Hyderabad City
-
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
-
భాగ్యనగరంలో భూకంపం.. ఉలిక్కిపడ్డ నగరవాసులు
-
కుట్టు.. ఫొటో ఆకట్టు..
మనలో చాలా మంది జీవితంలో మరపురాని సందర్భాలను పదిలపరుచుకుంటారు. కొందరు వీడియోల రూపంలో దాచుకుంటే మరికొందరు ఫొటోల రూపంలో భద్రపరుచుకుంటారు. పుట్టిన పిల్లలకు సంబంధించి ప్రతి నెలా, ప్రతి సంవత్సరం విభిన్నంగా ఫొటో షూట్స్ చేసుకుంటున్నారు. అందరిలాగే మనం ఎందుకు ఉండాలని కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉండేవి కదా.. మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్తున్నారు. అలా సాధారణ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు కొత్త సొబగులు అద్దుతూ సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు చేతులతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ కొత్త లుక్ తీసుకొస్తారు. చీరలకు, జాకెట్లకు, డ్రెస్లకు ఎంబ్రాయిడరీ వర్క్స్ తరహాలోనే.. ఫొటోలకు ఎంబ్రాయిడరీ ఏంటని ఆశ్చర్యపోయేలా వర్క్ చేస్తున్నారు. అవును ఈ సరికొత్త ట్రెండ్ గురించే ఈ కథనం... ఫొటోలపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇటీవల నగరంలో ఫేమస్ అవుతోంది. చాలా ఏళ్ల నుంచి ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ పనితీరు ట్రెండింగ్లో ఉండగా, తాజాగా మన నగరంలోకి వచి్చంది. పెళ్లి ఫొటోలు, బర్త్డే ఫొటోలు, బేబీ బంప్ సందర్భంగా తీసిన ఫొటోలను ఫ్రేమ్స్ రూపంలో ఇంట్లో పెట్టుకోవాలనుకునే వారు.. నార్మల్గా కాకుండా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో ఫొటోలకు డిఫరెంట్ లుక్ తీసుకొచ్చి తగిలించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఫొటోలకే కాకుండా ఇంటికి కూడా సరికొత్త కళ వస్తోందని కస్టమర్లు అంటున్నారని నగరానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ చెబుతున్నాడు. ఎంబోజ్ వంటి ప్రింటింగ్తో కూడా ఇలాంటి ఎఫెక్ట్ తీసుకురావొచ్చని, అయితే దానికన్నా ఎంబ్రాయిడరీకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపాడు. ముఖ్యంగా ఇంట్లో తగిలించుకునే ఫొటో ఫ్రేమ్స్ విషయంలో ఎక్కువ మంది ఇలాగే అడుగుతున్నారని పేర్కొన్నాడు. ఎలా చేస్తారు..? సాధారణంగా పెళ్లి ఫొటోలు లేదా ప్రత్యేక అకేషన్లలో దిగిన ఫొటోలను బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్లో ప్రింట్ చేస్తారు. మనకు కావాల్సిన పరిమాణంలో ప్రింట్ తీసుకున్నాక.. మనకు కావాల్సిన మోడల్లో ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు. కలర్ ఫొటోల వెనుక తెలుపు రంగులో ఫొటో పేపర్ను అతికించి, దానిపై ఫ్రేమ్ మాదిరిగా, ఫ్లవర్స్ లేదా మరేదైనా మనకు కావాల్సిన డిజైన్ హ్యాండ్తో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు. లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోలపై వేసుకున్న డ్రెస్ కానీ, ధరించిన పూల దండలు, నగలను మాత్రమే హైలైట్ చేస్తూ రంగురంగుల దారాలతో అల్లుతారు. దీంతో ఫొటోకు సరికొత్త కళ వస్తుందని చెబుతున్నారు. కాస్త సమయం పట్టినా.. సాధారణంగా ఫొటో ఎడిటింగ్, ప్రింటింగ్ నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఎంబ్రాయిడరీకి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. సైజును బట్టి.. ఫొటోపై కుట్టాల్సిన ఎంబ్రాయిడరీని బట్టి సమయం తీసుకుంటున్నారు. ఒక్క ఫొటో పూర్తి చేసేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుందని ఓ షాప్ నిర్వాహకుడు వివరించాడు. సాధారణ ఫొటోలతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువ అయినా గిఫ్ట్లు ఇచ్చేందుకు ఫొటో ఎంబ్రాయిడరీని ఎంచుకుంటున్నారని చెబుతున్నాడు.బహుమతులకు పర్ఫెక్ట్.. ఫొటో ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ నగరంలో కొత్తగా వచి్చంది. ఎంబోజ్, గ్లిట్టర్ వంటి ఫొటో ప్రింటింగ్ టెక్నాలజీని ఆల్బమ్లు రూపొందించేందుకు ఎక్కువగా వాడుతుంటాం. వీటితో ఆల్బమ్కు, ఫొటోలకు మంచి లుక్ వస్తుంటుంది. అయితే ఫొటో ఎంబ్రాయిడరీని ఆల్బమ్లో పెట్టడం కాస్త కష్టం. అందుకే చాలా మంది ఫొటో ఫ్రేమ్స్ చేయించుకునేందుకు ఫొటో ఎంబ్రాయిడరీ గురించి అడుగుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్, పెళ్లి వంటి శుభకార్యాల్లో గిఫ్ట్గా ఇచ్చేందుకు దీన్ని ఎంచుకుంటున్నారు. చూసేందుకు బాగుండటమే కాకుండా రిచ్గా, సరికొత్తగా ఉంటోందని చెబుతున్నారు. :::బీసు విష్ణుప్రసాద్, ఫొటోగ్రాఫర్ ::: సాక్షి, సిటీబ్యూరో -
ట్రాఫిక్ లోనే సగం జీవితం.. కొవ్వొత్తిలా కరిగిపోతున్న సమయం.. సమస్య తీరేది ఎప్పుడు..?
