సంకీర్త్‌ కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ | bandaru dattatreya console sankeerth family | Sakshi
Sakshi News home page

సంకీర్త్‌ కుటుంబానికి దత్తాత్రేయ పరామర్శ

Published Thu, Jul 21 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

bandaru dattatreya console sankeerth family

హైదరాబాద్‌ : అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు విద్యార్ధి సంకీర్త్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం పరామర్శించారు. సుల్తాన్‌ బజార్‌లోని సంకీర్త్ నివాసానికి వెళ్లిన ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంకీర్త్ హత్య తనని కలచివేసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విషయంపై అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భగా సంకీర్త్‌ తం‍డ్రి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తనకు కలిగిన పుత్రశోకం ఎవరికీ రాకూడదన్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement