shamshabad
-
శంషాబాద్ రియల్ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఏక్యూఐ
హైదరాబాద్: బయోఫిలిక్, సస్టెయినబుల్ రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లోని తమ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లో ఏక్యూఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటరింగ్ స్టేషన్ను ప్రారంభించింది. ఈ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అక్కడి కమ్యూనిటీ ప్రయోజనం కోసం గాలి నాణ్యతను పర్యవేక్షించడమే కాకుండా పర్యావరణ సుస్థిరత గురించి అవగాహన పెంచడానికి కూడా దోహదం చేస్తుంది.ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్, ఎకనామిక్ కౌన్సెలర్ టీ పిరిహ్, జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అడిషనల్ కమిషనర్ వీవీఎల్ సుభద్రాదేవి, కేంద్ర ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి అశోక్ పావడియా వంటి ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కత్తిరించి మొక్కలు నాటారు. అనంతరం ప్రాజెక్ట్ విస్తృత ప్రభావాలను వివరించారు.ఈ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా రాయబారి మతేజా వోడెబ్ ఘోష్ మాట్లాడుతూ.. సుస్థిర చర్యల ప్రపంచ ప్రాముఖ్యతను తెలియజేశారు. "గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడానికి అన్ని సంస్థలు, ప్రభుత్వాలు, ఎన్జీఓలు, కార్పొరేట్లు, వ్యాపార సంస్థలు - సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చిలుకూరి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ అభివృద్ధి అంటే కేవలం భౌతికంగా నివాస ప్రాంతాలను సృష్టించడం కాదని, సుస్థిర సమాజాలను నిర్మించడమని తాము నమ్ముతున్నామన్నారు. పర్యావరణ బాధ్యతను పెంపొందించే దిశగా తాము తీసుకుంటున్న అనేక చర్యల్లో శంషాబాద్ లోని ఏక్యూఐ మానిటరింగ్ స్టేషన్ ఒకటి అన్నారు. -
ఆరేళ్లలో ఐదు కోట్ల మంది ప్రయాణికులు
హైదరాబాద్: ఆరేళ్లలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఏటా 5 కోట్ల స్థాయికి చేరుతుందని జీఎంఆర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.9 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ వెల్లడించారు. ‘2023–24లో 2.5 కోట్ల మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేశారు. కంపెనీ ప్రస్తుత కార్గో టెరి్మనల్ విస్తరణ కోసం రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది. ఏటా 4 లక్షల టన్నుల సామర్థ్యా న్ని చేరుకోవడానికి కొత్త టెరి్మనల్ ఏర్పా టు చేస్తోంది. విమానాశ్రయం ఇప్పటికే ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2008లో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఎయిర్పోర్టును నిర్మించారు’ అని వివరించారు. -
శంషాబాద్లో మళ్లీ ‘హైడ్రా’ కొరడా.. కమిషనర్ వార్నింగ్
సాక్షి,శంషాబాద్:శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్లను తొలగించింది. హోర్డింగ్లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
శంషాబాద్లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు సమాచారం.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే క్రమంలో హైడ్రా సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
శంషాబాద్లో చెన్నై-పూణే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024 -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
-
శంషాబాద్లో యువకుడి హల్చల్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తొండుపల్లిలో ట్రాఫిక్ పోలీసులతో యువకుడు గొడవ పెట్టుకున్నాడు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు బైక్ను ఆపి చెకింగ్ చేస్తుండగా.. యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బెలూగా.. భలేగా..
శంషాబాద్: ఆకాశ తిమింగలంగా పేరొందిన ప్రపంచంలోని అతిపెద్ద అయింది. ఈ నెల 27న ఫ్రాన్స్లోని టూలూజ్ నుంచి థాయ్లాండ్ వెళ్లేందుకు బయలుదేరిన ఈ విమానం 28న ఫ్రాన్స్లోని మార్సెల్లే, 29న ఈజిప్టు రాజధాని కైరో, కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్బస్ బెలూగా (ఏ300–608ఎస్టీ3) మరోసారి భాగ్యనగరాన్ని పలకరించింది. గురువారం అర్ధరాత్రి 12:23 గంటలకు ముచ్చటగా మూడోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా ప్రయాణించి ఇంధనం నింపుకోవడంతోపాటు సిబ్బంది విశ్రాంతి కోసం హైదరాబాద్ చేరుకుంది. దాదాపు 15 గంటల హాల్టింగ్ అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు థాయ్లాండ్ బయలుదేరింది. బెలూగా–3 విమానం 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఆగస్టులో రెండోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది.ప్రత్యేకతలు ఇవీ..రష్యన్ భాషలో బెలూగా అంటే తెల్ల తిమింగలం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమానాలు కేవలం ఐదే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన అంటోనోవ్–225కన్నా ఇది 20 మీటర్లు చిన్నగా ఉంటుంది. సాధారణ కార్గో విమానాల్లోతరలించలేని భారీ సామగ్రిని ప్రత్యేకించి విమానాల విడిభాగాలు, రక్షణ రంగ పరికరాలను ఈ విమానంలో తరలిస్తారు. దీని పొడవు పొడవు 56.15 మీటర్లు, ఎత్తు 17.24 మీటర్లు, కార్గో మోసుకెళ్లే సామర్థ్యం 47 టన్నులు. -
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
-
శంషాబాద్-బెంగళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం
-
శంషాబాద్లో స్కూల్ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ బెంగుళూరు హైవే పై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది.గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుతో పాటు డ్రైవర్ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పఠాన్ చెరువుకు మెట్రో విస్తరణ..
-
Farm House: అంతా అక్రమమే..
శంషాబాద్: ఇటీవల సంచలనం రేపిన ఎమ్మార్పీఎస్ నేతలు నరేందర్, ప్రవీణ్లను కిడ్నాప్ చేసి బంధించిన ఫాంహౌస్ను సోమవారం పోలీసుల బందోబస్తు మధ్య శంషాబాద్ మున్సిపాలిటీ అధికారులు నేలమట్టం చేశారు. పట్టణంలోని 103 సర్వే నంబరులో ధర్మగిరి ఆలయానికి సమీపంలో కిడ్నాపర్లు సుమారు వెయ్యి గజాల స్థలంలో ఈ ఫాంహౌస్ను నిరి్మంచినట్లు గుర్తించారు. రెండు మూడేళ్ల క్రితంఎలాంటి అనుమతులు లేకుండా రెండు రేకుల షెడ్లతో పాటు ప్రహరీ, కుక్కలను ఉంచేందుకు ప్రత్యేకంగా ఎనిమిది బోన్లను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో బాతులు, కోళ్లను కూడా పెంచుతున్నారు. కిడ్నాప్ సంఘటనతో పాటు అప్రత్తమైన పోలీసులు ఫాంహౌస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న గుర్తించిన మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అక్రమ నిర్మాణంగా తేలితే కూల్చివేయాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్ కమిషన్ బి. సుమన్రావు ఆదేశాలతో టౌన్ప్లానింగ్ అధికారులు ఇటీవల ఫాంహౌస్కు నోటీసులు అంటించారు. సోమవారం మూడు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. కుక్కలతో పాటు, కోళ్లు, బాతులను తీసుకెళ్లేందుకు పశుసంవర్థక శాఖతో పాటు బ్లూక్రాస్కు సమాచారం అందించారు. అప్పటి వరకు కుక్కలకు సంబంధించిన బోన్ల కూలి్చవేతను నిలిపివేశారు. ఫాంహౌస్ పూర్తిగా అక్రమ నిర్మాణమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కూల్చివేతల సమయంలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ అక్కడికి రాలేదు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు. భూ కబ్జాదారులు ఇబ్బంది పెడితే పోలీసులను సంప్రదించాలన్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
హైదరాబాద్లో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. శంషాబాద్లో దాదాపు కేజీ హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు హెరాయిన్ తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు..వివరాలు.. నగరంలోని రాజస్థాన్కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. రాజస్థాన్కు చెందిన నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 7 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం ఇదే తొలిసారి అని తెలిపారు. కేజీకి పైగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన డ్రగ్ పెడ్లర్ నేమి చాంద్ భాటితోపాటు నార్పట్ సింగ్, అజయ్ భాటి, హరీష్ సిర్వి, సంతోష్ ఆచార్య అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా రాజస్థాన్ నుంచి బస్లో డ్రగ్స్ తీసుకొచ్చారని సీపీ తెలిపారు.స్వీట్ బాక్సుల్లో పైన స్వీట్స్ పెట్టి.. కింద 250గ్రా. హెరాయిన్ ఉంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోనే హెరాయిన్ ఎక్కువగా తయారు అవుతోందని.. ఈ హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
శంషాబాద్లో మరోసారి చిరుత కలకలం!
సాక్షి,రంగారెడ్డి : శంషాబాద్లో వరుసగా రెండోసారి చిరుత ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాంన్సీమియాగుడా గ్రామ శివారులో చిరుత అనవాళ్లు కనిపించాయి.పొలంలో చిరుత సంచరించినట్లు రైతులు ఆనావాళ్లు గుర్తించారు. వెంటనే చిరుతను గుర్తించాలని అటవిశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అయితే అధికారులు స్పందించ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. -
ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. సినిమా టెంపుల్.. అమ్మపల్లి గుడిని చూశారా? (ఫొటోలు)
-
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
-
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
ఏటీఎంలో రూ.18.99 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
శంషాబాద్ రూరల్: గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి భారీగా నగదు దోచుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో ఏటీఎంలోకి వెళ్లి సీసీ కెమెరాల్లో కనిపించకుండా వాటిపై నల్లరంగు స్ప్రే చేసి..ఆధారాలు లేకుండా తప్పించుకున్నారు. మరోచోట ఏటీఎంలోకి చొరబడేందుకు యతి్నంచి విఫలమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉంది. ఈ నెల 14న సీఎంఎస్ కంపెనీ వారు ఈ ఏటీఎంలో రూ.21 లక్షలు జమ చేశారు. ఆదివారం అర్థరాత్రి 1.59 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి..మొదట ఏటీంలోని సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేశారు. అనంతరం గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్చేసి అందులో ఉన్న నగదు రూ.18,99,000 దోచుకున్నారు. పోలీసులకు సమాచారం.. ఏటీఎంలో దుండగులు గ్యాస్ కట్టర్తో కట్ చేస్తుండగా..చివరి సమయంలో అక్కడ ఉన్న సేఫ్టీ పరికరాల ద్వారా ముంబయిలోని నిర్వహణ సంస్థకు అలర్ట్ వెళ్లింది. దీంతో సంస్థ ప్రతినిధులు సుమారు 20 నిమిషాల తర్వాత శంషాబాద్ ఎస్హెచ్ఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సరికి దుండగులు నగదుతో పారిపోయారు. ఏటీఎంలోకి చొరబడిన దుండగులు షటర్ను మూసివేసి లోపల పని కానిచ్చారు. దీంతో అటువైపు పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే వరకు స్థానికులకు సమాచారం లేదు. ఏటీఎం కేంద్రాన్ని డీసీపీ నారాయణరెడ్డి, సీఐ నరేందర్రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ పట్టణంలో.. శంషాబాద్ పట్టణంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న ఏటీఏంలోనూ చోరీకి దుండగులు యతి్నంచి విఫలమయ్యారు. ఇక్కడ ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో నగదు దోచుకునేందుకు దొంగలు ప్రయతి్నంచినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఎలాంటి నగదు చోరీకి గురికాలేదు. -
Hyd : నిందితుల నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
-
విశాఖ టు శంషాబాద్ ఇక 4.30 గంటలే
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదిదశకు చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ (పెట్) సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే (డీపీఆర్) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి రూ.20,000 కోట్లకుపైగా వ్యయం అవుతుందని అధికారుల అంచనా. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశముంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే డీపీఆర్ సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శంషాబాద్–విశాఖకు తక్కువ సమయంలోహైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే.. శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకోవచ్చు. ప్రస్తుతం జంటనగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతోంది. వందేభారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటోంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30 వేల మంది వీక్లీ ట్రైన్లలో రాకపోకలు సాగిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతి రోజు సుమారు 55,000 మంది జాతీయ ప్రయాణికులు ఉండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరొప్ తదితర దేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి హైస్పీడ్ రైలులో నేరుగా విజయవాడ, విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా హైస్పీడ్ కారిడార్ మార్గాలను ఎంపిక చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎలివేటెడ్ కారిడార్ అయితే ఎలా ఉంటుంది... హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రాథమిక సర్వే చేపట్టినా, కారిడార్ నిర్మాణానికి ఏ రకమైన సాంకేతిక వ్యవస్థ ఎంపిక చేసుకోవాలనే అంశంపైన కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం అన్ని రైళ్లు నేల మీద నిర్మించిన పటిష్టమైన ట్రాక్లపైనే నడుస్తున్నాయి. ప్రధాననగరాల్లో మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైల్కు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిసేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కి.మీల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం కావొచ్చు. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపు ఖర్చు చేయాల్సి రావొచ్చు. నేలపైనే హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం తగ్గే అవకాశముంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైనే డీపీఆర్ తర్వాతే ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. చర్లపల్లికి సోలార్ ప్రాజెక్టు.. గ్రేటర్ హైదరాబాద్లో నాలుగో టర్మినల్గా అందుబాటులోకి రానున్న చర్లపల్లి రైల్వేస్టేషన్లో విద్యుత్ సరఫరాకు చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు కేంద్రం తాజా బడ్జెట్లో రూ.93.75 కోట్లు కేటాయించింది. స్టేషన్ అవసరాలకు కావాల్సినంత విద్యుత్ ఈ ప్రాజెక్టు నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరులో చర్లపల్లి నుంచి రైల్వేసేవలు ప్రారంభించనున్నట్టు జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు. సౌరశక్తి ప్రాజెక్టుతో పాటు తుదిదశలో ఉన్న చర్లపల్లి టర్మినల్ నిర్మాణ పనులకు మరో రూ.46 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. -
Hyderabad: విషాదం.. చిన్నారిని బలిగొన్న వీధి కుక్కలు
శంషాబాద్: హైదరాబాద్లో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందింది. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మున్సిపాలిటీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన సూర్యకుమార్, యాదమ్మ దంపతులు బతుకుదెరువు కోసం శంషాబాద్కు వలస వచ్చారు. అయితే వారు రాళ్లగూడ సమీపలోని ఓ గుడిసెలో తమ ఏడాది వయసున్న కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావటంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి ఆ చిన్నారికి పాలు తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున ఆ చిన్నారి మళ్లీ ఏడుస్తూ గుడిసె బయటకు రాగా రోడ్డుమీద ఉన్న వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అక్కడి నుంచి వస్తున్న శబ్దాలను విన్న పలువురు వాహనదారులు పల్లాడిపై దాడి చేస్తున్న కుక్కలను తరిమేశారు. వారు చిన్నారిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందాడు. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందగా.. మరో చిన్నారి వీధి కుక్కలు బలితీసుకోవంటంతో బోరున విలపిస్తున్నారు. -
కల్వర్టు గుంతలో పడిన కారు
శంషాబాద్ రూరల్: రహదారిపై అదుపు తప్పిన కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. గుంతలోని నీళ్లలో మునిగి ఊపిరాడక తల్లీ, కొడుకు మృతి చెందిన దుర్ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసీఐఎల్లోని శ్రీరాంనగర్ కాలనీ వాసి మెరువ ఆదిశేషరెడ్డి(57) బాబా ఆటోమిక్ రీసెర్స్ సెంటర్లో సైంటిఫిక్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా సొంత ఊరైన ఏపీ నంద్యాల సమీపంలోని జిల్లెల గ్రామానికి తన తల్లి ఎం.రాములమ్మ(88)ను తీసుకుని ఈసీఐఎల్ నుంచి కారులో శనివారం బయలుదేరాడు. మార్గ మధ్యలో మండలంలోని ఘాంసిమిగూడ శివారులో బెంగళూరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటో, బైక్ను ఢీకొడుతూ.. నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడింది. నీళ్లలో మునిగి మృత్యువాత.. కారు ఢీకొనడంతో బైక్తో పాటు ఆటో కూడా గుంత నీళ్లలో పడిపోయాయి. కారులో ఉన్న ఆదిశేషరెడ్డి, రాములమ్మ అందులోని నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్లలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. ఆటోలో ఉన్న ముగ్గురిలో డ్రైవర్ రాయన్నగూడ సిద్దయ్యకు గాయాలయ్యాయి. బైక్పై ప్రయాణిస్తున్న గొల్ల ఆంజనేయులు(25)కు కాలు విరగగా బాలికకు గాయాలయ్యాయి. వీరందరనీ స్థానికులు గుంతలో నుంచి బయటకు తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
కరాచి బేకరి కిచెన్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం
-
ఆ 181 ఎకరాలు హెచ్ఎండీఏవే..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లోని 181 ఎకరాల వివాదాస్పద భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కే చెందుతాయని హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. అందులోని 50 ఎకరాలపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 2007 నుంచి శంషాబాద్ గ్రామ పంచాయతీ జారీ చేసిన ఆస్తి పన్ను నోటీసులు, మున్సిపల్ అనుమతి, రెవెన్యూ రికార్డులు, విద్యుత్ బిల్లులు, ఫొటోలు, 2023 ఏప్రిల్ 20 నాటి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇంటి పన్ను రశీదులు, ఇంటి నిర్మాణ అనుమతి.. ఇలా అన్నీ నకిలీవేనని జ్యుడీషియల్ రిజిస్ట్రార్నివేదిక బయటపెట్టిందని స్పష్టం చేసింది. 2007లోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు కల్పి త రసీదులు సృష్టించారని పేర్కొంది. 1990 సెపె్టంబర్ 4 నాటి ఉత్తర్వుగా పేర్కొంటూ.. 1992లో టైప్ చేసిన కాపీని పిటిషనర్ ఇచ్చారని, అది కూడా నకిలీదేనని తేలిందని వెల్లడించింది. అన్ని అంశాలను పరిశీలించాక పిటిషనర్కు ఉపశమనం పొందడానికి ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ‘పైగా’భూములని పేర్కొంటూ.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సర్వే నంబర్ 725/21లోని 7.31 ఎకరాలు, సర్వే నంబర్ 725/23లోని 10.07 ఎకరాలు, సర్వే నంబర్ 725/25లోని 12.34 ఎకరాలు సహా దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా (సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు క ల్పిస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ల ధర్మాసనం విచారణ జరిపింది. రసీదులన్నీ నకిలీవే.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘవన్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. తప్పుడు పత్రాలు, రసీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని.. అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకు పైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ కోర్టుకు వివరించారు. 2007, 2012లో జారీ చేసిన రసీదులు పూర్తిగా నకిలీవని స్పష్టం చేశారు. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల పత్రాలను ఆయన ఈ సందర్భంగా ధర్మాసనానికి అందించారు. 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం తెలంగాణ అని పేర్కొన్నారని.. అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందని వివరించారు. దాంతో ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం గతంలోనే జ్యుడీïÙయల్ రిజిస్ట్రార్ను ఆదేశించింది. రిజిస్ట్రార్విచారణ జరిపి కోర్టుకు నివేదిక ఇచ్చారు. పిటిషనర్ పేర్కొన్నట్టుగా 1997లో అసలు పిటిషన్లే నమోదు కాలేదని వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచి్చంది. -
మందుబాబులకు అలర్ట్.. నేటి నుంచే వైన్షాప్లు బంద్
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి షాపులను తెరుస్తారని అన్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా, మద్యం నిలువ చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 236 కేసులు నమోదు చేశామన్నారు. తమ ప్రాంతంలో మద్యం విక్రయించినా, డంప్ చేసినా ఫోన్ నంబర్ 8712658750లో ఫిర్యాదు చేయాలని కోరారు. -
‘పైగా’ భూములపై.. అవి తప్పుడు తీర్పు నివేదికలే..
సాక్షి, హైదరాబాద్: ‘పైగా’భూములకు సంబంధించి 1998లో ఇచ్చిన తీర్పు కాపీని సీల్డ్ కవర్లో హైకోర్టుకు రిజిస్ట్రార్ సమర్పించారు. సెపె్టంబర్ 15న విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు నివేదిక అందజేశారు. పిటిషనర్ పేర్కొన్నట్లు ‘పైగా’భూములపై 1998లో హైకోర్టు ఏ తీర్పునూ ఇవ్వలేదని, అసలు పిటిషనర్ పేర్కొన్న పిటిషన్లే నమోదు కాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్ను ఆదేశిస్తూ, స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్ 13కు విచారణను వాయిదా వేసింది. 50ఎకరాల భూములపై వివాదం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా(సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నా హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కల్పిస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేజీ రాఘువన్, ప్రభుత్వం తరఫున బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. బోగస్ డాక్యుమెంట్లు, రశీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టించి అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకుపైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ గతంలో వాదనలు వినిపించారు. 2007, 2012లో జారీ చేసి న రసీదులు పూర్తిగా నకిలీవని.. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల డాక్యుమెంట్లను ఆయ న ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచారు. 2007నాటికి తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? 2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం అలా పేర్కొన్నారని, అలాగే శంషాబాద్ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్ అని మరో రసీదులో ఉందన్నారు. దీనిపై పూర్తిగా విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక అందజేయాలని జుడీషియల్ రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ మేరకు నివేదిక అందజేసింది. అనంతరం ధర్మాసనం.. ఈ నివేదిక కాపీలను అక్టోబర్ 3లోగా పిటిషనర్కు, ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
బ్యాగ్ల అడుగున దాచి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల విలువ చేసే ఐదు కిలోల కొకైన్ను డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు శుక్రవారంస్వాధీనం చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్లో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగ్ల కింద దాచి ఉంచిన కొకైన్ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ మేరకు డీఆర్ఐ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. లావోస్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడు లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్కు శుక్రవారం చేరుకున్నాడు. అతడు హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా, పక్కా సమాచారం మేరకు అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. సూట్కేస్, నాలుగు మహిళా హ్యాండ్ బ్యాగ్ల అడుగు భాగంలో దాచి ఉంచిన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం ఐదు కిలోల కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రయాణికుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ డ్రగ్ సిండికేట్లోని మరికొందరు ముఠా సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్పోర్ట్లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న షేక్ఖాజా, షేక్జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
వీడిన శంషాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీ
-
మంజుల హత్య కేసు.. రిజ్వానా బేగం వల్లే దారుణం..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్లో మహిళ దారుణ హత్య సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక, మృతురాలిని రాళ్లకు చెందిన మంజులగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. రుజ్వానానే మంజులను తన చీరతో ఉరివేసి చంపినట్టు తెలిపారు. కాగా, కేసు వివరాలను డీసీపీ శనివారం మీడియాకు వివరించారు. ఈ సందర్బంగా డీసీపీ నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించాం. చనిపోయిన మహిళను వడ్ల మంజులుగా గుర్తించడం జరిగింది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త చెప్పిన పోలికలు, ఘటనా స్థలం వద్ద మృతదేహంతో సరిపోలడంతో.. హత్యకు గురైందని మంజులగా గుర్తించాము. అయితే, మంజుల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం. మంజుల రిజ్వానా బేగం అనే మహిళకు లక్ష రూపాయాలు అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బుల వ్యవహారం వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. ముందుగా మంజుల కళ్లలో కారంతో రిజ్వానా కారంతో దాడి చేసింది. మంజుల చీర కొంగుతో రిజ్వానా మెడ గట్టిగా పట్టకుని ఉరివేసి హత్య చేసింది. అనంతరం, పెట్రోల్తో మంజుల మృతదేహాన్ని రిజ్వానా కాల్చి చంపింది. 24 గంటల్లోనే కేసును చేధించాం. ఈ కేసులో రిజ్వానా బేగంను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తాము. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసింది. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారం చెవుల రింగ్స్ రిజ్వానా దొంగతనం చేసింది. అనంతరం వాటిని ముత్తూట్ ఫైనాన్స్లో రిజ్వానా తాకట్టు పెట్టింది. ఈ క్రమంలో భర్తతో కలిసి అజ్మీర్ వెళ్లిపోవడానికి రిజ్వానా టికెట్స్ కూడా బుక్ చేసింది అని తెలిపారు. ఇది కూడా చదవండి: జగిత్యాల గొల్లపెల్లిలో విషాదం: బాలికను బలిగొన్న పిచ్చి కుక్క -
శంషాబాద్లో దారుణం.. కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్బాడీ
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు మహిళపై పెట్రోల్పోసి నిప్పంటించారు. కాగా, పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పడేసినట్టు తెలిపారు. మహిళ ఎవరు ఎందుకు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళ కోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా, మహిళకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మహిళ 35, 36 సంవత్సరాలు వయసుగా ఉంటుంది. కాళ్లకు మెట్టలు ఉండడంతో వివాహమైన మహిళగా ప్రాథమిక గుర్తించామన్నారు. హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా లేదంటే ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య, శరణ్యను కిరాతకంగా.. -
ఎయిర్పోర్టులో దుమ్మురేపుతున్న దోస్తులు, ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ రావొద్దు!
శంషాబాద్: ప్రయాణికుల స్వాగత, వీడ్కోలు జరిగే సమయాల్లో అత్యధికమంది రావడంతో ఎయిర్పోర్టు పరిసరాల్లో పార్కింగ్, రద్దీ పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎయిర్పోర్టు వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇటీవల విదేశాలకు వెళుతున్న విద్యార్థుల వెంట పరిమితికి మించి పెద్దఎత్తున స్నేహితులు, బంధువులు, కుటుంబసభ్యుల రాకతో ఎయిర్పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు, వారి కుటుంబసభ్యులు సహకరించాలన్నారు. -
బంగారం ద్రవాన్ని చీరపై స్ప్రేగా చల్లి అక్రమ రవాణా
హైదరాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని పరిశీలించారు. అందులో ఉన్న ఓ కాటన్ చీరపై బంగారం ద్రవాన్ని స్ప్రేగా చల్లి తీసుకొచ్చినట్లు గుర్తించి దానిని బయటికి తీశారు. బయటపడిన 461 గ్రాముల బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్సర హత్యకు ముందు.. గూగుల్లో సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్లో గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు. గూగుల్లో సెర్చింగ్.. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. టికెట్ కొనలేదని చెప్పి మరీ.. జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ. ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే! -
మా కూతురుకు ఏ చెడు అలవాటు లేదు: అప్సర తల్లిదండ్రులు
-
గర్భవతిగా ఉన్న అప్సరను హత్య చేసిన సాయికృష్ణ
-
అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా?
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో ఇంకా శవ పరీక్ష(అటాప్సీ) పూర్తి కాలేదు. ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది. చాలాకాలం కిందట చెన్నై నుంచి హైదారాబాద్కు వలస వచ్చింది అప్సర కుటుంబం. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్నగర్లో అద్దె ఇంట్లోంది అప్సర. ఈ క్రమంలో స్థానికంగా ఓ ఆలయంలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో గుడిలో అప్సరకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పూజారి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు సాయికృష్ణ. అప్సర తల్లిని అక్కా అని పిలుస్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్గా భావించి.. అప్సరను హత్య చేశానని నిందితుడు సాయికృష్ణ అంగీకరించాడు. సాయికృష్ణ అమాయకుడు! ఇక ఈ కేసులో తన కొడుకు సాయికృష్ణ అమాయకుడని అంటున్నాడు అతని తండ్రి. అప్సరతో సంబంధం ఉన్నట్లు తమకు, అంతెందుకు సాయికృష్ణ భార్యకు సైతం తెలియదని అంటున్నాడు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్ చేసి ఉంటుందని ఆయన అరోపిస్తున్నాడు. కూతురిని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది తల్లే కదా అంటున్నాడాయన. ఓసారి అప్సర బ్యాంక్ అకౌంట్లను పరిశీలించండి.. ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అంటూ నిలదీస్తున్నాడాయన. మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తను వెనకేసుకొస్తోంది. ‘‘నా భర్తకు అప్సరతో సంబంధం లేదు. అప్సర చేసింది కరెక్ట్ కాదు. ఆమెకు ఎవరివల్ల గర్భం వచ్చిందో?. బహుశా నా భర్తను అప్సర నిజంగానే టార్చర్ చేసి ఉండొచ్చ’’ని అంటోందామె. -
అప్సర హత్య కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్
-
చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, హత్య కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా వారి మధ్య శారీరక సంబంధమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. కాగా, డీసీపీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడులోని చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్లో స్థిరపడ్డారు. అప్సర డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో కొద్దిరోజులు పనిచేసింది. 2022లో ఆమె హైదరాబాద్కు వచ్చారు. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. కోనసీమ జిల్లా గన్నవరానికి చెందిన సాయికృష్ణ మార్కెటింగ్లో ఎంబీఏ చేశాడు. 2010లో సాయికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్గా కూడా పనిచేస్తున్నాడు. అయితే, ఇద్దరికీ బంధుత్వం లేదు, ఒక్కటే కమ్యూనిటీ. అప్సర సరూర్నగర్లోని బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అదే ఆలయంలో సాయి పూజరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవలే సాయికి వివాహం జరిగినట్టు అప్సరకు తెలిసింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. ఈనెల 3వ తేదీన కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను సాయి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి కారులో స్టార్ట్ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అప్సర కారు ముందు సీటులో పడుకుని ఉంది. ఈ క్రమంలో సుల్తాన్పూర్వద్ద ఉన్న గోశాల వైపు కారును మళ్లించాడు. ముందు సీటులో ఉన్న అప్సర ముఖంపై కారు కవరింగ్ షీట్ సాయంలో బలవంతంగా నొక్కాడు. దీంతో, అప్సర ప్రతిఘటించింది. అయితే, సాయి అప్పటికే తన వద్ద ఉన్న రాయితో అప్సర తలపై కొట్టాడు. ఇలా అప్సర తలపై 10సార్లు కొట్టడంతో ఆమె చనిపోయింది’ అని తెలిపారు. మరోవైపు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించినట్టు తెలుస్తోంది. పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: హాయ్ డియర్.. హోటల్లో కలుద్దామా.. యువకులతో మాటలు కలిపి.. -
శంషాబాద్ పరిధిలో మహిళ దారుణ హత్య
-
శంషాబాద్లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Hyderabad: మెట్రో రెండో దశ.. దూరమే!
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ కింద చేపట్టాలని భావించిన మూడు ప్రాజెక్టుల్లో ఒకటైన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు కేరిడార్ను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసింది. మిగతా రెండు ప్రాజెక్టులైన బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు పొడిగింపు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్గా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు అంత వేగంగా పడడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని కోరగా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వికాష్ కుమార్ ఈ మేరకు సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు తాము స్పందించామని, తదుపరి కార్యాచరణ లేదని స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమాధానమిస్తూ మెట్రో మంజూరుకు కీలకమైన డీపీఆర్లో మార్పులతో పాటు సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. వివరణ పంపని రాష్ట్రం డీపీఆర్ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చాలని సూచించడంతో పాటు 14 అంశాలపై వివరణ కోరారు. తాము కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అర్వింద్కుమార్కు గత డిసెంబర్ 1న లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ పంపలేదు. కేంద్రం అడిగిన కేబినెట్ తీర్మానం కాపీ, స్పెషల్ పర్పస్ వెహికిల్, నిధులు సమకూర్చే సంస్థను ఎంపిక చేయడం, రోడ్మ్యాప్ మొదలైనవాటిని ఫైనలైజ్ చేసి పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పంపలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో పనులపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. -
గుడ్న్యూస్! శంషాబాద్లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
శంషాబాద్ లో యువతి ఆత్మహత్య
-
మెట్రో.. మెట్రో: రాయదుర్గం టు శంషాబాద్.. ఏనోట విన్నా అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రూ.6,200 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రోతో సమయం, డబ్బు, ట్రాఫిక్ లేకుండా రాకపోకలు సాగించే వీలుండడంతో సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. కొన్ని రోజులుగా మధురానగర్, ప్రశాంత్హిల్స్ కాలనీ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్య కాలనీ, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ల్యాంకోహిల్స్, నానాక్రాంగూడ ప్రాంతాలలో మెట్రోపై అందరూ చర్చించుకుంటున్నారు. గచ్చిబౌలి డివిజన్ అనగానే ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఉన్నత విద్యా, శిక్షణ సంస్థలకు నిలయం. అలాంటి ప్రాంతానికి మెరుగైన రవాణా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మెట్రో రూటు ఇదే.. ►రాయదుర్గం సర్వే నంబర్–83కి చేరువలోనే ఉన్న రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు విస్తరిస్తారు. ►ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్కు కూడలి చేరువ నుంచి మధురానగర్, ఖాజాగూడ, నానక్రాం గూడ ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి పక్కనే ఉన్న సరీ్వస్ రోడ్డు ద్వారా నార్సింగి మీదుగా శంషాబాద్ వరకు మెట్రో రైలు నడపాలని భావిస్తున్నారు. ►ఈ మెట్రోతో గచి్చ»ౌలి, మధురానగర్, రాయదుర్గం, ప్రశాంత్హిల్స్, ఖాజాగూడ, సాయివైభవ్ కాలనీ, సాయిఐశ్వర్యకాలనీ, ల్యాంకోహిల్స్, నానక్రాంగూడ, పరిసరాల్లోని వారికి మేలు కలుగుతుంది. ►ఇటీవల ఈ ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు విరివిగా పెరగడం, ఇంకా పలు భవనాలు నిర్మాణంలో ఉండడంతో వీరంతా సంతోíÙస్తున్నారు. ►ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల లోని ఐటీ, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా మెట్రో రాకతో సొంత వాహనాలు పక్కనపెట్టి మెట్రోలోనే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతోనే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీరామారావు ప్రత్యేక చొరవతోనే గచ్చిబౌలి డివిజన్కు మెట్రో సౌకర్యం ఏర్పడే అవకాశం కలుగుతోంది. ఇప్పటికే లింకురోడ్లు, ఫ్లైఓవర్లతో చాలా వరకు తగ్గినా ఈ మెట్రోతో మా ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం మరింతగా చేరువ కానుండడంపై అందరిలోనూ సంతోషం వ్యక్తం అవుతోంది. –సాయిబాబా, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ రైలు సౌకర్యం వస్తుందని అనుకోలే.. మా మధురానగర్, ఖాజాగూడ, నానక్రాంగూడ, పరిసరాలకు మెట్రో సౌకర్యం కలుగుతుందనే భావన ఎంతో సంతోషానిస్తోంది. ఇటీవల అపార్ట్మెంట్లు విపరీతంగా వెలిశాయి. దీనికితోడు ఐటీ సంస్థలు, స్కూళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ట్రాఫిక్ రోజురోజుకూ పెరిగిపోతోంది. అది చాలా వరకు తగ్గుతుంది. – రమేష్గౌడ్,మధురానగర్ మెట్రో రావడం చాలా సంతోషం.. మెట్రోతో ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేకూరుతుంది. మియాపూర్, మాదాపూర్ వరకు వచి్చంది. మాకు కూడా వచి్చంటే బాగుండు అనుకున్నం. శంషాబాద్, నార్సింగి, గచ్చి»ౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలతోపాటు ఇతర చోట్లకు వెళ్ళేందుకు సమయం, డబ్బు ఆదాతోపాటు వేగంగా Ðð ళ్లేందుకు అవకాశం కలుగుతుంది. –పొన్నయ్య, ఖాజాగూడ -
హలో మేము సైబర్ క్రైమ్ పోలీసులం అంటూ..రూ.35 వేలు కాజేశారు!
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్గా పని చేస్తున్నాడు. గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్లో అప్లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
హైదరాబాద్ : మెట్రో రైల్ రెండవ దశకు ముహూర్తం ఖరారు
-
ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్టు విస్తరణలో భాగంగా నాలుగేళ్లుగా అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని వీఐపీ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెర్మినల్ భవనంలో కొనసాగించారు. గతంలో ఉన్న డిపార్చర్ కేంద్రానికి అనుసంధానంగా నిర్మించిన కొత్త భవనం ఇటీవల పూర్తయింది. దీంతో ప్రధాన టెర్మినల్లోనే కొత్త అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సీఈవో ప్రదీప్ ఫణీకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం సౌదీ ఎయిర్లైన్స్ విమానం తొలిసారిగా కొత్త టెర్మినల్ కేంద్రంగా బయల్దేరింది. ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం పురోగమిస్తోందని సీఈవో ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
మాయని మచ్చగా తొండుపల్లి ఘటన.. ఆ అమానుషానికి మూడేళ్లు
ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది.. నలుగురు కామాంధులు చేసిన వికృత చేష్టలకు సమాజం దిగ్బ్రాంతికి గురైంది. దిశ ఉదంతం.. పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్నగర్ శివారులో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికీ మూడేళ్లు పూర్తయింది. ఆమె మరణం.. మహిళా రక్షణ కొత్త చట్టాలకు దిశా నిర్దేశం చేసింది. మహిళల దశ మార్చే న్యాయసహాయకులకు, నిఖార్సైననిర్ణయాలకు రూపకల్పన చేసింది. అమానుషమైన నాటి ఘటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తు చేసుకుంటే.. – షాద్నగర్ 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయం.. దిశ అనే యువతి అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపింది. అక్కడి నుంచి పని మీద వెళ్లింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. అంతలోనే నలుగురు కామాంధులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని నిందితులు లారీలో తీసుకొచ్చి షాద్నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. అయితే 2019 డిసెంబర్ 6 తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్ధలానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి వారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయ్యింది. దిశ హత్య ఘటన జనాలను ఎంతగా కదిలించిందంటే ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ను ప్రతి ఒక్కరూ సమర్తిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు దిశ హత్య ఉదంతం కొత్త చట్టాలకు దిశానిర్దేశం చేసింది. ఆ తర్వాత ఎన్కౌంటర్కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను సుప్రీం కోర్టుకు అందజేశారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది. మారిన చట్టాలు దుర్మార్గుల చేతిలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయిన దిశ పేరిట కొత్త చట్టాలను ప్రభుత్వాలు తీసుకొచ్చారు. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్ధలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లను, పోలీసు వ్యవస్థను, ఏర్పాటు చేశారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలపై కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్లో సైతం వేగం పెంచారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అప్రమత్తత అవసరం సమాజంలో ఇంకా అక్కడక్కడా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న, కల్పిస్తున్న సదుపాయాలను యువతులు, మహిళలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Shamshabad: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు
శంషాబాద్: దశలవారీగా జరుగుతున్న రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్ నుంచే అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..) -
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
సర్కారీ జాగా.. వేశాడు పాగా.. నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత
సాక్షి, హైదరాబాద్: కంచె చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధే సర్కారు భూమిని కబ్జా చేశాడు. పట్టా భూమి కొనుగోలు చేసి..పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో పాగా వేశాడు. రూ.2 కోట్ల విలువైన ఈ భూమికి ఏకంగా ప్రహరీ కూడా ఏర్పాటు చేసి.. తన ఆధీనంలోకి తీసుకున్నాడు. పలుకుబడి కలిగిన ఆ ప్రజాప్రతినిధి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం తెలిసినా రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లేందుకు సాహసించడంలేదు. శంషాబాద్ మండలం పాల్మాకుల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 13లో 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 28 ఎకరాలను పేద రైతులకు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. అక్రమంగా నిర్మించిన ప్రహరీ నాలుగు ఎకరాలు మాత్రం ఖాళీగానే ఉంది. ఈ భూమిని ఆనుకుని పట్టా (సర్వేనం.28) భూములున్నాయి. ఈ భూమిలో కొంత మేర కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి కన్ను పక్కనే ఉన్న సర్కారు భూమిపై పడింది. పట్టా భూమి చుట్టూ ప్రహరీ నిర్మించిన ఆయన పనిలో పనిగా హద్దు రాళ్లను తొలగించి సర్కారు భూమిని కూడా తన ఖాతాలో కలిపేసుకున్నాడు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.రెండు కోట్లు ఉంది. ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో పెద్ద గుట్ట కూడా ఉంది. ఈ బండరాళ్లను పగలగొట్టి గ్రానైట్ రాళ్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్రమణలను అడ్డుకుంటాం ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేయగా మిగిలిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఆర్ఐని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతాం. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలితే..స్వా«దీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు నాటుతాం. ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, శంషాబాద్ నాడు రామోజీ.. నేడు అధికారపార్టీ నేత సర్వే నంబరు 13 సర్కారు భూముల పక్కనే మార్గదర్శి చిట్ఫండ్ యజమాని రామోజీరావు భూములు ఉన్నాయి. నాలుగు ఎకరాలను తన భూమిలో కలిపేసి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. 2011లో ‘సాక్షి’ ఈ భూ కబ్జాపై వరస కథనాలు ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జాను నిర్దారించారు. దీంతో ఆక్రమణదారులు అప్పట్లో ఈ నాలుగు ఎకరాలను వదిలేసి లోపలి వైపు కడీలు పాతారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ సర్కారు భూమిపై ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధి కన్నుపడింది. చదవండి: ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు -
Shamshabad: వాట్సాప్లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి..
సాక్షి, రంగారెడ్డి: వాట్సాప్లో అమ్మకానికి పెట్టిన గేదెలను కొనడానికి యత్నించిన ఓ రైతు సైబర్ నేరగాళ్లకు రూ.1,31,500 సమర్పించుకున్నాడు. పోలీసుల చెప్పిన వివరాల మేరకు... కవ్వగూడకు చెందిన రైతు బొద్దం శ్రీకాంత్ యాదవ్ వాట్సాప్ నంబరుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఈ నెల 6న హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి గేదెల ఫొటోలు పోస్టు చేసి, రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని వాటి ధర రూ.1,10,000గా చెప్పాడు. గేదెలు కొనేందుకు శ్రీకాంత్ ఆసక్తి చూపడంతో సదరు వ్యక్తి ముందుగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పాడు. అందుకు ఒప్పుకుని ఫోన్పే ద్వారా పలుసార్లు రూ.9వేలు పంపించాడు. గేదెలు పంపించడానికి బోర్డర్ చార్జీలు, జీఎస్టీ కలిపి అదనంగా రూ.11,500 అవుతుందని చెప్పగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. గేదెలు ఇంటికి పంపించిన తర్వాత రూ.లక్ష ఇవ్వవచ్చని, మిగిలిన మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని షరతు పెట్టారు. దీంతో ఈ నెల 10న గేదెలు పంపిస్తున్నట్లు చెప్పడంతో తన చిరునామా వివరాలు అందజేశాడు. ఇలా శ్రీకాంత్ను నమ్మించి పలుసార్లు మొత్తంగా రూ.1,31,500 వసూలు చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పెళ్లికి నిరాకరించిందని వివాహితపై హత్యాయత్నం
శంషాబాద్ రూరల్: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో వివాహితపై పెట్రోలు పోసి నిప్పంటించాడో వ్యక్తి. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తొండుపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలోని కిషన్గూడ వాసి బంటారం మహేశ్గౌడ్, మండలంలోని గండిగూడకు చెందిన సంధ్య(29) వివాహం 2012లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొండుపల్లిలో నివాసముంటున్నారు. మూడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడంతో పిల్లలతో కలిసి సంధ్య గండిగూడలోని పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో వీరింటి పక్కన నివాసముండే మహ్మద్ అల్తాఫ్తో పరిచయం ఏర్పడి ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత సంధ్య భర్త వద్దకు వెళ్లిపోయింది. పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. ఈ క్రమంలో తొండుపల్లిలో ఉంటున్న సంధ్యకు తరచూ అల్తాఫ్ ఫోన్ చేస్తూ వేదిస్తున్నాడు. తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని సంధ్య తన భర్తకు తెలిపింది. సంధ్య తన మాట వినడంలేదని కక్షగట్టిన అల్తాఫ్ ఆమెను ఎలాగైనా అంతం చేయాలని భావించాడు. ఇందుకోసం పథకం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం సంధ్య భర్త మహేశ్కు అల్తాఫ్ ఫోన్ చేశాడు. తాను తొండుపల్లి వద్ద వైన్షాపు దగ్గర ఉన్నానని, మాట్లాడుకుందాం.. అక్కడకు రావాలని చెప్పాడు. దీంతో మహేష్ ఇంటి నుంచి వైన్షాపు వద్దకు వెళ్లాడు. దీంతో సంధ్య ఇంట్లో ఒక్కతే ఉందని గుర్తించి అక్కడకు వెళ్లిన అల్తాఫ్.. తన వెంట బాటిల్లో తెచ్చుకున్న పెట్రోలును సంధ్యపై పోసి నిప్పటించాడు. దీంతో పాటు తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన సంధ్యను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అల్తాఫ్కు స్వల్పగాయాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడుపై నేర చరిత్ర.. వివాహితపై పెట్రోలు పోసి నిప్పటించిన అల్తాఫ్కు గతంలో కూడా నేర చరిత్ర ఉంది. మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట వలస వచ్చి గండిగూడలో స్థిరపడ్డారు. సుమారు 8 ఏళ్ల కిందట అల్తాఫ్ తండ్రి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అల్తాఫ్, తన అన్నతో కలిసి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత అల్తాఫ్ కుటుంబ గండిగూడ నుంచి ఘాంసిమియాగూడకు మకాం మార్చింది. చదవండి: ఘోర ప్రమాదం.. 11 మంది సజీవదహనం -
రాష్ట్రంలో ‘ష్నైడర్’ రెండో ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ పరికరాల తయారీ, ఆటోమేషన్ రంగంలో ఉన్న ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో మరో ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద 18 ఎకరాల్లో ఇది రానుంది. రూ. 300 కోట్ల వ్యయంతో చేపడుతున్న తొలి దశ 2023 సెప్టెంబర్కు సిద్ధం అవుతుంది. ఉత్పత్తుల తయారీకి స్మార్ట్ యంత్రాలు, ఉపకరణాలను ఉపయోగించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులను దేశంలో తొలిసారిగా శంషాబాద్ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించింది. 30కిపైగా దేశాలకు ఇక్కడ తయారైన సరుకు ఎగుమతి చేస్తారు. భారత్లో సంస్థకు ఇది 31వ కేంద్రం కాగా తెలంగాణలో రెండవది. స్మార్ట్ ఫ్యాక్టరీలపరంగా కంపెనీకి దేశంలో ఇది ఎనిమిదవది కానుంది. అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ.. భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయల్ లెనిన్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ష్నైడర్ ప్రతిపాదిత నూతన కేంద్రానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కొత్త ప్లాంటు మూడు దశలు పూర్తి అయితే 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. భారత్లో కంపెనీకి ఇది అతిపెద్ద, అత్యంత స్మార్ట్ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పారు. 75 శాతం ఉత్పత్తులు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయని వివరించారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను ఆయన కోరారు. టాప్–3లో భారత్.. ష్నైడర్కు ప్రపంచంలోని టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. సంస్థ కార్యకలాపాల్లో 10 శాతం వాటాను కైవసం చేసుకుంది. 77% ఉత్పత్తులు, సొల్యూషన్స్ భారత్లో అభివృద్ధి చేసినవేనని సంస్థ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ చౌదరి వెల్లడించారు. ‘భారత్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 90% దేశీయంగా తయారైనవి. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విద్యుత్ పరికరాలను ఇప్పటికే సరఫరా చేస్తున్నాం. చార్జింగ్ స్టేషన్లను సొంతంగా ఏర్పాటు చేస్తాం. శంషాబాద్ ఫెసిలిటీకి మూడు దశల్లో కలిపి 4–5 ఏళ్లలో రూ.900 కోట్ల దాకా పెట్టుబడి పెడతాం’ అని చౌదరి వివరించారు. భారత్లోనే అధికం.. ఇప్పటికే హైదరాబాద్లో ష్నైడర్కు తయారీ యూనిట్ ఉంది. ఈ ప్లాంటులో రెండు వేల మంది పనిచేస్తున్నా రు. శంషాబాద్ కేంద్రం రాకతో తొలిదశలో ప్రత్యక్షంగా వెయ్యిమందికి, పరోక్షంగా 8 వేలమందికి ఉపాధి అవ కాశాలు ఉంటాయని గ్లోబల్ సప్లై చైన్ ఎస్వీపీ జావెద్ అహ్మద్ తెలిపారు. భారత్లో సంస్థ ఉద్యోగుల సంఖ్య 35 వేలు. వారిలో 5,500 మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ష్నైడర్లో 1.60 లక్షల మంది పనిచేస్తుండగా భారత్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుండటం విశేషం. హైదరాబాద్లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ తెలంగాణ, ఫ్రాన్స్ నడుమ వాణిజ్య సంబంధాలు, రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ‘హౌస్ ఆఫ్ ఫ్రాన్స్’ పేరిట కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించడాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. 2023 అర్ధభాగంలో కొత్త ఫ్రెంచ్ బ్యూరో పనిచేయడం ప్రారంభిస్తుందని, ఇది వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా పనిచేయడంతోపాటు కాన్సులార్, వీసా సేవలను కూడా అందిస్తుందన్నారు. తద్వారా తెలంగాణ విద్యార్థులు, బిజినెస్ వర్గాలకు ఫ్రాన్స్తో సన్నిహిత సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ఫ్రెంచ్ బిజినెస్ మిషన్ బృందం గురువారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, పారిశ్రామిక విధానాలు, సాధించిన విజయాలు, పెట్టుబడి అవకాశాలపై కేటీఆర్ ఆ బృందానికి వివరించారు. ఈ భేటీలో ఫ్రెంచ్ బృందం ప్రతినిధులు పాల్ హెర్మెలిన్, గెరార్డ్ వోల్ఫ్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇ. విష్ణువర్దన్రెడ్డి పాల్గొన్నారు. -
జేపీ నడ్డాతో ముగిసిన హీరో నితిన్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్ పర్యటనను పూర్తి చేసుకున్న నడ్డా తిరిగి శంషాబాద్ నోవాటెల్ చేరుకొని హీరో నితిన్తో సమావేశమయ్యారు. వీరితోపాటు లక్ష్మణ్, రామచంద్రరావు ఉన్నారు. నితిన్తో సమావేశం అనంతరం బీజేపీ ముఖ్యలతో నడ్డా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక గతవారం హీరో జూనియర్ ఎన్టీఆర్తో అమిత్షా సమావేశమయ్యారు. చదవండి: అవన్నీ అబద్దాలని చెప్పే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? కిషన్ రెడ్డి ఫైర్ -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
శంషాబాద్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన శంషాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఆర్జీఐఏ సీఐ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక రాళ్లగూడ యాదవ్కాలనీలో పెద్దులు, దానమ్మ (25)దంపతులు నివాసం ఉంటున్నారు. దానమ్మ కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, పెద్దులు ఏ పని చేయకపోగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవపడుతుండేవాడు. బుధవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న పెద్దులు దానమ్మ మెడపై గొడ్డలితో నరకడంతో ఆమె కుప్పకూలింది. సమీపంలోనే ఉంటున్న సోదరులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే దానమ్మ మృతిచెందింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చర్మం ఒలిచినా దక్కని ఫలితం) -
కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ కుమార్తె తనియా మృతి
-
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతి
-
Hyderabad: ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శాతం రాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల కుమార్తె తనియా కక్డే దుర్మరణం చెందారు. ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. తనియా కక్డే శంషాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డుపై తన స్నేహితుడితో కలిసి I-20 కారులో వెళ్తుండగా డివైడర్ను ఢీకొట్టి ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె అక్కడికక్కడే మరణించిందని, కారులోని మిగిలిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆర్జీఐ ఎయిర్పోర్టు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: అప్రమత్తమైన తెలంగాణ సర్కారు.. ‘తొలిమెట్టు’తో పట్టు! -
శంషాబాద్ శాతంరాయి వద్ద ప్రమాదం
-
ఇదేం విడ్డూరం.. భార్య ఇంట్లోనే భర్త చోరీ !
సాక్షి, రంగారెడ్డి: భార్య నుంచి వేరుగా ఉంటున్న భర్త.. ఆమె ఇంట్లో లేని సమయంలో నగలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎ.శ్రీధర్కుమార్ కథనం ప్రకారం.. ఊట్పల్లిలో నివాసముంటున్న ఉపాధ్యాయురాలు రావుల అనురాధతో ఫరూక్నగర్ మండలం షాద్నగర్ వాసి తీగలపల్లి మధుసూదనాచారితో 17 ఏళ్ల కిందట పెళ్లైంది. సంతానం లేకపోవడంతో పాటు అనురాధకు అనారోగ్యం కారణంగా వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అనురాధ తన దత్తపుత్రుడు అనిరుధ్తో కలిసి ఊట్పల్లిలో ఉంటోంది. జూన్ ఒకటో తేదీన ఇంటికి తాళం వేసి అనిరుధ్తో కలిసి బీరమ్మగూడలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి జూన్ 7న ఇంటికి వచ్చి చూడగా.. ఇంటి తలుపు తాళం విరగొట్టి ఉంది. బీరువా కూడా తెరిచి ఉంది. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా.. జూన్ 4న అర్ధరాత్రి సమయంలో అనురాధ భర్త మధుసూదనాచారి ఇంటికి వచ్చాడని చెప్పారు. దీంతో భర్తే తన నగలు, నగదు తీసుకెళ్లి ఉంటాడని భావించి.. వాటిని తిరిగి ఇవ్వాలని కోరింది. ఎంతకూ అతడి నుంచి స్పందన లేకపోవడంతో గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓఆర్ఆర్పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నేత కుమారుడు దుర్మరణం
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ను హ్యుందాయ్ వెర్నా కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తాపడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మాజీ ఎంపీపీ కొడుకు చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా గుర్తించారు. దినేష్రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్లగొండలోనీ వీటి కాలనీలోని రేగట్టే స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించారు. మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ టీఆర్ఎస్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి పరామర్శించారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
సినిమా థియేటర్కు యువతులు.. ఓ వ్యక్తి ఫోటోలు తీసి అసభ్యకరంగా..
శంషాబాద్(హైదరాబాద్): మహిళలు, యువతులతో అసభ్యంగా వ్యవహరిస్తున్న మరో వ్యక్తిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఓ సినిమా థియోటర్లో సినిమా చూసేందుకు వచ్చిన యువతులు, మహిళలను గత కొంత కాలంగా ఓ వ్యక్తి (35) ఫొటోలు తీయడంతో పాటు అసభ్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం ఉదయం నిఘా వేసి అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అత్యాచారయత్నం కేసు.. గాయత్రి భర్త చెప్పిన షాకింగ్ విషయాలు.. -
కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: బ్యాంక్కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్లో.. -
రూ. 54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
శంషాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అనుమానిత దేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఆ మహిళ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్లని పాలిథీన్ కవర్తో ఉన్న ప్యాకేజిని తొలగించడంతో అందులో 6.75 కేజీల బరువు కలిగిన హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.54కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సదరు మహిళ కూడా క్యారియర్గా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలో అక్రమార్జన
సాక్షి హైదరాబాద్: ఆబ్కారీశాఖలో నకిలీ ఈవెంట్ పర్మిట్ల దందా చర్చనీయాంశంగా మారింది. వేడుకల సందర్భంగా మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్కు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంక్విట్ హాళ్లు వంటి చోట్ల నిర్వహించే వేడుకల సందర్భంగా మద్యం వినియోగం కోసం పెద్ద సంఖ్యలో నకిలీ అనుమతులను ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ఎక్సైజ్ శాఖ సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం వెనుక పైఅధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సీఐలతో పాటు మరో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అనుమతితోనే నకిలీ దందా కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖాతాలో చేరాల్సిన సొమ్మును స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా కేవలం సస్పెన్షన్కే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్తో పాటు నగర శివార్లలోని మరికొన్ని స్టేషన్ల పరిధిలోనూ ఇలాంటి నకిలీ పర్మిట్లు వందల సంఖ్యలో వెలువడ్డాయని, ఉన్నతస్థాయిలో విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖలో ఏళ్లుగా.. మరోవైపు తాజాగా నకిలీ అనుమతుల ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ 2016 అక్టోబర్ నుంచి ఇలాంటి అనుమతుల దందా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వేడుకలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తా రు. ఇలాంటి కార్యక్రమాలకు ఒకరోజు అనుమతికి రూ.8000 నుంచి రూ.9000 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రూ.30 వేలకుపైగా ఎక్సైజ్శాఖకు చలానాల రూపంలో చెల్లించి ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పైఅధికారుల అండతోనే కిందిస్థాయి సిబ్బంది అనుమతుల సమూనాపత్రాల్లో తేదీలు, వేడుక స్థలాలను మార్పు చేసి ఇస్తున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో నకిలీ అనుమతులు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఆదాయం కొందరు అధికారులు, సిబ్బంది జేబుల్లోకొ వెళ్తోంది. మరోవైపు ఈ తరహా అక్రమాలకు పాల్పడే సిబ్బంది ఎలాంటి బదిలీలు లేకుండా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి పని చేయడం గమనార్హం. ఏసీబీతో విచారణ జరిపించాలి.. ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో నకిలీ అనుమతులపై ఉద్యోగుల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు పరిమితం కాకుండా ఏసీబీ విచారణ జరిపించాలని, ఏ స్థాయి అధికారులైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి. (చదవండి: పడవతో గస్తీ.. లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
రాముడు నడయాడిన పవిత్ర భూమి..కోరిన కోర్కెలు తీర్చే కోదండ రామాలయం
-
ఇక నేరుగా అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ
శంషాబాద్: ఇతర మెట్రోనగరాలపై ఆధారపడ కుండా ఇక అంతర్జాతీయ కొరియర్ నిర్వహణ జీఎంఆర్ ఎయిర్ కార్గో చేయబోతోంది. దీని కోసం అంతర్జాతీయ కొరియర్ ఎక్స్ప్రెస్ కార్గో నూతన కేంద్రాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ బి.విశనాగకుమారి, ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ఫణీకర్, చీఫ్ ఇన్నో వేషన్ అధికారి ఎస్జికే కిశోర్లు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సదుపాయంతో కార్గో రవాణా లో హైదరాబాద్ దక్షిణ భారత దేశానికి గేట్వేగా మారనుందని వారు చెప్పారు. కార్గో రంగంలో ఇదో కొత్త అధ్యాయమని, హైదరాబాద్ ఎయిర్ కార్గో తన పరిధి ఏటా విస్తరిస్తోందని తెలిపారు. కార్గో ఇటీవల సంచార శీతలీకరణ కూడాప్రారంభించిందని చెప్పారు. -
సాక్షి ఎఫెక్ట్: హెచ్ఎండీఏ భూముల పరిశీలన
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ స్థానిక అధికారుల తీరుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు శుక్రవారం ఆరా తీసినట్లు సమాచారం. ప్రైవేట్ వెంచరు పరిధిలోకి వెళ్లిన భూమి వివరాలను పూర్తిగా నివేదించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. పట్టణంలోని సర్వేనంబరు 626/1 ఉన్న హెచ్ఎండీఏకు 360 ఎకరాల భూమి ఉండగా అందులో పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్లో 5.15 ఎకరాల భూమి, రైతుల ఆధీనంలో మరో 6.29 ఎకరాల భూమి ఉన్నట్లు తాజాగా రెవిన్యూశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’ ‘ఆ స్థలం సర్కారుదే’ అన్న శీర్షికతో వచ్చిన కథనం అటు అధికార వర్గాల్లో.. ఇటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పరిశీలించిన అధికారులు మున్సిపల్, రెవిన్యూ అధికారులు మరో మారు హెచ్ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. హెచ్ఎండీఏ స్థలంలో ఉన్న రహదారితో పాటు ఓ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ, మరో వ్యక్తి ఇంటికి సంబంధించి ఓ పిల్లర్తో పాటు ఓ గది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులకు వివరించారు. త్వరలో హెచ్ఎండీఏ అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ లేదా ఎదైనా ఇతర సరిహద్దులను ఏర్పాటు చేసి విలువైన స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!) -
ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే హెచ్ఎండీఏ భూ కబ్జా గుట్టు రట్టయింది. ఆరోపణలు, ఫిర్యాదులు వాస్తవమేనని సర్వే తేల్చిచెప్పింది. శంషాబాద్ పట్టణం నడిబొడ్డున చేసిన అక్రమ వెంచర్లో 5.15 ఎకరాల హెచ్ఎండీఏ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. దాదాపు రూ.50 కోట్ల పైచిలుకు విలువ చేసే ఈ భూమి అన్యాక్రాంతంపై హెచ్ఎండీఏ నిండా నిర్లక్ష్యం వహించినా స్థానికులు పోరు చేసి వాస్తవాలను బయటికి రప్పించారు. అసలేం జరిగింది? ► శంషాబాద్ పట్టణంలోని సర్వేనంబరు 626బై1 హెచ్ఎండీఏకు సంబంధించి 360 ఎకరాల భూమి ఉంది. ఓఆర్ఆర్ నిర్వాసితులతో పాటు విమానాశ్రయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించడంతో పాటు ఖాళీ స్థలాలున్నాయి. దీని పక్కనే ఆరేళ్ల క్రితం సర్వేనంబరు 551 నుంచి 600 వరకు సర్వే ఉన్న భూమిలో భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే హెచ్ఎండీఏకు సంబంధించిన సర్వే నంబరు 626బై1ని ఆనుకుని ఉంది. ► ఇది పూర్తిగా గుట్ట ప్రాంతంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉండేవి. కార్పొరేట్ స్థాయి వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానిక నేతలే ఇందులో భారీగా క్రయ విక్రయాలు దగ్గరుండి మరీ చూసుకున్నారు. క్రమంగా అభివృద్ధి చేసిన వెంచర్లో పురాతన దేవాలయాలను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న హెచ్ఎండీఏ 5.15 ఎకరాల భూమిని కూడా అందులో కలిపేసుకున్నారు. ► ఈ స్థలంలో రహదారులు వేసి అభివృద్ధి కూడా చేశారు. ఇందులో అధికార పార్టీ నేతల నుంచి కొందరు హెచ్ఎండీఏ మాజీ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇదే సర్వేనంబరు హెచ్ఎండీఏకు సంబంధించిన మరో 6.29 ఎక రాల భూమిలో రైతులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే ఉంది. (క్లిక్: దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) నిండా నిర్లక్ష్యం ► పునరావాసం కింద కేటాయించిన స్థలాలతో పాటు హెచ్ఎండీఏ మిగులు స్థలాలపై ఆది నుంచీ నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇదే అదనుగా ఇప్పటికే కొందరు నకిలీ దస్తావేజులతో ఒకే ప్లాటు నలుగురైదుగురికి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆర్డీఓ జారీ చేసినట్లు నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆర్డీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అక్రమార్కులను కటకటాల్లోకి పంపారు. ► ఇటీవల హెచ్ఎండీఏ భూమి కబ్జాపై స్థానికులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిసెంబరు 29 రెవిన్యూ అధికారులు సర్వే పనులు షురూ చేశారు. రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసి అధికారులకు నివేదిక అందించారు. కబ్జా జరిగింది వాస్తవమేనని తేల్చారు. త్వరలోనే సంబంధిత భూమిని స్వాధీనం చేసుకునేందుకు హెచ్ఎండీఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) కబ్జా వాస్తవమే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని సర్వేనంబరు 626బై1 ఉన్న హెచ్ఎండీఏకు సంబంధించిన 360 ఎకరాలతో పాటు సమీపంలో ఉన్న స్థలాను సర్వే పూర్తి చేశాం. హెచ్ఎండీకు సంబంధించిన 5.15 ఎకరాల భూమి వెంచర్లో కలిసినట్లు తేలింది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలకు సూచించాం. సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశాం. – జనార్దన్రావు, శంషాబాద్ తహసీల్దార్ -
కల్యాణం.. కమనీయం
శంషాబాద్ రూరల్: భక్త జన సందోహం, వేద మంత్రాల మధ్య శ్రీరామనగరం సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 108 దివ్య క్షేత్రాల్లోని పెరుమాళ్లకు శాంతి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కల్యాణోత్సవం నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులతో 108 పెరుమాళ్ల నామస్మరణం చేయించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 60 కౌంటర్ల ద్వారా భక్తులకు అక్షింతలు, ప్రసాదా లు పంపిణీ చేశారు. మైహోం గ్రూపు సంస్థల అధినేతలు జూపల్లి రామేశ్వర్రావు, జూపల్లి జగపతిరావు కుటుంబసభ్యులు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా సందర్శకులు వారాంతం కావడంతో సమతామూర్తి దర్శనానికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. అయితే సాయంత్రం శాంతి కల్యాణోత్సవం ఉండడంతో వారిని లోపలికి అనుమతించలేదు. ఇక స్ఫూర్తి కేంద్రం ప్రధాన ప్రాంగణంలోనికి అతి కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. పశ్చిమ వైపు ఉన్న 9వ నంబరు గేటు నుంచి ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే లోపలికి వదిలారు. కాగా ప్రధాన ప్రాంగణం ఎదురుగా ఉన్న ఆవరణలో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడంతో అక్కడ సుమారు పది వేల మంది వరకు కూర్చుని స్క్రీన్లపై కల్యాణోత్సవాన్ని వీక్షించారు. కల్యాణోత్సవానికి సుమారు 15 వేల మంది హాజరైనట్లు అంచనా వేశారు. -
భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్న సందర్భంగా ఎస్పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్పీజీ డీఐజీ నవనీత్కుమార్ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను పూర్తి స్తాయిలో సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పనిచేయనుంది. ఎస్పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు. ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో పూజా కార్యక్రమాల్లో దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను తీసుకొచ్చారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సమరోత్సాహ భక్తి ‘స్వీయ చిత్రం’ సమతామూర్తి సమారోహ వేదికలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి వచ్చిన మహిళలు వీరు.. యాగశాల వద్ద నరసింహస్వామి అవతారంలో ఓ వ్యక్తి తిరుగుతుండడంతో కొందరు వలంటీర్లు ఆయనకు దండం పెడుతుండగా.. మరికొందరు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (క్లిక్: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి) యాగశాలకు చేరుకున్న ఛత్రీలు.. యాగశాల వద్దకు బుధవారం కూడా వరుసగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఛత్రీలు చేరుకున్నాయి.. వాటిని తయారు చేసిన కార్మికులు కొందరు యాగశాల వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. (చదవండి: వెయ్యేళ్ల సమతాస్ఫూర్తి.. రామానుజ సమతా కేంద్రం నిర్మాణం..) టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహ్లో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర సమతా కేంద్రంలో బుధవారం ఉదయం తొలిరోజు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ చంద్ర, జై హనుమాన్ నినాదాలతో వేలాది మంది భక్తులు, పండితులు పాల్గొన్న ఈ యాత్ర కనుల పండుగగా సాగింది. ఈ యాత్రకు త్రిదండి చిన జీయర్స్వామి సారథ్యం వహించారు. వందలాదిగా రుత్వికులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఏడుగురు పూజ్య జీయర్లను అనుసరించారు. భక్తుల భజనలకు తోడుగా కోలాట నృత్యాలు ఆహ్లాదపరిచాయి. అనంతరం వాస్తు పూజ, పుణ్యహవచనం జరిగాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సర్వమానవ సమానత్వానికే..