-
మైనర్ కారు డ్రైవింగ్.. యువతి బలి
-
హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు.. కారణం ఇదే
-
అక్కడే నిలబడకోయ్.. కాస్త ఉరకవోయ్..
పరిగెత్తి పాలు తాగడం కన్నా.. నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం అంటారు పెద్దలు. అది ఏ సందర్భంలో వాడినప్పటికీ ప్రస్తుతం భాగ్యనగరంలో రన్నింగ్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు రావడం.. శారీరక వ్యాయామం చేయకపోవడంతో అనేక రకాల అరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం వారంలో ఒక్కసారైనా వ్యాయామం చేయడం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్తో ఒళ్లు కదిపితే లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనలు, ఫిట్నెస్ ట్రైనర్స్ సలహాల మేరకు నగర వాసులు పరుగులు పెడుతున్నారు..ఈ నేపథ్యంలో దీని గురించి పలు ఆసక్తికర అంశాలు... ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి అలసట లేకుండా పోతోంది. బుర్రనిండా ఆలోచనలతో గజిబిజి గందరగోళాల నడుమ ఒత్తిడితో కూడిన జీవనం సాగిస్తున్నారు నగరవాసులు. అలాంటి అలవాట్లను మార్చే ఉద్దేశంతో, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మారథాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఆరోగ్య విషయాలపై నగర ప్రజల్లో అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ ట్రెండ్ కాస్తా హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో సంస్థ ఒక్కో సమస్యపై అవగాహన కలి ్పంచేందుకు మారథాన్ నిర్వహించి పలువురిని భాగస్వాములను చేసుకుంటున్నాయి.సమస్యలపై అవగాహన కలి్పస్తూ.. యువతలో ప్రస్తుతం అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరికి వాటిపై అవగాహన లేక వాటి బారిన పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు నగరంలో తీవ్రతరం అవుతున్నాయి. మత్తుకు బానిసలవుతూ యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. సిగరెట్, గుట్కాలు తింటూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వివిధ రకాల క్యాన్సర్లపై అవగాహన లేక ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో ఇలాంటి సమస్యల గురించి ప్రపంచానికి అవగాహన కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకోసమే పలు ఆస్పత్రులు, సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.సాఫ్ట్వేర్ కంపెనీల్లో.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నైట్ డ్యూటీలు, లేట్ నైట్ ఫుడ్, జంక్ ఫుడ్తో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. దీంతో శారీరక, మానసిక రుగ్మతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో మానసిక సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి తగ్గించేందుకు పలు సాఫ్ట్వేర్ కంపెనీలు మారథాన్ నిర్వహిస్తున్నాయి. దీంతో మానసిక ప్రశాంతతతో పాటు తోటి ఉద్యోగులతో సరదాగా ఉంటూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. వ్యాధులపై ప్రచారానికి.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు జీవన శైలి వ్యాధులపై అవగాహన కలి ్పంచేందుకుకు నగరంలోని చాలా ఆస్పత్రులు మారథాన్ నిర్వహిస్తున్నాయి. మారథాన్ నిర్వహించడం ద్వారా వచ్చిన డబ్బులను దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి సంక్షేమం కోసం వినియోగిస్తున్నాయి. ఇదే దారిలో చాలా సంస్థలు మారథాన్ నిర్వహిస్తూ చారిటీ చేస్తున్నాయి. దీంతో రెండు రకాలుగా మారథాన్ ఉపయోగపడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు.డ్రగ్స్ రహిత సమాజం కోసం.. ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వంలోని పలు శాఖలు కూడా అప్పుడప్పుడూ మారథాన్ నిర్వహిస్తూ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. డ్రగ్స్పై అవగాహన కలి ్పంచేందుకు ఇటీవల తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. దీనిద్వారా కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు కాళాశాలలు మారథాన్ నిర్వహిస్తూ విద్యార్థులకు పలు అంశాల గురించి వివరిస్తున్నారు.రన్నింగ్తో ఎన్నో లాభాలు రన్నింగ్ చేస్తే శారీరక, మానసిక లాభాలు ఎన్నో ఉన్నాయి. 2010లో ఆర్మీలో చేరాను. పుణేలో ఉన్నప్పుడు మా కోచ్ సలహాతో మారథాన్లో పాల్గొనాలనే ఆలోచన వచ్చింది. 2013 నుంచి మారథాన్లో పాల్గొంటూ వస్తున్నా. దేశ, విదేశాల్లో ఎక్కడ మారథాన్ జరిగినా వెళ్లి పాల్గొంటా. ఇటీవల ముంబైలో జరిగిన మారథాన్లో గోల్డ్ మెడల్ సాధించా. ఢిల్లీలో జరిగిన మారథాన్లో సిల్వర్ పతకం వచి్చంది. రేపు జరగబోయే హైదరాబాద్ మారథాన్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చాను. మారథాన్లో పాల్గొనేందుకు రోజూ కనీసం 30 కిమీ చొప్పున వారానికి 160– 180 కిమీ పరుగెడుతూ సాధన చేస్తుంటాను. రన్నింగ్తో పాటు సరైన పోషకాహారం తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. – శ్రీను బుగత, బంగారంపేట, విజయనగరంఎన్నో పాఠాలు నేరి్పస్తుంది.. మారథాన్ అనేది పరుగు మాత్రమే కాదు. ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో ఎలా నిలకడగా ఉండాలనే విషయాలు తెలుస్తాయి. సవాళ్లను స్వీకరించడం ఎలాగో తెలియజేస్తుంది. నలుగురితో కలిసి జీవిస్తే వచ్చే ప్రయోజనాలను గురించి నేరి్పస్తుంది. భారత్లో గత పది, పదిహేనేళ్ల నుంచి మారథాన్ ట్రెండ్ అవుతోంది. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పట్టణాలు, గ్రామాల్లో కూడా మారథాన్ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో దీన్నొక సామాజిక పండుగలా సంబరంగా జరుపుకొంటున్నారు. – రాజేశ్ వెచ్చా, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఫౌండర్ అద్భుతమైన అనుభూతి.. మారథాన్లో పాల్గొంటే అద్భుతమైన అనుభూతి ఉంటుంది. తోటి ఉద్యోగులతో మారథాన్లో పాల్గొంటే ఆ ఉత్సాహమే వేరు. ఇప్పటివరకూ దాదాపు 10 మారథాన్లలో పాల్గొన్నాను. రన్నింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ కూడా వస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది. – మహేశ్రెడ్డి మోదుగు, ఐటీ ఉద్యోగి -
వినూత్నం.. వియత్నాం కాఫీ
పొద్దున లేవగానే కాఫీ తాగనిదే చాలామందికి తెల్లారదు. కప్పులో అలా వేడి వేడి కాఫీ మన ముందుంటే ఆ పొగలతో వచ్చే ఆ వాసన చూస్తుంటే మనల్ని మనమే మైమరిచి పోతాం. పొట్టలో ఓ కప్పు కాఫీ పడితే ఉంటుంది గురూ.. ఆ లెవలే వేరు. మెదడు కూడా అంత వేగంగా పనిచేస్తుంది. చకచకా పనులు అయిపోతాయంతే.. ఇంక వేరే మాటే ఉండదు. కొందరికేమో ఇన్స్టంట్ కాఫీ అంటే ప్రాణం. మరికొందరు ఫిల్టర్ కాఫీ అంటే పడి చచి్చపోతారు. ఇంకొందరికేమో కోల్డ్ కాఫీ అంటే పిచ్చి. ఇలా జిహ్వకో రుచి అన్నట్టు.. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన టేస్ట్.భాగ్యనగరం అంటేనే పలు రుచులకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచ దేశాల్లో దొరికే అనేక రుచులు మన నగరవాసులకు దొరుకుతాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇటీవల మన నగరంలో ఓ కొత్త రుచి క్రేజ్ను సంతరించుకుంటోంది.. దీంతో పాటు నగర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటోంది.. దాని గురించి తెలుసుకుందాం.. వరల్డ్ ఫేమస్ హైదరాబాద్.. కోల్డ్ కాఫీ నగరంలో ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. అందులోనూ వియత్నాం కాఫీ నగరంలో మరింత ఫేమస్ అయిపోతోంది. నగర యువత ఈ కాఫీని లొట్టలేసుకుంటూ తాగేస్తోంది. ఒకప్పుడు ఇరానీ చాయ్.. ఇప్పుడు కోల్డ్ కాఫీ.. అప్పటికీ.. ఇప్పటికీ ప్రియమైన పానీయం టీ, కాఫీలే అయినా.. వైవిధ్యమైన రుచి ఆస్వాదించాలి అనుకునే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్ టేస్టీ చాయిస్ అని చెప్పొచ్చు. విభిన్న రుచులు.. వియత్నాం కాఫీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎగ్ కాఫీ, యోగర్ట్ కాఫీ, కోకోనట్ వియత్నమీస్ కాఫీ, వైట్ కాఫీ, కాఫెసురా, ఐస్డ్ బ్లాక్ కాఫీ, వియెట్ కాఫీ, లైబేరికా కాఫీ, కులీ కాఫీ, చెర్రీ కాఫీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కోల్డ్ కాఫీల్లో కూడా కుకుంబర్ టానిక్, యాపిల్ కాఫీ యేల్, కివీ టానిక్ కాఫీ, స్పానిష్ లాటే ఇలా విభిన్నమైన రుచులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవ్వాలనుకున్నా.. గర్ల్ ఫ్రెండ్తో జాలీగా గడపాలనుకున్నా ఎంచక్కా మాంచి కాఫీ షాప్కి వెళ్లి రెండు వియత్నాం కాఫీలు ఆర్డర్ చేసి లాగించేయండి. అథ్లెట్స్, జిమ్ చేసే వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఏదైనా సరే రోజుకు ఓ మోతాదులో తీసుకుంటేనే మంచిదని, అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వియత్నాం కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. శక్తిని పెంచడమే కాకుండా రన్నింగ్, జాగింగ్, వ్యాయామాలు మరింత ఎక్కువగా చేసేందుకు దోహదపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. యాంగ్జయిటీని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతతో పాటు మెదడుకు మంచి చేస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ జ్ఞాపక శక్తి పెంచుతుంది. దీంతోపాటు ఎక్కువ విషయాలు నేర్చుకునేలా చేయడం, మానసిక సంతోషాన్ని ఇవ్వడంతో పాటు డిప్రెషన్ తగ్గించడం, శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడంతో, నిద్ర సరిగ్గా పట్టడంలో తోడ్పడుతుంది.నా సోల్మేట్.. కాఫీ అంటేనే అద్భుతం. ఇక కోల్డ్ కాఫీ అంటే మహా అద్భుతం. ఒంటరిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే నన్ను నేనే మైమరిచిపోతాను. కాఫీ తాగిన తర్వాత అరగంట వరకూ ఏమీ తినను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆస్వాదించాలనేది నా భావన. చల్లచల్లటి కాఫీ తాగుతుంటే మస్తు మజా వస్తుంది. మంచి లొకేషన్లో కాఫీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు. స్నేహితులు తోడైతే అనుభూతి వేరే లెవల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాఫీ నా సోల్మేట్. బేగంపేటలోని పంచతంత్ర కాఫీ షాప్కి వారానికోసారి వెళ్లి కాసేపు కూర్చుని కాఫీ తాగుతుంటే భలే సరదాగా ఉంటుంది. :::మంజీర ఆరెట్టి, ప్రకాశ్నగర్, బేగంపేట స్వచ్ఛమైన కాఫీ అందించాలని.. కాఫీ ప్రియులకు అచ్చమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన కాఫీ అందించాలనే ఆలోచనతో పంచతంత్ర కేఫ్ ఏర్పాటు చేశాం. కాఫీతో పాటు యాంబియెన్స్ కూడా బాగా ఉండేలా ప్రయత్నించాం. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడమే మా ప్రాధాన్యం. ::: విక్రమ్, పంచతంత్ర కేఫ్ -
హైదరాబాద్ ను కుమ్మేసిన కుండపోత వర్షం
-
జోర పబ్బులో నార్కెటిక్ బ్యూరో పోలీసులు తనిఖీలు..
-
హైదరాబాద్ ను ముంచెత్తిన వర్షం
-
హైదరాబాద్ లో మోత మోగుతున్న ఇళ్ల అద్దెలు
-
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
-
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్ప్లాన్ను రూపొందించాలని, ట్రిపుల్ వన్లోని ప్రాంతాలను కూడా మాస్టర్ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్ప్లాన్లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్ప్లాన్లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్ప్లాన్లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘బైరామల్ గూడ’ ఫ్లై ఓవర్తో.. రయ్ రయ్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మరో ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నాగార్జునసాగర్ రింగ్రోడ్, బైరామల్గూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి. త్వరలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, అది వెలువడేలోగా దాదాపు వారం రోజుల్లో ఈ ఫ్లై ఓవర్ను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సమాచారం మేరకు ఈ నెల 8న ప్రారంభించాలని తాత్కాలికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వచ్చాక శంషాబాద్ విమానాశ్రయం, ఓవైసీ హాస్పిటల్ వైపుల నుంచి విజయవాడ(చింతలకుంట వైపు), నాగార్జునసాగర్ (బీఎన్ రెడ్డి నగర్ వైపు)ల వైపు ఈ ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్ జంజాటం లేకుండా వెళ్లవచ్చు. ఈ ఫ్లై ఓవర్లతోపాటు రెండు లూప్లు కూడా అందుబాటులోకి వస్తే ఎడమవైపు లూప్ నుంచి నాగార్జునసాగర్, చింతలకుంట వైపుల నుంచి ఎల్బీనగర్, సికింద్రాబాద్ల వైపు వెళ్లే వారికి సదుపాయం కలుగుతుంది. అలాగే కుడివైపు లూప్ అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్ నుంచి కర్మాన్ఘాట్, ఐఎస్ సదన్ల వైపు వెళ్లే వారికి సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా ప్రయాణ సమయం కలిసి రావడంతోపాటు వాహనదారులకు ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు, ధ్వని కాలుష్యాలు తగ్గుతాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ ప్యానెల్స్ వంటి వాటికి ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వినియోగించారు. ఎస్సార్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే నగరంలో తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించడం తెలిసిందే. బైరామల్గూడ సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ ఇలా.. నిర్మాణ వ్యయం: రూ.148.05 కోట్లు, పొడవు: 1.78 కి.మీ, వెడల్పు ఓవైసీ వైపు (ర్యాంప్1): 12 మీటర్లు, 3లేన్. నాగార్జునసాగర్ వైపు(ర్యాంప్2): 8.5మీటర్లు, 2 లేన్. చింతల్కుంట వైపు(ర్యాంప్3): 8.5 మీటర్లు, 2 లేన్. ప్రయాణ మార్గం.. ఒకవైపు సిద్ధమైన బైరామల్గూడ ఫ్లైఓవర్ బైరామల్గూడ జంక్షన్ వద్ద మొదటి, రెండవ లెవెల్ ఫ్లై ఓవర్లు, లూప్స్ వినియోగంలోకి వస్తే బైరామల్గూడ జంక్షన్వద్ద 95 శాతం, నాగార్జునసాగర్ రింగ్రోడ్ వద్ద 43 శాతం ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభించనుందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
హైదరాబాద్ కేంద్రంగా ‘హ్యుందాయ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా గ్రూప్ హ్యుందాయ్ మోటార్ భారత్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలో నాయకత్వ స్థానం కోసం సిద్ధమవుతోంది. భవిష్యత్తులో పోటీతత్వ ఈవీ మార్కెట్గా భారత్ అవతరిస్తుందని కంపెనీ మంగళవారం తెలిపింది. 2032 నాటికి దేశీయంగా అయిదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొత్త ఈవీల పరిచయం, తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు వచ్చే 10 ఏళ్లలో రూ.20,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు 2023 మే నెలలో సంస్థ ప్రకటించింది. ఈవీలు, అటానమస్ సహా భవిష్యత్ మోడళ్ల పరిశోధన కోసం హైదరాబాద్లోని రిసర్చ్, డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్ను కేంద్ర బిందువుగా మార్చాలని గ్రూప్ యోచిస్తోంది. ఈ కేంద్రంలో భారతీయ భాషల్లో వాయిస్ రికగి్నషన్ టెక్నాలజీని సైతం అభివృద్ధి చేస్తారు. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ 2030 నాటికి 50 లక్షల యూనిట్లను దాటుతుంది. వీటిలో ఎస్యూవీల వాటా 48 శాతం. ఆ సమయానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటాయని హ్యుందాయ్ తెలిపింది. 2022–23లో భారత్లో అన్ని కంపెనీలవి కలిపి 48,104 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. భవిష్యత్ వ్యూహంపై.. ‘భారత విపణిలో కంపెనీ కార్ల విక్రయాలు పెరిగేందుకు హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. అలాగే కొరియాలోని హుందాయ్–కియా నమ్యాంగ్ ఆర్అండ్డీ సెంటర్తో కలిసి భారత మార్కెట్ కోసం వాహనాలను అభివృద్ధి చేస్తుంది. ఇందులో భాగంగా టెస్టింగ్ కోసం కొత్త సదుపాయం నిర్మాణం గత సంవత్సరం ప్రారంభమైంది’ అని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్ యూసన్ ఛంగ్ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్తోపాటు చెన్నైలోని తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహంపై కంపెనీకి చెందిన కీలక అధికారులతో చర్చించారు. భారీ లక్ష్యంతో.. ఎస్యూవీలలో నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేయడం, ఈవీ మోడళ్లను విస్తరించడం ద్వారా పరిమాణాత్మకంగా వృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు హ్యుందాయ్ వెల్లడించింది. ‘నాలుగేళ్లలో ఈవీ చార్జింగ్ సెంటర్ల సంఖ్యను 439కి చేర్చనున్నాం. గ్రూప్ కంపెనీ అయిన కియా 2025 నుండి భారత కోసం చిన్న ఈవీలను ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఈవీ మోడళ్లతోపాటు వినియోగదార్లు కోరినట్టు కస్టమైజ్డ్ (పర్పస్ బిల్ట్ వెహికల్స్) అందిస్తుంది. కొత్త మోడళ్ల పరిచయం, ప్రస్తుతం ఉన్న 300 షోరూమ్లను రెండింతలు చేయాలన్నది కియా ప్రణాళిక. ప్రస్తుతం కియా మార్కెట్ వాటా 6.7% ఉంది. సమీప కాలంలో దీన్ని 10%కి చేర్చాలన్నది కియా 2.0 వ్యూహం’ అని హ్యుందాయ్ తెలిపింది. -
హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి వానలు
-
రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మేడ్ ఇన్ చైనా!
సాక్షి, హైదరాబాద్: చైనాలో కూర్చున్న సూత్రధారులు కథ నడుపుతున్నారు... దుబాయ్లో ఉంటున్న పాత్రధారులు వీరి ఆదేశాలు పాటిస్తున్నారు. గుజరాత్లో నివసించే సహాయకులు ముందుండి పని చేస్తున్నారు. ఈ పంథాలో సాగిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించడం ద్వారా హైదరాబాదీయులు కీలకపాత్ర పోషించారు. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంతోపాటు ముంబై, అహ్మదాబాద్లకు చెందిన 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్లతో కలిసి ఆయన శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. టాస్క్లకు రూపమిచ్చేది చైనాలో.. ఈ ఫ్రాడ్లో కథ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పార్ట్టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వచ్చే ప్రకటనలతో మొదలవుతుంది. దీనికి ఆకర్షితులై స్పందించిన వారికి లింకులు పంపడం ద్వారా ఆ రెండు యాప్స్లోని గ్రూపుల్లో చేరుస్తారు. ముందు తమ వద్ద ఇన్వెస్ట్ చేసి, తాము పంపే టాస్క్లు పూర్తి చేసి లాభాలు పొందాలని. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తారు. వాళ్లు పంపే లింకులకు లైక్స్ కొట్టడం, నిర్ణీత విధానంలో షేర్ చేయడం వంటి తేలికపాటి టాస్క్లే ఉంటాయి. సూత్రధారులుగా ఉన్న చైనీయులు లీ లూ గువాంఘెజు, నాన్ ఏ, కివిన్ జున్ ఆ దేశంలోనే ఉండి ఆకర్షణీయమైన టాస్క్లు రూపొందిస్తున్నారు. చిన్న లాభాలు ఇస్తూ ఉచ్చులోకి... ఇందులో పెట్టుబడి రూ.5 వేల నుంచి మొదలవుతుంది. దీనికోసం ప్రత్యేక యాప్ను బాధితులు డౌన్లోడ్ చేసుకుంటారు. రూ.5 వేలకు రూ.వెయ్యి, రూ.10 వేలకు రూ.2 వేలు,రూ.15 వేలకు రూ.3వేల చొప్పున లాభం ఇస్తారు. అలా క్రమంగా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా మరికొంత పెడితేనే కుదురుతుందని చెబుతారు. ఇలా ఒక్కో బాధితుడితో రూ.లక్షల్లో పెట్టించిన తర్వాత ఆ యాప్ పని చేయడం మానేస్తుంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల నుంచి వీరిని తొలగించేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రూ.712 కోట్లు ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయారు. రెండు యాప్ల ద్వారా దుబాయ్ నుంచి.. చైనీయుల ఏజెంట్లు అనిస్, ఆరిఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెల్లీ దుబాయ్లో ఉంటున్నారు. అహ్మదాబాద్లో ఉన్న ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి వీరితోపాటు చైనీయులతో టచ్లో ఉంటున్నారు. వాళ్లకు కావాల్సిన షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, నగదును క్రిప్టోకరెన్సీగా మార్చడం వీరి విధి. ఇలా చేసినందుకు ఈ ద్వయానికి 3 శాతం కమీషన్ వస్తోంది. లక్నోకు చెందిన వికాస్, మనీష్, రాకేష్ తదితరులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని షెల్ కంపెనీలు, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాల వివరాలను ప్రజాపతి ద్వయం దుబాయ్లోని వారికి పంపుతుంది. వీటికి లింకైన సిమ్కార్డులతో కూడిన ఫోన్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వీరితోపాటు దుబాయ్లో ఉన్న వాళ్లు ఆ ఫోన్లలో కూల్టెక్, ఎయిర్డ్రాయిడ్ అనే యాప్స్ వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఇక్కడి ఫోన్లకు వచ్చిన ఓటీపీలను దుబాయ్లోని వాళ్లు చూడగలుగుతున్నారు. క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు... బాధితుల నుంచి కాజేసిన మొత్తాన్ని దుబాయ్లోని పాత్రధారులు అమెరికన్ డాలర్లతో సమానమైన క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. వీరికి ఒక్కో డాలర్కు రూ.10 కమీషన్గా వస్తోంది. వీళ్లు చైనాలోని సూత్రధారులకు వాలెట్స్ ద్వారా డబ్బు పంపేస్తున్నారు. ప్రజాపతులు వాడిన మూడు వాలెట్స్లో హిబ్బుల్ వాలెట్ కూడా ఉంది. దీని ద్వారా ఉగ్రవాదులకు నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రజాపతి ద్వయానికి రావాల్సిన కమీషన్ను దుబాయ్లోని కేటుగాళ్లు ముంబైకి చెందిన ఏజెంట్లు గగన్, గుడ్డు, నయీమ్ ద్వారా హవాలా రూపంలో పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించిన వారిలో హైదరాబాద్కు చెందిన మునావర్ మహ్మద్, ఆరుల్ దేవ్, సమీర్ ఖాన్, ఎస్.సుమేథ్ కూడా ఉన్నారు. ఈ భారీ మోసాన్ని ఛేదించిన పోలీసులు ఈ నలుగురితోపాటు ప్రజాపతి ద్వయం, గన్, గుడ్డు, నయీమ్లను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,53,89,943లను ఫ్రీజ్ చేశారు. -
హైదరాబాద్లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అప్రమత్తం!
హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లిలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో నగరవాసులను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరకు 040-29555500కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు. -
ఎల్బీనగర్ లో భారీ అగ్నిప్రమాదం
-
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం
-
హైదరాబాద్ లో జీరో షాడో డే
-
హైదరాబాద్ లో మళ్ళీ దంచికొట్టిన వర్షం
-
జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ
పంజగుట్ట (హైదరాబాద్): కరోనా కారణంగా మూడేళ్ల నుంచి వాయిదాపడిన చేప ప్రసాదం జూన్ 9న నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇవ్వనున్నట్లు బత్తిని సోదరులు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని అమర్నాథ్ గౌడ్, బత్తిని గౌరీశంకర్ గౌడ్ మాట్లాడుతూ..జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. ఆస్తమా, దగ్గు, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొన్ని లక్షల మంది తమ చేప ప్రసాదం తీసుకుని వారి సమస్యలను శాశ్వతంగా తగ్గించుకున్నారన్నారు. ప్రభుత్వం తరఫున కొర్రమీను లైవ్ చేపలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రసాదం తీసుకునే నాలుగు గంటల ముందు, తీసుకున్న రెండు గంటలు ఏమీ తినకూడదని, 45 రోజులు పత్యం ఉండాలని చెప్పారు. ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. -
హైదరాబాద్ లో వికటించిన వెయిట్ లెస్ ట్రీట్ మెంట్
-
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
-
ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇంతే.. తనిఖీలెక్కడ?
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడు ప్రమాదాలు జరిగినా ఇకపై ఇలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, మంత్రులు, అధికారులు ప్రకటించడం పరిపాటిగా మారింది. అంతకుమించి ఆ తర్వాత చర్యలుండటం లేవు. భవనాలు కూలినా అంతే. అగ్నిప్రమాదాలు జరిగినా అదే వైఖరి. తాజాగా సికింద్రాబాద్ మినిస్టర్రోడ్లో అగ్నిప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జనావాసాల మధ్య అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన గోడౌన్లు, తదితరమైన వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. గత సంవత్సరం బోయగోడలో స్క్రాప్గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించినప్పుడు సైతం ఇలాంటి ప్రకటనలే చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఏంచేశారో ఎన్ని భవనాలు తనిఖీలు చేశారో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో జీహెచ్ఎంసీ ఫైర్సేఫ్టీ విభాగం వెల్లడించలేదు. అప్పట్లో హోంమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ఏమైందో తెలియదు. గోడౌన్లు, షోరూమ్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, పబ్ల దాకా అదే పరిస్థితి వేటికీ నిబంధనల మేరకు సెట్బ్యాక్లుండవు, ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు అసలే ఉండవు. గత సంవత్సరమే ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లోనూ జరిగిన అగ్ని ప్రమాదాలు నగర ప్రజలింకా మరచిపోలేదు. చర్యలేవీ? జీహెచ్ఎంసీ ఫైర్సేఫ్టీ విభాగం అగ్నిప్రమాదాలు జరిగితే ఎక్కువ మందికి అపాయం జరిగే బార్లు, పబ్ల వంటివాటిపై తొలుత చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. వాటి తర్వాత హోటళ్లు, హాస్పిటళ్లపై చర్యలుంటాయని హెచ్చరించింది. కానీ ఇప్పటి వరకు ఒక్కదానిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నగరంలో, చుట్టుపక్కల దాదాపు 20వేలకు పైగా గోడౌన్లే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం పదిశాతం భవనాలకు కూడా ఫైర్సేఫ్టీ ఏర్పాట్లు లేవు. గతంలో నగరంలోని భవనాలకు సంబంధించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావించిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు టౌన్ప్లానింగ్, ఫైర్సేఫ్టీ, ఆరోగ్యం– పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారులను బృందాలుగా ఏర్పాటుచేసి, తనిఖీలు నిర్వహించి, ఫైర్సేఫ్టీ లేని భవనాలపై చర్యలు తీసుకోవాలనుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు అమలు కాలేదు. కనీసం ఫైర్సేఫ్టీ విభాగమైనా చర్యలు తీసుకుందా అంటే అదీ లేదు. జీహెచ్ఎంసీలో ఫైర్సేఫ్టీతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారాలు ఉన్న విభాగం కూడా.. ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. చదవండి: సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
