రియాక్టర్ పేలి ఒకరి మృతి
Published Thu, Aug 10 2017 11:13 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM
హైదరాబాద్: ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఓ కార్మకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ రియాక్టర్ పేలడంతో అప్పల నాయుడు(35) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా.. జగదీశ్వర్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ అంశంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement