pension
-
Delhi: రేఖా గుప్తా జీతమెంత? కేజ్రీవాల్ పింఛనెంత?
న్యూఢిల్లీ: మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని సాధించి, మహిళా నేత రేఖా గుప్తా(Rekha Gupta)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఫిబ్రవరి 24న ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందు ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రేఖా గుప్తా త్వరత్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ప్రజలకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎన్నికల్లో ఓటమి పాలయిన కేజ్రీవాల్కు మాజీ సీఎంగా ఎంత పింఛన్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతి నెలా రూ.1.70 లక్షల జీతం అందుకోనున్నారు. ఈ మొత్తాన్ని 2023, మార్చి నాటి ఆర్డర్ ప్రకారం నిర్ణయించారు. దీనిలో ఆమె ప్రాథమిక జీతం(Basic salary) రూ. 60,000. వీటికితోడు ఆమెకు పలు భత్యాలు కూడా లభిస్తాయి. వీటిలో రూ.30,000 అసెంబ్లీ భత్యం, రూ.25,000 సెక్రటేరియల్ సహాయం, రూ.10,000 టెలిఫోన్ భత్యం, రూ.10,000 ప్రయాణ భత్యం, రూ.1,500 దినసరి భత్యం ఉన్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రికి జీతంతో పాటు కారు, బంగ్లా సహా అనేక సౌకర్యాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి తన ప్రైవేట్ కారును ఉపయోగిస్తే, ప్రతి నెలా రూ. 10,000 మొత్తం లభిస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రభుత్వ నివాసానికి ప్రతి నెలా 5,000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తారు. దీనికితోడు ముఖ్యమంత్రి తన పదవీకాలంలో రూ.12 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.ఇప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఎంత పెన్షన్ వస్తుందనే విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యేల మాదిరిగానే ఆయనకు రూ. 15,000 పెన్షన్ మొత్తం లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు గెలిస్తే, ఈ మొత్తంపై వెయ్యి రూపాయలు పెరుగుతుంది. కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి అయినందున ప్రభుత్వ వసతి గృహం, ప్రభుత్వ కారు, డ్రైవర్ సేవలు లభిస్తాయి. దీనితో పాటు టెలిఫోన్, ఇంటర్నెట్, ప్రయాణ భత్యం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా లభిస్తాయి.ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే.. -
అధిక పెన్షన్కు ‘అదనపు’ టెన్షన్!
రాష్ట్ర సంక్షేమ శాఖకు చెందిన ఓ కార్పొరేషన్లో సీనియర్ అధికారి అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకు దరఖాస్తు చేసుకున్నారు. సర్వి సులో చేరింది మొదలు ఇప్పటివరకు అదే శాఖలో ఉన్న ఆ అధికారి.. అధిక పెన్షన్కు సంబంధించి అన్నిపత్రాలను సమర్పించారు.ఈపీఎఫ్ఓ లేవనెత్తు తున్న ప్రతి సందేహానికి సమాధానమిస్తూనే ఉన్నా.. ఏదో ఒక అదనపు సమాచారం కావాలంటూ దరఖాస్తును తిప్పిపంపుతున్నారని ఆయన వాపోతున్నారు. ఇప్పటికే 4,5 సార్లు వెనక్కి పంపగా.. ఓపికగా బదులిచ్చానని, మళ్లీ మరింత సమాచారం కావాలని, అధిక పెన్షన్కు ఆప్షన్ ఇచ్చినప్పటి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కోరారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో అధిక పెన్షన్ (హయ్యర్ పెన్షన్) కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ‘అదనపు’టెన్షన్ పట్టుకుంది. ఈపీఎఫ్ఓ అధికారులు అడిగిన వివరాలన్నీ సమర్పిస్తూనే ఉన్నా.. ఏదో ఓ కొత్త సమాచారాన్ని అడుగుతూ, దానిని ధ్రువీకరించే పత్రాలు కావాలంటూ దరఖాస్తులను వెనక్కి పంపుతుండటం ఉద్యోగులలో ఆందోళన రేపుతోంది. ఇలా ఇబ్బందిపడుతున్నవారిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.రాష్ట్రం నుంచి అధిక పెన్షన్ కోసం 3.3 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఇప్పటివరకు పదిశాతం కూడా పరిష్కారం కాని పరిస్థితి. మెజారిటీ దరఖాస్తులు పరిశీలన దశ లోనే ఉండిపోయాయి. అడిగిన వివరాలు, సమా చారం అందజేసే వరకు దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగదని అధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదారులు తలపట్టుకుంటున్నారు. కేంద్రం ఆదేశించడంతో.. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు పూర్తయింది. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలను సమర్పించాలని కోరుతున్నారు. దాదాపుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అధిక పెన్షన్కు అర్హత ఉన్నట్టు తేలినవారికి ఎంత బకాయిలు ఉన్నాయి? ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలను చెబుతున్నారు. నోటీసులు ఇస్తూ.. వివరాలు అడుగుతూ.. అధిక పెన్షన్ కోసం దేశవ్యాప్తంగా 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3.1 లక్షల దరఖాస్తులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సంస్థల యాజమాన్యాలు సమర్పించలేదు. మరో 4.66 లక్షల దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం, స్పష్టత కోరుతూ అధికారులు తిప్పిపంపారు. చాలా వరకు దరఖాస్తుదారులు ఆ వివరాలను సమర్పించారు. ఈ క్రమంలో మరోమారు ఈపీఎఫ్ఓ నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులే ఇందులో అధికంగా ఉన్నారు. అధిక పెన్షన్కు సంబంధించి ఆప్షన్ పత్రం, చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, వివిధ కేటగిరీల ధ్రువపత్రాలు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అధికారులు అడుగుతున్నారు.రెండు, మూడు దశాబ్దాల క్రితం నాటి పత్రాలను అడగటంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులకే ఇలాంటి అభ్యంతరాలు పెట్టడం ఏమిటని మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న నేపథ్యంలో.. శాఖాపరంగా సమాచారాన్ని అడగవచ్చని, ఉన్నతాధికారులు ధ్రువీకరించి ఇచ్చే పత్రాలనైనా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.కానీ ఉద్యోగులు సరైన ధ్రువపత్రాలు అందజేయాలని, వాటినే ప్రామాణికంగా తీసుకుంటామని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అధిక పెన్షన్ ప్రయోజనం కలిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. -
ఓటు వేసి తప్పు చేసాం కన్నీళ్లు తెప్పిస్తున్న పెన్షన్ దారుల కష్టాలు
-
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వండి
న్యూఢిల్లీ: గౌరవంగా జీవితాన్ని వెల్లదీసేందుకు నెలకు కనీసం రూ.7,500 పెన్షన్ ఇవ్వాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు ఈపీఎస్–95 పెన్షనర్ల ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక మంత్రితో ప్రతినిధి బృందం సమావేశమై, నెలకు కనీసం రూ.7,500 పెన్షన్తో పాటు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కోసం ఎప్పటి చేస్తున్న డిమాండ్ను నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్–95 లేదా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం నెలకు కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే ఉంది. తాజా భేటీపై ఈపీఎస్–95 నేషనల్ అగిటేషన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, డిమాండ్లను సమీక్షించి సానుకూలంగా పరిష్కరించనున్నట్లు ఆర్థికమంత్రి హామీ ఇచి్చనట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసిన 78 లక్షలకుపైగా పెన్షనర్ల పరిస్థితిని ఆర్థికమంత్రికి వివరించినట్లు ఈపీఎస్–95 నేషనల్ అగిటేషన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రౌత్ తెలిపారు. రూ.5,000 డిమాండ్ సరికాదు.. కనీసం రూ.5,000 పెన్షన్ డిమాండ్ చేసే కొన్ని కారి్మక సంస్థలపై ఆయన విమర్శలు చేశారు. ఇది పెన్షనర్ల ప్రాథమిక అవసరాలకు పట్టించుకోకపోవడమేనని, అన్యాయమైన ప్రతిపాదన అని అభిప్రాయపడ్డారు. ‘‘గౌరవమైన జీవితం కోసం కనీసం రూ.7,500 అవసరం,‘ అని ఆయన స్పష్టం చేశారు.హామీ ఇచ్చారు.. నెరవేర్చాలి..! నెలకు రూ.1,000 పెన్షన్ను రూ.7,500కు పెంచాలని, డీఏతో పాటు పె న్షనర్, వారి జీవిత భాగస్వామికి ఉచిత వైద్య చికిత్సను అందించాలని పెన్షనర్లు గత 7–8 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని కమాండర్ అశోక్ రౌత్ ప్రస్తావించారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షనర్ల డిమాండ్లను పూర్తి మానవతా దృక్పథంతో పరిగణిస్తామని చెప్పారు. ఈ హామీ మాకు ఆశ కలిగిస్తోంది. కానీ ప్రభుత్వం సంకల్పపూర్వకంగా స్పందించి రాబోయే బడ్జె ట్లో కనీసం రూ.7,500 పెన్షన్ను డీఏతో ప్రకటించాలి’ అన్నారు. -
పింఛన్ పొందుతున్న లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకుని ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండిచెయ్యే
-
పింఛనర్లపై పగ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నెలనెలా పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి.. మా పార్టీలో చేరండి. లేదంటే అంతే సంగతులు.. ఆశలు వదులుకోండి. ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనంలేదు.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడి పచ్చనేతలు బరితెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇదే గ్రామంలో ఉన్న సుమారు ఎనిమిది మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛన్ ఇవ్వలేదు. రెండో నెలలో సచివాలయానికి వెళ్లి గొడవపడి అంజయ్య, శ్రీనివాసరావులతోపాటు కొందరు పింఛన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితోపాటు మరికొందరికి మాత్రం డబ్బులివ్వలేదు. దీంతో కొందరు పింఛనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకున్నారు. మూడోనెలలో అంజయ్య, దివ్యాంగుడు శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే.. మీ పింఛన్లు లేవన్నారు. ఆరాతీస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ సచివాలయ పరిధిలో ఉన్నాయని తెలిసింది. మూడు, నాలుగు, ఐదు నెలలు శ్రమకోర్చి అక్కడికే వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. సొంత ఊరిలో ఉంటే ఎలాగూ పింఛన్ ఇవ్వరని కేతనకొండ నుంచి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురానికి బదిలీ పెట్టుకున్నారు. ఆరోనెల శంకరాపురానికి వెళ్లి పింఛన్ తెచ్చుకున్నారు. విషయం తెలిసి మంత్రి గొట్టిపాటి ముండ్లమూరు అధికారులకు చీవాట్లు పెట్టడంతోపాటు తక్షణం ముగ్గురి పింఛన్లను వేర్వేరు ఊర్లకు బదిలీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇంకేముంది.. వికలాంగుడు శ్రీనివాసరావు పింఛన్ శ్రీకాకుళానికి.. బత్తుల చిన్న అంజయ్య పింఛన్ అనంతపురానికి, లీలావతి పింఛన్ చిత్తూరు జిల్లాలకు బదిలీ చేసినట్లు సమాచారం. వారు అంతదూరం వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే అంతకుమించిన ఖర్చవుతుంది. లేదంటే మంత్రిని కలిసి జీ హుజూర్ అనాల్సిందే అంటున్నారు.వైఎస్సార్సీపీకి మద్దతు పలికారని..గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికారంటూ వృద్ధులని కూడా చూడకుండా ఇలాంటి వారి పింఛన్లను తొలగించారు. కొందరి పేర్లున్నా వారికి పింఛన్లు ఇవ్వడంలేదు. మరికొందరి పింఛన్లను సుదూరంలోని జిల్లాలకు పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ నుంచి బదిలీచేశారు. పింఛన్దారులను బెదిరించి తమవైపు తిప్పుకునేందుకు పచ్చనేతలు ఈ తరహా అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వారు మాట వినకపోతే తొలగించేందుకూ సిద్ధమైనట్లు సమాచారం. తామున్న సచివాలయ పరిధి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండడంతో పింఛన్లు తెచ్చుకునేందుకు వీలుకాక కొందరు ఇబ్బందులు పడుతుండగా.. అసలు తమ పింఛన్ ఏ జిల్లాలో ఉందో తెలీక చాలామంది సతమతమవుతున్నారు. ఒకవేళ ఫలానా జిల్లాలో ఉందని తెలిసినా ప్రతినెలా అంత దూరం ఖర్చులు పెట్టుకుని వెళ్లి తెచ్చుకోవడం చాలా కష్టం. వృద్ధులను ఇలా ఇబ్బందులకు గురిచేసి తమవైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మంత్రి గొట్టిపాటి ఇదంతా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పట్టు నిలుపుకునేందుకే ఇలా..ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇసుక, గ్రానైట్, రేషన్ బియ్యం దందాలతో పాటు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై కూటమి సర్కారు పెనుభారం మోపడంతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రతిష్ట నియోజకవర్గంలో పూర్తిగా మసకబారింది. పైగా.. నేతలు, కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడం, కొందరికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిని పసిగట్టిన గొట్టిపాటి నిర్బంధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పింఛన్లను సైతం నిలిపేసి వారి కుటుంబాలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
పెన్షన్ స్కీం పేరిట
సాక్షి, హైదరాబాద్: ‘మీరు పెన్షన్ పథకానికి అర్హులయ్యారు..మేం పంపిన లింక్పై వెంటనే క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి’.. అంటూ సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. www.pm&yojana.org వెబ్సైట్ పేరిట మోసపూరిత ఎస్ఎంఎస్లు పంపుతున్నట్టు వారు తెలిపారు.ఇలాంటి మెసేజ్లు వస్తే వాటిని నమ్మవద్దని, అందులోని లింక్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. ఇలాంటి అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడంతో ఫోన్లు హ్యాక్ అవుతాయని, అనంతరం సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని మోసగించే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. ఇలాంటి ఎస్ఎంఎస్లు వస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ఫ్రీ నంబర్ 1930కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. -
ఆ రూ.200 కోట్లు ఎటుపోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధిక పెన్షన్ కాంట్రిబ్యూషన్ సొమ్ముపై గందరగోళం నెలకొంది. ఉద్యోగులు చెల్లించిన సుమారు రూ.125 కోట్లు, వాటిపై వడ్డీ కలిపి.. మొత్తం రూ.200 కోట్ల మొత్తానికి లెక్కతేలకుండా పోయింది. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ స్కీమ్ కోసం పదేళ్ల కింద ఉద్యోగులు చెల్లించిన సొమ్ము ఏమైందో తెలియడం లేదని.. ఇప్పుడు అధిక పెన్షన్ కోసం మొదటి నుంచీ లెక్కేసి మొత్తం డబ్బులు కట్టాలంటున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీఎఫ్ బకాయిలు సకాలంలో చెల్లించకపోవటం, పీఎఫ్కు చెల్లించాల్సిన మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకోవటం, విషయం కోర్టు వరకు వెళ్లటం, అయినా బకాయిలు చెల్లించక ఆర్టీసీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం దాకా ఇప్పటికే ఎన్నో ఆందోళనకర పరిణామాలు జరిగాయి. దానికితోడు అధిక పెన్షన్ల వ్యవహారం మరో వివాదానికి కారణమవుతోంది.అసలేం జరిగింది?ఉద్యోగులకు అధిక పెన్షన్ కోసం 1995 నవంబరులో భవిష్యనిధి సంస్థ ఆప్షన్లను కోరింది. భవిష్య నిధి వ్యవహారాల కోసం ఆర్టీసీలో ప్రత్యేకంగా పీఎఫ్ ట్రస్టు ఉంటుంది. ఆ ట్రస్టు ఉమ్మడి ఆర్టీసీ ఉద్యోగుల నుంచి హయ్యర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ను వసూలు చేసి ఈపీఎఫ్ఓకు జమ చేసింది. 2014 ఆగస్టు వరకు ఇది కొనసాగింది. మొత్తంగా 16,307 మంది ఇలా హయ్యర్ పెన్షన్ కోసం వారి వేతనాల నుంచి 8.33 శాతం చొప్పున కాంట్రి బ్యూషన్ చెల్లించారు. అందులో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 7,373 మంది ఉన్నారు. వారు హ య్యర్ పెన్షన్కోసం చెల్లించిన మొత్తం సుమారు రూ.125 కోట్ల వరకు ఉంది. కానీ సాంకేతిక కారణాలతో వారి ఆప్షన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనితో అప్పటివరకు వారు చెల్లించిన కాంట్రిబ్యూషన్ సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉన్నా.. ఈపీఎఫ్ఓ వద్దే ఉండిపోయింది. పీఎఫ్ వ్యవహారాలు చూసేందుకు ఆర్టీసీలో ప్రత్యేకంగా ట్రస్టు ఉన్నా.. అది పట్టించుకోలేదు. ఉద్యోగులు చెల్లించిన సొమ్ము రూ.125 కోట్లకు వడ్డీ కలిపి రూ.200 కోట్ల వరకు అవుతుందని.. ఆ సొమ్ము లెక్క తేలడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.ఇప్పుడూ పూర్తిగా కట్టాలంటూ నోటీసులతో..సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ గతేడాది మరోసారి హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు తీసుకుంది. అప్పట్లో తిరస్కరణకు గురైనవారిలో కొందరు రిటైరవగా.. మిగతావారిలో చాలా వరకు హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్లు ఇచ్చారు. ఈసారి వేతనాల నుంచి 8.33 శాతం కాంట్రిబ్యూషన్తోపాటు ఎంప్లాయీస్ హయ్యర్ పెన్షన్ స్కీం నిర్వహణ చార్జీల పేరిట మరో 1.16 శాతం మొత్తాన్ని చెల్లించాలని ఈపీఎఫ్ఓ సూచించింది. స్కీం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం సొమ్మును చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆప్షన్ రిజెక్ట్ అయి ఇప్పుడు మళ్లీ ఆప్షన్ ఇచ్చినవారు.. అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి, మిగతా మొత్తాన్ని వసూలు చేసుకోవాలని అభ్యర్థించారు. కానీ స్పందన లేదు. ఈ విషయాన్ని పీఎఫ్ ట్రస్టు పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు..హయ్యర్ పెన్షన్ ఆప్షన్లను తిరస్కరించిన వెంటనే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వాపసు చేయాల్సి ఉంది. కానీ ఎన్ని సార్లు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్య ఎక్కడుందో చెప్పేవారు కూడా లేకపోవటం విడ్డూరం. ఈ విషయంలో చొరవ చూపాల్సిన ఆర్టీసీ మిన్నకుండిపోతోంది. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించి 7,373 మంది ఉద్యోగులకు ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది – ఎస్డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావుఏపీలోనూ ఇదే సమస్య..ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించి 8,934 మంది ఉద్యోగులు కూడా ఇదే తరహాలో ఎదు రుచూస్తున్నారు. వారు అప్పట్లో చెల్లించిన మొత్తాన్ని మినహాయించి తాజా కాంట్రిబ్యూషన్ను లెక్కించాల్సి ఉంది. దీన్ని ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టు సీరియస్గా తీసుకుని కొలిక్కి తేవాల్సి ఉంది– ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత దామోదర్వెంకట్రావు.. ప్రస్తుతం ఆర్టీసీలో డిపో క్లర్కు. 1996లో ఆయన కండక్టర్గా పనిచేస్తున్న సమయంలో.. హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓకు ఆప్షన్ ఇచ్చారు. కాంట్రిబ్యూషన్గా రూ.2.60 లక్షలు చెల్లించారు. ఆయన ఆప్షన్ రిజెక్ట్ అయింది. కానీ ఈ విషయం వెంకట్రావుకు తెలియలేదు. సమాచారం ఇవ్వాల్సిన ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పట్టించుకోలేదు. తాజాగా 2022లో ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం మళ్లీ ఆప్షన్ స్వీకరించింది.దీనికి వెంకట్రావు దరఖాస్తు చేసుకోగా.. 1996 నాటి నుంచి ఇప్పటివరకు కలిపి కాంట్రిబ్యూషన్ రూ.4.80 లక్షలు చెల్లించాలని ఈపీఎఫ్ఓ నోటీసు ఇచ్చింది. ఇదేమిటని ఆయన ఆరా తీయగా.. 1996లోనే తన దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిసింది. అప్పట్లో చెల్లించిన మొత్తం మినహాయించి మిగతాది చెల్లిస్తానని ఆయన చెబితే.. మొత్తం చెల్లించాల్సిందేనని ఈపీఎఫ్ఓ నుంచి సమాధానం వచ్చింది. మరి నాడు చెల్లించిన సొమ్ము ఏమైందో అంతుపట్టని పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీలో వేల మంది ఉద్యోగుల సమస్య ఇది.. -
చిక్కిపోతున్న పింఛన్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య నెలనెలకూ చిక్కిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఐదు నెలల్లోనే ఏకంగా 1,35,690 మందికి పింఛన్ ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు.. ఈ ఏడాది మేలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, తాజాగా నవంబర్ 1న (శుక్రవారం) 64,14,174 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసేందుకు డబ్బు విడుదల చేశారు. గత ఐదు నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా ప్రభుత్వం సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా ఏళ్ల తరబడి ప్రతి నెలా పింఛను తీసుకుంటున్న వారికి కోతలు పెట్టేందుకు ఎక్కడలేని ఉత్సాహం కనబరుస్తోంది. ఇక అక్టోబర్లో జరిగిన పంపిణీకి, ప్రస్తుత నెలలో జరుగుతున్న పంపిణీ మధ్య నెల రోజుల వ్యవధిలోనే పింఛన్ల సంఖ్య 24,710కి తగ్గిపోయాయి. సాధారణంగా లబ్ధిదారుల్లో మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనుకున్నా, ప్రతినెలా 10–15 వేలకు మించవని గణాంకాలు చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఎడాపెడా పింఛన్ల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. పంపిణీలో ఆధిపత్యం కోసం గొడవలురాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రతి నెలా అవ్వాతాతలకు అందజేసే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రాజకీయ రంగు పులిమింది. ఈ పంపిణీ పూర్తిగా తమ కనుసన్నల్లోనే జరగాలని టీడీపీ నాయకులు రాష్ట్రంలో అత్యధిక చోట్ల స్థానికంగా పింఛన్లను పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని హెచ్చరిస్తూ, పంపిణీ చేసే ఉద్యోగుల వెంట లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెత్తనం చెలాయిస్తున్నారు. కూటమిలోని టీడీపీ–జనసేన–బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నవంబరు 1 (శుక్రవారం) పింఛన్ల పంపిణీ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతలపాడులో టీడీపీ–జనసేన నాయకులు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకించిన ఏరియాల్లో పింఛను పంపిణీ తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరగాలంటూ పట్టుబట్టి, ఘర్షణలు పడటం గమనార్హం. సిబ్బందికి షోకాజ్ నోటీసులువలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఉదయం 6.15 వరకు పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదంటూ ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 70 మంది వార్డు సచివాలయాల ఉద్యోగులకు నగర కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 14 మందికి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలంలో 28 మందికి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 15 మందికి, బాపట్ల జిల్లా అద్దంకిలో ఆరుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్టు తెలిపారు. ఇవి కేవలం తమకు అందిన సమాచారం మేరకు మాత్రమేనని, ఇంకా పలు ప్రాంతాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయారు. ఒక్క జూలై నెలలోనే దాదాపు 4 వేల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని.. ఇలా ప్రతి నెలా జారీ చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన నత్తల వజ్రమ్మ (62) కావలిలో తన కూతురు శిరీష (33)వద్దకు వెళ్లింది. 1వ తేదీ పింఛను తీసుకునేందుకు కూతురితో కలిసి వస్తూ.. కావలిలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ మృతి చెందారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కుప్పం–3 సచివాలయం వద్దకు వృద్ధులను పిలిపించి పింఛన్లు పంపిణీ చేశారు. వరదయ్యపాళెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పని చేస్తున్న అనిత.. చిన్నపాండూరు సచివాలయ పరిధిలోని యానాదివెట్టు, రాచర్ల గ్రామాల్లో ఫించన్లు పంపిణీ చేశారు. సమస్యల నడుమ పంపిణీనవంబరు 1వ తేదీ (శుక్రవారం) సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.76 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అయితే పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు సర్వర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంపిణీ సమయంలో లబ్ధిదారులకు డబ్బులు అందజేసిన అనంతరం ఆయా లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య సర్వర్ పనిచేయక పోవడంతో దాదాపు రెండు గంటల పాటు పంపిణీ నిలిచిపోయింది. మరోవైపు.. వేలిముద్ర నమోదుకు ఉపయోగించే స్కానర్లకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్కు ప్రభుత్వం డబ్బులు చెల్లించని కారణంగా అవి పని చేయలేదు. అప్పటికప్పుడు వాటి స్థానంలో వేరే స్కానర్లు మార్చాల్సి వచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్ల కింద, సచివాలయాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రాణం మీదకు తెచ్చిన పింఛన్కాశీబుగ్గ: పింఛను పంపిణీ ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా, పలాసలోని, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో బైనపల్లి దానమ్మ వితంతువు పింఛన్ కోసం మండుటెండలో నిరీక్షించింది. ఉదయం ఏడు గంటల లోపల నామమాత్రంగా పనిచేసిన సర్వర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పింఛన్ల పంపిణీ మళ్లీ మధ్యాహ్నానికి గానీ ప్రారంభం కాలేదు. అప్పటి వరకూ నిరీక్షించిన దానమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో పింఛన్ ఇంటికి వచ్చి అందించేవారని, ఇప్పుడు ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పింఛనుదారులు వాపోతున్నారు. -
Telangana: పింఛన్లు పెంచరా? మాటకు కట్టుబడరా?
అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.2 వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామనీ హామీ ఇచ్చారు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పెంచలేదు. వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఫించన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జీవితం గడుపగలుగుతారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.మాయమాటల కాంగ్రెస్ ప్రభుత్వం మాటతప్పి మరోమారు ప్రజలను మోసపుచ్చింది. కాంగ్రెస్ పాలనలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండదని ఇంకోమారు రుజువయింది. ‘‘వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ పేషెంట్లకు అందరికీ పెన్షన్... నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన్రు. అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా పెన్షన్ పెంచి ఇస్తాం...’’ అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 జూలై నెలలో స్వయంగా పలికిన పలుకులివి! ఈయనే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... ‘‘ఒక్క నెల ఆగితే పెన్షన్ డబుల్ అయితది. డిసెంబర్ తొమ్మిదినాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ఖాతాలో రూ.4 వేలు పడుతాయి’’ అని కోతలు కోశారు. అయితే, అధికారంలోకి వచ్చి 10 నెలలైనా కాంగ్రెస్ బడా నేతలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదు.అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 42 పేజీల మేనిఫెస్టోలోని చాప్టర్–2లో పేర్కొన్న ఆరో గ్యారెంటీలో ఏం చెప్పారు? ఇంతకుముందు రూ.2 వేలు నెలవారీ పింఛన్ తీసుకుంటున్న వారందరికీ తాము అధికారంలోకి వచ్చాక చేయూత కింద రూ.4 వేలు ఇస్తామనీ, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామనీ రాతపూర్వకంగా చెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా... పెంచలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పింఛన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ లబ్ధిదారులకు ద్రోహం చేస్తున్నారు. పింఛను పెంపు లెక్కను పరిగణనలోకి తీసుకుంటే 10 నెలలుగా ప్రతి అవ్వ, తాతకు, దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 వేల రూపాయిలు బాకీ పడిందని చెప్పవచ్చు. ఉలుకూ లేదు పలుకూ లేదురాష్ట్రంలో ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న వారితో పాటు అదనపు వ్యక్తి ఉంటే, ఇంట్లో ఇద్దరు వృద్ధులకూ పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు చెప్పారు. దీంతో పది లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారనీ, ఈ లెక్కన దాదాపు 55 లక్షల మందికి కాంగ్రెస్ పెన్షన్ అందిస్తుందనీ గొప్పలు చెప్పారు. ఇప్పుడు దీని గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. రెండు మూడు రోజుల్లో ఆసరా పింఛన్ దారులకు తీపి కబురు అందిస్తాననీ, ఆ బాధ్యత తనదేననీ ఈ ఏడాది జూన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పుడు దీనిపై నోరు మెదపడం లేదు! ఇక, ఇతర మంత్రుల సంగతి సరేసరి... ఉలుకూ, పలుకూ లేదు!వృద్ధులు, ఒంటరివాళ్లు, వికలాంగులు పలు కారణాలతో సొంతంగా సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ప్రభుత్వం అందించే పింఛన్ వల్ల వీరు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా బతుకుతూ తృప్తిగా ఉంటారు. ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్లతో లబ్ధిదారులు గౌరవంగా జీవించడమే కాకుండా కష్టమైన పనులు చేయాల్సిన అవసరం లేకుండా జీవితం గడుపగలుగుతారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం వారికి హామీ ఇచ్చినట్టు పింఛన్ డబ్బులు పెంచితే వాళ్లు నిశ్చింతగా బతుకుతారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయం.మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రూ.200 పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకొంది. 2014 ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్... ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పింఛన్లను రూ.200 నుంచి రూ. 1,000, దివ్యాంగులకు రూ.500 నుంచి 1,500 రూపాయలకు పెంచారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి పింఛన్లు పెంచుతామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే వృద్ధులు, వితంతువులు, ఇతర కార్మికుల పింఛన్లను రూ.1,000 నుంచి రూ. 2,016, దివ్యాంగులకు రూ.1,500 నుంచి 3,016 రూపాయలకు పెంచింది. మారుతున్న కాలమాన పరిస్థితులు, వయసుతో వచ్చే వివిధ ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని 2020 మార్చిలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అర్హత వయసును 65 ఏళ్ళ నుండి 57 ఏళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడంతో వృద్ధాప్య కేటగిరిలో అదనంగా సుమారు 8 లక్షల మందికి లబ్ధి చేకూరింది. దీంతో పాటు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి మరో లక్ష మందిని ఆసరాకు జోడించింది. దీంతో పథకంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 45 లక్షలు దాటింది. అయితే కాలక్రమేణ పింఛన్ లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా కొత్తవారికి పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం చొరవ తీసుకోలేదు. సమయానికి సదర్ క్యాంపులు నిర్వహించకపోవడం వల్ల కొత్తగా దివ్యాంగులుగా మారిన వారు చేయూత పథకంలో చేరడం కష్టంగా మారింది. ఇవన్నీ గడిచిన పది నెలల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనతలుగా చెప్పుకోవచ్చు.మంచిర్యాలలో 2023 జూన్ 9న జరిగిన సభలో దివ్యాంగుల పింఛన్ను రూ.3,016 నుంచి రూ.4,106కు పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించిన తర్వాతి నెల నుండే అవి అమలులోకి వచ్చాయి. ఇది బీఆర్ఎస్ విశ్వసనీయత! దేశంలోనే బీడీ కార్మికులకు సైతం ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇది బీఆర్ఎస్కు పేదల పట్ల ఉన్న నిబద్ధత! కేవలం వృద్ధులే కాకుండా చేనేత కార్మికులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఇలా అందరికీ కేసీఆర్ ‘ఆసరా’గా నిలిచిన సంగతిని కాంగ్రెస్ కప్పిపెట్టవచ్చుగానీ, బీఆర్ఎస్ తీసుకొచ్చిన మార్పు లబ్ధిదారుల మనసుల్లో ఇప్పటికీ ఉంది, ఎన్నటికీ చెరిగిపోదు. బాకీ చెల్లించాలిఆసరా పింఛన్ పేరును చేయూత పింఛన్గా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తను ఎన్నికలప్పుడు వాగ్దానం చేసినట్టు పింఛన్ పెంచి ఇవ్వడం లేదు. అసలు సంగతి ఇలా ఉంటే, కొసరుగా... కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో చేయూత పింఛన్ దారులకు రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కూడా అందిస్తామనీ, దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామనీ హామీ ఇచ్చారు. కానీ, ఏ హామీనీ నెరవేర్చకుండా, అభాగ్యుల పింఛన్ డబ్బులను దారి మళ్లించి, వారిని రేవంత్ రెడ్డి నట్టేట ముంచారు. ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాలను, సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయాలి. లేదంటే, అది తీవ్ర అసమానతలకు దారి తీస్తుంది. కాబట్టి, హామీ ఇచ్చినట్టు దివ్యాంగుల పెన్షన్ వెంటనే రూ.4,016 నుంచి రూ. 6 వేలకు పెంచాలి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులకు రూ. 2,016 నుంచి రూ. 4 వేలకు పెంచాలి. పింఛన్ డబ్బులను ప్రతి నెలా 5వ తేదీలోపే ఇవ్వాలి. పది నెలలుగా బాకీ పడ్డ పింఛన్ పైసలన్నీ వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్లు సాధించేవరకు లబ్ధిదారుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది.-వ్యాసకర్త మాజీ మంత్రి, ఎమ్మెల్యే-టి.హరీశ్ రావు -
చింతమనేని హుకుం.. దెందులూరు టీడీపీ, జనసేనలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గం టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో..జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు.గ్రామాల్లో కేవలం టీడీపీ నేతలే పెన్షన్లు పంచుతారంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుకుం జారీ చేశారు. ప్రభాకర్ ఆదేశాలతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు సైతం తామూ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటామని తేల్చి చెప్పారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది.జనసేన నేతలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. పిడుగులు గుద్దులు గుద్దుతూ రెచ్చిపోయారు. ఈ ఘటనలో జనసేన పైడి చింత పాడు అధ్యక్షుడు మౌరు రామ కృష్ణతో పాటు పలువురికి గాయాలయ్యాయి. రామకృష్ణను అత్యవసర చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రోడ్డెక్కిన దివ్యాంగులు
మహారాణిపేట: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా ఇంకా ఈ హామీ అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 85 శాతం అంగవైకల్యం ఉన్నవారికి కూడా పెంచిన పెన్షన్ అమలు చేయడంలేదని ఆక్షేపించారు.వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్.మల్లేశ్వరి ఆధ్వర్యాన సోమవారం పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఇక్కడికి తరలివచ్చారు. తాము వివిధ సమస్యలతో సతమతమవుతున్నామని, వాటి గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని అక్కిరెడ్డి అప్పారావు అన్నారు. పెంచిన పెన్షన్ అమలుకోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని.. పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి దివ్యాంగులను అర్హులుగా గుర్తిస్తున్నారని.. కానీ, విశాఖలో ఎలాంటి క్యాంపులు నిర్వహించడం లేదన్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ పెన్షన్లను నిలుపుదల చేయడం తగదన్నారు. తండ్రికి ఇల్లు ఉందంటూ పిల్లలకు పెన్షన్ నిలిపేయడం సరికాదన్నారు. ఇలా జిల్లాలో దాదాపు 100 మందికి పింఛన్లు నిలిచిపోయాయన్నారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా పింఛను ఇవ్వాలని.. ఒంటరి దివ్యాంగులకు కూడా రేషన్ కార్డులివ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వారు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నలుమూలల నుంచి ట్రై సైకిళ్లు, దివ్యాంగుల స్కూటర్లు, ఇతర వాహనాల మీద దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ము
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై రిటైర్మెంట్ సొమ్ము భారీగా పెరగనుంది. ఈ మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్లో నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ సివిల్ ఉద్యోగుల సర్వీస్ సంబంధిత విషయాలను నియంత్రించడానికి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021ని నోటిఫై చేసింది.కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఎన్పీఎస్ కింద ఉద్యోగి ప్రాథమిక వేతనంలో యజమాని చెల్లించే మొత్తాన్ని 14 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రతిపాదించారు. కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్,పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే పెన్షనర్ల సంక్షేమ విభాగం ఎన్పీఎస్ కింద చెల్లించే మొత్తాలను వివరిస్తూ కొత్త ఆఫీస్ మెమోరాండమ్ను విడుదల చేసింది.సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ అమలు) రూల్స్, 2021లోని రూల్ 7 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని వారి వ్యక్తిగత పెన్షన్ ఖాతాకు ప్రతి నెలా జమ చేస్తుంది. మెడికల్ లీవ్, ఉన్నత విద్య కోసం వెళ్లడం కొన్ని సందర్భాలలో మినహా ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్ చెల్లించని సమయంలో ప్రభుత్వం కూడా తన వంతు మొత్తాన్ని చెల్లించదు.ఇక ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్నప్పుడు పెన్షన్ కాంట్రిబ్యూషన్స్ ఉద్యోగికి చెల్లించే జీవనాధార భత్యంపై ఆధారపడి ఉంటాయి. సస్పెన్షన్ కాలం తరువాత ఒకవేళ అది జీతం చెల్లించాల్సిన డ్యూటీ లేదా సెలవుగా వర్గీకరిస్తే ఆ మేరకు ప్రభుత్వం చందాలను సర్దుబాటు చేస్తుంది. ఉద్యోగులు ఫారిన్ సర్వీస్లో ఉన్నప్పుడు ఎన్పీఎస్ చందాలకు సంబంధించి కూడా మెమోరాండం వివరించింది. ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తాయి. -
పెన్షన్ల కోత .. పింఛన్ల కోసం అవ్వ తాతకు పడిగాపులు
-
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
కొత్త పెన్షన్ విధానానికి కేంద్రం ఆమోదం.. కీలకాంశాలు..
కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తోంది. వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు..ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్కు ఎలాంటి సంబంధం ఉండదు.కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.నేషనల్ పెన్షన్ స్కీమ్ కంటే యూపీఎస్ కొంత మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ యూపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను భర్తీ చేయదని కొందరు చెబుతున్నారు. ఇదిలాఉండగా, హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతుండగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేజీ బేసిన్లో మరో బావి నుంచి ఉత్పత్తిరాష్ట్రాల వాటాపై పర్యవేక్షణయూపీఎస్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని కేంద్రం కోరుతోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో కొన్ని రాష్ట్రాలు చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఎలాంటి అవినీతికి పాల్పడకుండా కేవలం గ్రాట్యుటీ, పెన్షన్ డబ్బుమీదే ఆధారపడే ఉద్యోగులకు కొత్త విధానం కొంత ఊరట చేకూరుస్తుందనే వాదనలున్నాయి. కానీ ఈ విధానాన్ని ఎంచుకునే రాష్ట్రాలు తప్పకుండా వాటి వాటాను సైతం జమచేసేలా పర్యవేక్షణ ఉండాలని విశ్లేషకులు కోరుతున్నారు. -
రాహుల్ జీ.. మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నా?
కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ పథకంపై ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సెటైర్లు వేశారు. యూపీఎస్లో ‘యూ’ అంటే.. యూటర్న్స్ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత రవి శంకర్ ప్రసాద్ కాంగ్రెస్పై ప్రశ్నల వర్షం కురిపించారు. పెన్షన్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని అన్నారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీని నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా..ఎన్నికల ప్రచారంలో హిమాచల్ ప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్పై హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల హామీని అమలు చేస్తారా? అని ప్రశ్నించారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ప్రచారం చేసింది. అది అమలు చేయడం సాధ్యం కాదని తెలుసుకుని లోక్సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చే ధైర్యం చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే అవికాని హామీలు ఇచ్చింది. ఇప్పుడు వాటిపై ప్రజల్లో నమ్మకం పోయిందని రవి శంకర్ ప్రసాద్ నొక్కాణించారు. కాగా,కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ను అమలు చేయనుంది. ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ అవుతుంది. ఈ పథకంలో ఉద్యోగులు 10 శాతం చెల్లించాల్సి ఉండగా..ప్రభుత్వం 18.5 శాతం చెల్లించనుంది. -
బ్యాంకు వారికి.. ఆ హక్కు లేదు!
ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – గ్రాట్యుటీని బ్యాంకు వారు లోన్ బకాయిల రీత్యా జమ కట్టుకోవచ్చా?ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న మాధవరావు (పేరు మార్చాము) అనే ఒక వ్యక్తి కోవిడ్ సమయంలో సేవలు నిర్వహిస్తూ కన్నుమూశారు. ఆయన మరణానంతరం తన వారసులకు –భార్యకు రావలసిన కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ వంటి అంతిమ ఆర్థిక ప్రయోజనాలు (టెర్మినల్ బెనిఫిట్స్) భార్య అకౌంట్లోకి వచ్చాయి. అయితే, అలా అకౌంట్ లోకి వచ్చిన వెంటనే సదరు బ్యాంకు అధికారులు పెన్షన్ మొత్తాన్ని మాధవ రావు బతికుండగా తీసుకున్న లోన్ బకాయి కింద జమ కట్టుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించిన సదరు ఉద్యోగి భార్యను ‘ఇది మా హక్కు‘ మీ ఆయన మా బ్యాంకులో లోను తీసుకోవడమే కాక, తన టెర్మినల్ బెనిఫిట్స్ నుంచి కూడా రికవరీ చేసుకోవచ్చు అని మాకు రాసి ఇచ్చారు. అంతేకాక మీ భర్త పని చేసిన డిపార్ట్మెంట్ వారికి, మా బ్యాంకుకు మధ్య ఒక ఒప్పందం కూడా ఉంది. అందువలన మేము ఆ మొత్తాన్ని లోను కింద జమ కట్టుకున్నాము‘ అని చెప్పి ఆవిడని వెళ్ళిపొమ్మన్నారు. అప్పుడు ఇద్దరు మైనర్ పిల్లల తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.వాదోపవాదాలు విన్న తర్వాత, పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని, మరీ ముఖ్యంగా సి.పి.సి లోని సెక్షన్ 60 (1) నిబంధనల ప్రకారం ‘‘టర్మినల్ బెనిఫిట్స్ లోనుంచి వచ్చిన నిధులను, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (పీ.ఎఫ్) వంటి సామాజిక సంక్షేమ పథకాల ద్వారా సంక్రమించిన నిధులను ఏ బ్యాంకు అయినా, కోర్టు అయినా అలా తీసుకోవడానికి, అటాచ్మెంట్ చేయడానికి వీలు లేదు’’ అని తీర్పునిస్తూ ‘‘ఆ మహిళ అకౌంట్లో నుంచి లోను బకాయి పేరుతో బ్యాంకు వారు తీసేసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఆ మహిళకు చెల్లించవలసిందే’’ అని ఆదేశించింది. అప్పటికీ కూడా బ్యాంకు వారు తిరిగి చెల్లించక΄ోవడంతో గౌరవ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాల్సి వచ్చింది. మొత్తానికి సదరు మహిళకి ఆ డబ్బులు మొత్తం బ్యాంకు వారు తిరిగి చెల్లించారు. బ్యాంకు వారికి లోన్ రికవరీ చేసే అధికారం వున్నప్పటికీ, చట్ట పరిధిలో ఉండి మాత్రమే రికవరీ చేయాల్సి వుంటుంది. లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకు లోన్ తీసుకున్నెప్పుడు ‘లోన్ ఇన్సూరెన్స్’ అనే పథకాన్ని ఎంచుకోవాలి. అంటే, రుణ బకాయీలు ఉండగా లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా, ఏదైనా శాశ్వత వైకల్యం వంటివి కలిగి ఉపాధి కోల్పోయిన సమయాలలో వారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా ఉండచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీ బదులు లోన్ కడతారు. మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది. కొన్ని లోన్ఖాతాలకి లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అయినప్పటికీ, బ్యాంకు వారు కూడా లోన్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ చెప్పి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకునేలా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం.. రూ.2లక్షల జరిమానా..!
ఢిల్లీ : పెన్షన్ల జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయకపోవడపై కేంద్రంపై సీరియస్ అయ్యింది.భారత సైన్యంలో రీటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ర్యాంక్ వన్ పెన్షన్ చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మండిపడింది.ఈ క్రమంలో కేంద్రానికి రెండు లక్షలు జరిమానా విధించింది. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు నవంబర్ 14లోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది. లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది సుప్రీం కోర్టు. పెన్షన్ విషయంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. -
పెన్షన్ల పంపిణీపై టీడీపీ నేతల లొల్లి ఎమ్మెల్యేను నిలదీసిన కార్పొరేటర్
-
కడప టీడీపీలో ‘పెన్షన్ల’ రగడ.. ఎమ్మెల్యే Vs కార్పొరేటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.సొంత పార్టీ కార్పొరేటర్నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
పెన్షన్ అందక 90 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన
-
శ్రీకాకుళం జిల్లా: టీడీపీ ఇష్టారాజ్యం.. పెన్షన్ల నిలిపివేత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఆముదాలవలస నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రాజకీయ కక్షతో పలు చోట్ల పెన్షన్ నిలిపివేయించారు. ఆముదాలవలస నియోజకవర్గంలో పెనుబర్తి గ్రామంలో 19 మందికి పెన్షన్ ఆపేశారు. టీడీపీ నేతల ఆదేశాలతోనే తమకు పెన్షన్ నిలిపివేశారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.నిన్నటి నుంచి పెన్షన్ కోసం లబ్ధిదారులు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయంలో ఎవరూ లేకపోవడంతో పెన్షన్ కోసం లబ్ధిదారులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.కాగా, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ కొందరికి పింఛన్లు ఇవ్వకపోవడం వాగ్వాదానికి దారి తీసింది. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు ఇవ్వలేక పోతున్నామని చెప్పడంతో గ్రామంలో పింఛన్ అందని వారంతా ఒక చోటకు చేరి ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి రైతు భరోసా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సుమారు 22 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ గుర్తింపు సర్టిఫికెట్ పొంది పింఛన్ పొందుతున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం మూడు గంటలకు పింఛన్లు అందజేశామని సచివాలయం వెల్ఫేర్ అధికారి రవికుమార్ చెప్పారు.ఐదేళ్లు ఎలాంటి వివక్షకు తావులేకుండా ఠంచన్గా, పారదర్శకంగా అందించిన పింఛన్లపై జన్మభూమి కమిటీల రాజ్యం మళ్లీ మొదలైంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సోమవారం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ పూర్తిగా రాజకీయ నేతల కనుసన్నల్లో సాగింది. ఇంటివద్ద అందించాల్సిన పెన్షన్లను కొన్నిచోట్ల చెట్ల కింద, రచ్చబండ వద్ద, ప్రైవేట్ స్థలాల్లో ఇస్తామని తిప్పడంతో పడిగాపులు కాసి అవస్థలు ఎదుర్కొన్నారు. పేరుకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించినా పంపిణీ మొత్తం ప్రతి చోటా అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే జరిగింది.మరోవైపు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల స్థానిక టీడీపీ నాయకులు చేతివాటం చూపినట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల సహా పలు చోట్ల కమీషన్ల కింద రూ.500 మినహాయించుకుని ఫించన్ ఇస్తున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 2014–19 మధ్య కూడా టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు లంచాల వసూళ్లకు తెగబడి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అదే వాతావరణం కనిపించినట్లు వాపోతున్నారు. -
500 ఇస్తేనే పెన్షన్ .. మళ్లీ మొదలైన అవినీతి
-
పండుటాకులపై టీడీపీ కక్ష !
ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు పి.నరసింహులు. టీఓపల్లె గ్రామానికి చెందిన ఇతను 2014 టీడీపీ ప్రభుత్వ హయాం నుంచి డప్పు కళాకారుడిగా పింఛన్ పొందుతున్నాడు. కొన్నేళ్ల క్రితం కాలుకు ప్రమాదం జరిగింది. పింఛన్ డబ్బులు మీదే ఆధారపడి భార్యను పోషించుకుంటున్నాడు. ‘గత నెల వరకూ పింఛన్ వచ్చింది.. ఈ నెలలో ఇవ్వలేదు. ఇదేమనడిగితే ఉన్నతాధికారులు ఆపమన్నారని చెబుతున్నా’రని వాపోయాడు.ఇక్కడ కన్పిస్తున్న వ్యక్తి పేరు ఆలూరు సీతారాములు. టీఓపల్లె పంచాయతీ రేపల్లెకు చెందిన ఇతనికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తున్న రూ.200ల వికలాంగ పింఛన్ పొందుతున్నాడు. గత నెల వరకూ వికలాంగత్వ పింఛను పొందాడు. ఈ నెలలో పింఛన్ కోసం వెళ్లగా తనకు ఇవ్వడం లేదని వాపోయాడు. తన వికలాంగ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే ఇస్తామని అధికారులు చెబుతున్నారని. కావాలనే గ్రామంలోని టీడీపీ నాయకులు తన పింఛను ఆపిస్తున్నారని, తన చేతిని చూసి కూడా పింఛన్ ఆపటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.చాపాడు : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ‘మీ భద్రతే .. మా బాధ్యత’ అంటూ ఊదరగొట్టింది. అవన్నీ మాటలకే అంటూ మరోసారి రుజువు చేసింది. అన్ని అర్హతలున్నా పింఛన్ ఇవ్వకుండా నిరుపేద పండుటాకులకు, దివ్యాంగులకు మోసం చేసింది. మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామ పంచాయతీలో 94 మంది పింఛన్ దారులకు డబ్బులు పంపిణీ చేయకుండా వారి కన్నీళ్లకు కారణమైంది. స్వయానా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మూడు పంచాయతీలకు చెందిన 94 మంది పింఛన్దారులకు అర్హతలను పునర్విచారణ చేసిన తర్వాతనే డబ్బులు పంపిణీ చేయాలని కలెక్టర్ విజయరామరాజుకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం జరిగిన పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసిన 94 మందికి పింఛన్ డబ్బులను ఆపాలని ఎంపీడీఓ రహంతుల్లయ్య ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసిన సదరు లబ్ధిదారులకు నిరాశ ఎదురైంది. పదేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నామని ఈ సారి తమకెందుకు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని, తామేమి పాపం చేశామని బాధితులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ వర్గీయులన్న కారణంగా పింఛన్లు ఆపారని ఆయా గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.ఎంపీడీఓ ఏమన్నారంటే..మడూరు, అన్నవరం, టీఓపల్లె గ్రామాల్లో 94మందికి పింఛన్లను ఆపడంపై ఎంపీడీఓ రహంతుల్లయ్యను వివరణ కోరగా.. ఎమ్మెల్యే కలెక్టర్కు ఫిర్యాదు చేశారని, డీఆర్డీఏ పీడీ నుంచి 94 మంది పింఛన్లను వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత పింఛన్ల పంపిణీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.పింఛన్ డబ్బులు అందని బాధితులు..మండలంలోని మడూరు పంచాయతీలో వృద్ధాప్య పింఛను పొందుతున్న ఎం.శివారెడ్డి, మబ్బులు, కె.మహమ్మద్ షరీఫ్, మాలబాల సుబ్బారెడ్డి, కట్టుబడి సాసేన్ వలి, మాబు షరీఫ్, సాకం చిన్న సుబ్బారెడ్డి, పర్లపాటి షేక్ రసూల్, బాషా, రామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, కల్లెగాల్ల చెన్నమ్మ, చంటి సుబ్బయ్య, ఆవుల గుర్రప్ప, కాలేబు, సానెపల్లె బయపురెడ్డి, లక్షుమ్మ, ఆళ్లగడ్డ దానం, బొగ్గుల రాజమ్మ, సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, శేషారెడ్డి, పెద్ద లక్ష్మీరెడ్డి, వికలాంగులైన లక్ష్మీప్రియ, సాకం నాగసూయమ్మ, సుభానీ, మహబూబ్ బాషా, రంగాగాళ్ల లలితమ్మ, సుబ్బమ్మ, డప్పు పింఛన్దారులు సుబ్బరాయుడు, కల్లగాల్ల సుబ్బరాయుడు, చిన్నటిగాళ్ల సుబ్బరాయుడు, చెప్పులు కుట్టేవారు అంకన్న, పెద్ద ఓబయ్య, బాల ఓబయ్య, అభయహస్తం, వితంతువు మునెమ్మ ఉన్నారు. అలాగే అన్నవరంలో.. వృద్దాప్య పింఛన్ దారులు పల్లవోలు ప్రసాద్రెడ్డి, ఆలూరు పీరయ్య, బాషా, వీరనారాయణ, గంగిరెడ్డి, నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, కుల్లాయిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నారాయణరెడ్డి, పెద్ద కొండారెడ్డి, కాసా వెంకటసుబ్బారెడ్డి, ఎల్లారెడ్డి, సంజీవరెడ్డి, జాకోబ్, చిన్న సుబ్బరాయుడు, వికలాంగులైన ఆదినారాయణరెడ్డి, చింతకుంట పైద్దీన్, ఇందిరమ్మ, కానాల మేరి, గంగయ్య, రామిరెడ్డి, రామ ఓబులరెడ్డి, అశ్వని, రామసుబ్బమ్మ, బంక మమత, చేనేత నారాయణ పింఛన్ ఆపేసిన వారిలో ఉన్నారు. టీఓపల్లెలో.. వృద్దాప్య పింఛన్ పొందుతున్న చెన్నూరు సుబ్బమ్మ, వీరమ్మ, సుబ్బారెడ్డి, ఏ.వెంకటసుబ్బారెడ్డి, కుంచెం సుబ్బ మ్మ, పిచ్చయ్య, మద్దిలేటి, రామయ్య, వెంకటసుబ్బ య్య, శివారెడ్డి, గంగమ్మ, కొండారెడ్డి, వికలాంగులైన సాంబశివారెడ్డి, శ్రీదేవి, తిరుపాలమ్మ, గురుస్వామి, రంగరాజు, సాంబశివారెడ్డి, డప్పు కళాకారులు వెంకటసుబ్బయ్య, చిన్నమ్మ, నరసింహులు, రాముడు, చేనేతలైన సుబ్రమణ్యం, వెంకటసుబ్బయ్య, సుబ్బరాయుడులకు పింఛన్ డబ్బులను ఆపారు.76 ఏళ్లు ఉన్నా వృద్ధాప్య పింఛన్ ఆపడం న్యాయమాపదేళ్లుగా వృద్ధాప్య పింఛన్ పొందుతున్నాను. గతంలో టీడీపీ, గత ఐదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా పింఛన్ సజావుగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో రావటం మొదటి నెలే నాకు పింఛను ఇవ్వకుండా ఆపటం ఎంత వరకు న్యాయం. 76 ఏళ్లు ఉన్న నా పత్రాలను పరిశీలించిన తర్వాతనే ఇస్తామని చెప్పటం బాధాకరం.– ముదిరెడ్డి శివారెడ్డి, వృద్ధుడు, మడూరు గ్రామం -
ఏపీలో మొదలైన పెన్షన్ కష్టాలు (ఫోటోలు)
-
ఈసారీ బ్యాంకు ఖాతాల్లోనే పింఛను డబ్బులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అవ్వాతాతలకు వచ్చే నెల నుంచి పంపిణీ చేసే పింఛన్ను కూడా ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. మే నెలలో ఇంటివద్ద పింఛను పొందిన వారికి ఈసారి కూడా 1–5 తేదీల మధ్య ఇంటివద్దే ఆ డబ్బు అందిస్తారు. జూన్ ఒకటికి కొత్తగా 80 ఏళ్లు వచ్చిన వారికి కూడా ఇంటి వద్దే పింఛన్ డబ్బు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ బుధవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఐదేళ్లుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే ఠంచన్గా పింఛన్ లబ్ధిదారులందరికీ వలంటీర్ల ద్వారా ఇంటివద్దే అందించేది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేప«థ్యంలో ఎన్నికల కోడ్ పేరుతో టీడీపీ చేసిన ఫిర్యాదులతో వలంటీర్లను ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నుంచి దూరంగా ఉంచింది. దీంతో రెండు నెలలుగా అవ్వాతాతలు, దివ్యాంగులు, తదితరులకు అందించే పింఛన్ల పంపిణీలో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. పింఛన్లను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్లకు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం ఇంటి వద్దనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో పింఛను డబ్బులను పంపిణీ జరిగింది. జూన్ నెలలోనూ ఇదేవిధంగా జరగనుంది. 73% లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ రాష్ట్రవ్యాప్తంగా 65,30,808 మందికి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఇందుకోసం రూ.1,939.35 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. లబి్ధదారుల్లో 47,74,733 మంది (73.11 శాతం)కి డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటో తేదీనే జమ చేస్తారు. మిగిలిన 17,56,105 మంది (26.89 శాతం)కి ఇంటి వద్దే పంపిణీ చేయనున్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పెన్షన్ పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు అందాయి. ఇతర రాష్ట్రాల కోఆపరేటివ్ బ్యాంకులలో బ్యాంకు ఖాతా ఉన్న లబ్దిదారులకు కూడా డీబీటీ రూపంలో కాకుండా జూన్ 1 – 5 తేదీల మధ్య ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. -
ఏపీ : చంద్రబాబు కుట్ర.. ఎండల్లో పింఛన్దార్ల అష్టకష్టాలు (ఫొటోలు)
-
ఫించన్ ఎత్తేశారు!
రాకముందే అవ్వాతాతలకు అవస్థలు 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ పేదవాడికీ, ఏమీ చేయని చంద్రబాబు ఈనాడులో ఇచి్చన ప్రకటన చూశారా? సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు. సూపర్ సిక్స్లో అవ్వాతాతల పెన్షన్ మీకు ఎక్కడైనా కనిపించిందా? చంద్రబాబు రాకమునుపే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనకా వాననకా తిరగాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక పొరపాటున చంద్రబాబు పాలన వస్తే చంద్రముఖి మళ్లీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ ఇది జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు, సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘ఈ ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు తన బాణాన్ని నేరుగా పేద సామాజికవర్గాల మీద, నా అవ్వాతాతల మీద, వారి పెన్షన్ల మీద గురి పెట్టాడు. ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతున్న రాజకీయాలు, చేస్తున్న అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. అయ్యా చంద్ర బాబూ...! 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ నీ హయాంలో అవ్వాతాతలకు నువ్వు ఇచ్చి న పెన్షన్ ఎంత? కేవలం వెయ్యి రూపాయలు కాదా? ఆ పెన్షన్ను రూ.3 వేలు చేసింది ఎవరు? ఆ అవ్వాతాతలకు పెన్షన్ ఇంటికే పంపుతున్నది ఎవరు? చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల్లో అవ్వాతాతల పెన్షన్ను అప్పుడే ఎత్తేశారు’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లాపెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు, సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలోని పామూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. సాధ్యం కాని హామీలతో వల.. మరో 10 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి కావు. ఐదేళ్ల మీ భవిష్యత్తు, ఇంటింటికీ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే. సాధ్యం కాని హామీలతో వల వేస్తున్నాడు. వదల బొమ్మాళీ వదలా.. అంటూ పసుపు పతి మళ్లీ నిద్రలేచి వస్తాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ చంద్రముఖి మీ ఇంటి తలుపుతట్టి లకలకా అంటూ ఐదేళ్లు రక్తం తాగేందుకు వస్తుంది. మరోసారి మోసగించేందుకే చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే ఆ పెద్దమనిషి పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క మంచి గుర్తుకొస్తుందా? నాడు అవస్థలతో 39 లక్షలు.. నేడు ఠంఛన్గా 66 లక్షలు ఓ అవ్వాతాతా.. చంద్రబాబు ఇచ్చిన సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా? ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకూ ఇచ్చింది కేవలం 39 లక్షలు. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకుంటూ వివక్షకు లోనవుతూ అరకొరగా తీసుకున్న దుస్థితి. మీ బిడ్డ జగన్ హయాంలో ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా రూ.3వేలు చొప్పున పెన్షన్ నేరుగా మీ ఇంటికే అందిస్తున్నాడు. ఆ పాపిష్టి కళ్లు పడనంతవరకూ.. చంద్రబాబు పాపిష్టి కళ్లు ఆ అవ్వాతాతల మీద పడనంత వరకూ ఇంటికే పెన్షన్ సజావుగా అందేది. సూర్యోదయానికి ముందే, ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వాతాతల ఇంటికే మనవళ్లు, మనవరాళ్ల రూపంలో వలంటీర్లు వచ్చి చిరునవ్వుతో పింఛను అందించి మంచి చేసిన కాలం మనదే. ఎప్పుడైతే చంద్రబాబు పాపిష్టి కళ్లు పడ్డాయో.. తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి వలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వకూడదంటూ ఉత్తర్వులు ఇప్పించాడు. చంద్రబాబు పాపిష్టి చేష్టలు అంతటితో ఆగలేదు. ఇంకా కడుపుమంట చల్లారక ఏం చేశాడో తెలుసా? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేటట్టుగా వాళ్ల పెన్షన్ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చింది. అవ్వాతాతలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇంత ఎండలో క్యూలలో నిలబడలేక చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఉంటే ఆ దౌర్భాగ్యపు పని చేసిన చంద్రబాబు ఆ నెపాన్ని మీ బిడ్డపై వేస్తున్నాడు. చంద్రబాబు, దుష్ట చతుష్టయం, ఎల్లోమీడియా వీళ్లంతా కలిసి ఆ నెపాన్ని మీ బిడ్డ మీద వేస్తున్నారు. ఆ ఈనాడు కథనాలు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూస్తే.. వీళ్లంతా మనుషులేనా? అనిపించేంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను 14ఏళ్లు మీరంతా చూశారు. మీ బిడ్డ 59 నెలల పాలన కూడా చూశారు. పెన్షన్లు నేరుగా మీ ఇంటికే వచ్చిన పరిస్థితులు చూశారు. చంద్రబాబు ఏ ఒక్క రోజూ అవ్వాతాతల మీద ప్రేమ చూపించలేదు. పెన్షన్ ఇంటికి పంపిన పరిస్థితి అంతకంటే లేదు. మీ కోసమే నా తొలి సంతకం.. నేను ఇవాళ ప్రతి అవ్వకూ, తాతకూ చెబుతున్నా. అవ్వాతాతా..! ఒక్క నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తేదీ దాకా ఓపిక పట్టండి. మీ బిడ్డ మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తాడు. నా మొట్ట మొదటి సంతకం మీకోసం పెడతా అని అవ్వాతాతలకు మాటిస్తున్నా. మీ మనవళ్లు, మనవరాళ్లుగా వలంటీర్లు సూర్యోదయానికి ముందే ఇంటికే వచ్చి చిరునవ్వుతో పెన్షన్లు అందించే పరిస్థితులు మీ బిడ్డ మళ్లీ తెస్తాడు. విద్యా విప్లవం.. మహిళా సాధికారత గతంలో ఎప్పుడూ జరగని విధంగా గవర్నమెంట్ బడిలో చదివే పిల్లలకు స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. నాడు–నేడుతో కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దాం. ఇంగ్లిష్ మీడియంతో వేసిన అడుగులు నుంచి సీబీఎస్ఈ, ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపిస్తున్నాయి. తొలిసారిగా 6వ తరగతి నుంచే క్లాస్రూమ్ లలో డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. పిల్లలు ఇబ్బంది పడకుండా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ సమకూర్చాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న 93శాతం మంది విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యాదీవెనతోపాటు వసతి దీవెన కూడా అందిస్తున్నాం. తొలిసారిగా అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను మన కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చాం.పిల్లలను బడికి పంపిస్తే చాలు చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ, ఆసరా ఇస్తున్నాం. ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు 22 లక్షల ఇళ్లు కూడా కడుతున్నాం. గ్రామాల్లోనే మహిళా పోలీసు, దిశ యాప్, రాజకీయ సాధికారత కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసింది మీ బిడ్డ ప్రభుత్వమే. లంచాలు లేని సమాజం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 600 రకాల సేవలు మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా ఇంటికే పెన్షన్, పౌర సేవలు, పథకాలు.. ఇవన్నీ జరుగుతోంది ఈ 59 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి కాకముందు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా నేరుగా మీ చేతికే అందుతాయని ఎవరైనా చెబితే నమ్మేవారా? మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశాడు. నాకు ఓటు వేయని వారినీ కోరుతున్నా.. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా మీ ఓటు ఎంత కీలకమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా ఒక్కటే కోరుతున్నా. మీ ఇంటికి వెళ్లి అవ్వాతాతలు, భార్యాపిల్లలతో కూర్చుని మాట్లాడండి. ఎవరి హయాంలో, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందో ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్లీ మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి నా అక్కచెల్లెమ్మలకు అందుతుంది. ఆ మోసాలు మీరంతా చూశారు.. మీ బిడ్డను నమ్మి మీరంతా అధికారం ఇచ్చినందువల్ల దేవుడి దయతో ఐదేళ్లలో ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తేగలిగాం. ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నా తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తూ 99శాతం హామీలను అమలు చేశాం. 2014లో ఒకసారి చంద్రబాబును నమ్మారు! ఆ కూటమిని నమ్మి ఓటు వేశారు! చంద్రబాబు మేనిఫెస్టో మాయలు, మోసాలు ఎలా ఉంటాయో మీరంతా చూశారు. ఈ 59 నెలల్లో మీ జగన్ పాలన చూస్తున్నారు. మీ బిడ్డ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు. కొత్త మోసాలతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్న వారికి, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని మనుషులకు తగిన గుణపాఠం చెప్పమని కోరుతున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్సింకులోనే ఉండాలి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, ఆసుపత్రులు, వ్యవసాయం బాగుండాలన్నా రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గకుండా గెలిపించాలి. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మన అభ్యర్థులను ఆశీర్వదించండివైఎస్సార్సీపీ నరసాపురం, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ముదునూరి ప్రసాదరాజు, గుడాల గోపి, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పి.అనిల్ కుమార్ యాదవ్, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. గతంలో ఇవి ఉన్నాయా?» పిల్లలకు విద్యాకానుక, వారి చేతుల్లో ట్యాబ్లు గతంలో ఎప్పుడైనా చూశారా? » రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారంతో గోరుముద్ద చూశారా? » తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యాదీవెన, వసతిదీవెన, ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, ఇంటివద్దే అందించిన పౌర సేవలు, పథకాలను చూశారా? » ఇంటికే రూ.3 వేల పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న తోడు, చేదోడు, లా నేస్తం, రూ.25 లక్షలదాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో మీరు చూశారా? » వీటన్నింటితో పాటు మీ ఊరిలోనే గ్రామ సచివాలయం, నాడు–నేడుతో బాగుపడిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఓ ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, అక్కచెల్లెమ్మల చేతుల్లో దిశ యాప్ గతంలో ఉన్నాయా? » మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్లీ ఇవన్నీ సజావుగా కొనసాగి పథకాలు అందుతాయి. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..» రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తానన్నాడు... జరిగిందా? » రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? » ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకుల్లో వేస్తామని ఏ ఒక్కరికైనా ఇచ్చాడా? » ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ అమలైందా? ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? » అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? » రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? » ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? » సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మించాడా? నరసాపురం, పెదకూరపాడు, కనిగిరిలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? » ప్రత్యేక హోదా తీసుకురాకపోగా అమ్మేశాడు. »ఇప్పుడు మళ్లీ అదే కూటమి పేరుతో మీ ముందుకొచ్చి సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కార్ అంటూ మరోసారి వంచనకు సిద్ధమైన మోసగాళ్లతో రాజకీయ యుద్ధం చేస్తున్నాం. నేడు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఇలా.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో ఉన్న గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరిక సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలు, సంఘాల ముఖ్య నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. తూర్పు గోదావరి జల్లాకు చెందిన బీసీ పోరాట సమితి జిల్లా అ«ధ్యక్షుడు రేలంగి శేఖర్, మూల్ నివాసి సంఘ్ జాతీయ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు, జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ నేత మారూరి రామలింగారెడ్డి, మార్వాడి కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారీకి సీఎం జగన్ వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహా్వనించారు. -
ఈ పాపం చంద్రబాబుదే.. అవ్వాతాతల ప్రాణాలు తీస్తూ రాజకీయాలా? (ఫొటోలు)
-
ఎటువంటి ‘చార్జీ’లు లేకుండానే పింఛన్ ఇవ్వండి
సాక్షి,అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలతో అవ్వాతాతల పింఛన్ సొమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పింఛన్ సొమ్మును ఎలాంటి చార్జీలకు మినహాయించుకోకుండా ఇవ్వాలని బ్యాంక్లను రాష్ట్ర బ్యాంకర్ల సంఘం (ఎస్ఎల్బీసీ) ఆదేశించినట్లు సెర్ప్ అధికారులు గురువారం తెలిపారు. అవ్వాతాతలు తమ బ్యాంక్ అకౌంట్లను చాలా కాలంగా ఉపయోగించని కారణంగా ఆ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేదు.దీంతో ఆయా అకౌంట్లకు బ్యాంక్లు చార్జీలు విధిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం..అవ్వతాతలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారు పింఛన్ డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఎటువంటి చార్జీలను బ్యాంక్లు తీసుకోకుండా చర్యలు తీసుకుంది. కాగా, మొత్తం లబి్ధదారులు 65.94 లక్షల మందిలో 48.92 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, వారందరి బ్యాంక్ ఖాతాల్లో బుధవారమే అధికారులు డబ్బులు జమ చేయగా, అందులో 74,399 మందికి వారి సాంకేతిక కారణాలు కారణంగా సొమ్ము జమ కాలేదు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందేలా వారి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకుంటామని సెర్ప్ అధికారులు తెలిపారు. కాగా, మే నెలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 65,49,864 మంది లబి్ధదారులకు పింఛన్ల పంపిణీ నిమిత్తం రూ.1,945.39 కోట్లు ప్రభుత్వం విడుదల చేయగా గురువారం సాయంత్రం వరకు డీబీటీ విధానంలో 48.92 లక్షల మంది లబి్ధదారులలో 48.17 లక్షల మందికి వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. దివ్యాంగులు, మంచం/వీల్చైర్కు పరిమితమైన వారిలో 16.57 లక్షల మందికి వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయించగా, అందులో 15.13 లక్షల మందికి గురువారం నాటికి పంపిణీ పూర్తయినట్లు వివరించింది. డీబీటీ విధానంలో 98.47% మందికి, లబి్ధదారుల ఇంటి వద్దనే పంపిణీ చేసేవారిలో 91.34% మందికి పంపిణీ పూర్తయినట్లు పేర్కొంది. -
ఠంఛన్గానే పింఛన్
సాక్షి, అమరావతి: మే 1న మేడే సందర్భంగా సెలవు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఠంచనుగా పింఛన్ అందించింది. 48,92,503 లబ్ధిదారులకు రూ.1,471.22 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. అలాగే దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన మరో 16,57,361 మందికి వారి ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.474.17 కోట్లను విడుదల చేయగా బుధవారం ఉదయం నుంచి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీని ప్రారంభించారు.గత ఐదేళ్లుగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్లను అందజేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ కుట్రలతో వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరగకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రతినెలా ఒకటినే ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును అందుకునే లబ్ధిదారులు గత నెల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడంతో అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ కష్టాలకు చంద్రబాబే కారణమని వారు మండిపడుతున్నారు. ప్రతి నెలా 1నే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారని.. ఇప్పుడు చంద్రబాబు కుట్రలతో వలంటీర్ల సేవలకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడిన ఇబ్బందులు తమకు పచ్చమూక కుట్రలతో మళ్లీ వచ్చాయని ధ్వజమెత్తుతున్నారు.అవ్వాతాతలకు పచ్చమూక తెచ్చిన కష్టాలు..చంద్రబాబు, ఆయన సన్నిహితుల కుట్రలతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అవ్వాతాతలకు పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు లేవు. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి. దీంతో మండల కేంద్రాలకు 10–15 కిలోమీటర్ల దూరంలో గ్రామాల్లో ఉండే అవ్వాతాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎవరో ఒకరి సహాయం లేకుండా బ్యాంకులకు వారు వెళ్లలేరు. దీంతో ఎవరో ఒకరిని బ్యాంకు వరకు రావాలని సహాయమడగాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు వేసవి కూడా కావడంతో పింఛన్ల నగదు తీసుకోవాలంటే అవ్వాతాతలు చాలా కష్టపడాల్సి వస్తోంది. గత ఐదేళ్ల నుంచి తమ ఇళ్ల వద్దే పింఛన్ల సొమ్మును నేరుగా అందుకున్న అవ్వాతాతలు బ్యాంకులకు ఎలాగోలా కష్టపడి వెళ్లినా నగదు విత్ డ్రా చేసుకోవడం తెలియదు. ఇందుకోసం వేరేవారిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇలా చంద్రబాబు, ఆయన ముఠా పన్నిన కుట్రలతో అవ్వాతాతలకు కష్టాలు తప్పడం లేదు.పింఛన్ కోసం వెళ్లి మృత్యువాతపింఛన్ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటి కెనరా బ్యాంక్ దగ్గరికి వచ్చిన ముద్రగడ్డ సుబ్బన్న (80) బుధవారం వేసవి తాపానికి గురై కుప్పకూలి చనిపోయాడు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకులవరం గ్రామం పిచ్చుకగుంట్లపల్లెకు చెందిన సుబ్బన్న 1వ తేదీ కావడంతో తన పెన్షన్ డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయో, లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అయితే మే డే కారణంగా బ్యాంకుకు సెలవు కావడంతో తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో ఎండ వేడికి తాళలేక బ్యాంకు సమీపంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. సమీపంలో ఉన్న వ్యక్తులు నీళ్లు చల్లి మంచినీరు తాగించినా ప్రాణాలు దక్కలేదు.పింఛను నేరుగా ఇవ్వడం లేదని మృతివలంటీర్ల ద్వారా నేరుగా పింఛన్ ఇవ్వనీయకుండా చంద్రబాబు కుట్రలు చేశారని మనస్తాపానికి గురైప ఒక వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు కళ్లా వీధికి చెందిన ఖలీల్ బేగ్ (75) ప్రతి నెలా ఇంటి వద్దనే వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేవాడు. అయితే ఈసారి పింఛన్ బ్యాంకులో వేస్తున్నారని.. అక్కడి నుంచి తెచ్చుకోవాలని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అవే ఆలోచనలతో ఇంటిలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చంద్రబాబు కుట్రలతో ఇబ్బందులునాకు వృద్ధాఫ్య పింఛన్ వస్తోంది. ఆధార్కు లింక్ చేసినా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా పని చేయడం లేదు. పింఛన్ వస్తుందో, లేదో అని భయంగా ఉంది. రెండు నెలల క్రితం వరకు వలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు కొట్టి పింఛన్ రూ. 3 వేలు చేతిలో పెట్టేవారు. చంద్రబాబు కుట్రలకు మాలాంటి ముసలోళ్లు ఇబ్బందులు పడుతున్నారు. – గుంజి లక్ష్మీదేవిఇంత ఎండలో బ్యాంకుకు ఎలా వెళ్లేది?పింఛన్ సొమ్మును ఈసారి బ్యాంక్లో వేస్తారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్కు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలాంటి వృద్ధులకు ఇబ్బందే. వలంటీర్లు ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి ఇచ్చేవారు. మాలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చంద్రబాబు వల్లే మాకీ కష్టాలు. – బొబ్బ సుందరమ్మ, ఆత్మకూరు, పల్నాడుజిల్లా వలంటీర్ ఉంటే ఉదయాన్నే పింఛన్..నాకు వితంతు పింఛన్ వస్తోంది. మంచం మీద నుంచి పైకి లేవలేను. వలంటీర్ ఉన్నప్పుడు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. బాబు ఓర్వలేక వలంటీర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పింఛన్ను బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు. నేను బ్యాంక్కు వెళ్లలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జగనన్న వస్తే మళ్లీ కష్టాలు తీరతాయి.– తాతపూడి రాహేలమ్మ, వెలిగండ్ల, ప్రకాశం జిల్లా బాబు మంచి చేయడు.. చేయనివ్వడు..వలంటీర్ల ద్వారా మాకు వచ్చే పింఛన్లను అడ్డుకుంది చంద్రబాబే. ఆయన మంచి చేయడు.. ఎవరైనా చేస్తుంటే చేయనివ్వడు. ఐదేళ్లుగా ఇంటివద్దే పింఛన్ అందుకున్నాను. గత రెండు నెలలుగా చంద్రబాబు, ఆయన సన్నిహితుడు నిమ్మగడ్డ రమేశ్ కుట్రలతో మాకు కష్టాలు తెచ్చిపెట్టారు. ఇప్పుడు పింఛన్ తీసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వస్తోంది. నా బ్యాంకు ఖాతా ఇప్పుడు వినియోగంలో కూడా లేదు. – గంగాబాయి, కార్వేటినగరం మండలం, చిత్తూరు జిల్లా -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
బొగ్గు కార్మికులకు కనీస పెన్షన్ ఇకపై రూ. వెయ్యి
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ రూ.1000కి పెరిగింది. ఈ మేరకు ‘ది కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్–1998’కి సవరణలను ప్రకటిస్తూ గత నెల 8న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీల కార్మికులకు కనీస పెన్షన్ రూ.250 ఉండగా, మరికొన్ని కేటగిరీల వారీకి రూ.350 ఉంది. పెరిగిన పెన్షన్ మార్చి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. నామమాత్రంగా ఉన్న బొగ్గు గని కార్మికుల పెన్షన్ను పెంచాలని దేశ వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అసోసియేన్లు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ.వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగుల కుటుంబాలు రూ.1000 పెన్షన్తో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల సవరణ కమిటీ కేవలం రూ.వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గును వెలికితీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితపు చరమాంకంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచాలనీ, కరువు భత్యం సైతం చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
61.37 లక్షల మందికి రూ.1,847.85 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి తీవ్ర అవాంతరాలు సృష్టించాలని చూసినా ప్రభుత్వం ఠంఛన్గా పింఛన్ పంపిణీ చేసింది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించి, శుక్రవారం సాయంత్రానికి 93.42 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో 95 శాతం మందికి పైగా పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. శనివారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగుతుంది. -
ఈ పాపం ఊరికే పోదు.. చంద్రబాబుని ఏకిపారేసిన రోజా
-
చంద్రబాబు అహంకారం.. 31మంది వృద్ధులను పొట్టన పెట్టుకున్న హంతకుడు
-
అవ్వాతాతలకు ఇంటి దగ్గర పెన్షన్ రాకుండా చేసిన పచ్చ గ్యాంగ్
-
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
చేసిందంతా చేసి సచివాలయాల వద్ద టీడీపీ నేతల డ్రామాలు
-
చంద్రబాబు మోసగాడు, వెన్నుపోటుదారుడు..బాబుపై ఫైర్ అయిన పేర్ని నాని
-
చంద్రబాబు కుట్రలు.. పెన్షన్ కోసం వృద్ధుల పాట్లు
సాక్షి, విజయవాడ: హేయమైన రాజకీయాలకు నిరుపేదలకు బలి అవుతున్నారు. చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీల కుట్రతో వృద్దులు పెన్షన్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రతినెల ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ నెల లేదు. ఎన్నిలకు కమిషన్ కి ఫిర్యాదు చెయ్యడంతో వాలంటీర్లు సేవలు బంద్ అయ్యాయి. నడవలేని వృద్దులు ఎండలో వస్తున్నారు. సచివాలయాల వద్ద పెన్షనర్లు కు సౌకర్యాలు కల్పించి పెన్షన్ డబ్బులు అందిస్తున్నారు సిబ్బంది. కానీ ఎండలలో సచివాలయాలకు రావాలంటే అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు చేసిన కుట్రకు మేము బలి అయ్యామని, మాకొద్దు చంద్రబాబు అంటున్నారు. ఓటుతో చంద్రబాబు కి బుద్ధి చెప్తామని పెన్షనర్లు చెబుతున్నారు. -
చంద్రబాబు కుట్రతో పెన్షన్ దారులకు అష్టకష్టాలు
-
విషాదం.. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వృద్దురాలు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్జా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనమలూరు మండలం గంగూరులో పెన్షన్ కోసం వెళ్లిన వృద్దురాలు వడదెబ్బ తగిలి మృతిచెందింది. పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో వజ్రమ్మ(80) ప్రాణాలు విడిచింది. ఉదయం నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసిన వజ్రమ్మ వడదబ్బతో అక్కడే కుప్పకూలిపోయింది. పరీక్షించిన వైద్యులు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. విభిన్న దివ్యాంగ లబ్దిదారులతోపాటు తీవ్ర అనారోగ్యాల పాలైనవారు, మంచం లేదా వీల్ చైర్లకే పరిమితమైనవారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న వృద్ధ వితంతువులకు మాత్రం వారి ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. పెన్షన్ల కోసం బారులు తీరారు. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబు కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోవడం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తోంది. బాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. -
చంద్రబాబు చేసిన పనికి పెన్షన్ కోసం ఇబ్బందులు
-
ఈసీకి కంప్లైంట్ పై చెల్లుబోయిన ఫైర్
-
సైంధవుడుచంద్రబాబే..
సాక్షి, నెట్వర్క్: పింఛన్కోసం సోమవారం సాయంత్రం వరకూ ఎదురు చూసిన వృద్దులకు నిరాశ తప్పలేదు. కనీసం మంగళవారం అయినా ఇస్తారని ఆశగా చూసి చివరికి ఎప్పుడిస్తారో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఆ సొమ్ముతోనే అత్యవసర మందులు కొనుగోలు, ఇతర నిత్యావసరాల కోసం వినియోగించాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి చంద్రబాబు పన్నాగం అవరోధంగా మారింది. దీంతో ఆయన వ్యవహారశైలిపై రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నోటికాడ కూడును లాగేసుకున్న చంద్రబాబు విధానంపై ప్రజలు అక్రోశం చెందుతున్నారు. వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు అన్ని రంగాల ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ప్రతి నెలా ఇంటివద్దకే వచ్చి వలంటీర్ కుశలప్రశ్నలు అడిగి సొమ్ము చేతిలో పెట్టే సమయంలో వృద్దులు తడారని కళ్లతో వాటిని సంతోషంగా తీసుకునేవారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో దూర ప్రాంతానికి వెళ్లి ఎలా తెచ్చుకోవాలని ఆందోళన చెందుతున్నారు. సచివాలయానికి ఎలా వెళ్లాలి ? నా వయస్సు 72ఏళ్లు. అనారోగ్యంతో పాటు లేవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాను. ఇంట్లో వాళ్ల సహాయంతో ఊపిరి పట్టుకుని ఉన్నాను. పింఛన్ ప్రతి నెల ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్ మా ఇంటికి తెచ్చి నా చేతిలో పెట్టేది. ఈ నెల ఇంకా రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వలంటీర్ల మీద ఫిర్యాదు చేశారని తెలిసింది. వలంటీరు లేకుంటే నా లాంటి ఎంతోమంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయేవారు. కరోనాలో ఆపద్బాంధవులుగా ఆదుకున్నారు. ముసలి వారితో రాజకీయ క్రీడలు ఆడడం ఎంతవరకు సమంజసం. ఈ ఎండలో సచివాలయానికి ఏ విధంగా వెళ్లాలి. మానవత్వం లేని టీడీపీ, జనసేన నాయకులు ప్రజలకు ఏం మేలు చేస్తారు? – ఎస్.గోపాల్, కొర్లగుంట, తిరుపతి జిల్లా చంద్రబాబు చూపు పడితే కష్టాలే నాకు 90 ఏళ్ల పైనే ఉంటాయి. అనారోగ్యంతో కొన్నేళ్లుగా మంచంలోనే ఉంటున్నా. ఎక్కడికీ పోలేను. ప్రతినెలా వలంటీరు ఇంటి వద్దకే వచ్చి జీతం ఇచ్చినట్లు పింఛను ఇచ్చేవారు. వేలి గుర్తులు పడకపోయినా ఓపిక పట్టి ఇచ్చేవారు. ఆ డబ్బులు మందులకు, ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు వలంటీరును రాకుండా చేసినారు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలంట. ఇన్ని ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగులుతుంది. ఆయన చూపు పడితే అన్నీ కష్టాలే. – బోయ బతుకమ్మ, సోమలగూడ, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఆ రోజులు తలచుకుంటే భయమేస్తుంది నా వయస్సు 70 సంవత్సరాలు. ప్రభుత్వం ఇచ్చే పింఛనే నాకు జీవనాధారం. జగన్మోహన్రెడ్డి వచ్చాక ఒకటో తేదీన ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు పింఛన్ సొమ్ముల కోసం గతంలోలా పంచాయతీ కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడతాం. అప్పటి ఇబ్బంది తలచుకుంటేనే చాలా భయమేస్తోంది. ఇంటి దగ్గరకి వచ్చి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. – మాముడూరి సూరమ్మ, పెనుగొండ, ప శ్చిమగోదావరి జిల్లా మా ఉసురు తగులుతుంది రోడ్డు ప్రమాదంలో కాలుకు దెబ్బతగలడం వల్ల చేతికర్ర ఉంటే తప్ప నడవలేను. రెండేళ్లుగా పింఛన్ అందుకుంటున్నాను. ప్రతి నెల 1న 6 గంటలకు నా తలుపు తట్టి రూ. 3000లు పింఛన్ అందజేసేవాడు. నాకు షుగర్, బీపీ ఉండడం వలన ఎక్కువ సేపు నిలబడలేను. పింఛన్ డబ్బులు అందితేనే నాకు పూట గడిచేది. టీడీపీ వలంటీర్లపై కోర్టులో కేసు వేసింది. ఈనెల పింఛన్ ఇప్పటికి ఇవ్వలేదు. మాలాంటి వికలాంగుల ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. ఇప్పటి వరకు పింఛన్ ఇంటికే వస్తుందనే ధైర్యంతో ఉన్నాను. – దియ్యా రాంబాబు, రాజుపాలెం గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆమె పేరు మంజుల. భర్త వెంకటేష్ చిరువ్యాపారి. చిత్తూరు నగరంలోని తేనెబండ కాలనీలో నివాసముంటారు. వీరికి 23 సంవత్సరాల వయస్సు ఉన్న భరత్ (విభిన్న ప్రతిభావంతుడు) ఉన్నాడు. 11 సంవత్సరాల క్రితం ఇంటి దగ్గర ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడడంతో కాలుకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి నడవడానికి వీలుకాని పరిస్థితి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేదు. తల్లి తోడు ఉంటేనే కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి. బయట ప్రపంచమే తెలియని భరత్ ఇంటికే పరిమితమయ్యాడు. గత పాలనలో పింఛను కూడా వచ్చేది కాదు. వైఎస్ఆర్సీపీ వచ్చాక గత ఐదు సంవత్సరాలుగా పింఛను అందుకుంటున్నాడు. ప్రతి నెలా ఒకటవ తేదీన వలంటీర్ ఇంటి వద్దకు వచ్చి పింఛను అందజేసేవారు. ప్రతి నెలా వచ్చే రూ.3 వేలు పింఛను డబ్బును భరత్ చికిత్సకు ఉపయోగపడేవి. టీడీపీ చేసిన కుట్రతో వలంటీర్లు పింఛను ఇవ్వరనే వార్త తెలియగానే భరత్ తల్లి తల్లడిల్లిపోయింది. భరత్ను వార్డు సచివాలయానికి ఎలా తీసుకెళ్లాలని ఆవేదన చెందుతోంది. ఇటువంటి నీచమైన పనులు చేయడం చంద్రబాబుకు సబబు కాదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. – కుమారుడు భరత్తో తల్లి మంజుల, తేనెబండ, చిత్తూరు జిల్లా నిస్సహాయులను శిక్షించడమేమిటి? ఈ ఫోటోలో కనిపిస్తున్న అభాగ్యుడి పేరు పిప్పళ్ల రామలక్ష్మయ్య. కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లి గ్రామం. వ్యవసాయ కూలీ. 15 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. ఇంటి పెద్ద దిక్కు మూలన పడిపోవడంతో కుటుంబం ఆర్థికంగా నలిగిపోయింది. గత ప్రభుత్వంలోనూ పింఛను అందుకున్నప్పటికీ దయనీయ స్థితిలో దూర ప్రాంతానికి వెళ్లి డబ్బులు అందుకోవాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ తలుపు తట్టి పింఛను అందించేవారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థపై కక్షగట్టి కోర్టు ద్వారా ఆంక్షలు విధించడంతో ఈనెల లేవలేని స్థితిలో మంచాన ఉన్న అభాగ్యుడికి పెన్షన్ అందలేదు. పెన్షన్ అందితే తప్ప అతనికి జీవనాధారం లేదు. ప్రభుత్వం నుంచి అందుకునే నగదుతోనే మందులు వాడేది. అడుగు తీసివేయలేని తనకు అన్ని విధాల అండగా ఉన్న వలంటీర్ను విధుల నుంచి తొలగించాలని కోర్టు నిర్ణయించడం తనలాంటి నిస్సహాయులను శిక్షించడమేనని ఆవేదన చెందుతున్నాడు. – పిప్పళ్ల రామలక్ష్మయ్య, పోతేపల్లి, బందరు మండలం, కృష్ణా జిల్లా, -
బాబు పగ.. పండుటాకులకు బెంగ
తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీలో వలంటీర్ల ఆప్యాయ పలకరింపులు అవ్వాతాతలకు ఉండవు. చంద్రబాబు పండుటాకులు అనే కనికరం కూడా చూపలేదు. పింఛన్లపై పగపట్టారు. వలంటీర్లపై అక్కసు వెల్లగక్కారు. ఫలితంగా మొదటి సారిగా వైఎస్సార్ పింఛన్ కానుక కింద వలంటీర్లు లేకుండానే పింఛన్ల పంపిణీ ప్రక్రియ జరగనుంది. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారికి.. ఇంటి వద్ద మంచానికే పరిమితమైన వారికి పింఛన్ సొమ్ము సకాలంలో చేరుతుందా లేదా అనే బెంగ లబ్ధిదారుల్లో కలుగుతోంది. కడప రూరల్ : ప్రతి నెలా వలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే ఠంచన్గా పింఛన్ పంపిణీ జరిగేది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేయడంతో పింపిణీపై గందరగోళం నెలకొంది. అదే సందర్భంలో ఆయన చర్యలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే పింఛన్ల పంపిణీ సాఫీగా జరిగేనా అనే అనుమానం అందరిలో కలుగుతోంది. అధికారుల చర్యలు ఇలా .. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఉన్నతాధికారులు పింఛన్ల పంపిణీకి ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. రెండు దశల్లో పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం మొదటి దశ సచివాలయాల్లో సిబ్బంది ద్వారా, రెండవ దశ ద్వారా సచివాలయాలకు రాలేని వ్యాధిగ్రస్తులు, మంచాన పడిన వారు తదితరులకు ఇంటి వద్దనే ఇవ్వాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సచివాలయాల వద్దకు పింఛన్ కోసం వచ్చే వారి సౌకర్యార్థం టెంట్లు, మంచి నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టారు. వయోభారం.. అనారోగ్యం జిల్లాలో 17 కేటగిరీలకు చెందిన వారు మొత్తం 2,68,179 మంది ఉన్నారు. వారందరికీ రూ.79,31,26,000 నగదును అందజేయాలి. మొత్తం 2,68,179 పింఛన్లలో వృద్ధులు అధిక సంఖ్యలో 1,40,864 మంది ఉన్నారు. అలాగే దివ్యాంగులు 40,391 మంది, డీఎంహెచ్ఓ కింద 1,526 మంది, కిడ్నీ వ్యాధిగ్రస్తులు (ప్రభుత్వ, ప్రైవేట్) 490 మంది ఉన్నారు. ఒక అంచనా ప్రకారం వృద్ధుల విభాగంలో సగం మంది వయోభారంతో, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దివ్యాంగుల్లో 75 శాతం మంది నడవలేని పరిస్థితిలో ఉంటారు. డీఎంహెచ్ఓ, కిడ్నీ వ్యాధిగ్రస్తులతోపాటు సైని క్ వెల్ఫేర్, వితంతువులు, చేనేతలు, ఒంటరి మహిళ విభాగాలకు చెందిన వారిలో అధిక సంఖ్యలో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సంఖ్యలో కదలలేని స్థితిలో ఉన్నారు. వారి కందరికీ ఇంటి వద్దనే పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొత్తం పింఛన్లలో దాదాపుగా 50 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడే వారే ఉన్నారు. తక్కువ సిబ్బందితో మూడు రోజుల్లో సాధ్యమేనా.. అధిక సంఖ్యలో వలంటీర్లు ఉన్నప్పుడే పింఛన్ల పంపిణీ నాలుగైదు రోజులకు 100 శాతం నమోదయ్యోది. అలాంటిది సచివాలయ సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండే క్రమంలో మూడు రోజుల్లో పంపిణీ సాధ్యమయ్యే పనేనా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఒక సచివాలయంలో 11 మంది సిబ్బంది ఉంటారు. అందులో ఇద్దరు లేదా ముగ్గరు వ్యక్తిగత సెలవులో ఉండే అవకాశం ఉంది. అదనంగా సిబ్బందిని తీసుకున్నప్పటికీ వలంటీర్ల అంత వేగంగా పింఛన్ల పంపిణీ సాగదనే అభిప్రాయాన్ని అవ్వాతాతలు వ్యక్తం చేస్తున్నారు. ఉసురు తగులుతుంది పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా పెట్టాలని చంద్రబాబు ఫిర్యాదు చేయడం శోచనీయం. మంచంలో నుంచి లేవలేని వాళ్లం సచివాలయం వద్దకు వెళ్లి పింఛన్ ఎలా తీసుకోవాలి. చంద్రబాబుకు మాలాంటి వాళ్ల ఉసురు తగుతులుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్ ఇంటి వద్దకే వస్తోంది. తెల్లవారక ముందే పింఛన్ అందేది. వలంటీర్ల సేవలు ఎంతో బాగున్నాయి. అలాంటి వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పుడు మళ్లీ మాకు పింఛన్ కష్టాలు ఎదురవుతున్నాయి. – ఆకుల సంజమ్మ, 8వ వార్డు, మైదుకూరు పింఛన్ తెచ్చి ఇవ్వడమే పాపమా మా మనవళ్ల వంటి వలంటీర్లు మాకు పింఛన్ తెచ్చి ఇవ్వడమే పాపమా. ఇంతకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మున్సిపాలిటీ ఆఫీసు వద్దకు పింఛన్ కోసం వెళ్లి ఎండలో సొమ్మసిల్లి పడిపోయే వాళ్లం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటి వద్దకే పింఛన్ తెచ్చి ఇస్తున్నారు. వలంటీర్ల సేవలు మరువలేం. మళ్లీ పింఛన్ల పంపిణీ వారికే ఇవ్వాలి. – బాబులమ్మ, సాయినాథపురం, మైదుకూరు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చే వారు ప్రతి నెల 1వ తేదీ తెల్లవారుజామునే ఇంటికి వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. ఇన్నాళ్లు మాకు పింఛన్ గురించి టెన్షన్ లేకుండా ఉండేది. ఇపుడు వలంటీర్లు లేరంటే చాలా టెన్షన్గా ఉంది. అసలు మాకు పింఛన్ డబ్బులు ఎప్పుడు చేతికి అందుతాయో అర్థం కావడం లేదు. మేము డబ్బుల కోసం సచివాలయాలకు ఎన్ని రోజులు వెళ్లాలో. అంతా గందరగోళంగా ఉంది. జగనన్న డబ్బులు ఇస్తుంటే మీకు కడుపు మంట ఎందుకు? వలంటీర్ల ద్వారానే మాకు పింఛన్లు ఇప్పించండి. మాకు అది చాలు. ఇంకేం వద్దు. – షహజాదీ, వితంతు పింఛన్ లబ్దిదారురాలు, కమలాపురం. జిల్లాలో సచివాలయాలు.. సిబ్బంది వివరాలు ప్రాంతం సచివాలయాలు సచివాలయ వలంటీర్లు సిబ్బంది -
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
-
పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు, నిమ్మగడ్డను షాక్
-
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు.కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగిభయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం.– విజయ్ రాజ్కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
వాలంటీర్లు, పెన్షనర్లు లక్ష్యంగా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు
-
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు. కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగి భయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం. – విజయ్ రాజ్కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
మా ఉసురు తగులుద్ది..
మూడుచక్రాల సైకిల్పై ఉన్న ఈ దివ్యాంగుడి పేరు షేక్ పాచ్ఛా. పొదిలికి చెందిన ఇతను టీడీపీ ప్రభుత్వంలో పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వికలాంగ పింఛన్ మంజూరైంది. ఠంఛనుగా ప్రతినెలా వలంటీర్ ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు టీడీపీ నాయకుల కుట్రలతో వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘ఎండలో సచివాలయాలకు వెళ్లి క్యూలో ఉండి అధికారుల కోసం పడిగాపులు కాసి పింఛను తీసుకోవాల్సిన దుస్థితి కలి్పంచారు.. మా పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వకుండా అడ్డుకున్న వారు బాగుపడరు. మాలాంటి వృద్ధులు, వికలాంగుల ఉసురు తప్పక తగులుతుంది’’ అంటూ మండిపడ్డాడు. ఈ వృద్ధురాలి పేరు అల్లు తిరుపతమ్మ. వయస్సు 80 సంవత్సరాలు. తర్లుపాడు మండలం జగన్నాథపురానికి చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. కాస్త దూరం కూడా నడవలేని స్థితిలో ఉన్న ఈమెకు వలంటీరే ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ అందించేవారు. చంద్రబాబు కుతంత్రంతో ఇప్పుడు వలంటీర్లు పింఛను ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సుమారు 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి సచివాలయం దగ్గర పింఛన్ తీసుకోవాల్సి వస్తోంది. ‘‘1వ తేదీ అయినా వలంటీరు రాకపోవడంతో వాకబుచేస్తే వలంటీర్లు పింఛన్ ఇవ్వకూడదంటూ టీడీపీ నేతలు కేసులు వేశారని.. అందుకే వారు రాలేదని తెలిసింది. ఎండలు మండిపోతున్నాయి. సచివాలయం దాకా నడిచి వెళ్లి పింఛను తీసుకోలేను. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మంచి చేసే వాళ్ల మీద కేసులు పెట్టడం ఏందయ్యా..’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకటో తేదీ వచ్చిందంటే అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చిందేవి. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా అందరి ఇళ్ల ముందు సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇళ్ల ముందుకు వచ్చేవాళ్లు. ఏమవ్వా బాగున్నావా... ఏం తాతా ఎలా ఉన్నావంటూ కుశల సమాచారాలు అడిగి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులు వారి చేతుల్లో పెట్టేవారు. అవి అందుకున్న వాళ్ల కళ్లల్లో మెరుపులు చూసి వలంటీరు సంతృప్తి పడేవారు. ఎండైనా, వానైనా లెక్కచేయకుండా అవ్వా తాతలకు పింఛన్లు అందజేసేవారు. ఒకవేళ ఏదైనా పనిమీద వేరే ఊర్లకు వెళ్లి ఉన్నా, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా అక్కడికి వెళ్లి అందజేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలా అభాగ్యులకు అండగా ఉండే వలంటీరుపై పచ్చదండు కక్ష గట్టింది. రోజుకో రకమైన కథనాలు పచ్చమీడియా వండివార్చేది. అయినా రెట్టించిన ఉత్సాహంతో వలంటీర్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా శ్రమిస్తూ వస్తున్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి నాయకులు ఇళ్లకు పరిమితమైతే తన ప్రాణాలకు లెక్కచేయకుండా వలంటీరు సాయం అందించాడు. ఎన్నో మంచి పనులు చేసిన వారి సేవలు ఎల్లో మీడియాకు పట్టలేదు. ఎన్నికల పేరు చెప్పి వారిని అభాసుపాలు చేసేలా రోజుకో రకంగా అసత్య కథనాలు వండివార్చింది. కోర్టులకు ఎక్కింది. తాజాగా ఎన్నికల పేరు చెప్పి కొత్త కుట్రలకు తెరతీసింది. తన అనుకూలుర ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు మీద ఫిర్యాదులు చేయించింది. ఎన్నికల సంఘాన్ని సైతం తప్పుదోవ పట్టించింది. ఫలితంగా వలంటీరు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వరాదన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీనికి కారణమైన పచ్చదండుపై అవ్వాతాతలు, అభాగ్యులు మండిపడుతున్నారు. ప్రజల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేము ఏమన్యాయం చేశామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రభుత్వం, అధికార పారీ్టపై ఆ అపవాదు తోసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పత్రికా ప్రకటన. చేసిన తప్పును ఇలా కప్పిపుచ్చుకునేలా ప్రకటనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2 లక్షల 95 వేల మందిపై ప్రభావం తెలుగుదేశం పార్టీ దుష్ట కూటమి కుట్రలతో జిల్లాలో 2 లక్షల 95 వేల మంది పింఛన్దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వీరందరికీ ప్రతి నెలా ఇంటి వద్దకు వచ్చి తలుపుతట్టి మరీ పెన్షన్లు ఇచ్చేవారు వలంటీర్లు. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్లు క్రమం తప్పకుండా పెన్షన్ వచ్చేది. ఇందుకోసం నెలకు రూ.88.21 కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తెలుగుదేశం చేసిన కుట్రల వలన ఈ నెల చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి వచ్చింది. సహజంగానే వృద్ధాప్యంలో ఉన్న అనేక మంది ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటు¯ంటారు. ఇందులో ఎంతో మంది ప్రతినెలా వచ్చే పెన్షన్ డబ్బులు చేతికి అందగానే వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతుంటారు. అవసరమైన ఔషధాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రతినెలా వచ్చే పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియక కొందరు వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్లు రాకుండా అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు పోయేకాలం దాపురించిందని విమర్శిస్తున్నారు. చంద్రబాబు పాలనలో నరకయాతన చంద్రబాబు పాలనలో పెన్షన్లు తీసుకోవాలంటే నరకయాతన లాగా ఉండేది. అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ కోసం పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఏ రోజు పెన్షన్ ఇస్తారో తెలియక రోజుల తరబడి ఎంపీడీఓ కార్యాలయం, పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఉండేది. పైగా జన్మభూమి కమిటీలకు లంచాలు ముట్టచెప్పిన వాళ్లకు త్వరగా పెన్షన్లు అందేవి. ఒకరు చనిపోతే గానీ కొత్తవి వచ్చేవి కావు. ఇంతటి దారుణ పరిస్థితులు చవిచూసిన అభాగ్యులు నేడు ఎలాంటి కష్టం లేకుండా ఇంటికే డబ్బులు వస్తుండడంతో ఆనందంగా ఉన్నారు. రూ.3 వేల వరకు పింఛన్ జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది అవ్వాతాతలను కలిశారు. స్వయంగా వారి ఇబ్బందులను గమనించిన ఆయన చలించిపోయారు. తాను అధికారంలోకి వచ్చాక రూ.2 వేల వరకూ ఇస్తానని ప్రకటించారు. అప్పటి వరకు కేవలం వేయి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఎన్నికలకు ముందు రూ.2 వేలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అది కూడా కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 వేలు ఉన్న దానిని పెంచుకుంటూ రూ.3 వేలు చేశారు సీఎం జగన్. అర్హులందరికీ కొత్త పింఛన్లు సైతం అందేలా చేశారు. మంచంలో ఉన్న ఈ వృద్ధురాలి పేరు శగబండి మస్తానమ్మ. కురిచేడుకు చెందిన ఈమెకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. వలంటీరు ఇంటికి వచ్చి ప్రతినెలా పింఛన్ ఇచ్చేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపేయడంతో ఆ వృద్ధురాలికి కష్టం వచ్చిపడింది. ఈనెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి పింఛను తెచ్చుకోవాలని చెప్పడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లే స్థితిలో లేని ఆమె ఆవేదన వర్ణనాతీతం. ‘‘ఉద్యోగులు లాగే మా ఇళ్లకు వచ్చి పింఛన్లు ఇచ్చేవాళ్లు. ఏ దిక్కూ లేని మాకు జగన్బాబే దిక్కయ్యాడు. ఆయన ఇస్తున్న పింఛన్కు అడ్డుపడుతున్న వాళ్లు మా ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తారా.. మంచి చేయడం చేతకాకపోయినా చేసేవాళ్లను చెడగొట్టడం నీచమైన పని’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
టీడీపీ కుట్రల వల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు చేసే టక్కు టమారాలు, దొంగవిధానాలు, అబద్ధపు హామీలు, బూటకపు కూటములు ఈ ఎన్నికల్లో పనిచేయబోవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ ఆదివారం పేట పరిసర ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వలంటీర్లపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి, కుట్రలు కుతంత్రాలు పన్నిన కారణంగా పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని మండిపడ్డారు. లబ్ధిదారులంతా ఇప్పుడు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. జాతీయ సంస్థల సర్వేల్లో ఏపీ బెస్ట్ 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిపై జాతీయ సంస్థలు అనేక సర్వేలు చేశాయని, జీఎస్డీపీ టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే ఈ ఐదేళ్లలో 5వ స్థానానికి వచి్చందన్నారు. తలసరి ఆదాయం 17 నుంచి 9వ స్థానానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇవన్నీ అభివృద్ధి సూచికలు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్ను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్న సమయంలో 70 ఏళ్ల వృద్ధురాలు కూర్మాపు లకు‡్ష్మమమ్మ మధ్యలో లేచి మైక్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ‘మీ అందరికీ దండంబాబు.. ఏ దిక్కు మొక్కులేని నాకు జగన్బాబు దయవల్ల వలంటీర్ ఇంటికొచ్చి పెన్షన్, బియ్యం ఇస్తున్నారు. నాకు భర్తలేడు. కోడలు చనిపోయింది. నా కొడుక్కి, ఇద్దరు మనవళ్లకు నేనే గంజి పోస్తున్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్బాబును, పెసాదుబాబును గెలిపిస్తా’ అంటూ తన యాసలో చెప్పి అందరినీ ఆకట్టుకుంది. -
అవ్వాతాతలపై చంద్రబాబు కక్ష
సాక్షి నెట్వర్క్ : పేదవారంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనని.. ప్రతీనెల ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని, అందుకే వారిపై ఆయన కక్ష కట్టాడని పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో చంద్రబాబు తన జేబు సంస్థ అయిన ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ముసుగులో తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్కుమార్తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. దాన్ని వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ రాజకీయాలు చేస్తూ వలంటీర్లపై ఫిర్యాదు చేయడమంటే.. ప్రజలకు జరుగుతున్న మేలు అడ్డుకోవడమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. ఎవరెవరు ఏమేన్నారంటే.. ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి.. ప్రతీనెలా ఒకటో తేదీన ప్రభుత్వమిచ్చే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవ్వాతాతలు జీవిస్తున్నారు. అలాంటి వారికి వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలి. పేదోడు బాగా ఉంటే చంద్రబాబుకు తిన్నది అరగదు. పెన్షన్లు ఇవ్వనీయకుండా.. నిరుద్యోగుల డీఎస్సీని అడ్డుకున్న దుషు్టడు చంద్రబాబు. పెన్షన్ పంపిణీకి ఎటువంటి ప్రత్యామ్నాయం చేసినా ఇబ్బందులు తప్పవు. అది ఒక నెలతో పోయేది కాదు.. మూడునెలల పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటే ఆ పాపం శాపమై చంద్రబాబుకు చుట్టుకుంటుంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి వలంటీర్లపై విషం కక్కుతున్నారు పది మంది జీవితాల బాగు కోసం పాటుపడుతూ.. పారదర్శకంగా ప్రజాసేవకు అంకితమైన వలంటీర్లపై చంద్రబాబు, పచ్చబ్యాచ్ విషం కక్కుతున్నారు. ప్రజల కోసం అహరి్నశలు పాటుపడుతున్న వలంటీర్లంటే ఎందుకంత భయం? చంద్రబాబు ఓటమి భయంతోనే వలంటీర్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కక్ష సాధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. మొత్తం వలంటీరు వ్యవస్థనే తీసేసే హెచ్చరికగానే దీన్ని భావించాలి. అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిసినా అమానవీయంగా ఎన్నికల కమిషనర్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు వారి ఉసురు తగులుతుంది. – విడదల రజిని, మంత్రి బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు 1వ తేదీ ఉ.5 గంటల నుంచి ఇంటిగుమ్మంలో పింఛను కోసం ఎదురుచూస్తారు. పెత్తందార్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్యాకేజీలు గుంజుకునే చంద్రబాబు పేదలను ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ముందునుంచీ వలంటీరు వ్యవస్థపై పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్తో ఎన్నికల అధికారికి పిటిషన్ ఇచ్చి వలంటీర్లను విధుల నుంచి తప్పించి పాపం మూటగట్టుకున్నాడు. అవ్వాతాతల శాపనార్థాలు ఆయనకు తగులుతాయి. వారు పడే బాధ నువ్వు కూడా అనుభవించే రోజు వస్తుంది. – కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి చంద్రబాబుది రాక్షసానందం అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు రాకుండా అడ్డుకున్న పాపం చంద్రబాబుదే. గ్రామ వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఆయన రాక్షసానందం పొందుతున్నారు. ఆయన కుట్రతో అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇకపై మండుటెండల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో? వలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ బతుకులు ఏవిధంగా ఉంటాయోనని పేదలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ కూటమికి వారు బుద్ధిచెప్పడం ఖాయం. – ఆదిమూలపు సురేష్, మంత్రి చంద్రబాబు నరరూప రాక్షసుడు అవ్వాతాతలపై ఎటువంటి కనికరం లేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచీ కడుపు మంటతోనే ఉన్నాడు. ప్రతినెలా ఒకటో తేదీన అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ రూ.3 వేల పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారు. దీంతో వలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దారులే. – మార్గాని భరత్రామ్, ఎంపీ పెన్షనర్లే టీడీపీ కూటమికి బుద్ధిచెబుతారు పింఛన్దారులను ఇబ్బంది పెట్టడం దారుణం. చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పెన్షనర్లే తెలుగుదేశం కూటమికి బుద్ధిచెబుతారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. – ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి -
బోసి నవ్వులకు భరోసా ఏదీ?
వేకువజామునే వచ్చి ‘అవ్వా.. తాత.. ఇదిగో మీ పింఛన్ సొమ్ము తెచ్చాను. తీసుకోండి’ అంటూ అప్యాయంగా పలకరించే వలంటీర్ సేవలను నిర్ధాక్షిణ్యంగా చంద్రబాబు రాక్షసానందం కోసం నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆశగా ఎదురు చూసే వలంటీర్లను ఆ సేవల నుంచి తొలగించారనే నిజాన్ని నమ్మలేక దిగాలు పడిపోయారు. వలంటీర్లను తొలగించాలంటూ చంద్రబాబు కుట్రతో ఎన్నికల కమిషన్కు íఫిర్యాదు చేయడంతో వారిని ఆ విధుల నుంచి తప్పించారు. దీంతో ప్రతి నెల మాదిరిగానే ఈ నెల సూర్యుడు పొడవకుండానే వస్తారని వేచి చూసి.. చూసి బారెడు పొద్దెక్కినా రాకపోవడంతో చంద్రబాబు కుటిలత్వం వల్ల పింఛన్ అందలేదని తెలుసుకుని గుండెలు అవిసేలా రోదించారు. ప్రతి నెలా ఒకటో తేదీన బోసి నవ్వులతో ఎదురు చూసే ఆ వృద్దులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడాలా ? అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్న తరుణంలో గంటలపాటు సచివాలయాల అరుగులమీద అధికారుల కోసం ఎదురుచూసిన జ్ఞాపకాలను చూసి ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, నెట్వర్క్ ఇలాగైతే ఎలా..? ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్దురాలి పేరు పొటుకూరి గంగమ్మ. వయస్సు 85 సంవత్సరాలు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలోని సురేంద్రం. సొంతంగా ఏ పని చేసుకోలేదు. కనీసం లేచి నిలబడలేదు. ప్రతి నెల వలంటీర్ వచ్చి ఈమెకు పింఛన్ నగదు అందచేసేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడంతో ఈ నెల సకాలంలో పింఛన్ అందలేదు. ఈమె పింఛన్ తీసుకోడానికి సచివాలయానికి వెళ్లాలంటే నాలుగు ఫర్లాంగులు దూరం ప్రయాణించాలి. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. ఇద్దరు పట్టుకుని ఆటోలో తీసుకువెళ్లాలి. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో ఎలా వెళ్లాలి అని ఆందోళన చెందుతోంది. –పొటుకూరి గంగమ్మ, సురేంద్రం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యో అననివారు లేరు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాళం శివకృష్ణ. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంగళరావు నగర్కు చెందిన ఈయన పుట్టుకతో అంధుడు. పోలియో బారిన పడిన దివ్యాంగురాలు రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం శివకృష్ణకు రోడ్డు ప్రమాదంలో నడుము దెబ్బతిని స్పర్శ లేకుండా పోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దివ్యాంగ (అంధుడు) పెన్షన్ పొందుతున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని స్టాండ్ సహకారంతో నడుస్తున్న భార్య రాజేశ్వరికి కూడా పెన్షన్ మంజూరైంది. వచ్చే పింఛన్, అమ్మ ఒడి పథకంతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ జీవితం గడుపుతున్నారు. మంచానికే పరిమితమైన భర్త, స్టాండ్ సహాయంతో నడుస్తున్న భార్య ఇద్దరూ పింఛన్ కోసం కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి వలంటీర్ల సహకారంతో ప్రతినెలా 1వ తేదీన ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. టీడీపీ నీచ రాజకీయాలకు ఈ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది. – అంధుడు శివకృష్ణతో భార్య రాజేశ్వరి వెంగళరావునగర్, గుంటూరు జిల్లా డయాలసిస్ ఎలా చేయించుకోవాలి ? 68 ఏళ్లు పైబడిన నేను చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో ఒకసారి డయాలసిస్, మరో రోజు వైద్యం చేయించుకుంటున్నా. షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి నెలా వలంటీర్ వచ్చి 1వ తేదీన తెల్లవారకముందు రూ.10 వేలు పింఛన్ అందించేవాడు. వాటిని వైద్యం కోసం ఉపయోగిస్తాను. కానీ వలంటీర్లు పింఛన్ ఇవ్వడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేసిన ఇబ్బందికి ఈ నెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి క్యూలో నిలబడలేని పరిస్థితి. మా లాంటి రోగులను, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడు. – మాతంగి వెంకాయమ్మ, డయాలసిస్ రోగి, హరిశ్చంద్రపురం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా సచివాలయాల్లో పడిగాపులు తప్పవా..? నాలుగు సంవత్సరాలుగా వలంటీర్ ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి పింఛన్ అందించేవాడు. నా లాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. అక్కడికి వెళ్లి పడిగాపులు కాసి తెచ్చుకొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాను, వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిపివేయాలనడం చాలా దారుణం. అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. వృద్దుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ కొనసాగించాలి. – సయ్యద్ పెద్దబీబి, ఉరుటూరు, వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా అన్ని తానై చూసేది ఒకటోతేదీ వస్తే వలంటీర్ మా వీధిలోకి వచ్చి ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేది. గతంలో పెన్షన్ తీసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగి బాధలు పడేదాన్ని. వలంటీర్ వ్యవస్థ వచి్చన తరువాత పెన్షన్తో పాటు అన్ని తానై చూసేది. గతంలో భారీ వర్షాలు రావడంతో మా ప్రాంతం వరద ముంపునకు గురైంది. ఇళ్లలోకి నీళ్లు చేరవడంతో ముందుగానే వలంటీరు వచ్చి జాగ్రత్తలు తీసుకుని మాకు పునరావాసం కలి్పంచి సహాయం చేసింది. అలాంటి వారిని పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించడం బాధాకరం. – గులాబ్జాన్, బాపక కాలువ, మదనపల్లె.చిత్తూరు జిల్లా. ఇక మాకు పస్తులే కాళ్లు చేతులు సన్నగిల్లి ఒంట్లో సత్తువ లేక మంచం పట్టాను. ఐదేళ్లుగా ఇంటికే పొద్దున్నే వలంటీర్ వచ్చి పెన్షన్ అందించేవారు. మా లాంటి వృద్ధులకు వరంలా ఉండేది. ఇప్పుడు మానవత్వం లేని రాజకీయ స్వార్థంతో మేమంతా సచివాలయం వద్ద పెన్షన్ తీసుకోవాలని చెబుతు న్నారు. వలంటీర్ తెచ్చి పింఛన్ ఇవ్వకుంటే పస్తులతో చావు తప్పదు. ఆర్.కరాపాడులో సచివాల యం వద్దకు వెళ్లేందుకు శరీరం సహకరించదు. మా లాంటి పేదలపై ఇటువంటి కక్షసాధింపు మంచిది కాదు –హత్తి త్రినాథ్, కన్నుపుట్టుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా ఈ పాపం ఊరికే పోదు నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో మంచంలో నుంచి లేవాలంటే ఇద్దరు మనుషులు పట్టుకుని లేపాలి. ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి వృద్దాప్య పింఛన్ ఇచ్చేవాడు. ఈ నెల ఇంకా అందలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంటే నా వల్ల కాదు. వలంటీర్ నేను ఉండే మంచం దగ్గరికే వచ్చి పింఛను ఇచ్చే వాడు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లేవారు లేరు. ఈ పాపం ఊరికే పోదు – షేక్ బడేబి,కురిచేడు, ప్రకాశం జిల్లా నడవలేని నేను సచివాలయానికి ఎలా వెళ్లాలి? ఉదయం నుంచి వలంటీరు వచ్చి పింఛన్ ఇస్తారేమో అని ఎదురు చూశాను. మూడో తేదీ వరకు పింఛన్ ఇవ్వరని తెలిసింది. సచివాలయానికి వెళ్లి నేనే పింఛన్ను తెచ్చుకోవాలని చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకు గ్రామ వలంటీరు ఒకటొవ తేదీనే మా ఇంటికి వచ్చి పింఛన్ అందించారు. ఇప్పుడు వలంటీర్లు పని చేయకూడదని చెప్పడం దారుణం. వలంటీర్లు పనిచేయకపోతే నాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. ఈ ఐదేళ్ల నుంచి పింఛన్ కోసం వెళ్లే నరకయాతన తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు వచ్చాయి. – సూరగాని తులశమ్మ, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా) పింఛన్ కటకటే.. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. డయాలిసిస్ చేయించుకునే స్థోమత లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు రూ.10 వేలు పింఛన్ను మూడు నెలలుగా అందజేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయవద్దంటూ ఫిర్యాదు చేయడంతో ఈ నెల సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. – నాబాన వెంకటే‹Ù, గర్భాం గ్రామం, మెరకమూడిదాం మండలం, విజయనగరం జిల్లా రెండు కిలోమీటర్లు నడవాలి ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేది. ఇప్పుడు సచివాలయానికి వచ్చి పింఛన్ తీసుకోమంటున్నారు. మా ఇంటి నుంచి 2.కి.మీ దూరంలో ఉన్న వీరఘట్టం సచివాలయానికి నేను నడిచి వెళ్లాలి. ఓ పక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లో పింఛన్ కోసం వెళితే మళ్లీ తిరిగి ఇంటికి వస్తానో రానో అని భయంగా ఉంది. చంద్రబాబు తీరు సరైనదికాదు. – బిడ్డిక పెద్ద సుంబురు, అచ్చెపువలస గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో? వలంటీర్లు ఉదయాన్నే తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. అంతేకాదు వలంటీర్ల వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇపుడు తగుదనమ్మా అని చంద్రబాబు వలంటీర్లను అడ్డుకుని పింఛన్ ఇవ్వకుండా చేస్తే ఎంత ఇబ్బంది. దీనివల్ల ఆయనకు ఒరిగేది ఏమిటి? – బి.మంగమ్మ, పింఛన్ లబి్ధదారు, చెందోడు, కోట మండలం, తిరుపతి జిల్లా మళ్లీ పాత కష్టాలేనా .నేను దివ్యాంగురాలిని. గతంలో పెన్షన్ కోసం మా నాన్న వెంకటరమణ ప్రతి నెలా ఒకటో తేదీన కె.నగరపాలెం పంచాయతీ కార్యాలయానికి ఆటోలో తీసుకొని వెళ్లేవారు. ఒక్కోసారి నెలకు రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ కష్టం తప్పింది.ఈ ఐదేళ్లు ఎక్కడికి వెళ్లకుండానే ఇంటికే పెన్షన్ వచి్చంది. ఇప్పుడు వలంటీర్లు పెన్షన్ను అందించకూడదని అంటున్నారు. – చల్లపల్లి ఎరి్నకుమారి, మంగమారిపేట, విశాఖ జిల్లా పింఛన్ కోసం పక్క ఊరికి వెళ్లాలా..? వలంటీర్లు నెలనెలా ఠంఛన్గా ఇంటికే వచ్చి అందజేసేవారు. ఇకపై పింఛన్ తీసుకునేందుకు పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్లాలా? నాకు చాలా ఏళ్లుగా ఆరోగ్యం బాగోలేక ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాకు పింఛన్ డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. నడవలేని నాకు ఇక ఇబ్బందులు తప్పవు. అక్కడ పడిగాపులు కాసే ఓపిక నాకు లేదు. – వరికూటి మాలకొండారెడ్డి, చెన్నారెడ్డిపల్లి, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయన బుద్ధే అంత నాకు పెన్షన్ను ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీర్ తలుపుతట్టి ఇచ్చేవారు. చంద్రబాబు రాజకీయంలో ఇప్పుడు నేను పెన్షన్ తీసుకోవాలంటే మా గ్రామ సచివాలయానికి వెళ్లాలి. ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయమేస్తోంది. ఇలా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది. – కోటపాటి పెంచలయ్య, దిగువపేటలోని గాం«దీవీది, సిద్దవటం, వైఎస్సార్ జిల్లా నేను సచివాలయానికి ఎలా వెళ్లేది? గత రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు పూర్తిగా చచ్చుబడ్డాయి. లేవలేని దుస్థితి. 24 గంటలు మంచంపైనే ఉండాల్సి వస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి వలంటీర్ పింఛన్ ఇచ్చివెళ్లేది. ప్రస్తుతం వలంటీర్లకు పింఛన్ పంపిణీ నిలిపివేయడం చాలా దారుణం. నేను ఏవిధంగా సచివాలయానికి వెళ్లాలి. ఎలా పింఛన్ తీసుకోవాలని, వరుసలో ఎలా నిలబడాలి. గుర్తొస్తేనే భయమేస్తోంది. – సువార్తమ్మ, క్రిష్టిపాడు గ్రామం, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా ఆ తిప్పలు మాకొద్దు నాకు 77 ఏళ్లు. ఎవరూ లేరు. చెల్లెలు కొడుకే అన్నం పెడుతున్నాడు. నడవలేని దుస్థితిలో పింఛన్ డబ్బులే ఆసరా. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపురం నడిచి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రతి నెల వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు కోసం ఎదురు చూశా. కానీ సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. జీ.ఎర్రగుడి సచివాలయం వెళ్లాలంటే 14 కిలోమీటర్లు. నడవలేని స్థితిలో ఉన్న నేను అంతదూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. – సయ్యద్ గూడమ్మ, తుగ్గలి మండలం, ఆర్.కొట్టాల గ్రామం, కర్నూలు జిల్లా -
చంద్రబాబు నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని వృద్ధులు ఆగ్రహం
-
కుట్ర కనిపింఛన్
టీడీపీ కుట్ర బయటపడింది.. అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు మొదలు కానున్నాయి.. ఇంటి వద్దనే పింఛన్ అందుకోవాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే! వలంటీర్ వ్యవస్థతో వైఎస్సార్సీపీకి మంచి పేరొస్తుందని తెలుగుదేశం పార్టీ కుయుక్తులకు పాల్పడింది.. తన అనుబంధ సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వచ్చినా వలంటీర్లు ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక వైపు చెబుతూనే మరో వైపు కుతంత్రాలకు పాల్పడటంపై పింఛన్దారులు మండిపడుతున్నారు. కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(న్యూటౌన్): ఇంటి వద్దనే నిశ్చింతగా పింఛన్ తీసుకుంటున్న అవ్వాతాతలు, దివ్యాంగులు టీడీపీ కుట్రలతో నేడు గడపదాటాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 16 రకాల పింఛన్లు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4.73 లక్షల మంది వివిధ కేటగిరీ పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో 70 శాతం మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వివిధ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. వీరిలో 10 శాతం మంది మంచానికే పరిమితం అయ్యారు. డయాలసిస్, కిడ్నీ రోగులు... ఇలా వేలాది మంది అడుగుతీసి అడుగు వేయలేరు. ఇటువంటి వారందరూ ఏప్రిల్ నుంచి జూన్ వరకు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు అందుకోవాల్సిందే. సచివాలయాలకు వచ్చి పింఛన్లు పొందాలంటే వీరందరూ నరకం చూడాల్సిందే! వేలాది మందిని సచివాలయాలకు ఎత్తుకొని రావాల్సి ఉంది. వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ తన అనుబంధ సంస్థ అయిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఈ దుస్థితి నెలకొంది. టీడీపీ హయాంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండేది. లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కష్టాలను తొలగించింది. వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అధికార పార్టీకి మంచి పేరొస్తాందనే టీడీపీ కుట్రపన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారు. మళ్లీ కష్టాలు మొదలు.. టీడీపీ హయాంలో పింఛన్ పొందడంలో అవ్వాతాతలు, దివ్యాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాసేవారు. డబ్బులు రాలేదు.. రేపు..మాపు అంటూ తిప్పుకునేవారు. ఎంత మంది అర్హులు ఉన్నా మండలానికి ఇన్నే పింఛన్లు అని కోటా పెట్టేవారు. ఒక్కో గ్రామానికి 10–15 వరకు పింఛన్లు మాత్రమే వచ్చేవి. జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే లబ్ధిదారులుగా ఎంపిక చేసేవారు. ఇందుకోసం నాలుగైదు నెలల పింఛన్ మొత్తాన్ని లంచంగా ముట్టచెప్పాల్సి వచ్చేది. ప్రతి నెలా ఇచ్చే పింఛన్లోనూ రూ.100, 200 కోత పెట్టేవారు. మరణించిన వారిస్థానంలోనే కొత్త పింఛన్ వచ్చేది. వైఎస్సార్సీపీ పాలనలో పింఛన్దారుల కష్టాలకు ఫుల్స్టాప్ పడింది. అర్హతే ప్రామాణికంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు గ్రామ, వర్డు వలంటీర్లను నియమించి... వారి ద్వారా నేరుగా ఇంటికే పింఛన్ పంపే ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ పండుగ ఉన్నా.. సెలవైనా... వానొచ్చినా.. ఇంటికే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు, దివ్యాంగుల కష్టాలు తొలగిపోయాయి. ఆసుపత్రిల్లో చికిత్స పొందుతుంటే అక్కడికే వెళ్లి పింఛన్ అందచేస్తున్నారు. వలంటీర్లు కేవలం సేవాభావంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు, కుట్రలు, కుతంత్రాలతో అవ్వాతాతలకు మళ్లీ కష్టాలు ప్రారంభం కానున్నాయి. ఇంటిదగ్గరే పించన్ పంపిణీ చేస్తున్న వలంటీరు(పైల్) ఇందుకే కక్ష.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్త మాంసాలను పీల్చివేశాయి. జన్మభూమి కమిటీలకు చంద్రబాబు అపారమైన అధికారాలు ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకొని జన్మభూమి కమిటీలోని సభ్యులు చెలరేగిపోయాయి. అవినీతి అక్రమాలతో లక్షాధికారులయ్యారు. జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు పిండకపోయినప్పటికీ వలంటీర్ల పట్ల అపారమైన ద్వేషం పెరగడానికి వారి వల్ల అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం.. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తు వస్తుండటమే కారణమని తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు ఇవీ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. లబ్ధిదారులు ఏప్రిల్ నెల గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి వేలిముద్ర వేసి పింఛన్లు పొందాల్సి ఉంది. ఇందుకు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు సెర్ప్ ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు, గ్రామ సచివాలయాల్లో పింఛన్ల పంపిణీని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకులకు సెలవు. 2వ తేదీన పింఛన్ల సంబంధించిన మొత్తం ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుంది. అదే రోజున గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు ఆడ్మిన్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు డ్రా చేస్తారు. మూడో నుంచి 5 రోజుల పాటు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేస్తారు. పింఛన్లు పంపిణీ చేసే సచివాలయ ఉద్యోగులు, ఆర్బీకే ఇన్చార్జీలందరి దగ్గర ఎంపీడీవోలు/ మున్సిపల్ కమిషనర్లు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉంటాయి. అనుకున్నట్టే చేశారు.. వలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో టీడీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఏదో విధంగా వలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడానికి కొన్నేళ్లుగా ఆ పార్టీ నేతలు చేయని ప్రయత్నం లేదు. అనేక రకాల అభాండాలు వేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్లపై కక్షసాధింపు చర్యకు పాల్పడ్డారు. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలులో ఎన్నికల కోడ్ ముగిసే వరకు వలంటీర్లను పక్కన పేట్టే విధంగా చేయగలిగారు. ప్రజలతో మమేకమైన వలంటీర్లపై ఇంత దారుణంగా పగపట్టడంపై అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటుతో బుద్ధి చెబుతాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతి రోజూ కన్నీళ్లు వచ్చేవి. ఎప్పుడిస్తారో తెలిసేది కాదు. ప్రతి రోజూ పంచాయతీ కార్యాలయం దగ్గర పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కష్టాలు తొలగిపోయాయి. వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. – రమావత్ నాగమ్మ, మీటేతాండ, తుగ్గలి మండలం మళ్లీ ఎదురు చూపులే టీడీపీ హయాంలో పింఛన్ పొందాలంటే నానా యాతన పడేవాళ్లం. అలాంటి పరిస్థితి లేకుండా వలంటీర్లు ప్రతి నెలా ఠంఛన్గా 1వ తేదీనే ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఆ డబ్బులు ఆసుపత్రికి, సొంత ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడేవి. టీడీపీ కుట్రలు పన్ని వలంటీర్లను పింఛన్ల పంపిణీ విధుల నుంచి తప్పించింది. మళ్లీ పింఛన్ కోసం ఎదురు చూడాల్సి వస్తుందేమో! – మాబున్నిసా, గడివేముల ఇబ్బందులు తప్పవు వలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చి మా అమ్మాయి తని్వకకు పింఛన్ సొమ్ము ఇచ్చి వెళ్లేవారు. వికలాంగురాలైన చిన్నారిని తీసుకొని సచివాలయానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ సమయానికి సి బ్బంది పింఛన్ ఇస్తారో తెలియని పరిస్థితి. వలంటీర్ వ్యవస్థ లేకపోతే దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సిందే. – చిన్నారి తని్వకతో తల్లి, నూనెపల్లె టీడీపీ హయాంలో అన్నీ కష్టాలే మోకాళ్ల నొప్పులతో ఎక్కడికి తిరగలేని పరిస్థితిలో ఉన్నా. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే పింఛన్ తీసుకుంటున్నా. ఎన్నికల సమయంలో వలంటీర్లను విధుల నుంచి పక్కనబెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడికో వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులో టీడీపీ హయాంలో చూశాను. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – రత్నమ్మ, మిట్నాల గ్రామం -
నాడు బతుకు భయం..నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. భూమి సొంతం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు వారు ఎంతిస్తే అంత తీసుకుని బతుకు గడిచిపోతే చాలనుకున్న స్థితికి చేరుకున్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. కట్టుకునేందుకు సరైన బట్టలే లేని వారికి ఉండే ఇల్లు ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. బతుకుపై మళ్లీ ఆశలు కల్పించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. (ఎ.చంద్రశేఖరరావు, విలేకరి, బూర్జ) అడగకుండానే.. అన్నీఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక సమస్యలన్నీ తీరాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క నయాపైసా సహాయం అందలేదు. కుటుంబ ఖర్చులకు కూడా నానా అవస్థలు పడేవాళ్లం. చిన్నపాటి అవసరాలకూ అప్పులు చేయాల్సి వచ్చేది. మా ఇద్దరు పిల్లలూ బధిరులే అయినా ఎలాంటి సాయమూ అందలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతీ నెల పండగే. ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. ఏడు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఏ కష్టం వచ్చినా దానిని ప్రభుత్వం సాయంతో ఎదుర్కోగలమనే నమ్మకం ఏర్పడింది. మా అబ్బాయి చంద్రశేఖర్కు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహంతో కొత్త కుట్టుమెïÙన్ కొన్నాం. బట్టలు కుట్టుకుంటూ వచ్చిన కుట్టుకూలితో ఆనందంగా బతుకు తున్నాం. రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – వారణాసి కుమార స్వామి సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వల్ల నిరుపేదలకు అత్యవసర వేళ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఇంకా ఉన్నత విద్యకోసం విద్యాదీవెన, వసతి దీవెన, నిరుపేదలకు ఇళ్లు వంటివి ఎంతోమందికి అందాయి. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు విస్తృతంగా జరిగి వారిలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీనివల్ల వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం వల్ల పరోక్షంగా రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఎందో ఉపయోగపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ గత ప్రభుత్వ హామీలు నీటిమీద రాతలు 2014లో లెక్కలేనన్ని హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. ఫలితంగా కమారస్వామి లాంటి వారి ఆశలు అడియాసలయ్యాయి. డ్వాక్రా రుణమాఫీ కాకపోవడం... కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవ డం... మరే ఇతర సౌకర్యాలు అందకపోవడంతో ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఏనాటికైనా ప్రభుత్వ సహాయం అందకుండా పోతుందా... అని నెలల తరబడి నిరీక్షించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పిల్లల పోషణకు తోడ్పాటు అందక, కుటుంబ అవసరాలు తీర్చే ఆధారం లేక, ఒంటికి కష్టం వస్తే నయం చేయించుకునే శక్తి లేక, పెరిగిన కుటుంబానికి తగినంత ఇల్లు లేక రోజు వారీ బతుకులు భారమై పో యాయి. అప్పుడప్పుడు పస్తులు ఉండాల్సి వచ్చేది. -
3 నెలలకోసారి పెన్షన్.. బాబొస్తే నెల నెలా పింఛను రాదు
-
జగన్ను మళ్లీ సీఎం చేయడానికి మేమూ సిద్ధం
ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం జగనన్న మేలు మరువలేం సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు. – ఎం.కృష్ణారెడ్డి, డీఎన్ పాలెం, రంపచోడవరం జగనన్నకే మా మద్దతు సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్సైట్లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? – కరుటూరి ఉమాదేవి, తణుకు ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి. – కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మోసం చేశాడు. – ఉడతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం రైతులను ఆదుకుంటున్నారు గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. – జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు భారత దేశ చర్రితలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు. – కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు ప్రతిపక్షాల మాటలు నమ్మం జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం. – బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం నమ్మకానికి ప్రతీక జగన్ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు. – ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు. – ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ సీఎం జగన్కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. – కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. – బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా నూతన ఒరవడి సృష్టించారు వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజాప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలి యజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతారు. – దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం ఇంతకన్నా మార్పు ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? – కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా నేరుగా నగదు బదిలీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా? – చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వారధిగా ప్రణాళిక ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్ర ణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు. – ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం -
వలంటీర్ మానవత్వం..
రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్లో మేకతోటి జయంతి వలంటీర్గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గత నెలలో అతను ఫించన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్ సాయంతో బైక్పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది. అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. -
పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా మాది చేనేత కుటుంబం. మా ఆయన అశ్వర్థ నారాయణ ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. మాకు ముగ్గురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మగ్గం నేతతోపాటు నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఒంట్లో సత్తువ తగ్గి బయట పనులకు వెళ్లలేకపోతున్నా. గతంలో కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ వచ్చేది. 2019లో జగన్ సీఎం అయ్యాక పెన్షన్ పెరిగింది. ఇపుడు రూ.3 వేలు వస్తోంది. చేనేత వృత్తిలో ఉండటంతో వలంటీరే ఇంటికొచ్చి మరీ వైఎస్సార్ నేతన్న నేస్తంలో నా పేరు నమోదు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కూడా వర్తించింది. రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు అందుకున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాకు కొండంత భరోసానిచ్చాయి. నాలాంటి ఒంటరి మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా, సంతోషంగా బతికే ధైర్యాన్నిస్తున్నాయి. – శిరివెల్ల లక్ష్మీదేవి, జమ్మలమడుగు (నాయబ్ అబ్దుల్ బషీర్, విలేకరి, జమ్మలమడుగు) 30 ఏళ్ల కల నెరవేరింది కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం నుంచి నరసన్నపేట మండలం ఉర్లాంకు 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. కొన్నాళ్లకు మా ఆయన కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకుని చదివిస్తూ, షాపుల్లో పని చేస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించాను. గతంలో ఉన్న ప్రభుత్వాలకు పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనే స్తోమత లేక అద్దెలు చెల్లిస్తూ జీవనం కొనసాగించాం. జగన్ బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా కోరిక తీరింది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా రుణం ఇప్పించారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సొంత ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు సొంత ఇల్లు లేదని ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్న మా అబ్బాయి వైకుంఠరావుకు పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. ఈ వేసవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదంతా ముఖ్యమంత్రి చలువే. ఆయన సీఎం కాకపోతే మా కల నెరవేరేదికాదు. అలాగే ఈ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో మంచి జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీనే వితంతు పింఛన్ వస్తోంది. డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వచ్చింది. సీఎం జగన్ రుణం తీర్చుకోలేం. – పైడిశెట్టి సత్యవతి, ఉర్లాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట) పింఛన్ మా ఇంటికే వస్తోంది మాది నిరుపేద కుటుంబం. మేము పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉంటున్నాం. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. పుట్టుకతోనే నా రెండు కాళ్లు చచ్చుబడటంతో దివ్యాంగుడినయ్యాను. సెంటు భూమి కూడా లేని నన్ను మా అమ్మ కూలి పనులు చేసి బతికించింది. దివ్యాంగుడిని కావడంతో నన్ను ఎవరూ పనులకు పిలిచేవారు కాదు. అమ్మ కష్టాన్ని చూడలేకపోయాను. పెళ్లి మండపాల డేకరేషన్ పనులు నేర్చుకొని అప్పుడప్పుడు ఆ పనులకు వెళ్తున్నాను. ఎనిమిదేళ్ల క్రితం సలోమి అనే దివ్యాంగురాలితో నాకు వివాహమైంది. మాకు రాకేష్, సతీష్ అనే ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా పనులకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇద్దరికీ వచ్చే పింఛనే జీవనాధారంగా మారింది. గతంలో పింఛను తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించేవాళ్లం. ట్రై సైకిల్ పై రోజూ అక్కడకు వెళ్లి రోజుల తరబడి తిరిగితే గాని పింఛను డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు, నా భార్యకు మొత్తం రూ.6 వేలు మా వలంటీర్ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారు. మా అమ్మకు వితంతు పింఛను కింద రూ.3 వేలు వస్తున్నాయి. వైఎస్సార్ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వస్తోంది. మా బాబు ఈ ఏడాదే ఒకటో తరగతిలో చేరాడు. విద్యాకానుక కింద బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు వస్తున్న పింఛను డబ్బులతోనే మేము బతుకుతున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వ పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న సాయం ఎప్పటికీ మరచిపోలేం. – మేడి నాగరాజు, దాచేపల్లి(వినుకొండ అజయ్కుమార్, విలేకరి, దాచేపల్లి) -
ఫ్యామిలీ పెన్షన్ నామినేషన్ : మహిళా ఉద్యోగులకు భారీ ఊరట
మహిళా ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ కోసం మహిళా ఉద్యోగులు, పెన్షనర్లు నామినేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన వారికి కుటుంబ పింఛను మంజూరు చేసేందుకు వీలు కల్పిస్తూ 2021 కేంద్ర పౌర సేవల (పెన్షన్) రూల్స్, 2021కి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DoPPW) సవరణను ప్రవేశపెట్టింది. ఈ కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకనటలో తెలిపారు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు భర్తలను మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉండేది. మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబ సభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
fact check: పింఛన్లపై వంచన రాతలెందుకు?
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, దివ్యాంగులు సహా ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరికీ రామరాజ్యమంటే ఏంటో.. సంక్షేమ శకం తీపిగుర్తులు ఎలా ఉంటాయో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వారికి తెలిసేలా చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నరోజుల్లో వాళ్లు పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు పటాపంచలై వాళ్లు వాటిని దాదాపు మరిచిపోయేలా కూడా చేశారు. కానీ.. ఆ జన్మభూమి కమిటీల ఆగడాలతో అప్పట్లో ఐదేళ్లపాటు అవ్వాతాతలు, దివ్యాంగులు సహా ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరూ అనుభవించిన అష్టకష్టాలే ఇంకా ఇంకా అనుభవిస్తూ ఉండాలని రామోజీరావు కోరుకుంటున్నట్లు ఉంది ఈనాడు రాతలు చూస్తే. ఎందుకంటే.. ‘జగన్ వచ్చే.. పింఛను తుంచె..’ అంటూ ఆ పత్రిక పెట్టిన పెడ»ొబ్బలు అంతాఇంతా కాదు. నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే ఇంటికే వెళ్లి ఇస్తున్నా.. చెప్పినట్లుగా ఏటా పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లినా.. సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నా నిలువెల్లా విషం నింపుకున్న రామోజీ తనను తాను వంచన చేసుకుంటూ ఏడుపుగొట్టు రాతలు రాస్తున్నారంటే ఆయన్ను ఏమనాలి? ఈనాడు వండివార్చిన విషపూరిత కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్చెక్’.. ఇదేనా స్వర్ణయుగమంటే.. ఈనాడు: గత తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక భద్రత పింఛను లబ్ధిదారులకు స్వర్ణయుగమే.. వాస్తవం: 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సమయానికి విభజిత ఆంధ్రప్రదేశ్లో 43.11 లక్షల పెన్షన్ లబ్ధిదారులుండేవారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కూడా రాష్ట్రంలో కేవలం 39 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే ప్రతినెలా పెన్షన్ తీసుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత 55 నెలల్లో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది. ఈనాడు: టీడీపీ ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా కేటగిరీ పింఛన్లూ ఒకే ఇంటిలో రెండు ఉన్నా.. అందరికీ ఇచ్చారు.. వాస్తవం: 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు..’ అంటూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 2014 సెప్టెంబరు 18న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీచేసిన ఆర్సీ నెంబరు 1053 ఆదేశాలే సాక్ష్యం. వీటి ప్రకారం.. కేవలం 80 శాతానికి పైగా అంగవైకల్యం ఉండే వారికి మాత్రమే రెండో పెన్షన్ మంజూరు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందే అందరికీ, రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించడంతో పాటు కొత్తగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా కలి్పంచిన వెసులుబాట్లతో రాష్ట్రంలో 3,53,645 మంది ఒకే ఇంట్లో రెండో పెన్షన్ కూడా పొందుతున్నారు. ‘జన్మభూమి’ పేరు వింటేనే హడల్ చంద్రబాబు పాలనలో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికీ జన్మభూమి కమిటీ పేరు గుర్తుకొస్తేనే వణికిపోయే పరిస్థితి. అప్పట్లో నెలనెలా తమ పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే నడవలేని, నిలబడలేని స్థితిలో కూడా చాంతాడంత క్యూలలో ఎర్రటి ఎండలో గంటల తరబడి నిరీక్షించిన రోజులను ఊహించుకుంటేనే వారు బెంబేలెత్తిపోతున్నారు. పైగా.. బాబు పాలనలో అన్నీ అర్హతలున్న వాళ్లు పెన్షన్ కావాలంటే ఏడాదికో, లేదంటే రెండేళ్లకోసారో మొక్కుబడిగా ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఆ దరఖాస్తులు మండలాఫీసుల్లో కుప్పలపాలయ్యేవి. పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎవరైనా మరణిస్తేనో లేదా ఇతర కారణాలతో తగ్గితేనే కొత్త పెన్షన్లు మంజూరయ్యేవి. ఆ దరఖాస్తుల దుమ్ము దులిపిన దాఖలాల్లేవు. ఎమ్మెల్యేని అడిగినా దిక్కూమొక్కూలేని పరిస్థితి. సీఎం జగన్ పాలనలో.. సంతృప్త స్థాయిలో.. అదే ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మొదటి నుంచీ (గత నాలుగున్నర ఏళ్లకు పైగా) సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వలంటీరే స్వయంగా వెళ్లి పింఛను దరఖాస్తు తీసుకుని మంజూరు కాగానే తిరిగి లబ్ధిదారుడు ఇంటికే వచ్చి మంజూరు పత్రం అందజేస్తున్నారు. ఎక్కడన్నా ఏదైనా కారణంతో అర్హత ఉండీ పెన్షన్ మంజూరు కాకపోతే.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వారికి పెన్షన్లు మంజూరు చేసే విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలుచేస్తోంది. కానీ, చంద్రబాబు హయాంలో పెన్షన్ లబ్ధిదారులు ఎన్ని ఇబ్బందులుపడ్డా ‘ఈనాడు’ మాత్రం చంద్రబాబు జమానాను స్వర్ణయుగం అని కీర్తిస్తోంది. అలాగే, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర చేతి వృత్తిదారులపట్ల పూర్తి మానవత్వంతో పెన్షన్ల మంజూరు నుంచి ప్రతినెలా ఠంఛన్గా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటివద్దే పంపిణీకి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ‘ఈనాడు’కు బూటకపు విధానాలుగా కనిపిస్తుంటే దానిని ‘కళ్లుండీ చూడలేని కబోదీ’ అనే అనుకోవాలి. -
కర్ణాటకలో పింఛన్ కష్టం..
శివాజీనగర: పింఛన్ కోసం కర్ణాటక రాష్ట్రంలో 77 ఏళ్ల ఓ దివ్యాంగ వృద్ధురాలు రెండు కిలోమీటర్లకు పైగా పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చిన ఘటన అందర్నీ నివ్వెరపరిచింది. పంటిబిగువన నరకయాతన అనుభవిస్తూ పోస్టాఫీసుకు వచ్చిన ఆమెకు తీవ్ర నిరాశే మిగిలింది. అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకు ఉన్న తేడాకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఏపీలో ఒకటో తేదీ వచ్చిందంటే.. వలంటీర్లు తెల్లారకముందే తలుపుకొట్టి అవ్వాతాతల చేతుల్లో పింఛను సొమ్ము పెడుతుండడం తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్ణాటకలో అమలవుతున్న తీరుతో కన్నడిగులు పోలుస్తున్నారు. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా కుణిబెళకెర గ్రామానికి చెందిన వయో వృద్ధురాలు గిరిజమ్మకు ఎవరూలేరు. ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆమెకు జీవనాధారం. ప్రతి నెలారంభంలో హరిహర పోస్టాఫీసులో పెన్షన్ తీసుకుంటుంది. గత ఏడాది నవంబరు నుంచి సక్రమంగా అందడంలేదు. ఆటోలో రావడానికి డబ్బులు లేకపోవడంతో వారం రోజుల కిందట గ్రామం నుంచి రెండు కిలో మీటర్లు పాక్కుంటూ పోస్టాఫీసుకు వచ్చింది. 77 year old divyang woman crawls for her unpaid pension in Congress ruled Karnataka. Meanwhile, @INCIndia plays 'Nyay' in the sky. Sickening irony! https://t.co/9RbFUanKd4 pic.twitter.com/KEW4hfeiWG — Anoop Antony (@AnoopKaippalli) January 14, 2024 కానీ, పెన్షన్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో హతాశురాలైంది. ఆమె కష్టాన్ని కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. అంతదూరం నుంచి పాక్కుంటూ రావడంవల్ల ఒళ్లు చీరుకుపోయి బొబ్బలు వచ్చినా లెక్కచేయలేదు. ‘ఆ పెన్షన్ వస్తేనే నాకు రోజు గడుస్తుంది. అదే లేకపోతే ఏం తినాలి, అందుకే కష్టమైనా పాకుతూనే వచ్చాను..’ అని గిరిజమ్మ దీనంగా చెప్పింది. కాగా, ఈ విషయమై పెద్దఎత్తున విమర్శలు రావడంతో స్థానిక సబ్ కలెక్టర్ అమూల్య పాండా స్పందిస్తూ.. ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసే సదుపాయం రాష్ట్రంలో లేదనడం గమనార్హం. ఏపీలో వైఎస్ జగన్ సర్కారు ప్రతి నెలా మొదటి తారీఖునే ఇళ్లకే వెళ్లి మరీ అవ్వాతాతలకు రూ.3వేలు చొప్పున ఫించన్ సొమ్ము అందజేస్తుండడం తెలిసిందే. దేశంలో రూ.3 వేల ఫించన్ తోపాటు ఎక్కువ మందికి ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే కావడం విశేషం. -
అవ్వాతాతల దీవెన మధ్య పెన్షన్ పెంపు సంబరాలు
సాక్షి, అమరావతి: లక్షలాదిమంది అవ్వాతాతలు, వితంతు, చేతి వృత్తిదారుల దీవెనల మధ్య రాష్ట్రమంతటా పెన్షన్ రూ.3,000కు పెంపు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు చెప్పిన మాటను చెప్పినట్లే అమలు చేస్తూ పెన్షన్ను రూ.3,000కు పెంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అవ్వాతాతలు జేజేలు కొడుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో తాము ప్రతి నెలా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి గంటల తరబడి ఆఫీసుల వద్ద క్యూలైన్లలో వేచి ఉండే పద్ధతులను పూర్తిగా మార్చి.. ఇప్పుడు ప్రతి నెలా ఠంఛన్గా.. పండుగైనా, ఆదివారమైనా, ఇతర సెలవు రోజయినా వలంటీర్లు తమ ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చే విధానం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మనసారా దీవిస్తున్నారు. ఈ నెల నుంచి పెన్షన్ను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచిన నేపథ్యంలో.. ఒకటోతేదీ నుంచి 8వ తేదీ వరకు మండల, మున్సిపాలిటీల వారీగా స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ లబ్దిదారులతో మమేకమవుతూ పూర్తి పండుగ వాతావరణంలో వేడుకలా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జనవరి ఒకటోతేదీ నుంచి ఆదివారం (7వ తేదీ వరకు) 700 మండలాలు, మున్సిపాలిటీల్లో ఉత్సవ కార్యక్రమాలు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం 15 మండలాల్లో ఉత్సవాలు కొనసాగాయని, సోమవారం మిగిలిన 24 మండలాల్లో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. -
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ కానుక సంబరాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ పింఛన్ కానుక సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న రూ.3 వేల పింఛన్ కానుకను రాష్ట్రవ్యాప్తంగా అవ్వాతాతలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వలంటీర్లు అందిస్తున్నారు. గురువారం నాటికి 20 లక్షల మంది (34 శాతం) లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. 533 సచివాలయాల పరిధిలో పింఛన్ సంబరాలు జరుగుతున్నాయి. వీటిలో 181 సచివాలయాల పరిధిలో పింఛన్ కానుక సంబరాలు గురువారం ప్రారంభమయ్యాయి. తిరుపతి పోస్టల్ కాలనీలో పింఛన్ పంపిణీని టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఓ పండుగలా నిర్వహించారు. అర్హులైన అవ్వా తాతలు, వితంతువులకు రూ. 3 వేల పింఛన్ను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి తదితరులు అందించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ పింఛన్ను పంపిణీ చేశారు. -
EPFO Update: గడువు పొడిగించిన ఈపీఎఫ్వో
అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ల ధ్రువీకరణ కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గడువును మరోసారి పొడిగించింది. పెన్షన్ కోసం ఉద్యోగులు సమర్పించిన లక్షలాది దరఖాస్తులు యాజమాన్యాల దగ్గర పెండింగ్ ఉండటంతో గడువు పొడిగించే ప్రతిపాదనను ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ లేదా జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఈపీఎఫ్వో గతంలో ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2022 నవంబర్ 4 నాటి సుప్రీం కోర్ట్ ఆర్డర్కు అనుగుణంగా అర్హులైన పెన్షనర్లు/సభ్యుల కోసం 2023 ఫిబ్రవరి 26న ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. 2023 మే 3 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా ఉద్యోగుల అభ్యర్థన మేరకు గడువును మరో నాలుగు నెలలు అంటే 2023 జూన్ 26 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2023 జూలై 11 వరకు 15 రోజుల అవకాశం ఇచ్చింది. 2023 జూలై 11 నాటికి ఆప్షన్/జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం పెన్షనర్లు/సభ్యుల నుంచి 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారు పెన్షనర్లు/సభ్యుల వేతన వివరాలను అప్లోడ్ చేయడానికి వ్యవధిని పొడిగించాలని ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుంచి అభ్యర్థనలు రావడంతో యజమానులకు వేతన వివరాలను ఆన్లైన్లో సమర్పించడానికి 2023 సెప్టెంబరు 30 వరకు సమయం ఇచ్చింది. ఇది మళ్లీ 2023 డిసెంబర్ 31కి జరిగింది. ఆ తర్వాత కూడా ఆప్షన్/జాయింట్ ఆప్షన్ల ధ్రువీకరణ కోసం 3.6 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ప్రాసెసింగ్ కోసం యజమాన్యాల వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఈ మిగిలిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడం కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరో సారి సమయాన్ని పొడిగించే ప్రతిపాదనను ఆమోదించింది. 2024 మే 31 లోపు యాజమాన్యాలు తమ ఉద్యోగుల వేతన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. -
పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. ►22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి ►ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ►ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు ►కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు ►ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే ►అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు ►ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు ►అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు ►చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు ►గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర ►అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది ►ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు ►ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి ►అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ ►కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు ►అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు? ►అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు ►గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ►అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది ►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది ►చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు ►ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు ►గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు ►ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ►గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు ►45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం ►వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం ►వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం. ►ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం ►అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం ►ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది ►ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు ►రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది ►అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ►ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది. ►గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్ పీ క్లాసు రూములు కనిపిస్తాయి ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి ►వైఎస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి ►1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం ►రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ►కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి ►ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్.. ట్యాబులంటే మీ జగన్ ►గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్ ►గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్ ►ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి ►ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది ►ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు ►కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ►రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ►అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా ►మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు ►మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు ►మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు ►మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు ►అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా. -
పింఛను నామినీలుగా ఉద్యోగినుల పిల్లలు
న్యూఢిల్లీ: భర్త నుంచి వేరుగా ఉండే మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కొత్త వెసులుబాటు కల్పించింది. కుటుంబ పింఛను కోసం నామినీలుగా ఇకపై తన పిల్లల పేర్లను పేర్కొనవచ్చని తెలిపింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్(పింఛను)నిబంధనలు–2021లోని 50వ క్లాజ్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భాల్లో కుటుంబ పింఛను మంజూరవుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు మరణించినప్పుడు ఆ వ్యక్తి జీవిత భాగస్వామికి కుటుంబపింఛను అందుతుందని తెలిపింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామి కుటుంబ పింఛనుకు అనర్హులైనప్పుడు లేదా చనిపోయినప్పుడు కుటుంబ పింఛను ఇతర కుటుంబసభ్యులకు అందుతుందని వివరించింది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పింఛనుకు నామినీలుగా భర్త కంటే ముందుగా సంతానాన్ని పేర్కొనేందుకు వీలు కలి్పస్తూ తాజాగా నిబంధనలను మార్చినట్లు కేంద్ర పింఛను, పింఛనుదారుల సంక్షేమ విభాగం పేర్కొంది. తాజా సవరణ.. మహిళా ప్రభుత్వోద్యోగి విడాకుల పిటిషన్, గృహ హింస కేసు, మహిళల రక్షణ చట్టం కింద కేసులను దాఖలు చేసిన అన్ని సందర్భాల్లో, ఆమె భర్త కంటే ముందు అర్హత ఉన్న బిడ్డకు కుటుంబ పెన్షన్ను పంపిణీ చేయడానికి అనుమతిస్తుందని విభాగం కార్యదర్శి వి శ్రీనివాస్ పిటిఐకి తెలిపారు. -
నూతన సంవత్సరంలో పింఛన్ పెంపు మహోత్సవాలు..
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, చేతి వృత్తిదారులకు ఇస్తున్న రూ.2,750 పింఛన్ను ఈ నెల నుంచి రూ.3వేలకు పెంచింది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు అన్ని మండల, మున్సిపాలిటీ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమి తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలన్నారు. జనవరి నెలకు సంబంధించి 2,93,493 మంది పింఛన్దారులకు రూ.87.92 కోట్లు విడుదలైందన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన పింఛన్లు 5,234 ఉన్నాయన్నారు. మొత్తం లబ్ధిదారుల్లో 2,31,513 మంది రూ.3వేల పింఛన్లు అందుకోనున్నారన్నారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరిగినప్పటి నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. ఈ మార్పును పింఛన్దారులు గమనించాలని కోరారు. ఈ నెల మూడో తేదీ అనంతపురం అర్బన్, గార్లదిన్నె, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, గుంతకల్లు అర్బన్, కళ్యాణదుర్గం రూరల్, కూడేరు, నార్పల, రాప్తాడు, రాయదుర్గం రూరల్, శింగన మల, తాడిపత్రి అర్బన్, తాడిపత్రి రూరల్లో పింఛన్ పెంపు మహోత్సవాలు జరుగుతాయన్నారు. 4న బెళుగుప్ప, అనంతపురం రూరల్, బొమ్మనహాళ్, బుక్కరాయసముద్రం, డి.హీరేహాళ్, గుత్తి రూరల్, గుత్తి అర్బన్, కళ్యాణదుర్గం అర్బన్, పెద్దపప్పూరు, 5న ఆత్మకూరు, కణేకల్లు, పామిడి రూరల్, పామిడి అర్బన్, పుట్లూరు, రాయదుర్గం అర్బన్, శెట్టూరు, ఉరవకొండ, యాడికి, యల్లనూరు, విడపనకల్లు, 6న వజ్రకరూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు, కుందుర్పి, కంబదూరులో పింఛన్ పెంపు మహోత్సవాలు నిర్వహిస్తారన్నారు. వలంటీర్లందరూ లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారన్నారు. పంపిణీ సమయంలో ముఖ్యమంత్రి లేఖను పింఛన్దారులకు అందజేస్తారన్నారు. నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర నూతన సంవత్సరంలో ‘సంక్షేమ’ జాతర జరగనుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు పింఛన్ల పెంపు సహా మూడు ప్రధాన పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ‘ఆసరా’. ఈ నెల 23 నుంచి 31 వరకు ‘ఆసరా’ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పథకం కింద నాలుగో విడత ద్వారా జిల్లాలో 24,100 డ్వాక్రా సంఘాలకు రూ.183.59 కోట్ల లబ్ధి చేకూరనుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నాలుగో విడతలోనూ ఆర్థిక సాయం అందించేందుకు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1,18,881 మంది మహిళలకు రూ.35.96 కోట్లు అందజేయనున్నారు. ఇవి చదవండి: AP: బలంగా.. బడుగుల అడుగులు -
AP: పండుగలా పింఛన్ల పంపిణీ
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనూ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగలా మొదలైంది. తాజాగా పెంచిన మొత్తంతో కలిపి రూ.మూడు వేల చొప్పున ఈనెల పింఛను డబ్బులు అందుకున్న అవ్వాతాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పటివరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్ మొత్తాన్ని ఈ జనవరి ఒకటి నుంచి రూ.మూడు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 8వ తేదీ వరకు మండలాల వారీగా ఉత్సవాలు నిర్వ హించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల నుంచి కొత్తగా మరో 1,17,161 మందికి పింఛన్లు మంజూ రు చేసింది. మొత్తంగా ఈ నెలలో 66.34 లక్షల మందికి రూ.1,968 కోట్లను విడుదల చేసింది. పింఛన్ల పంపిణీలో విప్లవాత్మక మార్పులు.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నా పింఛన్ల మంజూరుకు అప్పటి జన్మభూమి కమిటీ సభ్యులు ఇబ్బందులు పెట్టడాన్ని స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టుకుంటూ పెన్షన్ మొత్తాన్ని ఏటేటా పెంచుకుంటూ ఈ జనవరి నుంచి రూ.మూడువేల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇలా సీఎం జగన్ తానిచ్చిన మాటను అమలుచేసి చూపించడంతో సోమవారం రాష్ట్రంలో పలు మండలాలు, మున్సిపాలిటీల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ పెన్షన్ లబ్దిదారులతో మమేకమవుతూ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. వలంటీర్లు కూడా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. -
పింఛన్ రూ.3,000.. లబ్ధిదారులకు సీఎం లేఖ
సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు దేశంలో రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని, ప్రజలందరి ఆశీస్సులతోనే ఇదంతా చేయగలుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచుతున్న సందర్భంగా ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. ఒకటవ తేదీన వలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులు అందజేస్తూ, వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతులను అందజేయనున్నారు. ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయి, జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్టు కూడా పేర్కొన్నారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రియమైన అవ్వాతాతలకు.. మీకు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు 2024 జనవరి 1 నుంచి.. ఇచ్చిన మాట ప్రకారం.. ఇక మీ చేతికి అందే పెన్షన్ రూ.3000 అవుతుంది. నా సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో నోరు తెరిచి అడగలేని ఎంతో మంది అవ్వాతాతలను, దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయి జీవితాన్ని భారంగా నెట్టుకొస్తున్న వితంతువులను.. కష్టాలు, కన్నీరు తుడిచే వారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వ్యథలను నేను స్వయంగా చూశాను. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి.. మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూ.చా. తప్పక పెన్షన్లను పెంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో, దేవుడి దయతో అందిస్తునందుకు సంతోషిస్తున్నాను. ఈ పెన్షన్ పెంపుతో మేనిఫెస్టోలో ఇచ్చిన నూరు శాతం హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నాను. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పింఛన్ కేవలం రూ.1,000 ఉండేది. ఆ ఐదేళ్లలో ఒక్కో అవ్వాతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ రూ.58 వేలు. అదే మీ జగన్ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా రూ.1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి.. కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికీ సంతోషిస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ, పెన్షన్ మంజూరు కావాలంటే నరకమే. పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు, పెన్షన్ తీసుకోవడానికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు. కానీ, ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీన.. అది ఆదివారమైనా, మరే ఇతర సెలవు రోజైనా సరే సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెపుతూ మన వలంటీర్లు మీకు పెన్షన్ అందిస్తున్నారు. పెన్షన్ కోసం పడిగాపులు పడి, ఎక్కడో ఉన్న కార్యాలయం చుట్టూ తిరిగిన గత ప్రభుత్వ విధానాలకు.. మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా.. మనది మనసున్న ప్రభుత్వం. మనది పేదలు, మహిళలు, రైతుల పక్షపాత ప్రభుత్వం. దేశంలోనే రూ.3,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమని, ప్రజలందరి మన ప్రభుత్వమే ఇది చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. మీ ఆశీస్సులతోనే ఇదంతా చేయగలిగాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్లే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో ఇలాంటి మంచి ప్రయత్నాలను కొనసాగించగలిగాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు మంచి జరగాలని.. ఆ దేవుడి దయ ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి దయతో, మీ అందరికి ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటూ.. మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమతో మీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి -
పండుగలా రూ.3 వేల పింఛన్ పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హతే ప్రామాణికంగా.. వివక్షకు తావు లేకుండా.. అందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జనవరి 1 నుంచి పింఛన్ను రూ.2,750 నుంచి రూ.3 వేలకు పెంచి.. పంపిణీ చేసే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 66 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నారన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ఫైనల్ ఇన్స్టాల్మెంట్ను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు ♦ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో కూడా అందరి భాగస్వామ్యం ఉండేలా చేస్తాం. ♦ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అభ్యర్థులు ఎక్కడైనా మార్పులు జరిగి ఉంటే వారిని పరిచయం చేయడం, బలోపేతం చేయడం, పార్టీ మొత్తం వారితో సమన్వయం చేయడంపై చర్చ జరిగింది. అభ్యర్థుల మార్పు వీలైనంత త్వరగా జరిగిపోతుంది. మార్పు తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటారు. ♦ వైఎస్సార్సీపీ చాలా బలంగా ఉంది. ఏ కారణాల వల్లనైనా ఎవరైనా పక్కకు వెళ్తుంటే, ఇక్కడ ఇంతకు మించి ఎదుగుదల లేదని వాళ్లు అనుకుంటే అలాంటి వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాం. మా పార్టీకి డిమాండ్ ఉంది. ఫామ్లో ఉన్నాం. ఇమడలేని వారు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు అడ్డంగా కొంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా.. పోతేపోనీ కొత్తవారు వస్తారనే ఉద్దేశంతోనే జగన్ చూశారు. ఇలాంటి చిన్నచిన్న వాటికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పోయిన వారి గురించి మేం కామెంట్ చేయదలచుకోలేదు. ♦ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ మధ్య నలుగురిని సస్పెండ్ చేశాం. పార్టీ విధానాలు కుదరడం లేదనుకునే వారు పోతుంటారు. ఇలాంటి వారు ఉంటే పార్టీకి పోనుపోనూ ఇంకా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ♦ వైఎస్సార్సీపీని స్థాపించినప్పటి నుంచి జగన్ ఆలోచన విధానాన్ని గమనిస్తే, పార్టీనుంచి ఎవరైనా వారి ప్రయోజనాల కోసం వెళ్తుంటే దాన్ని అంతే బ్రాడ్ మైండ్తో చూడటం అనేది అలవాటు అయ్యింది. ఒక నాయకుడితో అనుబంధం ఉన్నాక అందులో మార్పులు జరిగినప్పుడు కిందవాళ్లకు కొత్తవారితో అడ్జస్ట్ కాగలమా అనేది ఒక డైలమా రావచ్చు. అప్పుడు అసంతృప్తులు రావొచ్చు. వారికి నచ్చజెప్పేందుకే ఈ యంత్రాంగం అంతా నాతో సహా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు పని చేస్తున్నాం. చాలావరకు విజయవంతం అవుతాయి. -
జనవరి 3న సిఎం జగన్ కాకినాడ పర్యటన
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 3న జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఈ విషయం చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంపుదల చేసే కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. బుధవారం ఆయన కమిషనర్ నాగ నరసింహారావు ఇతర అధికారులతో కలిసి సీఎంతో ప్రారంభించనున్న రాగిరెడ్డి వెంకట జయరాంకుమార్ కళాక్షేత్రాన్ని, స్కేటింగ్ రింక్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశలవారీగా పింఛన్ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3,000కు పెంచే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభిస్తారన్నారు. ముత్తా గోపాలకృష్ణ వారధి ( కొండయ్యపాలెం ఫ్లైఓవర్ ), రూ 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం, రూ.7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్ను కూడా సీఎం ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట స్మార్ట్ సిటీ ఎస్ఈ ఎం.వెంకటరావు, కనస్ట్రక్షన్స్ మేనేజర్ కామేశ్వర్, ఇతర అధికారులు ఉన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష కాకినాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 3న కాకినాడ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, మున్సిపాలిటీ, పబ్లిక్హెల్త్, మెప్మా, డీఆర్డీఏ, పౌర సరఫరాలు, రోడ్డు, భవనాలు, విద్యుత్, ప్రజారవాణా, సమాచార పౌర సంబంధాలు, ట్రాన్స్పోర్టు తదితర శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.