Fire Accident: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: అగ్గి అంటుకుంటే బుగ్గిపాలు కావాల్సిందేనా? ప్రమాద సమయంలో కాపాడేందుకు సరైన అగ్నిమాపక వ్యవస్థ నగరంలో అందుబాటులో లేదా?.. అంటే అవుననే నిరూపిస్తున్నాయి అగ్ని ప్రమాద ఘటనలు. సికింద్రాబాద్ పరిధిలోని ‘డెక్కన్ కార్పొరేట్’ గురువారం చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో మంటల తీవ్రత అధికంగా ఉంది. గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించినా మంటలు అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో ఫైర్ సిబ్బంది స్పందించడం, తగిన పరికరాలతో రంగంలోకి దిగడం అత్యంత ప్రధానమైంది. అలా చేస్తే మంటలను అదుపులోకి తేవడంతోపాటు ప్రమాద తీవ్రత, నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. అగ్నిమాపక సిబ్బందికి తగిన సమర్థత ఉంటున్నా.. కొన్నిసార్లు అందుబాటులో సరైన పరికరాలు లేకపోవడంతోనూ వారు ఆశించిన రీతిలో స్పందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల కాసుల కక్కుర్తి, అగ్నిమాపక శాఖలోని కొందరు లంచావతారుల కారణంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు అలవోకగా లభిస్తున్నాయి. నగరంలో కేవలం రెండంటే రెండు మాత్రమే బ్రాంటో నిచ్చెనలు ఉన్నాయి. బహుళ అంతస్థుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో ఈ నిచ్చెలను అంత్యంత కీలకమైనవి. కింది అంతస్థుల్లో మంటలు, పొగ వ్యాపించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఈ భారీ నిచ్చెనల ద్వారా పై అంతస్తులకు చేరే వీలుంటుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడి వారిని సురక్షితంగా కిందకు చేర్చడంలోనూ ఈ భారీ నిచ్చెనలు ఉపయోగపడాయి. ప్రస్తుతం ఉన్న రెండు బ్రాంటో నిచ్చెనల్లో ఒకటి సికింద్రాబాద్ పరిధిలో, మరోటి మాదాపూర్ ప్రాంతంలో అందుబాటులో ఉన్నట్టు సమాచారం. మంజూరు మంజూరు చేసినా.. అగ్నిమాపక శాఖకు ప్రస్తుతం ఉన్న బ్రాంటో నిచ్చెనకు అదనంగా మరో 101 మీటర్ల బ్రాంటో స్కై లిఫ్ట్నకు ప్రభుత్వం మంజూరు లభించింది. నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. ఈ బ్రాంటో స్కై లిఫ్ట్నకు దాదాపు రూ. 25 కోట్ల ఖర్చవుతుందని, ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
అగ్ని ప్రమాదాలతో భయపడుతున్న జంటనగరాలు
-
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో ఘోర అగ్నిప్రమాదం
-
హైదరాబాద్లో మరో మూడు డేటా సెంటర్లు: మైక్రోసాఫ్ట్
కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లను ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3 డేటా సెంటర్ లను ప్రారంభిస్తామని తెలిపింది. గత సంవత్సరం ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రో సాప్ట్ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్ లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్ లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంతో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్ లో హైదరాబాదే కీలకం అన్న అహ్మద్, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. డేటా సెంటర్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని అహ్మద్ మజారీ తెలిపారు. -
సనత్ నగర్ లో లోకో పైలట్ వాసవి అదృశ్యం
-
హైదరాబాద్ లో రెండోరోజు ఐటీ సోదాలు
-
బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం ఖాళీ అయింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు వెళ్లిపోయారు. వ్యక్తిగత వాహనాలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలలో పయనమయ్యారు. దీంతో ఔటర్, జాతీయ రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేలలోని టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం భోగి కావటంతో గురు, శుక్రవారాల్లో నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వెళ్లారు. 12, 13 తేదీలలో రెండున్నర లక్షల పైనే వాహనాలు ఆయా హైవేలలోని టోల్గేట్లను దాటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. 1,49,403 వాహనాలు విజయవాడ హైవేలోని పంతంగి, వరంగల్ హైవేలోని బీబీనగర్ టోల్ప్లాజాలను దాటివెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందులో 1,14,249 వాహనాలు కార్లే కావటం గమనార్హం. ఈ రెండు రోజులలో 1,24,172 వాహనాలు విజయవాడ హైవేలోనే ప్రయాణించాయని పోలీసులు తెలిపారు. అలాగే వరంగల్ వైపు నుంచి హైదరాబాద్కు 13,334 వాహనాలు వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల మధ్య నగరవాసులు ఎక్కువగా వాహనాలలో ప్రయాణించారు. ప్రత్యేక బృందాలతో ట్రాఫిక్ క్రమబద్దీకరణ హైవేలలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ను క్రమబద్ధికరించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆరీ్టసీ, జీఎంఆర్ టోల్ నిర్వహణ బృందాలతో పనిచేస్తున్నాం. మెయిన్ రోడ్లలో వెళ్తున్న వారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – డి.శ్రీనివాస్, డీసీపీ, రాచకొండ ట్రాఫిక్ (చదవండి: ముగ్గుల ఫోటోలు తీస్తుండగా విషాదం..ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి..) -