సాక్షి, హైదరాబాద్: రామానుజాచార్య సర్వ మానవ సమానత్వం కోసం కృషి చేశారని, జాతి, కుల, మత, లింగ వివక్షలు కూడదని బోధించారని అందుకే దీనిని సమతా పండుగ (ఫెస్టివల్ ఆఫ్ ఈక్వాలిటీ)గా పిలుస్తున్నామని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విశ్వమంతా ఒకే కుటుంబం అనే భావనను, వసుదైవ కుటుంబం స్ఫూర్తిని అందించేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. శంషాబాద్లోని ముంచింతల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సహస్రాబ్ది సమారోహం సంరంభం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాలకు చినజీయర్ స్వామి సారథ్యం వహించారు. తాము తలపెట్టిన మహా యజ్ఞం నుంచి వెలువడే పొగ, పరిమళాల వల్ల మానవాళి ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. ఈ మహా క్రతువులో వేలాది మంది పాల్గొంటుండడం ఆనందంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక పారవశ్యంలో భక్తులు తొలుత రామానుజాచార్యుల శోభాయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం ప్రపంచంలోనే మున్నెన్నడూ జరగనంత భారీ స్థాయిలో లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో 5 వేల మంది రుత్వికులు, 1,035 హోమ కుండాలు, 144 హోమశాలలు, 2 ఇష్టి శాలలు ఈ మహా క్రతువులో భాగం అయ్యాయి. యాగానికి సిద్ధం చేయడంలో భాగంగా భూమి శుద్ధి చేసి విష్వక్సేనుడి పూజ చేశారు. అలాగే హోమద్రవ్యాల శుద్ధి, వాస్తు శాంతిలో భాగంగా వాస్తు పురుషుడిని ప్రతిష్టించి పూజ నిర్వహించారు. యాగశాలల్లో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తూ, మంత్రరాజంగా పేరొందిన అష్టాక్షరి మహా మంత్రాన్ని పఠిస్తూ, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు పారాయణం చేస్తూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులలో ఆధ్యాత్మిక పారవశ్యాన్ని నింపారు. అష్టాక్షరి మహామంత్ర జపం 12 రోజుల పాటు నిర్విరామంగా సాగనుంది. ఉత్సవాలు ముగిసే సమయానికి మొత్తంగా కోటిసార్లు జపించాలనే భారీ లక్ష్యాన్ని చేరుకోనుంది. తరలివచ్చిన స్వాములు, విదేశీ భక్తులు, ప్రముఖులు ఈ సమతా పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు, రుతి్వకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అహోబిల జీయర్స్వామి, దేవనాథ జీయర్ స్వామి, రామచంద్ర జీయర్ స్వామి, రంగ రామానుజ జీయర్ స్వామి, అష్టాక్షరి జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి తదితర అతిరథ మహారథులనదగ్గ స్వాములు తరలివచ్చారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఏపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వందలాదిగా భక్తులు, 20 మంది రుత్వికులు రావడం విశేషం. యూరప్ నుంచి, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న నగర యువత సైతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సెలవు పెట్టి మరీ వాలంటీర్లుగా ఇక్కడ సేవలు అందిస్తుండడం విశేషం. -
Statue Of Equality: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహానికి అంకురార్పణ జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులను సమతామూర్తి ఆశీనులైన భద్రవేదికకు చేరుకునే ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన 108 మెట్లలో మొదటి మెట్టు వరకు అనుమతించనున్నారు. అటు నుంచి యాగశాలకు ఆనుకుని ఉన్న ప్రవచన మండపానికి అనుమతించనున్నారు. ఇక్కడి నుంచే యాగశాలను దర్శించుకునేందుకు సందర్శకులకు అవకాశం కల్పిస్తారు. భద్రవేదికపై ఆశీనులైన 216 అడుగుల ఎత్తైన భగవద్రామానుజాచార్యుల విగ్రహాన్ని ఈ నెల 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి మూడో అంతస్తుపై ఉన్న ప్రధాన విగ్రహం వరకు సందర్శకులను అనుమతించనున్నారు. భద్రవేదిక మొదటి అంతస్తులో ఉన్న 120 కేజీల సువర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 13న తొలి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి 54 అంగుళాలు ఉన్న సువర్ణమయ నిత్య ఉత్సవమూర్తిని వీక్షించేందుకు సందర్శకులకు అనుమతించనున్నారు. అప్పటి వరకు వీరంతా బయటి నుంచే వీక్షించి వెళ్లాల్సి ఉంది. అంతేకాదు ఈ ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాల్లో ప్రతిష్టించిన దేవతామూర్తుల విగ్రహాల వీక్షణ, ఆరాధనకు కూడా ఆ తర్వాతే అనుమతించనున్నారు. అప్పటి వరకు ఆయా ఉత్సవమూర్తులను బయటి నుంచే సందర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ శ్రీరామానుజాచార్యల విగ్రహావిష్కరణకు ఈ నెల 5న ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం శ్రీరామనగరాన్ని సందర్శించారు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఆయా విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఉదయం ఆయన కేంద్ర భద్రతా బలగాలతో సమావేశం కానున్నారు. ప్రారంభానికి ముందే అవస్థలు ఇదిలా ఉంటే ఉత్సవాల ప్రారంభానికి ముందే రుత్వీకులు, వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంగణానికి 15 వేల మందికిపైగా చేరుకోగా, పూజా కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గ్రేటర్ జిల్లాల నుంచి రోజుకు సగటున 50 వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వాలంటీర్లు, రుత్వీకులు, ప్రభుత్వ ఉద్యోగులను అంచనా వేయడంలో నిర్వాహకులు ఇప్పటికే కొంత విఫలమయ్యా రు. ఆయా నిష్పత్తి మేరకు అన్నప్రసాదాలను తయారు చేసినా వారికి అందజేయక పోవడంతో ఇక్కడికి వచ్చిన వారికి పస్తులు తప్పడం లేదు. భారీ స్వాగత తోరణాలు వేడుకలకు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు ఆయా మార్గాల్లో భారీ కటౌట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాలను సర్వంగసుందరంగా తీర్చిదిద్దా రు. అన్ని మార్గాల్లోనూ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) -
ముచ్చింతల్: శ్రీరామనగరానికి సిటీ బస్సులు
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లో శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలకు శ్రీరామనగరం తరలివెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకొని బస్సులను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ముచ్చింతల్కు రాకపోకలు సాగించేలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అన్ని రూట్లలో ఉదయం 6, 7, 8 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) బస్సుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులను ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేసేందుకు ముచ్చింతల్లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ మేరకు ప్రతి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. పోలీసుల ఆధీనంలో ప్రధాన మార్గాలు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్షించారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో సమావేశయ్యారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? విధులు నిర్వహించనున్నారు? తదితర అంశాలపై సమీక్షించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గం సహా బెంగళూరు జాతీయ రహదారి మార్గాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ఎక్కడిక్కడ భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. (చదవండి: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు) -
Statue Of Equality: 7500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ముచ్చింతల్ ఆశ్రమంలో సమతా మూర్తి సమారోహం వేడుకలకు 7500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎనిమిది విభాగాలుగా పోలీసులకు బాధ్యతలు కేటాయించారు. రెండు సెక్టార్లుగా ట్రాఫిక్ క్లియరెన్స్కు 1200 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. సమతామూర్తి ప్రాంగణంలో.. సమతామూర్తి విగ్రహ ప్రాంగణంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో నలుగురు ఏసీపీల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో పన్నెండు మంది సీఐలు, 58 ఎస్సైలు, 218 మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసులు 134, ఇతర 20 మంది ఉంటారు. యాగశాల వద్ద.. యాగశాల వద్ద 1682 మంది పోలీసులతో బందోబస్తుకు కేటాయించారు. ఇందులో డీసీపీలు, నలుగురు అదనపు డీసీపీలు, 12 మంది ఏసీపీలు, 57 మంది ఇన్స్పెక్టర్లు, 155 మంది ఎస్సైలు, 1214 మంది కానిస్టేబుళ్లు, 240 అదనపు పోలీసులను కేటాయించారు. (చదవండి: సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు) ప్రవచన మండపం వద్ద.. ప్రవచన మండపం వద్ద 157 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఓ డీసీపీ అధికారితో పాటు ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 28 మంది ఎస్సైలు, 88 కానిస్టేబుళ్లు, 36 మంది ప్రత్యేక పోలీసులు ఉంటారు. భోజన శాల వద్ద.. భోజన శాల వద్ద ఓ డీసీపీ స్థాయి అధికారితోపాటు నలుగురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు, 8మంది ఇన్స్పెక్టర్లు, 24 మంది ఎస్సైలు, 124 మంది కానిస్టేబుళ్లు, 120 ప్రత్యేక పోలీసులను కేటాయించారు. రూట్ల వారిగా.. ఆశ్రయానికి వచ్చిపోయే రహదారులను 17 రూట్లుగా విభజించారు. ఆయా రూట్లలో 1200 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు. ట్రాఫిక్ పర్యవేక్షణ ఇలా.. వీవీఐపీలు, వీఐపీలు, కీలక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్రమోదీ తదితరులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సెక్టార్ల వారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సహస్రాబ్ది ఉత్సవాలకు మాధవ సేవకులు రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో సేవలందించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో సేవకులు తరలివచ్చారు. శ్రీరామనగరంలో బుధవారం నుంచి ఈ నెల 14 వరకు జరుగనున్న ఉత్సవాల్లో సేవలు అందించేందుకు సుమారు 8 వేల మంది సేవకులు తరలివచ్చారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో సేవకులకు బాధ్యతలు అప్పగించారు. యాగశాల, భోజనశాల, రవాణా, పూజా, వైద్య, తదితర 18 రకాల సేవా విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. రుత్వికుల సందడి.. ఇక్కడ యాగ శాలలో నిర్వహించే హోమాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి రుత్వికులు ఇక్కడికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత హోమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. (చదవండి: అసమానత వైరస్.. సమతే వ్యాక్సిన్) -
Statue Of Equality: రామానుజ సమతా కేంద్రం నిర్మాణం... రామానుజులవారి జీవిత విశేషాలు
భగవద్రామానుజులవారు భూమిపై అవతరించి ఇప్పటికి వెయ్యేళ్ళు దాటింది. సమాజంలో అసమానతలు తలెత్తి ఎవరికి వారు వేరు వేరంటూ కొందరిని దూరం పెడుతూ... భగవంతుని చేరే మార్గం కొందరి దగ్గరే ఉంచుకుని.. వేరెవరికీ ఇది తెలియ రాదనే కట్టుబాట్లు చాలా కఠినంగా అమలవుతున్న ఆ కాలంలో.. మిగిలినవారంతా భగవంతుని చేరుకోవడానికి నేనొక్కడినీ నరకానికి పోయినా పర్లేదని అప్పటి కట్టుబాట్లను దాటి మానవులందరిని భగవంతుని వద్దకు చేర్చే అష్టాక్షరీ మహామంత్రాన్ని బహిరంగంగా గోపురమెక్కి అందరికీ చెప్పిన భగవదవతారం శ్రీమద్రామానుజులు. నాటి వారి స్ఫూర్తిని నేటికీ నిలుపుతూ వారు పంచిన సమతను మరోసారి ప్రపంచానికి తెలియజేయాలనీ.. మానవులందరూ వారి బోధనలను తెలుసుకోవాలనీ... ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని.. మరో వెయ్యేళ్ళు రామానుజులవారిని మనమంతా గుర్తుంచుకోవాలని రామానుజ సహస్రాబ్ది సందర్భంగా వెలసినదే సమతా కేంద్రం. ఈ సందర్భంగా హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో రామానుజ సమతా కేంద్రం నిర్మాణ విశేషాలు.. రామానుజులవారి జీవిత విశేషాలు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది. నేటినుంచి ‘రామానుజ సహస్రాబ్ది సమారోహం’ ప్రారంభం కానుంది. పన్నెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి, దేశప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలైన పాలకవర్గం, మరోవైపు ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన అనేకమంది పీఠాధిపతులు.. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. విహంగ వీక్షణ దివ్యవిమానశిఖరాలు.. ఎత్తైన గోపురాలు.. గొప్ప శిల్పకళాశోభితమైన మండపాలు... అనేక ప్రాచీన శిల్పశైలీసంపన్నమైన స్వాగతతోరణాలు.. రామానుజ ఆచార్యాభిషేకం చేసే లీలాజలనీరాజనం (వాటర్ ఫౌంటెన్)... పచ్చటి ఉద్యానవనాలు... సర్వతోభద్ర మండలాకృతిలో రూపొందించిన 108 దివ్యదేశ దేవాలయాలు...ఆచార్య పురుషుని చేరుకునే ఉజ్జీవన సోపానమార్గం... ఆపై భద్రవేదిపై. పద్మాసనంపై ఆసీనులై ప్రసన్న మందస్మిత వదనంతో దర్శనమిచ్చే భగవద్రామానుజులవారి దివ్య విగ్రహం దర్శించినవారి మనస్సు ఆనందంతో ఉప్పొంగక మానదు. ప్రవేశద్వారం ఉన్నతమైన రామానుజులవారి విగ్రహాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు ముందుగా ప్రవేశద్వారం వద్ద ఉన్న శిల్పకళను చూసి అచ్చెరువొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రవేశద్వారం నుండి నిష్క్రమణ ద్వారం వరకు ఉన్న శిల్పకళను పరిశీలనగా చూడాలంటే రెండు కళ్లూ సరిపోవు. వాటి విశేషాలను తెలుసుకోవడానికి ఒకరోజు చాలదు. ఇందులో భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవమంతా కొలువుతీరింది. ఒకవైపు ప్రవేశద్వారం.. మరోవైపు నిష్క్రమణద్వారం.. వీటి మధ్యలో ఉన్న అనేక మండపాలు.. స్వాగతతోరణాలు.. మొదలైనవాటి గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. విజయనగరనిర్మాణమైన రాతిరథాన్ని గుర్తుకు తెచ్చే రెండు శిలానిర్మిత రథాలను రెండు ఏనుగులు లాగుతున్న దృశ్యం.. వైష్ణవసంప్రదాయంలో భక్తికి ప్రతీకలుగా నిలిచిన గరుడ, హనుమ విగ్రహాలు ఇరువైపులా ఎత్తైన మండపాల్లో కొలువుతీరాయి. హంసద్వారం.. యాళిద్వారం... వాటిపై కాకతీయ స్వాగతతోరణాలను నిర్మించిన తీరు ఈ నేలపై పరిఢవిల్లిన ఒకప్పటి సామ్రాజ్య వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. దక్షిణాది, ఉత్తరాది శిల్పౖ శెలులను గుర్తుకు తెచ్చే అనేక విమానశిఖరాలు.. ఆలయగోపురాలు ఇక్కడ కనిపిస్తాయి. ఒక్కసారి ఆమూలాగ్రం ఈ వరుసను పరికిస్తే భారతీయ ప్రాచీన శిల్పకళా వైభవం కళ్లముందు నిలుస్తుంది. భూమిపై ధర్మానికి ఆపద కలిగినప్పుడు దుష్టశిక్షణ.. శిష్టరక్షణకు చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. రామానుజులవారు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం నాడు సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన ఆర్ద్రానక్షత్రంలో రామానుజాచార్యుడు జన్మించాడు. ఆయన తండ్రిపేరు ఆసూరి కేశవ సోమయాజి, తల్లిపేరు కాంతిమతి. సమతామార్గం భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. అందరూ మోక్షం పొందడానికి అర్హులే అని చాటి చెప్పిన మహనీయుడు శ్రీమద్రామానుజులు. అందుకే ఆయన దేవుని దరిచేర్చే అష్టాక్షరీమహామంత్రాన్ని అందరికీ వినిపించేలా చెప్పారు. అందరూ సమానమేనని చాటారు. ప్రతి మానవునిలో మాధవుడు కొలువు దీరాడని నిరూపించారు. ఆచార్యుల ఆశయ వారసుడు వైష్ణవ సంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ముఖ్యమైనవారుగా పరిగణింపబడుతున్నారు. వీరిలాగే అనేకమంది గురువులు విష్ణుభక్తిని సమాజంలో నెలకొల్పడానికి పాటుపడ్డారు. ఆ కోవలో యామునాచార్యులు ముఖ్యమైన గురుస్థానాన్ని పొందారు. 1042 లో వారు పరమపదించారనే వార్త తెలుసుకొని, వారు వారి జీవితకాలం లో చేయాలనుకుని కలగన్న మూడు కోర్కెలను తీరుస్తానని రామానుజులవారు ప్రతినబూని వాటిని నెరవేర్చారు. యామునాచార్యులవారి వారసత్వాన్ని నిలబెట్టారు. గురువుకే గురువు శ్రీరామానుజాచార్యులవారు పదహారు సంవత్సరాల వరకు శ్రీపెరంబుదూరులోను, ఆ తర్వాత ఎనిమిదేళ్లపాటు తిరుప్పుట్కుళిలోను, పదేళ్లపాటు కంచిలోను వేదాంత విద్యను అధ్యయనం చేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే అమేయ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. యాదవప్రకాశులనే వేదాంతగురువు పాఠం చెప్తూ విష్ణునేత్రాలను వర్ణిస్తూ వాటికి వింత పోలికలను పోలుస్తూ విచిత్ర ఉపమానాలిస్తున్నప్పుడు రామానుజులవారు అది తప్పని చెబుతూ ‘సూర్యుని రాకతో విచ్చుకున్న తామరల్లా విష్ణునేత్రాలు ఒప్పుతున్నాయి’ అనే శంకరుల భాష్యాన్ని ఉదహరిస్తూ సరైన అర్థాన్ని చెప్పారు. ఇలాంటి సందర్భాలెన్నో. అంతా బ్రహ్మమా? బ్రహ్మమే అంతానా? సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషద్వాక్యానికి జగత్తులో ఉన్నదంతా బ్రహ్మపదార్థమే కాని, వేరుకాదు అని అంతవరకూ పండితులు చెప్పిన విశ్లేషణను వ్యతిరేకిస్తూ.. జగత్తులోని అంశలన్నీ భగవంతుని శరీరాలు. అన్నింటిలోనూ భగవంతుని తత్త్వం ప్రకాశిస్తుంటుంది. అంతేకానీ అంశకు, భగవంతునికీ భేదంలేదని చెప్పడం సరికాదన్నారు. బ్రహ్మ అనంతుడంటే సరిపోతుంది కాని, అనంతమే బ్రహ్మ అవుతుందా? అనంతం అంటే అంతం లేనిది అని అర్థం. అంటే అది ఒక గుణాన్ని సూచిస్తుంది కానీ, భగవంతునికి పర్యాయపదం కాదు. సత్య, జ్ఞాన, అనంతాలు భగవంతుని సహజగుణాలు. అటువంటి పరమాత్మని కేవలం సత్యంగాని, జ్ఞానంగాని, అనంతంగాని పరిపూర్ణంగా చిత్రించలేవు కదా! నలుగురి మంచికోసం నరకానికైనా... కాంచీపురంలోనే పెరియనంబి నుండి దివ్యప్రబంధాన్ని, శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలను, వర రంగాచార్యుల నుండి వైష్ణవ దివ్యప్రబంధాలను అధ్యయనం చేశారు. గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు. ఈ మంత్ర రహస్యాన్ని విన్నవారంతా మోక్షం పొందుతారని గురువులు చెప్పిన ఫలశ్రుతిని గ్రహించారు రామానుజులు. ప్రయాస లేకుండా ప్రజలందరికీ మోక్షం కలిగించాలని ఒకనాడు గుడిగోపురమెక్కి అందరూ వినేలా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అది విన్న గోష్ఠీపూర్ణులవారు. ‘అనర్హులకు ఈ మంత్ర రహస్యాన్ని వివరిస్తే పాపం పొంది నువ్వు నరకానికి పోతావు!’ అని చెప్తే ‘అంతమందికి మేలు జరుగుతున్నప్పుడు నేనొక్కడినే నరకానికి వెళ్లినా పర్వాలేదు’ అని అన్నారు రామానుజులు. వారి గొప్ప మనస్సుకు గోష్ఠీపూర్ణులు ఎంతగానో మెచ్చుకుని. ‘నువ్వు నాకంటే గొప్పవాడివయ్యా!’ అని రామానుజలవారిని గౌరవించారు. రామానుజుల రచనలు – విశిష్ఠ కృతులు రామానుజులవారు శ్రీభాష్యమనే పేరుతో ప్రస్థానత్రయానికి భాష్యం రచించారు. వారు రచించిన శరణాగతి గద్యని ప్రతి నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. శరణాగతిగద్య, శ్రీరంగగద్య, శ్రీవైకుంఠగద్య అనే మూడింటినీ గద్యత్రయం అంటారు. శ్రీవైష్ణవాలయాలలో పాంచరాత్రాగమోక్తంగా విశిష్ఠసేవలను, కైంకర్యాలను అందించేందుకు, శ్రీవైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ద్రవిడవేదం పట్ల అందరూ గౌరవ, ప్రపత్తులతో మెలిగేటట్లు విశిష్టాద్వైత వ్యాప్తి చేశారు. దేవుడు – జీవుడు రెండుగా లేరు. ఇద్దరూ ఒకటే అంటూ చెప్పేదే అద్వైతం (రెండుగా లేనిది). విశిష్టాద్వైతం అంటే ప్రకృతిని ఉపాయంగా చేసుకొని ఒక్కటిగా ఉండటం. ఈ మార్గాన్ని శ్రీరామానుజాచార్యులవారు బోధించారు. ఎవరైనా శరణాగతిమార్గం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని, ఆయనతో కలిసి ఒకటి గా ఉండవచ్చని తెలిపారు. అర్చామూర్తిని కొలిచి అర్చామూర్తిగా నిలిచి.. ఎందరో మహాత్ములు తమ చరమాంకంలో భగవంతునిలో లీనమైపోయారు. మరికొందరు సజీవసమాధి పొందారు. ఇంకొందరు దివ్యవిమానంలో ఆకాశమార్గాన దివ్యలోకాలు పొందారు. మరికొందరు దేవతా విగ్రహాలలో లీనమైపోయారు. అయితే తమ జీవితపర్యంతమూ అర్చామూర్తుల అర్చనాది కైంకర్యాలను, ఆలయసేవలను ఏమాత్రం లోటు లేకుండా ఆలయాలలో జీయర్ వ్యవస్థను బలోపేతం చేసి, అర్చామూర్తి ఆరాధనతో అందరూ పరమపదం చేరవచ్చని చాటిన భగవత్ రామానుజులవారు 1137 పింగళ నామ సంవత్సరం మాఘ శుద్ధ దశమినాడు పరమపదించి తన దేహాన్నే విగ్రహంగా మలచుకున్నారు. దానికి సాక్ష్యంగా నేటికీ ఆ విగ్రహం ‘తానాన తిరుమేని’ గా శ్రీరంగంలోని వసంతమంటపంలో దర్శనమిస్తుంది. లీలాజల నీరాజనం (డైనమిక్ ఫౌంటెయిన్) ప్రవేశద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే ఎదురుగా ఒక వాటర్ ఫౌంటెయిన్ కనిపిస్తుంది. ఇది ఒక విశేషమైన నిర్మాణం. దీని చుట్టూ అష్టదళాకృతిలో నీటిని చిమ్ముతూ రెండు వరుసలలో తొట్లు ఉన్నాయి. దానికి మధ్యలో కింద వరుసలో సింహాలు, వాటిపై ఏనుగులు, దానిపై హంసలు ఉంటాయి. వాటిపై అష్టదళపద్మం లోపల రామానుజుల వారి విగ్రహం ఉంటుంది. సింహాలు తామసగుణానికి, ఏనుగులు రాజసగుణానికి, హంసలు సాత్విక గుణానికి ప్రతీకలుగా వాటిపై త్రిగుణాతీతుడైన భగవద్రామానుజులవారు పద్మాలు విచ్చుకుని నిర్ణీత సమయంలో సౌండ్ సిస్టమ్ ద్వారా నీరు పైకెగసి, మధ్యలో చుట్టూ తిరుగుతూ దర్శనం ఇస్తారు. సంప్రదాయ వాద్యాలతో ఏర్పాటు చేసిన ధ్వనితో, నీటి నాట్యంతో జరిగే విన్యాసం చూసిన భక్తులకు దివ్యానుభూతి కలుగుతుంది. ఉజ్జీవన సోపానాలు లీలాజల నీరాజనం దాటి ముందుకు సాగితే భద్రవేదిపై కొలువుతీరిన రామానుజుల దర్శనం చేసుకోవాలని వెళ్లే భక్తులకు ఉజ్జీవనసోపాన మార్గం దర్శనమిస్తుంది. మొత్తం మెట్ల సంఖ్య 108. భగవంతుని దివ్య నామావళి 108ని ప్రతీకగా తీసుకుని ఈ మెట్ల సంఖ్య నిర్ణయించారు. అటూ ఇటూ ఎండవేడిమి, వానతాకిడికి భక్తులు ఇబ్బంది పడకుండా పైన మండపాలు మొత్తం 18 ఉన్నాయి. వీటిని సోపాన మండపాలు అంటారు. భద్రవేది – బంగారు రామానుజులు రామానుజుల విగ్రహం ఉన్న వేదిక ఈ భద్రవేది. ఇది మూడంతస్తుల నిర్మాణం. కింద భాగంలో ప్రవచనమండపం ఉంది. మొదటి అంతస్తులో బంగారు రామానుజులవారు కొలువుతీరే శరణాగత మండపం ఉంది. దీని చుట్టూ స్తంభాలపై 32్ర బహ్మవిద్యల విగ్రహాలున్నాయి. ఈ రామానుజమూర్తి నిర్మాణం కోసం 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ఈ బంగారు రామానుజుల వారి విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఈనెల 13న ఆవిష్కరించనున్నారు. దానిపై అంతస్తులో లైబ్రరీ ఏర్పాటు కానుంది. ఈ భద్రవేది పొడవు 54 అడుగులు. చుట్టూ 108 దివ్యదేశాలు భద్రవేది చుట్టూ భారతదేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 108 దివ్యదేశాలలో 92 క్షేత్రాలను పర్యటించి, ఆ ఆలయాలను పరిశీలించి అదేవిధంగా ఆలయం ఆకృతి, దేవతామూర్తులు ఉండేలా ఈ ఆలయాలను తీర్చిదిద్దారు. భూమిపై ఉన్న ఆలయాలు 106. 107 వది క్షీరసాగరం, 108వది పరమపదం. సర్వతోభద్ర మండలాకృతిలో ఉన్న ఈ ఆలయాల్లో మొదటి ఆలయం శ్రీరంగం కాగా చివరిది పరమపదం. -
108 దివ్య దేశ దివ్యాలయాల ప్రతిష్ఠా మహోత్సవం (ఫోటోలు)
-
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ
శంషాబాద్ రూరల్: డ్రగ్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంతో పాటు శాంతిభద్రతల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఆదివారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో కొత్తగా నిర్మించిన శంషాబాద్ పోలీస్స్టేషన్ను శ్రీత్రిదండి చినజీయర్స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ సరఫరా అదుపునకు సీఎం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటుచేసి, డీజీపీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనమన్నారు. పోలీస్ శాఖకు రూ.700 కోట్లు మంజూరుచేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మరో రెండు నెలల్లో పోలీస్ కమాండింగ్ కంట్రోల్ను ప్రారంభిస్తామన్నారు. పోలీస్ శాఖలో మహిళలకు 33 శాతం కోటా కల్పించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు. స్టార్ హోటల్ తరహాలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆధునిక హంగులతో రూ.4.5 కోట్ల వ్యయంతో మైహోం సంస్థ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ స్టీఫెన్ రవీంద్ర, మైహోం గ్రూపు సంస్థల చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మందు కొట్టేసి.. ఆపై పోలీసులను కొట్టేసి..
శంషాబాద్: మద్యం, గంజాయి మత్తులో ఓ నేపాలీ శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) పోలీస్స్టేషన్లో బీభత్సం సృష్టించాడు. పోలీసులంతా పాకిస్తాన్ ఏజెంట్లంటూ రెచ్చిపోయాడు. ఓ కానిస్టేబుల్పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. మరో కానిస్టేబుల్ వద్ద నుంచి లాఠీ లాక్కుని కనిపించిన పోలీసులందరినీ కొట్టాడు. దాదాపు గంటన్నర పాటు హల్చల్ చేసిన కమల్ ఆపై స్టేషన్లోనే స్పృహ తప్పి పడిపోయాడు. తిరిగి లేచిన తర్వాత కూడా అదేవిధంగా ప్రవర్తించాడు. వివరాలిలా ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్లో పనిచేస్తూ.. ఇరవై ఐదేళ్ల కమల్ పాయా అనే నేపాలీ శంషాబాద్లోని ఓ కన్వెన్షన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం 6.30 సమయంలో మద్యం, గంజాయి మత్తులో జోగుతూ చొక్కా కూడా లేకుండా స్టేషన్ వద్దకు వచ్చాడు. లోపలికి ప్రవేశిస్తూ మెట్లపై పడిపోయాడు. అది చూసిన పోలీసు సిబ్బంది లేపి సహకరించడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్క ఉదుటున ఠాణాలోకి ప్రవేశించిన పాయా.. పోలీసులను హిందీలో అసభ్య పదజాలంతో దూషిస్తూ వీరంగం వేశాడు. సిబ్బందిపై దాడికి దిగాడు. శారీరకంగా బలిష్టంగా ఉన్న అతన్ని అదుపు చేసి, స్టేషన్ బయటకు తీసుకువెళ్లడానికి పోలీసులు ఆపసోపాలు పడ్డారు. బీఏసీ కౌంట్ 450 స్టేషన్ ఆవరణలోకి వెళ్లాక కొద్దిసేపు ఆగిన కమల్ మరోసారి పోలీసులపై చేయిచేసుకున్నాడు. మరో సారి ఠాణాలోకి చొరబడి అసభ్య పదజాలంతో పోలీసులను దూషించాడు. తర్వాత అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి లేచి.. తాను శంషాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉంటున్నానని, తనను పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొడుతున్నారంటూ అరవడం మొదలుపెట్టాడు. అతన్ని కష్టమ్మీద పట్టుకున్న పోలీసులు యంత్రంతో శ్వాస పరీక్షించగా.. బీఏసీ కౌంట్ 450 వచ్చింది. దీంతో అతడిని స్టేషన్లోనే ఉంచి యజమానికి సమాచారమిచ్చారు. మద్యంతో పాటు గంజాయి కూడా సేవించడం వల్లే అలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్న పోలీసులు కమల్పై కేసు నమోదు చేశారు. -
మద్యం మత్తులో యువతి కారుతో బీభత్సం.. సెకన్ల వ్యవధిలోనే
హైదరాబాద్: మద్యంమత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మెహిదీపట్నంకు చెందిన ఓ యువతి (25) అమీర్పేట్కు చెందిన అమీర్ సోహేల్ మహ్మ ద్ అబ్దుల్ గురువారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వైపు కారులో వెళ్తున్నారు. కారు డ్రైవింగ్ చేస్తున్న యువతి మొదట బస్టాండ్లో ఓ వాహనాన్ని ఢీ కొడుతూ అదే వే గంతో కొద్ది దూరంలో ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడి చేతికి గాయమైంది. సెకన్ల వ్యవధిలోనే ఎయిర్పోర్టు బావర్చి ముందు నిల్చున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. అప్రమత్తమైన స్థానికులు కారుని ఆపడంతో ఇరువురు స్థానికులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరికి అదుపులోకి తీసుకున్నారు. శ్వాస పరీక్ష చేయగా యువతికి 200, యువకుడికి 550 ఉన్నట్లు తేలింది. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య) -
చినజీయర్ ఆశ్రమానికి మధ్యప్రదేశ్ సీఎం
శంషాబాద్ రూరల్: శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ శనివారం ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రుత్వికులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు ఆశ్రమంలో స్వామికి నమస్కరించి కానుకలు అందజేశారు. వచ్చే నెల 2 నుంచి జరగనున్న సహస్రాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను స్వామి ఆశీర్వదించి, ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. -
కోరాపుట్ టు నాసిక్
మియాపూర్: ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్కు గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్కు చెందిన వికాస్జాదవ్, ఒడిస్సా, మోహిపాల్పుట్కు చెందిన సుభాష్కుమార్, మహారాష్ట్రకు చెందిన చెందిన అశోక్కూలే, అమోల్, విలాస్ జగనాథ్ పచోరే, ఫిరోజ్ మోమిన్, సుధామ్ గౌటేకర్, ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్సింగ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి నాసిక్కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్లో సుభాష్కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి కొనుగోలు చేసి అశోక్కూలే, అమోల్కు అప్పగించేవాడు. వారు విలాస్జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్కు గంజాయి తరలించేవారు. వారం రోజుల క్రితం వికాస్ జాదవ్, సుభాష్కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వికాస్ జాదవ్, అశోక్కూలే, అమోల్కు ఈ విషయం చెప్పడంతో వారు జగన్నాథ్, రాహుల్కుమార్ సింగ్లకు ఫోన్ చేసి తమ ప్లాన్ను వివరించారు. ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో గంజాయిని ఐదు కిలోల చొప్పున 156 ప్యాకెట్లుగా సిద్ధం చేశారు. ఈ నెల 19న అశోక్కూలే, రాహుల్కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో అల్లం సంచులను లోడ్ చేశారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసుల నిఘా ఉంటుందనే అనుమానంతో ఇతర హైదరాబాద్కు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై కారు, డీసీఎంను ఆపారు. కారులో ఉన్న అశోక్కూలే, రాహుల్కుమార్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా డీసీఎంలో 800 కిలోల గంజాయిని నాసిక్కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అశోక్కూలే, అమోల్, రాహుల్కుమార్ సింగ్, విలాస్జగనాథ్, ఫీరోజ్ మోమిన్, సుధామ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితులు వికాస్జాదవ్, సుభాష్కుమార్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటున్నామని సీపీ తెలిపారు. ♦ 800 కిలోల గంజాయితో పాటు డీసీఎం, ఐ 20 కారు, ఐదు మొబైల్స్, రూ.2,130 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీ మియాపూర్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ తిరుపతిరావు, ఎస్ఓటీ సీఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు. -
తిరుపతి వెళ్లి ల్యాండ్ అవకుండానే వెనక్కి
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి బయలుదేరిన విమానం అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్టులోనే అత్యవసరంగా ల్యాండయింది. శుక్రవారం ఉదయం 6.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి స్పైస్ జెట్ 1075 విమానం తిరుపతి విమానాశ్రయానికి చేరుకునే సమయంలో అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ల్యాండింగ్కు అనుమతినివ్వలేదు. దీంతో ఆ విమానం తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి 9.30 గంటలకు చేరుకుంది. ఏటీసీ అనుమతి మేరకు ల్యాండ్ చేసిన విమానం 10 గంటలకు మరోసారి ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని బయలుదేరి 11. 26 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నట్టు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
మళ్లీ ‘భువికి’ రామానుజులు!
సాక్షి, హైదరాబాద్: జాతులు.. వర్గాలు.. ఆడ.. మగ.. మనిషి.. జంతువు.. అంతా సమానమే.. పరమాత్మ దృష్టి అన్నీ ఒకటే అంటూ సమానత్వాన్ని చాటిన సమతా మూర్తి శ్రీరామానుజాచార్యులు మరోసారి మనముందు వెలుస్తున్నారు. ఓవైపు భారీ రామానుజుడి విగ్రహం.. మరోవైపు ఆధ్యాత్మిక పరిమళాలు, సంభ్రమాశ్చర్యాలను కలిగించే సాంకేతిక విన్యాసాలు.. అబ్బురపరిచే రాతి శిల్పాలతో శ్రీరామానుజ సహస్రాబ్ధి ప్రాంగణం సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ శ్రీరామనగరంలో నిర్మించిన ఈ మహా ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలా 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’పేరిట ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్ద సంఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు, పలు రంగాల ప్రముఖులు అందులో పాల్గొననున్నారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని ప్రారంభించనుండగా.. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల రామానుజుల నిత్యపూజామూర్తిని 13న రాష్ట్రప్రతి తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. సీఎం కె.చంద్రశేఖరరావు ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలతో.. ♦ రామానుజుల ప్రాంగణం ఎన్నో ప్రత్యేకతలకు నెలవుగా నిలుస్తోంది. చినజీయర్ స్వామి చిరకాల వాంఛను నిజం చేస్తూ 2016లో దాదాపు రూ.వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను మేళవించి 2,700 శిల్పులు ఈ రాతి కట్టడాన్ని సిద్ధం చేశారు. ♦ ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న అతి ఎత్తయిన లోహ విగ్రహంగా శ్రీరామానుజుల విగ్రహం నిలవనుంది. ఇందులో పద్మాసనంలో ఉన్న రామానుజుల విగ్రహం 108 అడుగులుండగా.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. స్వామివారి పాదుకలతో ఉండే శఠారి 18 అడుగులు ఉంది. ఈ లోహ విగ్రహం బరువు 1,800 టన్నులు. దీన్ని చైనాకు చెందిన ఏరోసన్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో.. చినజీయర్ స్వామి సూచనల ప్రకారం రూపొందించారు. 200 మం ది చైనా నిపుణులు 9 నెలల పాటు శ్రమించి.. 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు (క్యాస్టింగ్)‡ చేశారు. వాటిని ఇండియాకు తీసుకొచ్చాక 60మంది చైనా నిపుణులు కలిపి తుదిరూపు ఇచ్చారు. వాతావరణంలో ఏర్పడే మార్పులు, పరిణామాలను తట్టుకుని వెయ్యేళ్లు నిలిచేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 108 పుణ్యక్షేత్రాల దర్శన అనుభూతితో.. ♦ ఈ క్షేత్రంలో రామానుజుల మహా విగ్రహం చుట్టూ.. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా ప్రధాన వైష్ణవాలయాలు ఇందులో ఉన్నాయి. వీటిని అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మించారు. ♦ ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెయిన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతిలో ఉండే ఈ ఫౌంటెయిన్లో పద్మపత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఎనిమిది రకాల జీవరాశులు నీటిని విరజిమ్ముతుండగా.. పద్మపత్రాల మధ్య నుంచి రామానుజుల ఆకృతిపైకి వచ్చి అభిషేకం జరుగుతున్న భావన కలుగుతుంది. అదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపిస్తుంటాయి. ♦ రామానుజుల సమతామూర్తి, పక్కనే ఉన్న ఫౌంటెయిన్, ఇతర భవనాలపైన కనువిందు చేసేలా.. ప్రత్యేక కాంతిపుంజాల విన్యాసాలతో జరిగే ఏఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ) షో మంత్రముగ్ధులను చేస్తుంది. రోజూ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 18 నిమిషాల పాటు ఈ 3డీ షో నిర్వహిస్తారు. ఇందులో రామానుజులు ప్రబోధించిన సమానత్వాన్ని చాటే ఘట్టాలు కనివిందు చేస్తాయి. ఏకకాలంలో 3,600 మంది తిలకించొచ్చు. ఇక రెండు లక్షల మొక్కలతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దుతున్నారు. -
యాదాద్రి ఏర్పాట్లు ఎలా చేద్దాం?
శంషాబాద్ రూరల్: యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునఃప్రారంభం ఏర్పాట్లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చారు. యాదాద్రిలో మార్చి 21 నుంచి మహా సుదర్శనయాగం, 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టడానికి ఇదివరకే ముహూర్తం ఖరారుకాగా.. వాటి ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్స్వామితో కేసీఆర్ చర్చించారు. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని జీయర్స్వామి ఆశ్రమంలో సీఎంకు రుత్వికులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్కు స్వామి మంగళ శాసనాలు అందజేశారు. సీఎం అక్కడి నుంచి జీయర్ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న యాగశాలకు వెళ్లి పనులను పరిశీలించారు. 1,035 కుండాలతో హోమాలు నిర్వహించనున్నట్లు స్వామి వివరించారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ జీయర్స్వామి భారీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ పనులను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం యాగశాల, సమతాస్ఫూర్తి కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్కు పలు సూచనలు ఇచ్చారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వీవీఐపీలు, వీఐపీలు వస్తున్నందున యాగశాల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి ఫోన్చేసి హోమాలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోమం కోసం వినియోగించే నెయ్యిని స్థానిక గోశాలలో సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్న విధానాన్ని అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం ఇక్కడకు వచ్చిన సీఎం మూడు గంటలకు పైగా ఇక్కడ గడిపారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు ఉన్నారు. -
‘శంషాబాద్’కు ఇంధన పొదుపు అవార్డు
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకుంది. ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జీఎంఆర్ ప్రతినిధులకు అవార్డును అందజేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ముందు వరుసలో ఉందని ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో శంషాబాద్ ఎయిర్పోర్టు ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుందన్నారు. -
శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): ఎయిరోటెక్నిక్లో శిక్షణ పొందుతున్న యువతితో ఇంజినీర్లు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..మహారాష్ట్ర ముంబాయికి చెందిన ఓ యువతి(25) మామిడిపల్లి హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటోంది. ఎయిర్పోర్టులో ఎరోటెక్నిక్ కోర్సులో కొంతకాలంగా శిక్షణ తీసుకుంటోంది. అదే విభాగంలో సీనియర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వెంకట్, ఫళనిస్వామి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో సదరు యువతి బుధవారం ఉదయం పహాడిషరీఫ్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎయిర్పోర్టులో జరిగిన ఘటన కావడంతో వారు మహిళా పోలీసుల సహాయంతో ఆర్జీఐఏ పోలీస్స్టేషన్కు పంపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మాజీ మంత్రికి ఝలక్.. 69 చోట్ల విజిలెన్స్ సోదాలు -
తప్పుడు వీసాల కేసులో 12 మంది ఏజెంట్ల పాత్ర!
శంషాబాద్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి తప్పుడు వీసాలు అందజేస్తున్న కేసులో మొత్తం 12 మంది ఏజెంట్ల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. మరో ఇద్దరు ఏజెంట్లు, ఓ అధికారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని కడప తదితర ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఫయాజ్ అనే ఏజెంటు కొంతకాలంగా ముంబై కేంద్రంగా పలు రాష్ట్రాల్లో ఉప ఏజెంట్ల ద్వారా తప్పుడు వీసాల వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం హైదరాబాద్ మల్లేపల్లిలో నివసిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ నూర్ మహ్మద్ (35)ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించడంతో రిమాండ్కు తరలించారు. కాగా, రెండు వీసాలతో కువైట్ వెళ్తూ మంగళవారం 44 మంది మహిళలు పట్టుబడిన మర్నాడే బుధవారం ఉదయం మరో ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. -
శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కారులో ప్రముఖ సీరియల్ నటి
Gruhalakshmi Serial Actress Lahari, Collided With Car At Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ సీరియల్ నటి లహరి కారు, బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్లు తెలిసింది. (చదవండి: ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి.. ఫోటోలు వైరల్) ఘటన జరిగిన తరువాత లహరి కారు నుంచి బయటకు దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుని.. కార్తో పాటు లహరిని కూడా స్టేషన్కు తీసుకెళ్లారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయనున్నారు. చదవండి: ‘గతంలో ఆ వ్యక్తితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవి కృష్ణతో రిలేషన్!’ -
నీ అంతు చూస్తా అన్నందుకు.. ఒక్కసారిగా కత్తి తీసుకుని...
సాక్షి, శంషాబాద్: పాత కక్షలకు తోడు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. మండలంలోని తొండుపల్లి శివారులో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన గండికోట యాదయ్య (29), శ్రీనివాస్ అన్నదమ్ములు. వీరిద్దరూ కొంపల్లిలో ఉన్న ఆరెంజ్ ట్రాన్స్పోర్టు కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం శ్రీనివాస్ కొంపల్లి నుంచి గూడ్సు వాహనం తీసుకుని చెన్నై బయలుదేరాడు. చదవండి: గట్టుపై బిడ్డను కూర్చోమని చెప్పి.. కుమార్తె కళ్లెదుటే.. ఈ వాహనంలో ఇతనితో పాటు వారి గ్రామానికి చెందిన మరో ముగ్గురు కూడా ఉన్నారు. వీరు అదే ట్రాన్స్పోర్టు కంపెనీలో పని చేస్తుండగా.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి ఈ వాహనంలో ఎక్కారు. అన్నదమ్ములిద్దరూ ఈ వాహనంలో ఒకరి తర్వాత ఒకరు డ్యూటీలో చేరుతారు. ఈ క్రమంలో వాహనం రాత్రి 8 గంటల సమయంలో మండలంలోని తొండుపల్లి వద్దకు చేరుకుంది. అక్కడకు శ్రీనివాస్ అన్న యాదయ్య వచ్చాడు. ఇప్పటి నుంచి తాను డ్యూటీ చేస్తానని తమ్ముడు శ్రీనివాస్కు చెప్పాడు. చదవండి: ఆసిఫాబాద్లో పులి చర్మం స్వాధీనం ఇందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో యాదయ్య బెదిరింపు ధోరణితో నీ అంతు చూస్తానని తమ్ముడు శ్రీనివాస్తో అన్నాడు. వెంటనే శ్రీనివాస్ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి.. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇద్దరు కూడా అన్నదమ్ములే కదా.. చిన్న దానికి గొడవ ఎందుకు అని సర్ది చెప్పి వెళ్లిపోయారు. స్టీరింగ్పైనే కుప్పకూలిన యాదయ్య, శ్రీనివాస్ (ఫైల్) కత్తితో దాడి చేసి.. తొండుపల్లి నుంచి యాదయ్య వాహనం నడుపుతుండగా.. అదే వాహనంలో శ్రీనివాస్తో పాటు మరో ముగ్గురు కూర్చున్నారు. యాదయ్య పక్కన ఓ వ్యక్తి కూర్చోగా.. తర్వాత శ్రీనివాస్ ఉన్నాడు. వాహనం బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి నుంచి రైల్వే వంతెన దాటగానే.. శ్రీనివాస్ ఒక్కసారిగా కత్తి తీసుకుని యాదయ్య ఛాతీలో పొడిచాడు. దీంతో అతను స్టీరింగ్పై స్పృహతప్పి పడిపోయాడు. ఈ సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాటరు కంటే..వైనే ఎక్కువ
శంషాబాద్ రూరల్: ‘రాష్ట్రంలో ఇంగ్లిషు చదువులు లేవుగాని.. ఇంగ్లిషు సారా ఖుల్లా ఖుల్లాగా దొరుకుతుంది.. గల్లీ గల్లీకి వైన్ షాపులు ఉన్నాయి. వాటరు కంటే వైన్ ఎక్కువ దొరుకుతుందని మహిళలు చెబుతున్నారు... ఇదేనా బంగారు తెలంగాణ’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. ‘ప్రజా ప్రస్థానం’ మహా పాదయాత్ర లో భాగంగా రెండోరోజు గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మల్కారంలో ఏర్పాటు చేసిన ‘మాట ముచ్చట’కార్యక్రమంలో ఆమె స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడితే.. బారుల తెలంగాణ, బీరుల తెలంగాణగా మార్చార ని దుయ్యబట్టారు. రైతులను రైతుబంధు పేరుతో ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు లు వ్యవసాయం చేసి ఏం లాభముంటుందన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రూ.25 వేలలోపు రుణాలకు సంబంధించి కేవలం 3 లక్షల మందికి మాఫీ చేసి 36 లక్షల మందికి రుణ మాఫీ ఎగ్గొట్టి మోసం చేశారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. పావలా వడ్డీ కూడా ఇవ్వడంలేదన్నారు. రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ బడులను మూసి వేసి 14వేల మంది టీచర్లను తొలగించారని ఆరోపించారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడంలేదన్నారు. ఏ ఒక్క వర్గం కూడా గ్రామాల్లో సంతోషంగా లేదని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు ఇచ్చి కాసుకోమంటుంది. కూలీనాలీ చేసి కష్టపడి పిల్లలను చదివిస్తుంది ఇందుకోసమేనా’అని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కేసీఆర్కు దున్నపోతు మీద వాన పడినట్లు ఉందన్నారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితులు మారాలంటే మీలో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎత్తి చూపడానికే ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను కేసీఆర్ పరిష్కరించకుంటే.. రెండేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదిస్తే తన తండ్రి వైఎస్ఆర్ తరహాలో తానూ మంచి పాలన చేస్తానన్నారు. నేడు శంషాబాద్లో యాత్ర షర్మిల పాదయాత్ర మూడో రోజు శుక్రవారం కాచారం నుంచి మొదలై నర్కూడ మీదుగా సాయంత్రం శంషాబాద్ బస్టాండ్కు చేరుకుంటుంది. అక్కడ ప్రజా సమావేశం ఉంటుంది. రాత్రికి పోశెట్టిగూడ శివారులో బస చేస్తారు. -
రెండోరోజు ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర రెండోరోజు ముగిసింది. శంషాబాద్ మండలం క్యాచారం వరకు పాదయాత్ర సాగింది. అక్కడే క్యాచారంలో వైఎస్ షర్మిల బస చేయనున్నారు. నేడు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. -
ఎమర్జెన్సీ లాంతరులో ఆరు కిలోల బంగారం
శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఈకే 524 విమానంలో మంగళవారం ఉదయం శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. అతని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిం చగా ఎమర్జెన్సీ లాంతరు వెనుక భాగంలో బ్యాటరీల సైజులో నలుపు రంగు కవర్లో అమర్చిన బంగారు కడ్డీలు బయటపడ్డాయి. 6.06 కిలోల బరువున్న ఈ బంగారం విలువ 2.96 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుడిని కొరియర్గా ఉపయోగించుకుని బంగారాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణా చేయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఓఆర్ఆర్పై ప్రమాదం.. కారులోని వ్యక్తి సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ రెండో లైనులో ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్దమైంది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రమాదానికి గురైన కారు ప్రకాశం జిల్లాకు చెందినదిగా స్థానికులు గుర్తించారు. -
అనాథను ఆదరించింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది
శంషాబాద్(హైదరాబాద్): అనాథను ఆదరించి..పెంచి పెద్దచేసిన ఓ విదేశీయురాలు..అదే యువతి కారణంగా హత్యకు గురైంది. తనకో జీవితాన్నిచ్చిన తల్లి లాంటి వృద్ధురాలిని ఆ కసాయి యువతి తన ప్రియుడితో కలిసి కుట్రపన్ని అంతమొదించింది. సహజీవనం వద్దని వారించినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి కథనం ప్రకారం..ఫ్రాన్స్ దేశానికి చెందిన మారి క్రిస్టిన్ (68) ముప్పై ఏళ్లుగా భారతదేశంలో నివాసముంటోంది. రాజేంద్రనగర్ దర్గా ఖలీజ్ ఖాన్, టోలిచౌకిలలో మారికా పేరిట రెండు పాఠశాలలను నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవలు అందిస్తోంది. అనాథ, పేద విద్యార్థులకు తన పాఠశాలల్లో విద్యావకాశాలు కల్పిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కాగా..ఒకరు స్థానికంగా సన్సిటీలో, మరొకరు పాండిచ్చేరిలో నివాసం ఉంటున్నారు. మరోవైపు క్రిస్టిన్ ప్రియాంక, రోమా అనే బాలికలను దత్తత తీసుకుని వారికి చదువులు చెప్పించి పెద్దచేసింది. వారితోనే కలిసి దర్గా ఖలీజ్ఖాన్ వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం దత్తపుత్రిక రోమాకు వివాహం చేయడానికి మ్యాట్రిమోని సైట్లో వివరాలు పొందుపర్చింది. వారించినందుకే.. మ్యాట్రిమోనీలో రోమా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్ శ్రీరాములు (25)తో స్నేహం పెంచుకుంది. స్నేహం కాస్తా వీరిద్దరు సహజీవనం చేసే వరకు వెళ్లింది. కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో గది తీసుకుని ఇద్దరు కలసి ఉండటంతో మారి క్రిస్టిన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మారి క్రిస్టిన్ను అడ్డుతొలగించుకోవాలని రోమా ప్రియుడు విక్రమ్తో కలిసి పథకం పన్నింది. ఈ నెల 8 ఉదయం దర్గా ఖలీజ్ఖాన్లో నివాసముంటన్న మారి క్రిస్టిన్ వద్దకు వెళ్లిన రోమా తనకు కొన్ని డబ్బులు కావాలని అడిగింది. ఆ తర్వాత టోలిచౌకిలోని పాఠశాల వద్ద వదిలేయమని చెప్పింది. అప్పటికే విక్రమ్తో పాటు అతడి స్నేహితుడు రాహుల్ గౌతమ్ క్రిస్టిన్ ఇంటి వద్ద కాపుకాశారు. రోమాను టోలిచౌకిలో వదిలేసిన క్రిస్టిన్ ఇంటికి చేరుకోగానే..అక్కడే ఉన్న విక్రమ్, రాహుల్ ఆమె గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆమె కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి హిమాయత్ సాగర్ చెరువు సమీపంలోని చౌడమ్మ గుట్టల్లో పడేశారు. హత్య అనంతరం మృతురాలి ల్యాప్టాప్ను తీసుకోవడంతో పాటు ఆమె బ్యాంకు ఖాతాలోంచి రూ.2 లక్షల నగదును కూడా రోమా ఖాతాలోకి మార్చుకుంది. అదృశ్యం కేసు నమోదుతో వెలుగులోకి.. ఈ నెల 8 ఉదయం నుంచి మారి క్రిస్టిన్ కనిపించకపోవడంతో బండ్లగూడ సన్సిటీలో నివాసముంటున్న సొంత కూతురు మారికా సొలంగ్ భర్త ప్రశాంత్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దత్తపుత్రిక రోమాను అనుమానించి విచారణ చేపట్టడంతో హత్య విషయం వెలుగుచూసింది. కుట్ర పన్నిన రోమాతో పాటు హత్య చేసిన విక్రమ్, రాహుల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, సీఐ కనకయ్య, ఎస్ఓటీ పోలీసులు కేసు చేధించడంలో మంచి ప్రతిభ కనబర్చారని డీసీపీ ప్రకాష్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. చదవండి: బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురి ప్రాణాలు గాల్లోకి -
కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం
శంషాబాద్: హైదరాబాద్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 19 నెలల తర్వాత శుక్రవారం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికులతో శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం ఇక్కడి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండుసార్లు (సోమ, శుక్రవారం) ఈ విమాన సర్వీసులు ఉంటాయని గెయిల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్లైన్స్ విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచస్థాయిలో ఇచ్చే స్కైట్రాక్స్ అవార్డును దక్కించుకుంది. వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్ 100 విమానాశ్రయాల్లో 64 స్థానంలో నిలిచిందని జీఎంఆర్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి. ఆన్లైన్ ద్వారా స్కైట్రాక్స్ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్ పరిస్థితుల్లో కూడా జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు
శంషాబాద్: వృత్తి విద్యతో మెరుగైన ఉపాధి లభిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యువత నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులోని జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ను ఆదివారం ఆయన సందర్శించారు. జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున్రావు స్వాగతం పలికారు. ఫౌండేషన్లో వివిధ కోర్సుల శిక్షణ తీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. టైలరింగ్ శిక్షణ తీసుకుని అక్కడే పనిచేస్తున్న మహిళలతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం బాగుందని కితాబిచ్చారు. తర్వాత జీఎంఆర్, చిన్మయ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో వెంకయ్యనాయుడు మొక్కను నాటారు. -
శంషాబాద్ లో బీహార్ గ్యాంగ్ అలజడి
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘాటైన గ్యాస్ లీక్
-
శంషాబాద్లో 30 విమాన సర్వీసులు రద్దు
సాక్షి, శంషాబాద్ రూరల్: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నం దున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఇతర రాష్ట్రాలు షరతులు విధిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ షెడ్యూల్ను వాయిదా వేసుకుంటున్నారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లకు ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణాలతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, çపుణే, చెన్నై తదితర నగరాలకు వెళ్లే సుమారు 30 విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు) -
బంగారు టీషర్ట్! చూశారా..?
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. టీషర్ట్లో సైతం బంగారాన్ని తీసుకొచ్చి ఓ నిందితుడు బుధవారం పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి ఎఫ్జెడ్–8779 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు ధరించిన టీషర్ట్కు పొర మాదిరిగా ఉన్న బంగారాన్ని గుర్తించారు. ఇందులోంచి 386 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ.19 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ రోడ్డు ప్రమాదం; కారును నడిపిందెవరు?
శంషాబాద్: శంషాబాద్లో వలస కార్మికులను బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే జరిగింది. కారును అతి వేగంగా నడపడం ఓ కారణమైతే ఇటుకలు రవాణా చేసే లారీలో జనాలను తరలించడం మరో కారణం. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్ బంగ్యానాయక్తోపాటు మొత్తం 30 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయాలైన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, ఒడిశా రాష్ట్రానికి చెందిన బుదాన్ (25) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుగుకు పెరిగింది. మరో మహిళ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. కారు నడిపిందెవరు? కారులో మాదాపూర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న గిరిప్రసాద్తో పాటు హోంగార్డు సంగమేశ్వర్, మండలంలోని ఊట్పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లేష్ ఉన్నారు. ఆదివారం ఉదయం యాదాద్రి వెళ్లి తిరుగు ప్రయాణంలో మద్యం తాగారు. సాయంత్రం ఊట్పల్లి సమీపంలోని సదరన్ వెంచర్లో మరోసారి మద్యం తాగి రాళ్లగూడ వైపు వెళుతుండగా అదే సమయంలో నర్కూడ వైపు వెళుతున్న లారీని షాబాద్ రహదారిలోని మసీదు గడ్డ వద్ద వేగంగా ఢీకొట్టారు. దీంతో లారీ అదుపు తప్పడంతో ఘోరప్రమాదం జరిగింది. ప్రమాదం సంభవించినపుడు కారులో బెలూన్లు తెరుచుకోవడంతో సురక్షితంగా బయటపడ్డ ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. మొదట మల్లేష్ను, తర్వాత గిరిప్రసాద్, సంగమేశ్వర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా సంగమేశ్వర్ మినహా మిగతా ఇద్దరూ మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. మద్యం సేవించని సంగమేశ్వర్ డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నా ఆ సమయంలో గిరిప్రసాద్ కారు నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ కారుపై అతివేగంగా నడిపినట్లు ఈ చలాన్ కూడా జారీ అయింది. కారులో లభ్యమైన ఓ మద్యం సీసాను వేలిముద్రల పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో లారీ డ్రైవర్ మద్యం తాగనట్లు తేల్చారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కారు డ్రైవర్తోపాటు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్జీఐఏ సీఐ విజయ్కుమార్ తెలిపారు. కేసులు పటిష్టం.. ప్రమాదాలు షరామామూలే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కేసులను తీవ్రంగా పరిగణిస్తూ కేసుల దర్యాప్తు చేపడుతున్నారు. రెండు నెలలుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కేసుల్లో సంబంధిత ఎస్సై, సీఐతో పాటు ఏసీపీ, ట్రాఫిక్ సీఐ, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, సంబంధిత రోడ్డు విభాగం ఇంజనీర్లు దర్యాప్తులో భాగమవుతున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు రోడ్డుపైకి అధిక లోడుతో వస్తున్న వాహనాలు, గూడ్స్ వాహనాల్లో ప్రజలను తరలిస్తున్న తీరుపై మాత్రం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. -
హైదరాబాద్: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం
-
బతుకు బోల్తా; ఆరుగురు దుర్మరణం
శంషాబాద్: పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం దాటివచ్చిన వలస కూలీల బతుకులను రోడ్డు ప్రమాదం ఛిద్రం చేసింది. వీరు ప్రయాణిస్తున్న లారీని ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ లారీని ఒక్కసారిగా రోడ్డు కిందకు దించడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణ పరిధిలోని షాబాద్ రహదారి మసీదు గడ్డ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని నర్కూడ రెవెన్యూ పరిధిలోని సుల్తాన్పూర్లో చందర్ అనే ఇటుక బట్టీ నిర్వాహకుడి వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 30 మంది కూలీలు యజమాని ఏర్పాటు చేసిన లారీలో ఆదివారం శంషాబాద్ వచ్చి కూరగాయలు, సరుకులు కొనుగోలు చేసి సాయంత్రం 6:10 గంటలకు తిరిగివెళ్తున్నారు. సరిగ్గా 6: 20 గంటలకు వీరు ప్రయాణిస్తున్న లారీ మసీదు గడ్డకు చేరుకుంది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. కారును తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ఎడమవైపునకు తిప్పాడు. దీంతో అదుపుతప్పిన లారీ బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న ఒడిశాలోని బలాంగర్ జిల్లా చనవాహాల్ గ్రామానికి చెందిన కలాకుమార్ (25), గోపాల్దీప్ (45), కృపాసునా (40) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఒడిశాకు చెందిన సహదేవ్ (45), ఛత్తీస్గఢ్కు చెందిన హక్తు (40), పరమానంద్ (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయాలపాలైన క్రిష్ణ, మంచన్, సత్యపాల్దీప్, ముఖేష్, రవీంద్రసునాతోపాటు మరికొందరిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించారు. లాక్డౌన్ అనంతరం ఒడిశా నుంచి 50 మందికిపైగా కార్మికులు ఐదు నెలల క్రితం నర్కూడలోని ఇటుకబట్టీల్లో పని చేసేందుకు వచ్చారు. మద్యం మత్తులోనేనా...! ప్రమాదానికి కారణమైన కారులో బెలూన్లు తెరుచుకోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. వీరిలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నర్సింహ, గిరితోపాటు మరో వ్యక్తి ఉన్నట్లు సమాచారం. వీరు సమీపంలోనే ఉన్న సదరన్ వెంచర్లో మద్యం తాగి శంషాబాద్కు తిరిగి వస్తున్నట్లు సమాచారం. వీరు మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ వివరాలను వెల్లడించడం లేదు. తీరని విషాదం.. సాయంత్రం 6.20 గంటలకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు, రహదారి గుండా వెళ్లే ప్రజలు చొరవ తీసుకుని బాధితులకు సాయం అందించారు. పోలీసులు, 108కు సమాచారం అందించినా వెంటనే స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 7.10 గంటల సమయంలో ఘటనాస్థలికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను తరలించారు. అప్పటికే స్థానికులు కొంతమందిని ప్రైవేటు ఆటోల్లో ఆస్పత్రులకు తరలించారు. రోడ్డుపై పడిపోయిన లారీని తొలగించడానికి చాలా సమయం పట్టింది. లారీ కింద ఇరుక్కుపోయిన కలాకుమార్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెండు గంటల సమయం పట్టింది. కలాకుమార్ మృతదేహాన్ని పట్టుకుని అతడి భార్య గుండెలవిసేలా రోదించింది. మృతిచెందిన వారు ముగ్గురూ వివాహితులే. ఘటనా స్థలం వద్ద మృతుల భార్యలు, పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. నా కళ్లముందే..: కలాకన్ సునా, ప్రత్యక్ష సాక్షి మొత్తం 30 మందిమి సరుకులు తీసుకుని వెళుతున్నాం. కారు స్పీడుగా వచ్చి లారీని ఢీకొట్టింది. నా కళ్లముందే నా తమ్ముడు కలాకుమార్ సునా కూడా లారీ కింద నలిగిపోయి చనిపోయిండు. బతుకు దెరువు కోసం బలాంగర్ జిల్లా చనవాహాల్ నుంచి ఇక్కడి వచ్చినం. మంత్రి సబిత దిగ్భ్రాంతి లారీ ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతిచెందిన ఘటనపై మంత్రి సబితాఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విషయం తెలిసిన వెంటనే సైబరాబాద్ సీపీ సజ్జనార్తో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ అమయ్ కుమార్కు ఫోన్ చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి, మెరుగైన వైద్యం అందేలా చూడాలని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదకరంగా శంషాబాద్–షాబాద్ రహదారి శంషాబాద్ రూరల్: రోడ్డుపై వాహనాల రద్దీ.. మితిమీరిన వేగం.. ట్రాఫిక్ నిబంధనల బేఖాతరు వలస కూలీల ప్రాణాలను బలిగొన్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శంషాబాద్– షాబాద్ రోడ్డుపై ట్రాఫిక్ పెరిగిపోయింది. రెండు లైన్ల దారిగా ఉన్న ఈ మార్గంలో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకెళ్తున్నాయి. పైగా దుర్ఘటన జరిగిన ప్రదేశం ఎత్తుగా ఉండడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో కవ్వగూడ వెళ్లే మార్గం వద్ద మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్విన కాలువను పూడ్చి వేయగా.. అక్కడ గుంతలు పడ్డాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్డుపై ఓ వైపు సిమెంటుతో గుంతను పూడ్చివేయగా.. అది కాస్త ఎత్తుగా మారింది. దీంతో శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్లే వాహనదారులు ఇక్కడికి రాగానే కుడి వైపు నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాళ్లగూడ నుంచి రహదారి పూర్తిగా చీకటిగా ఉంటుంది. అమ్మపల్లి, నర్కూడ సమీపంలో ఉన్న మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. లారీల్లో జనం తరలింపు.. నిబంధనలకు విరుద్ధంగా జనాలను లారీల్లో తరలిస్తున్నారు. మండల పరిధిలోని సుల్తాన్పల్లి, కవ్వగూడ, నర్కూడ శివారుల్లో పదికి పైగా ఇటుక బట్టీలున్నాయి. ఇందులో వందల కుటుంబాలు పని చేస్తున్నాయి. వీరంతా సరుకులు, కూరగాయల కోసం ప్రతీ ఆది, గురువారాల్లో శంషాబాద్ వస్తుంటారు. ఇందుకోసం బట్టీల నిర్వాహకులు కూలీలను లారీల్లోనే పంపిస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలా కూలీలను లారీల్లో తరలిస్తుండటంతో ప్రమాదాల సమయంలో వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ మార్గంలో ఆటోల్లో సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో అతివేగంతో తిరుగుతుంటాయి. -
శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
శంషాబాద్: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా... 15 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 30 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు. -
పెళ్లి పేరుతో ఘరాన మోసం.. కోరిక తీర్చుకొని ఆపై!
సాక్షి, శంషాబాద్: పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ప్రకాష్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేబీ. దొడ్డికి చెందిని బైండ్ల రాజేందర్(25) అదే గ్రామానికి చెందిన యువతి(19) పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో అనేక సార్లు శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా ముఖం చాటేశాడు. ఎన్ని సార్లు పెళ్లి ప్రస్తావని తీసుకొచ్చిన మోఖం చాటేశాడు. దీంతో, తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
దొంగోడి తిప్పలు; భక్తుడిలా గుడికి.. చెట్టుతొర్రలో ఇరుక్కుని..
సాక్షి, శంషాబాద్ రూరల్: ఆలయంలో నగదు చోరీ చేసిన ఓ మైనర్ బాలుడు.. తిరిగి ఆలయం నుంచి బయటకు వస్తూ చెట్టుతొర్రలో ఇరుక్కుపోయాడు. ఆలయ పూజారి వచ్చి గమనించి ఆ బాలుడిని పట్టుకున్నాడు. శంషాబాద్ మండలం ఇందిరానగర్ దొడ్డి ప్రాంతానికి చెందిన బాలుడు(11) సోమవారం మధ్యాహ్నం ఘాంసిమియాగూడలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ప్రధాన ఆలయంలోకి భక్తుడిలా వచ్చాడు. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని గుడిలోపలికి వెళ్లాడు. అయితే పూజలు చేస్తున్నట్లుగా నటించి ఏకంగా ఆలయం లోపల టేబుల్ ఖానాలో దాచి ఉంచిన రూ.10వేలను తస్కరించాడు. తిరిగి అదే చెట్టు తొర్రలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ అందులో ఇరుక్కుపోయాడు. అయితే, కొద్దిసేపటి తర్వాత ఆలయానికి వచ్చిన పూజారికి టేబుల్ ఖానాలోని నగదు కనిపించలేదు. దీంతో ఆయన స్థానికులతో కలిసి సీసీ పుటేజ్ను పరిశీలించగా.. బాలుడు ఆలయంలోకి వచ్చి చెట్టుతొర్రలోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడు అందులోనే ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలుడి నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఈ బాలుడు సెల్పోన్ దొంగతనం సంఘటనలో నిందితుడుగా ఉన్నట్లు సీఐ ప్రకాష్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి.. -
మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్లో బంగారం
శంషాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి అక్రమార్కులు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఓ వైపు కట్టడి చేస్తున్నా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఫ్లైదుబాయ్ ఎయిర్లైన్స్ –8779 విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఐదుగురు ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి లగేజీలో ఉన్న కటింగ్ ప్లేర్లు, మిక్సీగ్రైండర్లను పరిశీలించగా.. బంగారంతో తయారు చేసిన కటింగ్ ప్లేర్లకు ఇనుప పూత వేశారు. అలాగే మిక్సీ గ్రైండర్ లోపల ఉండే మోటార్ యంత్రాల్లో కూడా బంగారు ప్లేట్లను అమర్చారు. అనుమానం రాకుండా సిల్వర్ కోటింగ్ వేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ. 1.15 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారంతో పట్టుబడిన ప్రయాణికులు క్యారియర్లుగా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ కరెన్సీ పట్టివేత దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్కు చెందిన ఓ ప్రయాణికుడు మంగళవారం అర్ధరాత్రి ఎఫ్జెడ్–8776 విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 30,000 అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. వీటి విలువ భారత కరెన్సీలో రూ.21,48,000 ఉంటుం దని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్టైలిష్ వాక్, లవ్లీ జంపింగ్స్... స్విమ్మింగ్తో డాగ్స్ సందడి
-
శంషాబాద్ లో ఘోర ప్రమాదం
-
ఆర్జీఐఏకు ఎయిర్పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు
శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా ఆర్జీఐఏ నిలిచింది. ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, ప్రయాణికుల సంతృప్తి ఆధారంగా అంతర్జాతీయ విమానాశ్రయ మండలి ఆర్జీఐఏకు ఎయిర్పోర్టు సర్వీస్ క్వాలిటీ అవార్డు అందజేసినట్లు జీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి. సర్వీస్ క్వాలిటీ అవార్డు పొందడం పట్ల జీఎంఆర్ హెచ్ఐఏల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సురక్షితమైన సేవలందించడంలో కోవిడ్ మరింత అప్రమత్తం చేసిందని ఎయిర్పోర్ట్ ఈడీ, సౌత్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కిషోర్ పేర్కొన్నారు. -
రిజిస్టార్ను బురిడీ.. రూ.కోటిన్నర స్థలం హాంఫట్
సాక్షి, శంషాబాద్: నకిలీ పత్రాలతో ఇద్దరు వ్యక్తులు కోటిన్నర విలువ చేసే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సీఎంఓ పేరిట పలుమార్లు ఫోన్ చేసి రిజిస్టార్ను బురిడీ కొట్టించారు. జరిగిన తప్పు తెలుసుకున్న రిజిస్టార్ కార్యాలయం సిబ్బంది పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. విమానాశ్రయంలో భూములు కోల్పోయిన బాధితులకు శంషాబాద్ పట్టణంలో ఎయిర్పోర్టు కాలనీలో సర్వే నంబర్ 626/1లో ప్లాట్లను 2003లో కేటాయించారు. వీటికి అప్పట్లో పట్టా సర్టిఫికెట్లను మాత్రమే జారీచేశారు. అయితే, ఇప్పటికీ కొన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై కన్నేసిన మోసగాళ్లు పెద్ద కుట్రకు తెరలేపారు. ఈ సంవత్సరం జనవరి నెలలో కుమ్మరి అమృత అనే మహిళ ఎయిర్పోర్టు కాలనీలో ప్రభుత్వం తనకు కేటాయించిన 360 గజాల ప్లాటును మొకరాల శ్రీనివాస్శాస్త్రికి విక్రయించేందుకు శంషాబాద్ సబ్రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లింది. ఆమె పేరిట ఉన్న పట్టాపై అనుమానం వ్యక్తం చేసిన శంషాబాద్ సబ్ రిజిస్టార్ సిద్ధిఖీ రిజిస్ట్రేషన్కు నిరాకరించారు. దీంతో అక్రమార్కులు నకిలీ పత్రాన్ని సృష్టించారు. ప్రస్తుత రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ జనవరి 19న కుమ్మరి అమృత సరైన లబ్దిదారు అంటూ నకిలీ పత్రాన్ని తయారు చేసి సబ్రిజిస్టార్ కార్యాలయంలో సమర్పించారు. అంతేగాకుండా ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) నుంచి అంటూ రిజిస్టార్కు పలుమార్లు ఫోన్లు కూడా చేయించారు. దీంతో సబ్రిజిస్టార్ వీటిపై పూర్తిగా విచారణ చేయకుండానే ఈ నెల 15న కుమ్మరి అమృత నుంచి శ్రీనివాస్శాస్త్రికి 360 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేశారు. కాగా కుమ్మరి అమృత పాత్రను కూడా కొనుగోలుదారులే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. అది బర్త్ సర్టిఫికెట్.. మోసగాళ్లు ఆర్డీఓ పేరిట తయారు చేసిన పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించగా అది నకిలీదిగా నిర్ధారణ అయింది. ఉన్నతాధికారులు జారీ చేసే పత్రాలపై ఎక్కడా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఎంబ్లం ఉండదని తేల్చిచెప్పారు. అంతేగాకుండా సదరు పత్రంలో వేసిన ఎస్డీసీఎల్ఈ(ఎల్ఏపీ) బి/691/2003 రికార్డుల పరిశీలనలో అప్పటి చేవెళ్ల ఆర్డీఓ పరిధిలో ఉన్న బాలానగర్ నివాసికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఆర్డీఓ జారీ చేసినట్లుగా ఇచ్చిన పత్రం పూర్తిగా నకిలీదిగా తేలింది. కొనుగోలుదారుడైన వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఈ తంతంగాన్ని నడిపించారు. మరికొన్ని ప్లాట్లు కూడా ఇదేవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు పథకాన్ని రచించారు. కేసుల నమోదుకు సూచించాం.. విమానాశ్రయం భూ నిర్వాసితులకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం నుంచి అధికారులెవరూ లేఖలను ఇటీవల జారీ చేయలేదు. సదరు వ్యక్తులు సబ్రిజిస్టార్ కార్యాలయంలో ఇచ్చిన లేఖ నకిలీది. అధికారికంగా మేము జారీచేస్తున్న వాటిలో ఎక్కడ కూడా తెలంగాణ రాజముద్ర ఉండదు. లేఖలో వారిచ్చిన నంబరుపై ఇక్కడ మేము బర్త్ సరి్టఫికెట్ జారీ చేసినట్లు ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాల్సిందిగా సబ్రిజిస్టార్కు సూచించాం. – చంద్రకళ, రాజేంద్రనగర్ ఆర్డీఓ నకిలీ డాక్యుమెంట్గా తేలింది తొలుత మేము పట్టా సర్టిఫికెట్తో రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో పలుమార్లు సీఎంఓ నుంచి అంటూ ఫోన్లు చేయించారు. అంతేగాకుండా ఆర్డీఓ జారీ చేసినట్లు లబ్దిదారులు లేఖను అందజేయడంతో సరైనదేనని భావించి రిజిస్ట్రేషన్ చేశాం. అనంతరం పరిశీలనలో అది నకిలీ డాక్యుమెంట్గా తేలింది. కొనుగోలుదారుడే వాటిని మాకు సమర్పించాడు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. నకిలీ సర్టిఫికెట్లు అందజేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – సిద్ధిఖీ, సబ్ రిజిస్టార్, శంషాబాద్ చదవండి: ఏ బస్సు ఎప్పుడొస్తుందో..? -
శంషాబాద్ ఎయిర్పోర్టుకు అరుదైన గుర్తింపు
శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ మండలి నుంచి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు లభించింది. 2020లో ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా సేవలు అందించినందుకుగాను ఈ గుర్తింపు దక్కిందని ఎయిర్పోర్టు వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. కోవిడ్–19 పరిస్థితుల్లో కాంటాక్ట్లెస్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు దేశంలోనే ఈ–బోర్డింగ్ సదుపాయం కలి్పంచిన తొలి విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్పోర్టు ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అభినందనీయమని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(గెయిల్) సీఈఓ ప్రదీప్ ఫణీకర్ పేర్కొన్నారు. -
చిరుత కాదు.. అడవి పిల్లులే
సాక్షి,/హైదరాబాద్/శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లు లేవని, చుట్టుపక్కల ప్రజలు, విమానాశ్రయ సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని అటవీ శాఖ స్పష్టం చేసింది. కెమెరాల్లో కేవలం ఊర కుక్కలు, అడవి పిల్లులు, పందులు మాత్రమే కనిపించాయన్నారు. చిరుతపులి కదలికలున్నాయని, అడవి పందులను చంపుతోందని విమానాశ్రయం అధికారుల ఫిర్యాదుతో వాటిని పరిశీలించగా వాటిని కుక్కలు చంపినట్లుగా ఆధారాలు లభించినట్టు పేర్కొంది. అధికారులు విజ్ఞప్తితో ముందు జాగ్రత్తగా 10 ట్రాప్ కెమెరాలు కూడా పెట్టగా, వాటిలో చిరుతపులి కదలికలేవీ కనిపించలేదని తెలిపింది. విమానాశ్రయం ప్రహరీ దూకినట్లుగా గతంలో సీసీ కెమెరాలకు లభించిన ఆధారాలు సివిట్ క్యాట్ వి (మానుపిల్లి) అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్పోర్టు అధికారుల విజ్ఞప్తి మేరకు మరొక 10 ట్రాప్ కెమెరాలు, (మొత్తం 20), రెండు బోనులు (ట్రాప్ కేజెస్) కూడా పెట్టినట్టు తెలియజేశారు. (చదవండి: అది చిరుతేనా?) -
3 నెలలుగా బాలికపై యజమాని అఘాయిత్యం
సాక్షి, శంషాబాద్: పూల దుకాణం యజమాని ఓ బాలికపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలాన్నాయి. స్థానిక హుడా కాలనీలో నివసించే బాలిక(14) పట్టణంలోని సతీష్(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలికను బైక్పై ఇంటి వద్ద వదిలేసే క్రమంలో మూడు నెలలుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించడంతో బాలిక అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపారు. సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్గన్తో వ్యక్తి హల్చల్
సాక్షి, శంషాబాద్: కొంతకాలంగా ఎయిర్గన్తో హల్చల్ చేస్తూ స్థానికులను బెదిరిస్తున్న ఓ వ్యక్తిని ఆర్జీఐఏ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని తొళ్లబస్తీకి చెందిన సోహైల్(22) గత కొన్ని రోజులుగా తుపాకీ వెంట పెట్టుకొని సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానని స్థానికులను బెదిరిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సున్నంబట్టి సమీపంలో కొందరు వ్యాపారులను మామూళ్లు ఇవ్వాలంటూ బెదిరించడంతో వారు ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సోహైల్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న తుపాకీని పరిశీలించగా ఎయిర్గన్గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: పీపీఈ కిట్తో వ్యక్తి హల్చల్.. పరుగో పరుగు -
చినజీయర్ స్వామిని కలిసిన మధ్యప్రదేశ్ సీఎం
శంషాబాద్ రూరల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మంగళవారం ముచ్చింతల్లోని జీవా ప్రాంగణంలో చినజీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు చేరుకున్న చౌహాన్కు అహోబిల జీయర్ స్వామి, ఆశ్రమం సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం దివ్యసాకేతాలయంలో చినజీయర్స్వామి పర్యవేక్షణలో జరిపిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్కు చినజీయర్ స్వామి తీర్థ ప్రసాదాలు, మంగళశాసనాలు అందజేశారు. ఆశ్రమం సమీపంలో జరుగుతున్న సమతాస్ఫూర్తి కేంద్రం పనులను జీయర్స్వామితో కలసి చౌహాన్ పరిశీలించారు. -
ధరణి సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: ధరణి సేవలు షురూ అయ్యాయి. దాదాపు 2 నెలలుగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ సోమవారం లాంఛనంగా ప్రారంభమ య్యాయి. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసింది. ధరణి పోర్టల్నే భూరికార్డుగా పరిగణిస్తూ సాగు భూముల రిజిస్ట్రేషన్ల సేవలను తహసీల్దారు కార్యాలయంలోనే నిర్వహించేలా గత సెప్టెంబర్లో భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం –2020(ఆర్వోఆర్)ను ప్రభుత్వం తెచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించేందుకు తలపెట్టిన ధరణి పోర్టల్ను గతనెల 29న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే సాంకేతిక సమస్యలన్నిం టినీ అధిగమించి సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు ఉదయం 10.30 గంటలకే 946 మంది రిజిస్ట్రేషన్ల కోసం ఫీజులు చెల్లించగా... 888 మంది స్లాట్బుక్ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలంలో తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కొనుగోలుదారుకు అందించారు. మండలానికి చెందిన మంచాల ప్రభాకర్ తన భార్య ప్రశాంతి పేరుతో 4 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన భార్యకు డిజిటల్ సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్ పత్రాలను సోమేశ్కుమార్ అందజేశారు. స్మార్ట్గా స్లాట్ బుకింగ్... ధరణి పోర్టల్లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది వరకు రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ను సంప్రదించి, కొంత నగదును కమిషన్ రూపంలో ఇస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితంగా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొనుగోలు/అమ్మకందారుడెవరైనా నేరుగా స్మార్ట్ఫోన్ ద్వారా స్లాట్బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులిరువురితోనే పూర్తయ్యేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అలాగే మీసేవా కేంద్రాల్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1.48 ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్ ప్రింట్ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తితే కంటి చూపు (ఐరిస్) ద్వారా వివరాలు అప్డేట్ చేసేలా వెసులుబాటు కల్పించారు. పారదర్శకంగా పోర్టల్: సోమేశ్కుమార్ ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంది. భూముల క్రయవిక్రయదారులు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా, స్వేచ్ఛగా ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ఉన్న చోట తహసీల్దార్లు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. రెండుమూడు రోజుల్లో సమస్యలను పూర్తిగా పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. -
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ధరణి సేవలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా సోమవారం నుంచి ధరణి సేవలు ప్రారంభం అయ్యాయి. శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయి. కాగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాలా అక్టోబర్ 29న ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్ల కోసం 946 మంది నగదు చెల్లించగా, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. మీసేవా కేంద్రాల్లోనూ రూ.200 లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చున్నారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లపై త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామని, ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా , ఎలాంటి అవినీతికి తావు లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. (ప్రతి ఇంచూ డిజిటల్ సర్వే ) -
ఎయిర్పోర్టులో సందడి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. లక్షలాది మంది వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశీయ సర్వీసులతో పాటు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు.. కోవిడ్ కారణంగా ఎయిర్పోర్టులో షాపింగ్ చేసేందుకు భయపడిన జనం.. ఇప్పుడు సరదాగా షాపింగ్ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత జీవన విధానాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 23 నుంచి మే 25 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. సరుకు రవాణా కార్గో విమానాలు మాత్రమే నడిచాయి. ఆ తరువాత వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు వందేభారత్ విమానాలను నడిపారు. ప్రయాణికులు మాత్రం కోవిడ్ భయాందోళనలతో రాకపోకలు సాగించారు. మే 25 నుంచి దేశీయ ప్రయాణాలను పునరుద్ధరించారు. మొదట్లో ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రస్తుతం అన్లాక్లో భాగంగా అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు పునరుద్ధరించడంతో జనజీవితంలోనూ అనూహ్య మార్పులు వచ్చాయి. కోవిడ్కు ముందు ఉన్న పరిస్థితులు నెలకొన్నా యి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ వ్యాపార కార్యకలాపాలు పెరిగినట్లు జీఎమ్మార్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. 6 లక్షలు దాటిన ప్రయాణికులు... ► హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, విశాఖ సహా సుమారు 70 నగరాలకు రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ► కోవిడ్కు ముందు ప్రతిరోజూ 55 వేల మందికి పైగా దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఇప్పుడు సగటున 20 వేల నుంచి 22 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. ► ఇక అంతర్జాతీయంగా గతంలో ప్రతిరోజు 10 వేల మంది రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు 3 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ► బ్రిటన్తో పాటు, దుబాయ్, ఖతార్ తదితర గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు పెరిగాయి. త్వరలో మరిన్ని దేశాలకు విమానాలు నడిచే అవకాశం ఉంది. ► సెప్టెంబర్లో 7 వేల దేశీయ సర్వీసులు, 665 అంతర్జాతీయ సర్వీసులు హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ► ఈ ఒక్క నెలలోనే 6 లక్షల మందికి పైగా దేశీయ, 38 వేలకుపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. యూవీ ఓవెన్లో పెట్టి.. ఎయిర్పోర్టులో 80 షాపింగ్ ఔట్లెట్స్ ఉన్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువును యూవీ ఓవెన్లలో పెట్టి ఇస్తున్నారు. దీంతో వైరస్ పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ట్రయల్ రూమ్స్తో పాటు, షాపింగ్ సెంటర్లను కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. షాపింగ్ ఔట్లెట్స్లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
చిన్నజీయర్ స్వామిని పరామర్శించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సోమవారం రోజున ఆయన శంషాబాద్లోని ముచ్చింతల్ శ్రీరాంనగర్లోని చిన్న జీయర్స్వామి ఆశ్రమానికి వచ్చారు. సీఎం కేసీఆర్ దాదాపు గంటపాటు స్వామి వారితో ఆశ్రమంలో గడిపారు. అనంతరం తిరిగి నగరానికి బయలుదేరారు. కాగా.. గత శుక్రవారం రోజున చిన్న జీయర్స్వామి తల్లి అలివేలు మంగతాయారు స్వర్గస్తులు కావడంతో సీఎం కేసీఆర్ ఆశ్రమానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. (చినజీయర్స్వామికి మాతృ వియోగం) -
ఇంటి దొంగలను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర ఇంటి దొంగలను శంషాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లాక్డౌన్లో తరచూ దొంగతనాలకు పాల్పడిన పఠాన్ చాంద్ బాషా, సబేర్లను అనే ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని 20 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ గుల్భార్గాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. లాక్డౌన్లో మార్చి నుంచి జూలై వరకు వీరిద్దరూ 15 నేరాలకు పైగా పాల్పడ్డారని, ఇది వరకే వీరిపై తెలంగాణలో 15 పైగా కేసులు ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనాలకు చాంద్ బాషా స్కేచ్ వేయగా.. దొంగలించిన సోత్తును సాబేర్ డిస్పోస్ చేసేవాడని విచారణలో నిందితులు పేర్కొన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో వారు తాండూరు వద్ద నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇక గుల్బర్గ హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి నుంచి ఇక్కడుకు వచ్చి దొంగతనాలకు పాల్పడేవారని, ఈ నేపథ్యంలో మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్లో తరచూ నిందితులు నేరాలకు పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. -
అర్థరాత్రి మెడికోకు అసభ్యకరమైన సందేశాలు
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని వీజేఆర్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న మెడికోతో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిని ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆర్జీఐఏ సీఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన యువతి (24) ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతోంది. వందేభారత్ మిషన్లో భాగంగా ఏర్పాటు చేసిన విమానంలో సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. శంషాబాద్ పట్టణం నుంచి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా బెంగళూరుకు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిలబడగా.. ఆమెను గమనించిన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు చెందిన విజయ్కుమార్ (26) పురేందర్ కుమార్(25) శంషాబాద్ పట్టణంలోని వస్త్రవ్యాపారి పి.రామస్వామి కుమారుడు పి.ప్రవీణ్లు యువతితో మాటలు కలిపారు. బస్సు రావడానికి ఆలస్యమైతే పక్కనే ఉన్న వీజేఆర్ హోటల్లో గది తీసుకోవాల్సిందిగా ప్రోత్సహించారు. బస్సు రావడానికి సమయం చాలా ఉండడంతో వారి మాటలు నమ్మిన యువతి విశ్రాంతి కోసం హోటల్లో గది అద్దెకు తీసుకుంది. సదరు యువకులు అదే హోటల్లో కొన్ని రోజులుగా అద్దెకుంటున్నారు. హోటల్లో యువతి గదిలోకి వెళ్లినప్పటి నుంచి తరచూ ఆమెతో సంభాషించేందుకు యత్నించారు. అంతకుముందే ఆమె ఫోన్ నంబరు కూడా తీసుకోవడంతో యువతి ఫోన్కు అర్థరాత్రి సమయంలో అసభ్యకరమైన సందేశాలు పంపారు. రాత్రి 2 గంటల సమయంలో గది తలుపులు తట్టి అసభ్యకరంగా మాట్లాడడంతో అప్రమత్తమైన యువతి తన సోదరుడికి ఫోన్లో విషయం చెప్పింది. దీంతో నగరంలో ఉండే యువతి సోదరుడి స్నేహితులు ఆర్జీఐఏ పోలీసు స్టేషన్కు తెల్లవారుజామున చేరుకుని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విజయ్, పురేందర్ కుమార్, ప్రవీణ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీజేఆర్ హోటల్పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మోహన్బాబుకు ఆగంతకుల హెచ్చరికలు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు ఇంట్లోకి కార్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయన అక్కడ లేని సమయంలో గేటు వద్ద ఉన్న వాచ్మెన్తో మోహన్బాబును ఉద్దేశించి పలు హెచ్చరికలు చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి గ్రామ శివారులో సినీ నటుడు మోహన్బాబుకు సంబంధించిన మంచు టౌన్షిప్ పేరుతో నివాసం ఉంది. సాయంత్రం 5 గంటల సమయంలో లోపలి నుంచి బైక్ బయటకు వెళ్లడానికి వాచ్మెన్ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో బయట నుంచి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు లోనికి ప్రవేశించింది. ఇది గమనించిన వాచ్మెన్ ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో కారులో ఉన్నవారు ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని డోర్ తెరిచి దూషిస్తూ వేగంగా వెళ్లిపోయారు. వాచ్మెన్ ఇచ్చిన సమాచారంతో మోహన్బాబు కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మోహన్బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ‘ ఏపీ 31 ఏఎన్ 0004 ’ నంబరు గల కారులో దుండగులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. -
ఎంత కాలం నటిస్తావు..?
శంషాబాద్: మూడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి.. ఆత్మహత్యకుకు ముందు భర్త వెంకటేశ్వరావును ఉద్దేశించి మాట్లాడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అతడి ప్రవర్తనతో విసిగి జీవితంపై విరక్తితో ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నాని లావణ్య లహరి గతంలోని ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.. అదే రోజు ఆ వీడియోకు ముందు వెంకటేశ్వర్రావును ఉద్దేశించి కూడా లావణ్య మాట్లాడిన మరికొంత వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ‘సమాజాన్ని మోసం చేయడానికి ముసుగు వేసుకుని నటిస్తున్నావు.. ఎంత కాలం నటిస్తావు..? నీ కుటుంబ చరిత్ర కూడా ఎంతో హీనమైంది.. నిన్ను కూడా అదే దారిలో నడిపించాలని వారు చూస్తున్నారు. ప్రేమ.. ప్రేమ అని వెంటపడి నన్ను మోసం చేశావు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘డబ్బుతో ఏ నీచానికైనా ఒడిగట్టాలనే మనస్తత్వం నీది.. మన మధ్యన ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదు. ఏడు నెలల గర్భం పోయి నేను బెడ్పై ఉన్నప్పుడు మరో ఆడదానితో చాటింగ్ చేశావు. రేపు దానిని కూడా నువ్వు మోసం చేస్తావు’ అని లావణ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నీవు నన్ను కొట్టిన ప్రతి దెబ్బలను ప్రతి గోడ చెబుతుంది.. అంతలా నన్ను శారీరకంగా హింసించావు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, గతంలోని వీడియోకి అనుబంధంగానే ఈ వీడియో ఉన్నప్పటికీ.. అప్పుడు బయటికి వచ్చిన వీడియో మధ్యలోంచి ఉంది.. ఇందులో ఆమె భర్తను నేరుగా ప్రశ్నించి.. ఆవేదన వ్యక్తం చేసినట్లు ఉంది. -
అందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది?: లావణ్య
-
‘పెళ్లాం ఉండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నావు’
సాక్షి, హైదరాబాద్ : భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్యకు పాల్పడటం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆత్మహత్యకు ముందు లావణ్య రికార్డు చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో లావణ్య చెప్పుకున్న బాధలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ప్రేమ పేరుతో తన భర్త వెంకటేశ్ ఏ విధంగా మోసం చేశాడో లావణ్య ఈ వీడియోలో వివరించారు. అయినా అతడి మీద ప్రేమ చావలేదని కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తనను ఎంతో ప్రేమించారని.. కానీ వాళ్లను మోసం చేసి ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నందుకు క్షమించాలని కోరారు. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం) ‘ప్రేమించానని వెంటపడ్డావు. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు. నీ మీద నమ్మకంతో తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైన తర్వాత నీ నిజస్వరూపం తెలిసింది. బయటకు ఎన్నో నీతులు చెప్తావు.. కానీ నీకు అసలు వ్యక్తిత్వం ఉందా?. నేను గర్భిణిగా ఉన్నప్పుడు.. నువ్వు మరోకరితో సంబంధం పెట్టుకున్నావు అని తెలిసింది. నా ముందే వాళ్లతో వీడియో కాలింగ్లో మట్లాడేవాడిని. అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు తప్పని చెప్పినందుకు నాపై దాడి చేశావు. అనేక సార్లు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టావు. హింసించావు. ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది. నీ గురించి తెలిసిన రోజే నిన్ను వదిలేసి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకపోవడం నేను చేసిన తప్పు. నీకు, నీ కుటుంబానికి బంధుత్వాల గురించి తెలియవు. కుక్కలకైనా తిన్న విశ్వాసం ఉంటుంది.. మీ కుటుంబానికి అది కూడా లేదు. తప్పు చేస్తుంటే నీ తండ్రే నీకు మద్దతుగా నిలుస్తున్నాడు. పెళ్లాం.. ఉండగానే శిరీష అనే అమ్మాయితో తిరుగుతున్నావు. ఇలా ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశం చేస్తావు. నేను ఇక ఉండను కాబట్టి.. కనీసం ఆమెను అయినా పెళ్లి చేసుకో. మరోక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. నీ ముఖానికి ఉన్న మాస్క్ తీసేయ్. (ఇక భరించలేను.. ఉండలేను! ) ఎన్నో ఆశలతో నీతో భవిష్యత్తును ఊహించుకున్నాను. పెళ్లి తర్వాత నీ విశ్వరూపం తెలిసింది. నేను సంపాందించి అంతా నీ పేరున వేసుకున్నావు. నీకు ఉద్యోగం లేకపోయినా ఏళ్ల తరబడి పోషించాను. నీకు ఉద్యోగం వచ్చాక హింసించడం మొదలు పెట్టావు. కావాలంటే నా పే స్లిప్లు చూడండి. నేను సంపాదించింది ఎంతో తెలుస్తోంది. డాడీ వీడి వద్ద 48 లక్షలు తీసుకోండి.. ఒక అబ్బాయిని దత్తతు తీసుకుని మంచిగా పెంచండి. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.. ఎంతో ఇచ్చారు.. కానీ దాని మోసం చేసి వెళ్లిపోతున్నాను. మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం.. ఈ వెధవ అన్న నాకు చాలా ఇష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని లావణ్య తెలిపారు. మరోవైపు లావణ్య ఆత్మహత్య కేసులో శంషాబాద్ పోలీసులు ఇప్పటికే ఆమె భర్త, అత్తమామలు, ఇద్దరు ఆడపడుచుల్ని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. -
లావణ్య ఆత్మహత్యలో మరో వ్యక్తి..
శంషాబాద్: భర్త ప్రవర్తనతో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడిన సాప్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి కేసులో మరో నలుగురు నిందితులను ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్కు తరలించారు. పట్టణంలోని సీఎస్కే విల్లాలో పైలట్ వెంకటేశ్వర్రావుతో కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భార్య లావణ్య లహరి నివాసముండేది. భర్త చెడుతిరుగుళ్లతో ఆమె మనస్తాపం చెందింది. అదేవిధంగా వెంకటేశ్వర్రావు భార్యను మానసినంగా వేధిస్తుండేవాడు. ఈనేపథ్యంలో గతనెల 25న సూసైడ్నోట్ రాసిన లావణ్య లహరి సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం) లావణ్య ఆత్మహత్యకు కారణమైన ఆమె భర్త వెంకటేశ్వర్రావుతో పాటు అత్తమామలతో పాటు ఆడపడుచు, మరో బంధువుపైనా బంధువులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్జీఐఏ పోలీసులు సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకితో పాటు వరిమడుగు గ్రామంలో తలదాచుకున్న అత్త రమాదేవి, ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీకుమారితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈమేరకు వారిని మంగళవారం రిమాండ్కు తరలించారు. వెంకటేశ్వర్రావు తండ్రి సుబ్బారావు పరారీలో ఉన్నాడు. అయితే, ఈ కేసులో ఇప్పటికే పోలీసులు లావణ్య లహరి భర్త వెంకటేశ్వర్రావును రిమాండుకు తరలించారు. -
లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య భర్త పైలట్ వెంకటేశ్వర్రావుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరో మహిళతో వెంకటేశ్వర్రావు ఉండగా.. లావణ్యకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీంతో లావణ్య అతడిని నిలదీసింది. అయితే ఆ తర్వాత నుంచి వెంకటేశ్వర్రావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంట్లో ఉండే ఆ మహిళతో సోషల్ మీడియాలో చాటింగ్ చేయడంతో పాటు.. లావణ్య ముందే ఆమెకు వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడు. (చదవండి : ఇక భరించలేను.. ఉండలేను!) దీంతో లావణ్య తనకు అన్యాయం చేయవద్దని ఆ మహిళను వేడుకున్నారు. మరోవైపు తీరు మార్చుకోని వెంకటేశ్వర్రావు.. లావణ్యపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. గర్భవతి అనికూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య మరింత ఉద్వేగానికి లోనయ్యారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రూపం తెలుసుకుని మనస్తాపం చెందారు. ఈ క్రమంలో లహరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో లావణ్య మృతికి సంబంధించి మరో మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. మరోవైపు తమ కూతురిని వెంకటేశ్వర్రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్ లైసెన్స్ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కాగా, శంషాబాద్లోని సీఎస్కే విల్లాలో నివాసం ఉంటున్న లావణ్య భర్త వేధింపుల కారణంగా శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : వీడియో: పైలట్ మొగుడి పైశాచికం!) -
లావణ్య కథ..!
-
పరారీలో పైలట్ తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని లావణ్య లహరి ఆత్మహత్య కేసులో ఆమె భర్త వెంకటేశ్వరరావును పోలీసులు రిమాండ్కు తరలించారు. లావణ్య అత్తామామ రమాదేవి, మల్లాది సుబ్బారావు పరారీలో ఉన్నట్టు తెలిసింది. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే లావణ్య లహరి (32) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. భర్త వెంకటేశ్వరరావు ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. లావణ్య, వెంకటేశ్వరరావుది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. వారిద్దరు ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. (చదవండి: వీడియో: పైలట్ మొగుడి పైశాచికం!) వెంకటేశ్వర్రావు ఓ ప్రైవేటు ఎయిర్లైన్స్లో పైలట్. లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సీఎస్కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. దాంతో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆమె శుక్రవారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడింది. ఇదిలాఉండగా.. లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. (చదవండి: కరోనా జయించిన బాలాపూర్ సీఐ) -
ఇక భరించలేను.. ఉండలేను!
శంషాబాద్: రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (ఆర్జీఐఏ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పైలట్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త ప్రవర్తనతో విసిగి.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేసింది. సీఐ విజయ్కుమార్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్రావు, అదే జిల్లా అద్దంకికి చెందిన లావణ్య లహరి ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో 2012లో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశ్వర్రావు ఓ ప్రైవేటు ఎయిర్లైన్స్లో పైలట్. లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని సీఎస్కే విల్లాలో ఉంటున్నారు. వీరికి సంతానం కలగలేదు. వెంకటేశ్వర్రావు కొంతకాలంగా మరో మహిళతో చనువుగా ఉండటంతో పాటు సంతానం కలగలేదనే వేధింపులు పెరగడంతో లహరి మనస్తాపం చెందింది. గురువారం రాత్రి కూడా ఇదే విషయమై దంపతులు గొడవపడ్డారు. చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా.. భర్త ప్రవర్తన మారడం లేదని, వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడనే ఆవేదనతో లావణ్య సూసైడ్ నోట్ రాసింది. ఓ సెల్ఫీ వీడియోలోనూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ‘ప్రేమించడమంటే చచ్చేవరకు ప్రేమించాలన్న నమ్మకంతో ఇంతకాలం గడిపాను. గృహహింస కేసు పెట్టమన్నారు. కానీ, వాడిని ఇప్పటికీ ప్రేమిస్తున్నాను.. వాడి పాపాలతో వాడే పోతాడు.. కానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావట్లేదు.. వేరే మహిళతో తిరిగి వస్తున్న వ్యక్తికి సేవలు చేసే దౌర్భాగ్యమేంటి. నా లోపాలను సరిదిద్దుకున్నాను. వాడు మాత్రం తను చేసింది తప్పుగానే గుర్తించట్లేదు. ఇలాంటి వాడికి సేవలు చేసే కర్మేంటి నాకు.. ఇక భరించలేను. ఉండలేననే నిర్ణయం ఈ రోజు తీసుకుంటున్నాను’ అని సెల్ఫ్ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టింది. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భర్త వెంకటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురిని వెంకటేశ్వర్రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్ లైసెన్స్ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరారు. -
దివ్యసాకేతాలయంలో మధ్యప్రదేశ్ సీఎం పూజలు
శంషాబాద్ రూరల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ దంపతులు శుక్రవారం ముచ్చింతల్లోని దివ్యసాకేతాలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం చౌహాన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ముచ్చింతల్లో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం ఉదయం దివ్యసాకేతాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. చినజీయర్స్వామి పర్యవేక్షణలో నిర్వహించిన సుదర్శన హోమంలో పాల్గొన్నారు. 216 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న శ్రీ భగద్రామానుజుల వారి సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడి గురుకుల వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఆలయంలో వంట పనులు చూసుకునే మనోజీ కూతురు ఆకాంక్ష మిశ్ర పదో తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించడంపై సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్రావు దంపతులు పాల్గొన్నారు. -
హెచ్ఎండీఏ నర్సరీలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 6వ విడత హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఇందుకోసం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) శంషాబాద్లోని హెచ్ఎండీఏ నర్సిరీ మొక్కలను బుధవారం పరీశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో మొక్కలను పెంచుతున్న తీరు, ఏఏ మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలపై ఆయన ఆరా తీశారు. ఇక ఈ మొక్కలను ప్రజలకు అందించే ప్రక్రియ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. (హామీలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి) అక్కడ పనిచేసే అర్హులైన వారందరికీ ఈఎఫ్, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది 6వ విడత హరితహార కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడతామని చెప్పారు. పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడంపై ఇప్పటికే తమ శాఖ తరపున ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. హరితహారంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా మొక్కల కావాల్సి వస్తే నగర పరిధిలో ఉన్న నర్సరీలలో నుంచి ఉచితంగా తీసుకోవచ్చని, ఒకటి రెండు రోజుల్లో నగరంలోని నర్సరీల సమగ్ర సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు. (హరిత పట్నం కావాలి: కేటీఆర్) -
మాస్క్లు లేకుండానే హోటళ్లలో వంట
శంషాబాద్: పట్టణంలో కోవిడ్ నింబంధనల అమలుపై అధికారులు దృష్టిసారించకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ తయారీ, హోటళ్లతోపాటు టీ సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది కనీసం మాస్కులు కూడా ధరించడం లేదు. హోటళ్లలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆహార పదార్థాలను తయారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తుంపర్ల ద్వారా కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికులు మాస్క్లు ధరించడం లేదు. పట్టణంలో టిఫిన్ సెంటర్లతో పాటు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, హోటళ్లు, వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న కార్యాలయాల్లో ఆరంభంలో హడావిడి చేసిన అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు. గతంలో మాస్కులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న కొందరికి జరిమానా వేశారు. పట్టణంలో కోవిడ్ వ్యాప్తి చెందకముందు చర్యలు తీసుకున్న అధికారులు ప్రస్తుతం మూడు కోవిడ్ కేసులు నిర్ధారణ అయినా దృష్టిసారించడం లేదు. పట్టణంలో కోవిడ్ నియంత్రణ కోసం నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
నేటి నుంచి 140 దేశీయ విమానాల రాకపోకలు
శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రాత్రి 1.20 గంటలకు పుణే నుంచి ఇండిగో విమానం శం షాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటుందని, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇండిగో వి మానం (6ఈ 732) ఇక్కడి నుంచి లక్నో వెళ్లడానికి షెడ్యూల్ నిర్ధారించినట్టు ఆదివారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 30 వరకు రాకపోకలు సాగించే విమానాల రాకపోకల షె డ్యూల్ను, నిర్ధారిత వేళల పట్టికను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. షెడ్యూ ల్లో మార్పుచేర్పులు ఉండనున్నాయి. నేడు గన్నవరం, విశాఖ సర్వీసులు రద్దు గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రా రంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్లన్నీ సాంకేతిక కారణాలు వల్ల రద్దయ్యాయి. రెండు ఎయిర్పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఫోన్ కొట్టు.. మద్యం పట్టు!
శంషాబాద్: ఓ వైపు లాక్డౌన్ కొనసాగుతున్నా శంషాబాద్లో మద్యం విక్రయాలు ఆగడం లేదు. ఫోన్ల ద్వారా మద్యాన్ని కోరుకున్న వారికి చేరవేస్తున్నారు. కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. మధ్యవర్తులు కూడా పట్టణంలోని కొన్ని దుకాణాల వద్ద అడ్డాగా చేసుకుని పనికానిచ్చేస్తున్నారు. ఈ తరహాలో అమ్మకాలు సాగిస్తున్న రాళ్లగూడ దొడ్డికి చెందిన మహేష్ అనే వ్యక్తిని నాలుగురోజుల కిందట ఎక్సైజ్ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. మద్యంప్రియుల బలహీనతలను కొందరు వ్యాపారులు, నేతలు భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ సమయాల్లో రూ.800 ఉన్న ఫుల్బాటిల్ ధర రూ.4వేలకు పెంచి విక్రయిస్తున్నారు.(లాక్డౌన్ తర్వాత నమోదైన కేసు ఇదొక్కటే..) నేతలు సైతం.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కొందరు నేతలు భారీగానే మద్యం సేకరించారు. అయితే, ఆ నిల్వలు కొందరు నేతల వద్ద ఇంకా ఉన్నట్లు సమాచారం. సదరు నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో తమకు తెలిసిన వారికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. మద్యం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కల్తీ కల్లు విక్రయాలు ఇదే తరహాలో జరుగుతున్నాయి. సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్పహాడ్లో పెద్ద ఎత్తు కల్తీ కల్లును ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (అధికార మీడియా మౌనం.. అసలు కిమ్కు ఏమైంది?) జోరుగా గుట్కా దందా.. శంషాబాద్ పట్టణంలో గుట్కాల దందా కూడా సాగుతోంది. ఆయా పాన్ డబ్బాల విక్రేతలు ద్విచక్రవాహనాలపై ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ఫోన్ల ద్వారా ఆర్డర్ తీసుకుని గుట్కాలు విక్రయిస్తున్నారు. మరికొందరు తమ డబ్బాలకు సమీపంలోనే అడ్డాలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున గుట్కాలను విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం తొండుపల్లి వద్ద సుమారు 15వేల విలువైన గుట్కా, పాన్ మసాలాను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందించండి శంషాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఎక్కడైనా మద్యం, కల్లు విక్రయాలు జరిగితే 9440902325 నంబరుకు సమాచారం అందించాలి. శంషాబాద్ పట్టణంలో ఫోన్ ద్వారా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో నాలుగు రోజుల కిందట ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశాం. మద్యం దుకాణాలన్నింటికీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మరోసారి తాళాలు వేశాం. స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మద్యం వచ్చే అవకాశాలుండడంతో ప్రజలు సమాచారం అందించి అధికారులకు సహకరించాలి.– శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ -
ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి అమెరికన్లు
సాక్షి, శంషాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో శుక్రవారం పలువురు అమెరికన్లు 2 ఎయిరిండియా విమానాల్లో ఇక్కడి నుంచి ముంబై మీదుగా వాళ్ల దేశానికి బయలుదేరారు. మధ్యా హ్నం 3 గంటల సమయంలో ఏఐ–1615 విమానం 69 మంది పెద్దలు, ఒక శిశువుతో ఇక్కడి నుంచి ముంబైకి బయల్దేరగా.. ఏఐ–1617 విమానం 96 మంది పెద్దలు, ఇద్దరు శిశువులతో సాయంత్రం 4.24 గంటలకు టేకాఫ్ తీసుకుంది. పూర్తి శానిటైజేషన్ చేసిన టెర్మినల్ ద్వారా వీరికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలతోపాటు ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు. లాక్డౌన్ తర్వాత శంషాబాద్ విమానాశ్రయం నుంచి కార్గో విమానాలు కాక 5 ప్రయాణికుల విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 7న కూడా ఇక్కడి నుంచి అమెరికాకు ఓ విమానం బయలుదేరి వెళ్లింది. -
ఓఆర్ఆర్పై మృత్యు 'వలస'
సాక్షి, రంగారెడ్డి / శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ శివారులో ఔటర్ రింగ్రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్, యాద్గిర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడు కుటుంబాలు తమ పిల్లలతో కలిసి సూర్యాపేటలో రహదారి పనులు చేయడానికి గత నెలలో వలస వచ్చాయి. లాక్డౌన్ కారణంగా అక్కడ పనులు నిలిచిపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీంతో వారిని ఇక్కడ పనికి కుదిర్చిన మేస్త్రీ.. కర్ణాటకకు చెందిన బొలేరో ట్రక్కును రప్పించాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు వీరంతా ట్రక్కులో బయల్దేరారు. పెద్దఅంబర్పేట జంక్షన్ నుంచి ఔటర్ మీదుగా వీరి వాహనం పెద్దగోల్కొండ శివారుకు అర్ధరాత్రి చేరుకుంది. ట్రక్కులో పది మంది చిన్నారులతో కలిపి 28 మంది ఉన్నారు. లోడ్ ఎక్కువగా ఉండడంతో పాటు వెనక టైర్లో గాలి తగ్గిపోవడంతో వాహనం వేగం ఒక్కసారిగా తగ్గింది. అదే సమయంలో నూజివీడు నుంచి మామిడికాయల లోడుతో వస్తున్న లారీ వేగంగా వీరి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు వెనక భాగంలో కూర్చున్న వారు రెండు వాహనాల మధ్య ఇరుక్కున్నారు. కొందరు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఐదుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ ఇద్దరు మృతి చెందారు. మృతులు వీరే.. హుబ్లీ నివాసి బి.శెట్టి (45), రాయదుర్గం వాసులు రంగప్ప (32), శరణప్ప (30), శ్రీదేవి అలియాస్ సిరియమ్మ (8), కక్కెరకు చెందిన బసమ్మ(32), హనుమంతప్ప (2), అమ్రిశ్ (25). ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలించారు. కాగా, ప్రమాద బాధిత కుటుంబాలను పోలీసులు శంషాబాద్లోని ఓ ఫంక్షన్హాలులో ఏర్పాటు చేసిన షెల్టర్కు తరలించారు. 8 మంది చిన్నారులు, ముగ్గురు పురుషులు, ఆరుగురు మహిళలు ఇందులో ఉన్నారు. వీరికి కన్నడ తప్ప మరేమీ రాకపోవడంతో వివరాలు సేకరించడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం వీరిని ప్రత్యేక బస్సులో స్వస్థలాలకు పంపించారు. డీసీపీ ప్రకాష్రెడ్డి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో ముగ్గురు.. కర్ణాటక యాద్గిర్ జిల్లా కక్కెరకు చెందిన సోమన్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. పెద్ద కూతురు రేఖమ్మను ఇంటి వద్ద వదిలి భార్య బసమ్మ, ముగ్గురు పిల్లలతో పాటు తన తమ్ముడు బుడ్డప్ప, పూజమ్మ దంపతులు, మరో తమ్ముడు అమ్రేశ్తో కలిసి సూర్యాపేటకు ఉపాధి కోసం వచ్చారు. ఔటర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమన్న భార్య బసమ్మ, కొడుకు హన్మంతు, తమ్ముడు అమ్రేశ్ మృతి చెందారు. వీరితో పాటు పని కోసం వీరిని ఇక్కడకు రప్పించిన మేస్త్రీ కూడా చనిపోయాడు. ‘పనుల్లేకపోవడంతో అందరం ట్రక్కులో ఊరికి బయల్దేరాం. చిన్నపిల్లలు పెద్దల ఒడిలో నిద్రపోతున్నారు. అంతలో వెనక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. గాయాలైన నా భార్య, కొడుకు, తమ్ముడు మరికొందరిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారికేం జరిగిందో తెలియడం లేదు. చనిపోయినట్లు చెబుతున్నారు. మేమంతా ఇక్కడ రాత్రి నుంచి మా వారి క్షేమం కోసం దేవున్ని వేడుకుంటున్నాం’అని సోమన్న అనే బాధితుడు రోదిస్తూ చెప్పాడు. -
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం