శంషాబాద్లో తప్పిన పెను ప్రమాదం
Published Mon, Aug 28 2017 4:19 PM | Last Updated on Tue, Sep 12 2017 1:12 AM
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్ళగూడలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఆటో ట్రాలీలు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాయి. దీంతో విద్యుత్ స్తంభం కూలి ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Advertisement
Advertisement