నెల్లూరు : భారీ వర్షాలు నేపథ్యంలో స్వర్ణముఖి నదికి బుధవారం వరద ఉధృతి పెరిగింది. జిల్లాలోని నాయుడుపేటలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్యలు తడ మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. అయితే భారీ వర్షాల కారణంగా పెళ్లకూరు మండలంలోని 7 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సదరు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.