సాక్షి, హైదరాబాద్: కనీస సర్వీసు లేని కారణంగా పింఛను పొందే అవకాశం కోల్పోయిన రెండు వేల మంది పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులకు పింఛను ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పెన్షన్ రూల్స్ సవరణ ఫైలుపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆమోద ముద్ర వేశారు.
1992 నుంచి 2002 వరకు గౌరవ వేతనంపై పనిచేసిన గ్రామ పరిపాలనాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు తర్వాత స్కేలు పొందారు. అయితే వారు పదవీ విరమణ చేశాక కనీస సర్వీసు లేని కారణంగా పింఛను పొందే అవకాశం కోల్పోయారు. తాజాగా సీఎం నిర్ణయంతో రెండు వేల మందికి పింఛను రానుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) తెలిపింది.
రెవెన్యూ ఉద్యోగులకు పింఛన్ యోగం
Published Wed, Nov 5 2014 1:44 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement