శంషాబాద్‌ నుంచి వెళ్లిన కాసేపటికే పక్షికి ఢీ | bird hits plane emergency landing in hyderabad | Sakshi

శంషాబాద్‌ నుంచి వెళ్లిన కాసేపటికే పక్షికి ఢీ

Published Sun, May 21 2017 9:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

శంషాబాద్‌ నుంచి వెళ్లిన కాసేపటికే పక్షికి ఢీ - Sakshi

శంషాబాద్‌ నుంచి వెళ్లిన కాసేపటికే పక్షికి ఢీ

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా): హాంకాంగ్‌ విమానానికి పెనుముప్పు తప్పింది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నుంచి హాంకాంగ్‌కు చెందిన విమానం బయలుదేరిన కాసేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలెట్‌ తిరిగి వెంటనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దించాడు. ఆదివారం వేకువ జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ వివరాల ప్రకారం ఆదివారం వేకువజామున 2.45 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హాంకాంగ్‌ బయలుదేరిన కేత్వే ఫసిపిక్ ఎయిర్‌లైన్స్‌ విమానం బయల్దేరింది.

35 నిమిషాల తర్వాత ఓ పక్షిని ఢీకొట్టింది. దాంతో పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్ళించి శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశాడు. పక్షి ఢీకొట్టిన విషయం తెలిసి విమానంలోని ప్రయాణీకులంతా వణికి పోయారు. ఈ విమానంలో 244 మంది ప్రయాణికులు ఉండగా చివరకు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం విమానాన్ని ల్యాండ్‌ చేసి వారందరినీ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్‌కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement