'చెట్టు కన్నతల్లి లాంటిది' | pocharam visits nizamabad distirict | Sakshi
Sakshi News home page

'చెట్టు కన్నతల్లి లాంటిది'

Published Mon, Aug 24 2015 10:30 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

'చెట్టు కన్నతల్లి లాంటిది'

'చెట్టు కన్నతల్లి లాంటిది'

బాన్సువాడ: చెట్టు కన్నతల్లి లాంటిదని..ఇంటికి నాలుగు చెట్లు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని మంత్రి స్వగ్రామం పోచారంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో అందరూ చెత్తబుట్టలోనే వేయాలిన సూచించారు.

మూడు రోజులకు ఒక సారి రిక్షా వచ్చి చెత్తను తీసుకెళ్తుందని ఆయన తెలిపారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిలో చెట్లు పెంచాలని.. చెట్టు తల్లిలాంటిదని మంత్రి అన్నారు. అనంతరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement