రాజెక్ట్కు సంబంధించి డయాఫ్రమ్వాల్, గేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రాజెక్ట్ కోసం సహకరించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి అందరినీ పేరుపేరునా సభకు పరిచయం చేశారు. పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులను పండగలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. 680 బస్సుల్లో పోలవరం ప్రాజెక్ట్ సైట్కు ప్రజల్ని తరలించారు. ఇందుకోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించి మరీ బస్సులను తీసుకొచ్చారు. సభకు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే పసుపు కుంకుమ సొమ్ము రూ.3 వేలు ఆగిపోతాయని గోపాలపురం మండల టీడీపీ కార్యకర్తలు మహిళలను బెదిరించి బస్సులు ఎక్కించగా, నల్లజర్ల మండలంలో సభకు రాని మహిళలకు రూ.300 చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. ఆచంట నుంచి 78 స్కూల్ బస్సుల్లో మహిళల్ని తీసుకొచ్చారు. సభకు రాకపోతే సోపానం ఇంటర్వూ్యల్లో లబ్ధిదారులను పక్కన పెడతారని, కొత్త ఇళ్లు మంజూరు చేయరని, డ్వాక్రా గూపు సభ్యులకు రుణాలు మంజూరు చేయరని అధికారులు ప్రచారం చేసి మహిళలను, వివిధ పథకాల లబ్ధిదారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. నరసాపురం, సమీప గ్రామాల నుంచి ప్రైవేట్ కళాశాలలకు చెందిన బస్సులలో జనాన్ని తీసుకెళ్లారు. ఈ ప్రాంతం నుంచి మహిళలు తక్కువ సంఖ్యలోనే వెళ్లారు. మనిషికి రూ.300 వరకూ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రసంగాలు మూడు గంటలకు పైగా సాగడంతో జనమంతా మధ్యలోనే సభ నుంచి తిరుగుముఖం పట్టారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రతిజ్ఞ చేయించే సమయానికి సభాస్థలిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు మాత్రమే మిగిలారు. పొరుగు జిల్లాల నుంచీ జనం తరలింపు పోలవరం/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజలను తరలించారు. కొవ్వూరు నుంచి పోలవరం వరకు ఏటిగట్టు రోడ్డు సింగిల్ లేన్ కావడంతో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గూటాల సమీపంలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కొత్త పట్టిసీమ నుంచి గూటాల వరకు బస్సులను మళ్లించారు. పోలవరం నుంచి తాళ్లపూడి మార్గంలో ఆర్టీసీ బస్సులు నడపకపోగా, ఆటోల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని ఎత్తైన ఘాట్ రోడ్లపైకి బస్సులు వెళ్లేందుకు మలుపుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సభకు వచ్చిన జనం భయాందోళనకు లోనయ్యారు. సభ ముగిసిన తరువాత వాహనాలన్నిటినీ ఒకే మార్గంలో మళ్లించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. సభా ప్రాంగణానికి వెళుతున్న మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనను చూసి పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. -
పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభం
పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులను ఆరంభించారు. 52 బ్లాకులుగా స్పిల్వే నిర్మాణం జరగనుంది. ఇక కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, , నిర్మలా సీతారామన్ తదితరులను ఆహ్వానించినా వారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కేంద్రమంత్రులు వస్తారని కాంక్రీట్ పనుల శంకుస్థాపనను రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అయితే వాళ్లు ఈ కార్యక్రమానికి గైర్హాజరై చంద్రబాబుకు షాకిచ్చారు. -
పోలవరం స్పిల్వే కాంక్రీట్ పనులు ప్రారంభం
-
రాష్ట్రంలో 13 వేల శ్మశానవాటికల అభివృద్ధి
అవనిగడ్డ : రాష్ట్రంలోని 13 వేల శ్మశానవాటికలను (ఒక్కోదానికి రూ.10 లక్షల చొప్పున) అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డలో రూ.1.10 కోట్లతో నిర్మించనున్న వంతెన, రహదారి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 2,500 పంచాయతీల్లో ఒక్కోదానికి రూ.15 లక్షలతో గ్రామ సచివాలయాలను నిర్మించనున్నట్టు చెప్పారు. భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు పంచాయతీలు 30 శాతం నిధులు సమకూర్చుకుంటే మిగిలిన 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల గృహాలకు ఇంకా మరుగుదొడ్లు లేవని, 2019 నాటికి నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. స్వచ్ఛభారత్ నిర్వహించే గ్రామాలకు నిధుల మంజూరులో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 4,500 కిలోమీటర్ల మేర సీసీ రహదారుల నిర్మాణం పూర్తికాగా, మరో 2,600 కిలోమీటర్లలో నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఇంకో 2,400 కిలోమీటర్ల మేర సీసీ రహదారులను నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తొలుత రూ.27.5 లక్షల వ్యయంతో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి చింతకాయల ప్రారంభించారు. కార్యక్రమంలో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, స్వచ్ఛభారత్ మిషన్ రాష్ట్ర అంబాసిడర్ డాక్టర్ సీఎల్ రావ్ తదితరులు పాల్గొన్నారు. -
కొల్లేరు హామీలు అమలు చేస్తాం
మంత్రి కామినేని 29న పెద్దింట్లమ్మ వారధికి శంకుస్థాపన సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు రాక కైకలూరు : ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ప్రకటించిన హామీలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పెద్దలతో ఆదివారం సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద వారధి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మంత్రులు హాజరవుతారని తెలిపారు. గతంలో వారధి నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయించారని, ఇప్పుడు పెరిగిన ఖర్చులను పరిగణలోకి తీసుకుని నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో Mýృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు సంఘ అధ్యక్షులు సైదు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బలే ఏసురాజులు పాల్గొన్నారు. భూముల పంపిణీపై.. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కృష్ణాజిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన భూముల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇక కొల్లేరు కాంటూరు కుదింపు అంశం కేంద్ర స్థాయిలో ఉందన్నారు. -
కరీంనగర్లో భారీ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
-
టాటా -బోయింగ్ సంస్థకు నేడు రక్షణ మంత్రి పరీకర్
♦ పునాదిరాయి శంకుస్థాపనకు ♦ హాజరుకానున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ♦ వైమానిక రంగానికి కేంద్రబిందువుగా జిల్లా 13 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు దేశ వైమానికరంగానికి తలమానికంగా మారనుంది. ఇప్పటివరకు సికోర్స్కై, లుకుడ్ మార్టిన్ సంస్థతో కలిసి సీ-130జే ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ల కేబిన్లను తయారు చేస్తుండగా తాజాగా ప్రపంచ అగ్రశ్రేణి విమానయాన సంస్థ బోయింగ్ కూడా జత కలవడంతో ఏరోస్పేస్ హబ్గా జిల్లా పేరు మార్మోగనుంది. గగనతలంలో ఠీవిగా ఎగిరే బోయింగ్ విమాన తయారీకి మన జిల్లా.. కేంద్రం కానుంది. అమెరికాకు చెందిన బోయింగ్ విమానాల విడిభాగాల తయారీకి ఆదిబట్ల వేదికకానుంది. ఇప్పటికే వైమానిక రంగానికి చిరునామాగా నిలి చిన ‘టాటా ఏరో స్పేస్జోన్’లో దేశంలోనే ప్రప్రథమంగా ఈ బోయింగ్ విమానాల తయారీ కేంద్రం నెల కొల్పుతుండడం విశేషం. టాటా -బోయింగ్ కంపెనీలు సంయుక్తంగా నెలకొల్పుతున్న ఈ సంస్థకు శనివారం కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరీకర్ పునాదిరాయి వేయనున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దివంగత సీఎం వైఎస్.రాజ శేఖరరెడ్డి హయాంలో ‘టాటా ఏరో స్పేస్ జోన్’ ప్రకటించడంతో ఆదిబట్ల రూపురేఖలే మారిపోయాయి. అదేసమయంలో టీసీఎస్, కాగ్నిజెంట్లాంటి ఐటీ సంస్థలు కొలువుదీరడంతో రియల్కు రెక్కలొచ్చా యి. ఇవేకాకుండా సమూహ తదితర సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో నగరీకరణ విస్తృతంగా పెరిగింది. మరోవైపు ఆదిబట్ల ఏరోస్పేస్ జోన్కు కొనసాగింపుగా సమీపంలోని ఎలిమినేడులో కూడా ఏరోపార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీగా భూ సమీకరణ చేపడుతోంది. దాదాపు ఐదారు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసే ఈ జోన్లో.. అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన విమానరంగ తయారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. బోయింగ్ విమాన కేబిన్ల తయారీ కంపెనీకి శనివారం రక్షణమంత్రి పరీకర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంకురార్పణ చేయనుండడంతో త్వరలోనే ఆదిబట్ల పేరు విశ్వవ్యాప్తం కానుంది. -
పనులు పూర్తికాకుంటే సస్పెండే
♦ పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి ♦ బహిరంగ వేదిక నుంచే మంత్రి హరీశ్రావు సమీక్ష పాపన్నపేట: స్థలం : పెద్ద చెరువు (బాచారం, పాపన్నపేట మండలం) సందర్భం : మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా గుండువాగు శంకుస్థాపన విషయం : బహిరంగ సభలో వేదిక పైనుంచి సమీక్ష సమావేశం మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీశ్రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వానాకాలం సమీపిస్తుండడంతో పనులు తొందరగా పూర్తి చేయించాలన్న కచ్చితమైన లక్ష్యంతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పాపన్నపేట మండలం బాచారం గ్రామంలో శుక్రవారం గుండువాగు పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి హరీశ్ బహిరంగ వేదిక నుండే ఇరిగేషన్ అధికారులు ఈఈ యేసయ్య, డిప్యుటీ ఈఈ శివ నాగరాజు, జేఈ కుషాల్తో సమీక్ష నిర్వహించారు. మంత్రి: మెదక్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ మొదటి ఫేజ్ కింద 165 పను లు మంజూరు అయితే ఇంకా పూర్తి కాలేదు. ఈఈ : సార్, మొత్తం 165 పనుల్లో 109 గ్రౌండ్ చేశాం. 23 అగ్రిమెంట్ కాలేదు. 34 పనులు ప్రారంభం కాలేదు. మంత్రి: ఇంకెప్పుడు చేస్తారు. ఏం ముహూర్తాలు కుదరడం లేదా. వర్షాకాలం వచ్చాక చేస్తారా? అధికారి: ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తాం మంత్రి: అగ్రిమెంట్లో ఆలశ్యం ఎందుకు? ఎస్ఈతో మాట్లాడండి డిప్యుటీ ఈఈ : మాట్లాడుతాం సార్ మంత్రి: నర్సాపూర్లో కూడా ఇంకా 82 పనులు అసంపూర్తిగా మిగిలాయి. ఈఈ: అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం సార్ మంత్రి: రాష్ట్రంలో ఖమ్మం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఎందుకు పనులు సాగడం లేదంటే ఖమ్మం జిల్లాకు ఆంధ్రా నుండి జేసీబీలు వస్తున్నాయంటున్నారు. ఇక్కడ జేసీబీలు లేవంటున్నారు. ఈఈ: లేదు సార్ పూర్తి చేస్తాం. మంత్రి : వచ్చే మృగసిర కల్లా పనులు పూర్తి చేయక పోతే జేఈలను సస్పెండ్ చేస్తా. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి: ముప్పై ఏళ్లుగా నానుతున్న గుండు వాగు పనిని డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అడిగారు. వెంటనే రూ.1.08 కోట్లు మంజూరు చేశా. బుల్లెట్ లాంటి కాంట్రాక్టర్ దొరికాడు. ఈ పనిని కూడా నెల రోజుల్లో పూర్తి చేయించాలి. అంటూ సమీక్ష ముగించారు. -
అ అంటే అమరావతి..ఆ అంటే ఆంగ్లం..!!
'ఇక పై అ అంటే అమరావతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని స్థిరపడిపోవాలి..' అని తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయితే రాధాని అమరావతికి గతేడాది అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంతో పాటు, తాత్కాలిక సచివాలయానికి సీఎం చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం కూడా ఆంగ్లంలోనే ఉండడం గమనార్హం. తెలుగువారి రాజధానిలో తెలుగుకు పట్టిన గతికి ఇదే నిదర్శనం. దీన్ని బట్టి అ అంటే అమరావతి.. ఆ అంటే ఆంగ్లం అనుకోవాలేమో..!! -
రాజ్భవన్ క్వార్టర్లకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాజ్భవన్ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాజ్భవన్ వెనకనున్న విశాల స్థలంలో రూ.97.5 కోట్ల అంచనా వ్యయం తో ఈ నిర్మాణం చేపడుతున్నారు. క్వార్టర్లతో పాటు పాఠశాల భవనం, కమ్యూనిటీ హాల్, భద్రతా సిబ్బంది బ్యారెక్ పనుల కోసం గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం పరిపాలనాపర అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలో ప్రాజెక్టు నమూనాను గవర్నర్, సీఎం తిలకించారు. ప్రాజెక్టు విశేషాల గురించి గవర్నర్ స్వయంగా సీఎంకు వివరించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, డీజీపీ అనురాగ్శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి, ఆర్ అండ్ బీ కమిషనర్ సునీల్శర్మ పాల్గొన్నారు. మొత్తం 185 ఫ్లాట్లు... రాజ్భవన్లో 1956లో నిర్మించిన ప్రస్తుత క్వార్టర్స్ శిథిలావస్థకు చేరాయి. వర్షా కాలంలో పైకప్పు నుంచి నీళ్లు కారుతుండడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సిబ్బంది కోసం కొత్త నివాస సముదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చేపట్టిన నూతన ప్రాజెక్టులో క్వార్టర్స్ తదితర భవనాలను 2,93,211 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది వసతి కోసం జీ+5లో 185 ఫ్లాట్లను, 500 మంది విద్యార్థులకు సరిపోయేలా జీ+2తో పాఠశాల భవనం, 500 మంది సామర్థ్యంతో కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తున్నారు. ఒప్పందం మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 6 లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది. -
రాజ్భవన్లో క్వార్టర్స్ నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్ : హైదరాబాద్లోని రాజ్భవన్లో సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ దంపతులతోపాటు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో వారు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్కి గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్లో సిబ్బంది క్వార్టర్స్ కోసం ప్రభుత్వం రూ. 97.50 కోట్ల కేటాయించింది. ఈ నిధులతో రాజభవన్లో స్కూల్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్, సెక్యూరిటీ బరాక్ నిర్మించనున్నారు. -
చదువుకున్న బడికి శంకుస్థాపన చేసిన కేసీఆర్
మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రవెల్లిలో దాదాపు 29 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎర్రవల్లిలో దాదాపు 42.5 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్కు శంకుస్థాపన చేశారు. కాగా మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయింది. అరకొర వసతుల మధ్య విద్యనభ్యసించిన నాటి విద్యార్థి కేసీఆర్.. నేడు ముఖ్యమంత్రి హోదాలో పాఠశాల నూతన భవన శంకుస్థాపన చేశారు. తాను అష్టకష్టాలు పడి విద్యను పూర్తిచేశానని, తనకొచ్చిన బాధలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రావొద్దన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.4.67 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో బాలాజీ ఫంక్షన్ హాలులో సీఎం సమీక్ష నిర్వహించారు. కాగా మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో వెంకటేశ్వర ఆలయంలో తన బాల్యమిత్రులతో సీఎం గడపనున్నారు. -
'టీ టీడీపీకి మర్యాద లేదా..'
హైదరాబాద్: నగరంలోని ప్రగతినగర్ ఇన్కాయిస్లో నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కార్యాచరణ శిక్షణా కేంద్ర భవనాల సముదాయాన్ని సోమవారం శాస్త్ర సాంకేతిక మరియు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సృజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా.. శిలాఫలకం పై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల పేర్లు లేకపోవడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన మల్కాజ్ గిరి ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి టీడీపీ పార్టీకి చెందిన వారేనని, తనతో పాటు స్థానిక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా టీడీపీకి చెందిన వారే అయినా తమ పేర్లు లేకపోవడం ఆశ్ఛర్యంగా ఉందని ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే టీడీపీ పార్టీనా.. తెలంగాణ టీడీపీకి విలువలేదా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. -
1450 మురికివాడల్లో 'డబుల్' ధమాకా
దశలవారీగా 1.08 లక్షల ఇళ్లు * స్లమ్ ఫ్రీ సిటీనే లక్ష్యం: మంత్రులు * గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో 'డబుల్ బెడ్రూం' శంకుస్థాపనలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను స్లమ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు నగరంలోని 1450 మురికివాడల్లో దశలవారీగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర మంత్రులు చెప్పారు. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, అందు లో భాగంగా మురికివాడల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. నగరంలోని ఐదు నియోజకవర్గాల పరిధిలోని ఏడు ప్రాంతాల్లో గురువారం డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ, మం త్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, కె.టి.రామారావు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా... 'హైదరాబాద్ని గుడిసెలు, మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు 1,08,000 ఇళ్లను దశలవారీగా నిర్మిస్తున్నాం. వీటితో పాటు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా ఈ ఇళ్లు ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది 10 వేలు, ఆ మరుసటి సంవత్సరాలు వరుసగా 25 వేలు, 50 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏడాది కాలంలో నగరంలోని ఐడీహెచ్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి దాదాపు 400 కుటుంబాలకు అందజేశాం. ఈ మోడల్ కాలనీని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చి ఆసక్తిగా సందర్శిస్తున్నారు’ అని కేటీఆర్ అన్నారు. మహమూద్అలీ మాట్లాడుతూ... 'టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలోని 1.08 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేసి రికార్డు సృష్టించింది. సామాజిక భద్ర త పింఛన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది' అన్నారు. నాయిని మాట్లాడుతూ... ‘నగరంలోని ఆటోలకు రూ.77 కోట్ల రవాణా పన్ను మాఫీ, డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాల ద్వారా ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా నిలిచింది’ అని చెప్పారు. 'డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎవరూ ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. మొత్తం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది' అన్నారు. శంకుస్థాపనలు జరిగిందిక్కడే... రసూల్పురా క్రాస్రోడ్, కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్ (కంటోన్మెంట్ నియోజకవర్గం), లంబాడీతండ, శ్రీసాయిచరణ్కాలనీ; బాగ్లింగంపల్లి చౌరస్తా (ముషీరాబాద్), కాంగారి నగర్ (అంబర్పేట), పిల్లిగుడిసెలు (మలక్పేట), సర ళాదేవినగర్ (యాకుత్పురా) -
ఈ వరం ఎన్నడు సాకారం ?
సాగర్ జలాశయ విస్తీర్ణం : 110 చదరపు మైళ్లు గరిష్ట నీటిమట్టం : 590 అడుగులు డెడ్ స్టోరేజి లెవల్ : 490 అడుగులు నిల్వ నీరు : 408 టీఎంసీలు డెడ్ స్టోరేజి నీరు : 168 టీఎంసీలు లక్షలాది ఎకరాలకు సాగునీరందిస్తూ అన్నదాతల పాలిట జీవనధారగా విరాజిల్లుతున్న నాగార్జున సాగర్ జలాశయం మన రాష్ట్రానికే మకుటాయమానం. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ వంటి ఎంతోమంది మహనీయుల కలల వారధిగా నిర్మితమైన సాగర్ నేటికీ వారి లక్ష్యాలను చేరలేదనే చెప్పాలి. ఆయకట్టు చివరి వరకూ నీరందించాలనే ముఖ్యుల ఆశయ సాధనకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కృషిచేసినా ఆయన మరణానంతరం చతికిలపడింది. నేటికి (గురువారం) నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేసి 60ఏళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కథనం. నెరవేరని సాగర్ లక్ష్యం చివరి భూమి వరకూ నీరు ఎప్పటికి చేరేను? నేటికి 60ఏళ్లు పూర్తి విజయపురి సౌత్/మాచర్ల : నాగార్జునసాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి గురువారానికి 60ఏళ్లు. కోట్లాదిమంది ప్రజలకు జీవనాధారంగా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు విరాజిల్లుతోంది. 1955 డిసెంబర్ 10న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్లో శంకుస్థాపన చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తిస్థాయి మానవశక్తితో నిర్మితమైన ప్రాజెక్టు ఇది. సాగునీటి కోసం కుడి, ఎడమ కాలువలు కూడా నిర్మించారు. కుడికాలువను జవహర్ కాలువగా, ఎడమ కాలువను లాల్బహుదూర్ కాలువగా పిలుస్తారు. కాలువలే సాగుకు ప్రధానం జవహర్ కాలువ పనులను అప్పటి ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956, అక్టోబర్ 10న ప్రారంభించారు. దక్షిణ విజయపురి వద్ద సొరంగమార్గం ద్వారా ఈ కాలువ ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీనిపై ఆధారపడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 20లక్షల 62వేల ఎకరాలు సాగవుతోంది. ఇక లాల్బహుదూర్ కెనాల్ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. దీని నిర్మాణాన్ని నాటి గవర్నర్ భీమ్సేన్ సచార్ 1959లో ప్రారంభించారు. పొడవు 349 కిలోమీటర్లు. దీనిపై ఆధారపడి 14లక్షల 50వేల ఎకరాలు సాగవుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు కుడి కాలువలాగే ఈ కాలువకూ నీరు విడుదల చేయవచ్చు. దీని నిర్మాణానికి సుమారు రూ.675 కోట్లు వ్యయమైనట్టు అంచనా. సాగర్ ప్రాజెక్టు కింద ఏడాదికి సగటున కనీసం రూ.1,500 కోట్ల విలువైన వ్యవసాయం సాగవుతోందని అంచనా. ఆగస్టు 4, 1967న నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు నీటిని వదిలారు. పూడిక నిండటంతో చాలని నీరు నాగార్జున సాగర్తో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలోకి పూడిక చేరడంతో ఒకసారి నిండితే గానీ రెండు పంటలకు నీరు సరిపోవట్లేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి నిర్మించటం, కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం లేకపోవటం, సాగునీటిశాఖ అధికారుల ప్రణాళికలు లేకపోవడంతో తాగునీరు పేరుతో నీరు విడుదల చేస్తున్నారు. కన్నీటి సాగునీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్ పరిధిలో 22 లక్షల ఎకరాలను సాగు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది కనీసం రెండు లక్షల ఎకరాలకు కూడా నీరందలేదు. దీంతోపాటు కృష్ణాడెల్టాకు నీరు విడుదల కాకపోవటంతో మరో ఐదు లక్షల ఎకరాలు ఎండిపోయే పరిస్థితి. నాడు సాగర్ రిజర్వాయర్ నుంచి ఏటా కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలయ్యేది. నేడు కనీసం తాగునీటికి కూడా నీటిని విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. నాడు సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రాజెక్టు నిర్దేశిత విధానం ప్రకారం సాగునీరు విడుదల చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ లక్ష్యం నెరవేరలేదు. ఆనాటి అద్భుత కట్టడమైన బహుళార్థక ప్రాజెక్టు సాగర్ నేడు హైదరాబాద్ మంచినీటి అవసరాలు, ఎస్ఎల్బీసీకి నీటి విడుదల, కుడి, ఎడమ కాలువలకు తాగునీరుకే పరిమితమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీటి లక్ష్యాలను నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు, కూలీలు, ఆయకట్టు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నెరవేరని వైఎస్ కల నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. ఆనాడు తవ్విన కాలువల సిమెంట్ నిర్మాణాలు దెబ్బతిని నేడు చివరి భూముల వరకూ నీరందని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాగర్లో స్వర్ణోత్సవాలు జరిపారు. చివరి ఎకరం వరకూ కాలువల ద్వారా నీరు అందాలని భావించిన ఆయన ప్రపంచ బ్యాంకు రుణంతో సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడంతో పాటు ప్రాజెక్టు జీవిత కాలాన్ని పెంచాలనే ఉద్దేశంతో పనులు చేపట్టారు. ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు కాకపోయినా ఆధునికీకరణ పనులు మొదలుపెట్టారు. వైఎస్ మరణం తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరైనా పనులు నేటికీ నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. ఈనాడు నాగార్జున సాగరానికి నేనిక్కడ జరిపే శంకుస్థాపనను పవిత్రకార్యంగా పరిగణిస్తున్నాను. ఇది భారత ప్రజాసౌభాగ్య మందిరానికే శంకుస్థాపన. ఈనాడు మనం ఆసేతు హిమాచల పర్యంతం నిర్మించుకుంటున్న నవదేవాలయాలకు ఇది చిహ్నం (నాగార్జున సాగర్ శంకుస్థాపన సందర్భంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలు) -
9 అంతస్తుల్లో 'డబుల్' ఇళ్లు
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో రేపు(గురువారం) డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి బ్లూప్రింట్ ఫోటోలను ఆయన మంత్రిత్వశాఖ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో 8,650 ఇళ్ల నిర్మాణం చేయనుంది. వీటిలో ఒక్కో ఇంటికి రూ.6.81 లక్షల వ్యయం చేయాలని ప్రణాళికలు రచించారు. మొత్తం 17 ప్రాంతాల్లో 9 అంతస్తుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరపనున్నారు. Elevation designs of 2 BHK flats to be built for poor by govt in Hyderabad. Foundation stone to be laid tomorrow. pic.twitter.com/olDlmvU31K — Min IT, Telangana (@MinIT_Telangana) December 9, 2015 -
డిసెంబర్ 5న దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన
విజయవాడ : విజయవాడ నగరంలో దుర్గగుడి ఫ్లైఓవర్కు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితీన్ గడ్కరీ, వెంకయ్యనాయుడిలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 464 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్మాణాన్ని కృష్ణా పురష్కరాల నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసునేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. -
అది ‘సెంటిమెంట్’కు శంకుస్థాపన
శంకుస్థాపన ఆర్భాటాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తున్నారు? కొంత మంది మంత్రులు శంకుస్థాపన పనులకు రూ.9 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదని చెప్పారు. ‘ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వచ్చుగా’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కొన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నాం. కనుక ఆ ఖర్చును ఈ పద్దులో చూపలేం అని తప్పించుకుంటున్నారు. ‘అప్రాధాన్యతాంశాన్ని ప్రాధాన్య తాంశంగా మార్చడం; ప్రాధాన్య తాంశాన్ని అప్రాధాన్యతాంశం చేయడమే రాజకీయం’(Making a non-issue into an issue and an issue into a non-issue) అన్నది ఓ రాజకీయ నానుడి. దీనిని ఓ కళగా చేసుకొని రాజకీయాల స్వరూప స్వభావాల్ని తమకు అనుకూలంగా మార్చుకొన్న నాయకులు చరిత్రలో అనేకమంది కనిపిస్తారు. తెలుగునాట ఆ కళలో ఆరితేరిన నేతల్లో చంద్రబాబునాయుడు ఒకరు. అందుకు గురువారం జరిగిన అమరావతి శంకుస్థాపన ఉదంతమే ఉదాహరణ. ‘అమరావతి నిర్మాణం’ పేరుతో ముఖ్య మంత్రి చంద్రబాబు గొప్ప ప్రచార హోరును సృష్టించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, వామపక్షాలు చేస్తున్న పోరాటాలు ఆ హోరులో కొట్టుకుపోతాయన్నది చంద్ర బాబు వ్యూహం. అంతేకాదు.. అమరావతి శంకుస్థాపనలాంటి చరిత్రలో నిలిచిపోయే ఓ అపూర్వమైన వేడుకకు హాజరుకాకపోతే అదో నేరమనీ, గైర్హాజరయ్యేవారు చరిత్రహీ నులుగా మిగిలి పోతారనీ ఓ వింత వాదన లేవదీసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఘనమైన రాజధాని కావాల్సిందే. వద్దని ఎవ్వరూ అనలేదు. కానీ నూతన రాజధాని నిర్మాణం పేరుతో సాగిన విధ్వంసం, చట్టాల ఉల్లంఘన; శంకుస్థాపన పేరుతో జరి గిన ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలపైననే ప్రతి పక్షాలు, మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రభు త్వం ఆలోచన వేరు. తాము ఏకపక్షంగా సాగిస్తున్న కార్యక్రమా ల్లోని లొసుగులను, ఉల్లంఘనలను ప్రశ్నించకుండా, నోరుకట్టేసు కొని అందరిలా కేవలం అతిథులుగా పాల్గొని వెళ్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతంగా కనిపిస్తుంది. ఓటుకు కోట్లు కేసు ఏమైంది? అవసరం అనుకొంటే చంద్రబాబు రాజకీయంగా ఒకటికాదు, అనేక మెట్లు దిగడానికి సిద్ధపడతారు. అది ఆయన బలం కావొచ్చు. లేదా నైజం కావచ్చు. కాని, ప్రజాప్రయోజనాల విష యంలో రాజీపడడం సహించరానిది. తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశాన్ని కుదిపివేసిన ‘ఓటుకు కోట్లు కేసు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి చంద్రబాబు, ఆయన పార్టీ సహచరులు డబ్బు ఎర వేశారని; తద్వారా తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్న క్ర మంలోనే తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఏసీబీకి చిక్కినట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏసీబీ చార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ఉటంకించింది. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్తో సహా పలువురి ఫోన్లను ‘ట్యాప్’ చేశారని; దీంతో తెలం గాణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కానీ ఓటుకు కోట్లు కేసు దాదాపు క్లైమాక్స్కు చేరుకుందన్న దశలో అటు ఇటు అంతా అనూహ్యంగా మిన్నకుండిపోవడమే అనుమానాలు కలిగిస్తున్నది. శంకుస్థాప నకు ఆహ్వానించడానికి చంద్రబాబు స్వయంగా చంద్రశేఖర్రావు ఇంటికి వెళ్లడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. రెండు రాష్ట్రాల అభివృ ద్ధికి అది అనివార్యం. కాకపోతే తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు చేసుకొన్న నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు కలుసుకోవ డం, ఓ 10 నిమిషాలు ఏకాంతంగా చర్చించుకోవడం అనుమానా లకు ఆస్కారమిస్తుంది. ప్రత్యేక హోదా హక్కును వదులుకోవడానికి సిద్ధపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి ‘రాజ ధాని సెంటిమెంట్’కు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే... ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పెద్దల్ని కలుసుకొనే సమయంలో తిరుపతి లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నారు. భక్తిప్రపత్తులు, మత విశ్వా సాలు వ్యక్తిగతంగా ఉండటంలో తప్పేమీకాదు. కాని, అవి పరిపా లనలో, ప్రభుత్వపరంగా చేసే ప్రతిపనిలో ప్రతిఫలించడం లౌకిక స్ఫూర్తికి విరుద్ధం. ‘అమరావతి శంకుస్థాపన’ సందర్భంగా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి మట్టి, నీరు సేకరించడానికి ‘మననీరు - మన మట్టి’ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒక్కో జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున రూ.39 కోట్లు కేటాయించారు. ‘రాజధాని అమరావతి’ అందరిదీ అనే భావన కేవలం అన్ని ప్రాంతాల నుండి మట్టి, పవిత్రజలాలు తెచ్చి ఉపయోగిస్తే వస్తుందా? లేక అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం వల్ల కలుగుతుందా? శంకుస్థాపన పేరుతో జరిగిన దుబారా అందర్నీ విస్మయ పరుస్తోంది. రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా బడ్జెట్ లేదంటున్నారు. కాని, శంకుస్థాపన ఆర్భాటాలకు వందల కోట్లు ఎలా కేటాయిస్తున్నారు? కొంత మంది మంత్రులు శంకుస్థాపన పనులకు రూ.9 కోట్లకు మించి ఖర్చు పెట్టలేదని చెప్పారు. ‘ఖర్చులపై శ్వేతపత్రం ఇవ్వచ్చుగా’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. కొన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నాం. కనుక ఆ ఖర్చును ఈ పద్దులో చూపలేం అని తప్పించుకుంటున్నారు. గోదావరి పుష్కరాలకు రూ.1,550 కోట్లు కేటాయించి చేసిన పనులు ఏమిటో ప్రజలందరూ గమనించారు. సెంటిమెంట్ రాజకీయం ‘సెంటిమెంట్’ తాత్కాలిక భావన. దాని వల్ల దీర్ఘకాలంలో పాల కులకు కలిగే ప్రయోజనం శూన్యం. ఆ వాస్తవం చంద్రబాబు వంటి రాజకీయుడికి తెలియంది కాదు. కాని, ఒక వాస్తవాన్ని మరుగునపర్చడానికి సెంటిమెంట్ను వాడుకోవాలనుకుంటు న్నారు. తిరుపతిలో మునికోటి ఆత్మార్పణం మొదలుకొని.. వరు సగా జరిగిన సంఘటనలు; ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ దీక్ష మొదలైన అంశాలు.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. అదీ ఒకరకమైన సెంటిమెంట్గా రూపుదాల్చింది. అందుకే ‘ప్రత్యేకహోదా సెంటిమెంట్’ను దెబ్బ తీయడానికి అమరావతి నిర్మాణం సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అధికార పార్టీ నేతలు ప్రయాసపడుతున్నారు. ‘అమరావతి సెంటిమెంట్’ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కనిపిస్తే ఆశ్చర్యమేమీలేదు. అక్కడ భూములున్న మోతుబరులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు నిజంగా పండుగే. ప్రభు త్వమే స్వయంగా అక్కడి భూముల రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచు కోవడానికి భూముల విలువలను విపరీతంగా పెంచేసింది. కాని, ఆ రెండు జిల్లాల్లో పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఎవ్వరూ ఆలోచించడంలేదు. వారి ఆదాయంలో మార్పులేదు గానీ జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది. ఇక, అభివృద్ధి మొత్తం అమరా వతి చుట్టూనే జరగబోతోందన్న సంకేతాలు వెలువడటంతో.. మిగతా ప్రాంతాల ప్రజల్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి సాగునీటి ప్రాజెక్టును చేపట్టకుండా; విభ జన బిల్లులో పేర్కొన్న విధంగా రాయలసీమలో ఏర్పాటు కావా ల్సిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇతర జిల్లాలకు తరలించడం వంటి చర్యలతో... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డే ప్రాంతీయ అసమానతలను పెంచే దిశగా ముందుకు సాగుతు న్నారు. తమ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించనందున కర్నూలు లో ఏర్పాటు కావాల్సిన రెండు విద్యా సంస్థల్ని వేరే జిల్లా కు తర లించడం ఇందుకు ఒక ఉదాహరణ. కడప జిల్లాలో ఏర్పాటు కావా ల్సిన ఉక్కు ఫ్యాక్టరీపై ప్రజలకు స్పష్టత ఇవ్వకపోవడం మరొకటి. రాజకీయాల్లో సెంటిమెంట్లు ఉంటే ఉండొచ్చు. కాని.. ‘సెంటిమెంట్’తో రాజకీయం చేయాలనుకోవడం అవివేకం. ప్రత్యేక హోదా హక్కుకు సెంటిమెంట్ ప్రత్యామ్నాయం కాదు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన డం ఎంత ముఖ్యమో... ఆ సందర్భంగానైనా ఆయనతో ప్రత్యేక హోదా ప్రకటన చేయించడం కూడా ముఖ్యమే. శంకుస్థాపనకు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, ఎంత మంది ప్రముఖులు హాజరయి నా, ప్రత్యేకహోదా ప్రకటన వెలువడకపోవడంతో అంతా బూడి దలో పోసిన పన్నీరే అయింది. చంద్రబాబు ప్రత్యేకహోదా అడగ లేదు. ప్రధాని ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన ప్రత్యేక ప్యాకేజీని సైతం మోదీ పట్టించుకోలేదు. పైగా రాష్ట్ర విభ జనకు కాంగ్రెస్ పార్టీని నిందించడం మోదీ ద్వంద్వ నీతికి నిదర్శ నం. బాబూ, మోదీ జోడీ ఆంధ్రుల నోట్లో పార్లమెంట్ మట్టి కొట్టారు. చంద్రబాబు అడిగింది మట్టి, నీరు. ఆ రెండూ ప్రధాని పట్టుకొచ్చారు. పార్లమెంటు మట్టి, యమునానది నీళ్లు. యద్భా వం తద్భవతు. చంద్రబాబు భావన ఎట్లా ఉన్నదో ఆచరణలో అ దే జరిగింది. అందుకే మట్టి సత్యాగ్రహం చేయవలసి వస్తున్నది. వ్యాసకర్త ఎమ్మెల్సీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మొబైల్ : 8106915555 - సి. రామచంద్రయ్య -
స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమిపూజ
హైదరాబాద్ : స్వర్ణభారతి ట్రస్ట్ భూమి పూజ శుక్రవారం శంషాబాద్ మండలం ముచ్చింతల్లో జరిగింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పదమూడేళ్ల కిందట స్నేహితులతో కలిసి వెంకయ్యనాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. చాలా కాలంగా స్వర్ణభారతి ట్రస్ట్ ను వెంకయ్య కుమార్తె నడుపుతున్న విషయం తెలిసిందే. -
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన
-
రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా గురువారం కార్యక్రమం జరిగింది. ఎన్నికల్లో అత్యంత ప్రధానమైన హామీ అయినప్పటికీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచినా చేపట్టలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పథకాన్ని విజయదశమి రోజున ప్రభుత్వం ఆరంభించింది. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిమోజక వర్గాల్లో లాంఛనంగా ప్రారంభించింది. స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఎంపీలు , ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా శంకుస్థాపనలు జరిపారు. నిజామాబాద్: జిల్లాలోని బోధన్ మండలం ఆటోనగర్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థలాలకు ఎంపీ కవిత భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షఖీల్, ఇతర నేతలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్: వీరన్న పేటలో ఇళ్ల స్థలాలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ శ్రీదేవి లు భూమి పూజ చేశారు. నల్లగొండ: జిల్లాలోని చౌటుప్పల్ లో ఇళ్ల స్థలాలకు మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముక్తాబాద్, గంభీరావు పేటలో నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు భూమి పూజ నిర్వహించారు. -
రాజధాని శంకుస్థాపనకు వీవీఐపీలు
- ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన - అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలకు ఆహ్వానాలు - లోక్సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఆహ్వానాలు - రాష్ట్రంలో ప్రతిపక్ష నేతతో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానం హైదరాబాద్ : విజయ దశమి రోజు అక్టోబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి 1500 మంది వీవీఐపీలను, వీఐపీలను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విజయ దశమి రోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే లోక్సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్రానికి చెందిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాష్ట్రానికి చెందిన న్యాయ మూర్తులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. ప్రతిపక్ష నేతతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ ఆహ్వానాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్ ప్రధానమంత్రి, జపాన్ ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినప్పటికీ వారు వచ్చే అవకాశం లేదని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర దేశాల ప్రధానమంత్రులను ఆహ్వానిస్తే రారని, దీనికి ఒక విధానం ఉంటుందని ఆ అధికారి తెలిపారు. కేంద్ర విదేశీమంత్రిత్వ శాఖ లేదా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇతర దేశాల ప్రధానమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాలని, అలా కాకుండా ముఖ్యమంత్రి ఆహ్వానించడం చెల్లదని ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే సింగపూర్, జపాన్ ప్రధానమంత్రులు శంకుస్థాపన కార్యక్రమానికి రాకపోయినప్పటికీ ఆ దేశాలకు చెందిన కన్సల్టెంట్లు, ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని ఉన్నతాధికారి తెలిపారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు గోదావరి పుష్కరాల్లో చేసినట్లు సినిమా చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ చిత్రీకరణ కార్యక్రమాన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్కు అప్పగించాలని సీఆర్డీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను కన్సల్టెంట్కు అప్పగించనున్నారు. -
భారీ ఈవెంట్గా ఏపీ రాజధాని శంకుస్థాపన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఈవెంట్గా ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం... ప్రయివేట్ కన్సల్టెన్సీకి ఈ ఈవెంట్ బాధ్యతలు అప్పగించనుంది. విజ్క్రాప్ట్ కన్సెల్టెన్సీకి ఈవెంట్ నిర్వహణ కట్టబెట్టింది. ఇందుకోసం రూ.9.50కోట్లు చెల్లించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. మరోవైపు రాజధాని శంకుస్థాపనను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా అక్టోబర్ 22 విజయదశమి రోజున జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఈ శంకుస్థాపనకు భారత, సింగపూర్ ప్రధానమంత్రులతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి హాజరవుతుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
అప్పటి వరకూ ఓట్లు అడగం: కేటీఆర్
ఖమ్మం: ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ భీష్మ ప్రతిజ్ఞ చేశారని, నీళ్లు ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఓట్లు అడగమని చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వు గ్రామంలో పాలేరు సెగ్మెంట్ వాటర్గ్రిడ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. 60ఏళ్ల ఆంధ్రా పాలనలో చితికిపోయిన తెలంగాణ అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. వచ్చే నాలుగేళ్ల లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తోపాటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పొంగులేటి సుధాకర్రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకట్రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
'సీఎం హామీని రెండు నెలల్లో పూర్తి చేశా'
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా 8 కొత్త మార్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండు నెలల్లో 13 వ్యవసాయ మార్కెట్లు జిల్లాకు ఇచ్చామని మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో సోమవారం రూ. 3 కోట్లతో నిర్మించే గోదాములకు హరీష్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికి 25 వ్యవసాయ మార్కెట్లు ఉండగా మరో 13 నూతనంగా మంజూరు చేశామన్నారు. అందులో పెద్దపల్లి నియోజకవర్గంలో జూలపెల్లి, కాల్వశ్రీరాంపూర్ ఉందన్నారు. నియోజకవర్గంలో పదిన్నర కోట్లతో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాముల్లో ధాన్యాన్ని ఆరు నెలల వరకు నిల్వ చేసినా వడ్డీ లేని రూ. 2లక్షల వరకు రుణాలను బ్యాంకు ఇస్తుందన్నారు. మార్కెట్కు వచ్చిన రైతులకు ప్రమాదబీమా సైతం రూ. లక్ష ఇవ్వడం జరగుతుందన్నారు. రైతు బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మత్తు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వం అందిస్తే మా ప్రభుత్వం 37లక్షల మందికి పెన్షన్లు అందించామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైస్మిల్లులు కరెంట్ లేకుండా జనరేటర్తో నడిచి నెలకు రూ. 3 లక్షలు నష్టం వాటిల్లుతుందని తమ దృష్టికి తేగా నేడు కరెంట్ కొరత లేని విధంగా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ 2 ఫేస్లో నెల రోజుల్లో టెండర్ పిలుస్తామని చెప్పడంతో పాటు మినీ ట్యాంకుబండ్, సీసీ రోడ్లు, మూత్రశాలలు, రైతులకు విశ్రాంతి గది నిర్మిస్తామని చెప్పారు. -
రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం
నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వెల్లనూరు, మంగునూరు, నర్సింగపల్లి గ్రామంలో రూ. 4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు. -
శిలాఫలకంపై వైఎస్సార్సీపీ ఎంపీటీసీ పేరు లేదు
కోవూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం వద్ద రోడ్డు నిర్మాణానికి టీడీపీకీ చెందిన కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసులురెడ్డి ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు. అయితే శిలాఫలకంపై వైఎస్సార్సీపీకి చెందిన స్థానిక ఎంపీటీసీ మొహిదీన పేరు లేకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ ప్రాంతానికి సంబంధం లేని టీడీపీ ఎంపీటీసీ ఎస్కె పర్వీన్ పేరు వేశారు. దాంతో ఆగ్రహించిన పొడుగుపాడు సర్పంచ్ రమణమ్మ(వైఎస్సార్సీపీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆందోళన చేయాలని నిర్ణయించారు. -
పునాదిరాయి వేసిన చోటే!
అదృష్టం తలకిందులైతే.. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది. గోవాకు చెందిన ఓ మాజీ మంత్రిగారికీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితే దాపురించింది. ఓ జైలు నిర్మాణానికి ఐదేళ్ల క్రితం స్వయంగా తన చేతులతోనే పునాది రాయి వేసిన ఆయన ఇప్పుడు అదే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు! గోవా ప్రజా పనుల శాఖ మాజీ మంత్రి చర్చిల్ అలెమావో ఇటీవల లూయిస్ బెర్గర్ లంచం కేసులో అరెస్టయ్యారు. క్రైమ్ బ్రాంచ్ లాకప్లో ఏడు రోజులు గడిపిన తర్వాత బెయిల్ పిటిషన్ను పెండింగ్లో పెట్టిన కోర్టు ఆయనకు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కొత్తగా నిర్మించిన కోల్వాలే జైలుకు తరలించారు. ఈ ఏడాది మే 30నే ప్రారంభమైన ఈ జైలుకు ఖైదీగా వచ్చిన తొలి రాజకీయ నాయకుడు కూడా ఈయనే! అన్నట్టూ.. తాను పునాదిరాయి వేసిన ఈ జైలులో సౌకర్యాలన్నీ బాగున్నాయని అలెమావో సంతృప్తి వ్యక్తం చేశారట! -
అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన
హైదరాబాద్: అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. సోమవారం ప్రభుత్వానికి రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ అందుతుందని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సీఎం చంద్రబాబునాయుడికి ఆ ప్లాన్ అందజేస్తుందని చెప్పారు. ఆ ప్లాన్ వచ్చాక క్యాపిటల్ పనులు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. -
యాదాద్రి అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన
-
కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం
-
కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 9.20 గంటలకు సురేంద్రపురికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన యాదగిరిగుట్టకు చేరుకున్నారు. గర్భాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్నికేసీఆర్ ఆవిష్కరించారు. అక్కడి సుదర్శన చక్రం పక్కన ఏర్పాటు చేసిన మరో శిలాఫలాకానికి గవర్నర్ నరసింహన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు త్రిదండి చినజీయర్ స్వామి కూడా పాల్గొన్నారు. అంతకు ముందు కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్లో గజ్వేల్ నియోజకవర్గం ములుగుకు చేరుకుంటారు. అక్కడి పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ కప్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్కు పయనం అవుతారు. -
జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ..
-
జూన్ 6న ఉ.8.49కి రాజధాని భూమిపూజ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమిపూజకు ముహుర్తం ఖరారైంది. జూన్ 6వ తేదీ ఉదయం 8.49 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ 144 ఏళ్ల తర్వాత వచ్చిన గోదావరి పుష్కరాలను మహా పుష్కరంగా పరిగణిస్తామన్నారు. 198 ఎంట్రీలను పరిశీలించాక పుష్కరాల లోగోను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. ఇకపై అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో ఈ లోగోను వాడుతామని పరకాల పేర్కొన్నారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తారని తెలిపారు. 3.5 కోట్లమంది గోదావరి పుష్కరాలకు హాజరవుతారని భావిస్తున్నట్లు పరకాల చెప్పారు. ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల కోసం రూ.1471 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల లోగోను ఆవిష్కరించారు. -
జూన్ 6న ఏపీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం జూన్ 6న నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఈ లోపలే సాధ్యమైనన్ని ప్రభుత్వ శాఖలను విజయవాడ, గుంటూరులకు తరలించాలని ఈ రోజు జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించారు. శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉండగా, ఏపీ నూతన రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలలోని భూసమీకరణకు ఇష్టంలేదని కోర్టుకు వెళ్లిన వారి భూములను సేకరణ ద్వారా సమీకరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. -
ఈ నెల 29న పట్టిసీమకు శంకుస్థాపన
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు శంకుస్థాపనకు తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. ఈ నెల 29న ఆ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి.... పట్టిసీమ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అదే రోజు సాయంత్రం గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతం తుళ్లూరులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగే వేడుకల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. -
జూన్లో పునాది రాయి
ఏపీ రాజధానికి జూన్ 11వతేదీ లేదా 12న శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జూన్ 11వ తేదీ లేదా 12వ తేదీన పునాది రాయి వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. జూన్ 11, 12వ తేదీలు దశమి, ఏకాదశి కావటంతో మంచి రోజులని జ్యోతిష్యులు సూచిం చడంతో ఈ ముహూర్తం మేరకు రెండింటిలో ఏదో ఒక రోజున రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కృష్ణా నదిని ఆనుకుని వెంకటాయపాలెం, ఉద్దండరాయపాలెం, బోరుపాలెంలో పాలనా రాజధాని నిర్మాణం కానున్న నేపధ్యంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా అక్కడే జరగవచ్చని సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు సింగపూర్ ప్రధానమంత్రిని కూడా దీనికి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సింగపూర్ కంపెనీలు ఈలోగా రాజధాని నిర్మాణంపై మాస్టర్ ప్లాన్ను అందచేస్తాయని తెలిసింది. కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్, ఎమ్మెల్యే, మంత్రులు నివాస గృహాలు, హైకోర్టు, ఆసుపత్రులు, పాఠశాలలు, మంచినీటి సరఫరా, రహదారుల నిర్మాణాలకు ప్రాథమికంగా రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టు నివేదికను సమర్పించింది. కేంద్రం సూచనల మేరకు దీన్ని అందచేసింది. సీఎం తాత్కాలిక సచివాలయానికి రూ.90 కోట్లు రాజధాని నిర్మాణానికి 20,500 ఎకరాలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వాస్తవికత నివేదికను రూపొందించింది. భూమిని సేకరించేందుకు, పునరావాసం అమలుకు ఎకరానికి రూ.కోటి వంతున వ్యయమవుతుందని అంచనా వేసిం ది. ఈ లెక్కన రూ.20,500 కోట్లు ఆర్థిక సాయం కావాలని కేంద్రానికి నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాస్టర్ ప్రణాళిక, సవివరమైన ప్రాజెక్టు నివేదిక తయారీ, కన్సల్టెన్సీ చార్జీల కింద రూ.500 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ముఖ్యమంత్రి తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి 14 ఎకరాల స్థలం అవసరమని, దీనికి రూ.90 కోట్లు వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. 655 ఎకరాల్లో నిర్మించే పరిపాలనా రాజధాని నిర్మాణానికి రూ.8,962.17 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించింది. -
15 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు: కేసీఆర్
సంగారెడ్డి: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందులోభాగంగా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గురువారం మెదక్ జిల్లా ముప్పిరెడ్డిలో శాంతాబయోటెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇన్సులిన్ పరిశ్రమకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడారు. రూ.850 కి దొరికే ఇన్సులిన్ను కేవలం రూ. 150కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేస్తున్న శాంతాబయోటెక్ చైర్మన్ వరప్రసాద్రెడ్డిని కేసీఆర్ ఈ సందర్బంగా అభినందించారు. వీలైనంత త్వరగా ప్రజలకు ఇన్సులిన్ అందుబాటులోకి రావాలని ఈ సందర్బంగా ఆయన ఆకాంక్షించారు. కలా వ్యాక్సిన్ తయారు చేసి... ఆ వ్యాధిని తరిమికొట్టిన ఘనత వరప్రసాద్దే అని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. -
మెట్రోకు భూమిపూజ
సాక్షి, ముంబై: ముంబై మెట్రో-3 ప్రాజెక్టు పనులకు మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుణే మెట్రో జాప్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని విషయాలపై సమాచారం అందకపోవడమే కారణమని తెలిపారు. అయితే ఇప్పుడు అన్ని విషయాలపై సమాచారం లభించడంతో తొందర్లోనే ఆ ప్రాజెక్టు కూడా ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం మరోల్లోని అంధేరీ-ఘాట్కోపర్ లింకు రోడ్డు (మరోల్ అగ్నిమాపక కేంద్రం) సమీపంలో జరిగింది. ఈ మెట్రో-3 ప్రాజెక్టును పూర్తిగా సొరంగాల ద్వారా భూగర్భంలో నిర్మిస్తారు. ఇది 2019 వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సుమారు రూ.23,136 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. మెట్రో రాకతో ముంబైలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఇప్పటికే ఘాట్కోపర్-వర్సోవా మధ్య మెట్రోరైలు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెట్రో-3 ప్రాజెక్టులో బాగంగా కొలాబా నుంచి సీప్జ్ వరకు మెట్రోరైలు మార్గాన్ని నిర్మించనున్నారు. -
‘వేముగంటి’కి శంకుస్థాపన
భీమ్గల్, న్యూస్లైన్ : మండల ప్రజల చిరకాల వాంఛ అయిన వేముగంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్రెడ్డి కాంట్రాక్టర్ ను, అధికారులను ఆదేశించారు. ఆగస్టులో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం మం డలంలోని పల్లికొండలో వేముగంటి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం మండల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణ దశకు చేరుకుందన్నారు. గట్టు పొడచిన వాగు నుంచి మండలంలోని మెండోరాకు నీళ్లు తరలించే విషయాన్ని పరిశీలించేందుకు అధికారులను పంపుతామన్నారు. భూగర్భ జలాల పెరుగుదల కోసం వాగుల్లో చెక్డ్యాంలు నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. శ్రీరాంసాగర్ ప్రా జెక్టు వరద కాల్వకు 30 కిలోమీటర్లకు ఒక చెక్డ్యాం నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు పల్లికొండలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు బూటకపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలో కరెంటోళ్లు రైతుల మీటర్ల డబ్బాలు లాక్కుపోయేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే మార్పు వచ్చిందన్నారు. అలాంటి బాబుకు ప్రజలు మళ్లీ ఎందుకు అవకాశమిస్తారన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. పెద్ద సంఖ్యలో సీట్లు సీమాంధ్రలో ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అందుకే.. భీమ్గల్పై అభిమానం బాల్కొండకు, భీమ్గల్కు ఎంతో వ్యత్యాసం ఉందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీలో సగం భీమ్గల్ నుంచే వచ్చిందన్నారు. అందుకే తనకు భీమ్గల్ అంటే ప్రత్యేక అభిమానమన్నారు. ఈ ప్రాంత ప్రజల ‘వేముగంటి’ ఆకాంక్షను నెరవేర్చానన్నారు. మౌలిక వసతుల కల్పనకు తాను పెద్ద పీట వేశానన్నారు. నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, విప్లను ప్రాజెక్టు కమిటీ, ఆయకట్టు రైతులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శనిగరం సంతోష్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్రావు, నాయకులు కన్నె సురేందర్, మానాల మోహన్రెడ్డి, సుంకెట రవి, వేముగంట ప్రాజెక్టు చైర్మన్ రాజేశ్వర్, సర్పంచ్లు ఆర్మూర్ మహేశ్, కొమ్ము నరేశ్, గుగులోత్ రవినాయక్, ఏశాల సౌమ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.