హైదరాబాద్ లో భోగి మంటల వెలుగులు
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
హైదరాబాద్ లో మళ్లీ తెరపైకి డ్రగ్స్
-
హైదరాబాద్ భారీగా డ్రగ్స్ పట్టివేత
-
హైదరాబాద్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం
-
హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ తనిఖీలు
-
కార్ రేసింగ్ షో
-
హైదరాబాద్ లో అర్ధరాత్రి కుంభవృష్టి
-
కుండపోత వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం
-
భాగ్యనగరంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
హైదరాబాద్ లో గంట గంటకు మారుతున్న వాతావరణం
-
హైదరాబాద్ లో కనిపించని బంద్ ప్రభావం
-
బస్సు.. గుస్సా! ప్రజా రవాణాపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ‘మీ ప్రాంతానికి రావాల్సిన బస్సు జీవిత కాలం లేటు’ అన్నచందంగా మారింది నగరంలో ఆర్టీసీ సర్వీసుల పరిస్థితి. పది వేల జనాభా ఉన్న సింగపూర్ టౌన్షిప్నకు రెండేళ్లుగా సిటీ బస్సులు నిలిచిపోయాయి. తెల్లారి లేస్తే అంతా ఉద్యోగాలకు వెళ్లేవారే. రెండేళ్లుగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహిళలు, పిల్లలు, ఈ టౌన్షిప్నకు వచ్చే బంధుమిత్రులు అవస్థల పాలవుతున్నారు. తాజాగా ఈ రూట్లో బస్సుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు నడుస్తాయా లేదా అనేది సందేహమే. ఒక్క సింగపూర్ టౌన్షిప్ మాత్రమే కాదు. గ్రేటర్లోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సులు లేవు. 10 ట్రిప్పులు నడపాల్సిన రూట్లలో కేవలం 3 లేదా 4 ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ వాహనాల వైపు వెళ్లాల్సివస్తోంది. పదేళ్లుగా కొత్తవి పత్తా లేదు.. ► హైదరాబాద్ మహానగర జనాభా సుమారు కోటిన్నరకు చేరువైంది. ఔటర్ను దాటి నగరం విస్తరిస్తోంది. ఏటా వందలాది కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి. ప్రజా రవాణా నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే కనీసం 6వేల బస్సులు అవసరం. 2013 నుంచి ఇప్పటి వరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ► అదే సమయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సిటీ బస్సుల సంఖ్య సగానికి తగ్గింది. గతంలో 3850 బస్సులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 2500కు పరిమితమైంది. మూడేళ్ల క్రితం 850 సిటీ బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరి కొన్నింటికి కాలం చెల్లింది. బస్సుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఉన్న వాటిలోనూ కొన్ని డొక్కు బస్సులే. కానీ కొత్త వాటిని కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో ఉన్నవాటితోనే అధికారులు నెట్టుకొస్తున్నారు. గణనీయంగా తగ్గిన ట్రిప్పులు ► గత పదేళ్లలో ఆర్టీసీ లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు అన్ని రూట్లలో ట్రిప్పుల సంఖ్య పెరగాల్సి ఉండగా భారీగా తగ్గిపోయింది. మూడేళ్ల క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పులు తిరిగాయి. అంటే సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు నడిచాయి. ► నిజానికి పెరుగుతున్న జనాభాకు ఈ సదుపాయం తక్కువే. 2015 నాటికే కనీసం 60 వేల ట్రిప్పులకు పెరగవలసి ఉండగా అందుకు భిన్నంగా కనీసం 10 వేల ట్రిప్పులు తగ్గాయి. ‘ప్రయాణికులు ఆటోలు, క్యాబ్లు, ఇతర వాహనాల్లో వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది. మా బస్సెక్కాల్సిన వాళ్లు ఇతర వాహనాల్లో వెళ్లడం బాధగానే ఉంటుంది. కానీ బస్సులే తగినన్ని లేనప్పుడు ఏం చేయగలం’అని ఓ డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. ► ఇప్పటికిప్పుడు కనీసం వెయ్యి కొత్త బస్సులు వచ్చినా కొంతమేరకు ప్రయాణికులకు ఊరట లభించనుంది. ‘కొత్త బస్సులు కొనుగోలు చేయకపోతే ఆర్టీసీ మనుగడ మరింత ప్రశ్నార్థకమవుతుంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. పెరిగిన వ్యక్తిగత వాహనాలు.. కోవిడ్ కంటే ముందే సిటీ బస్సు కుదేలైంది. కోవిడ్తో పూర్తిగా నష్టపోయింది. పెరిగిన డీజిల్ ధరలు మరింత దారుణంగా దెబ్బతీశాయి. రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయం వస్తే ఖర్చు రూ.4.5 కోట్లు దాటుతోంది. రోజుకు కనీసం రూ.కోటి నష్టం. ఈ నష్టాలను అధిగమించేందుకు ఆర్టీసీ అధికారులు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపడుతున్నారే తప్ప బస్సుల సంఖ్య పెంచడంలేదు. ‘మెట్రో’ తారకమంత్రం కాదు.. మెట్రో రైలు ప్రజా రవాణాకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాబోదు. అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు సిటీ బస్సు ఒక్కటే పరిష్కారమని సిటిజనులు చెబుతున్నారు. రోజుకు రెండు ట్రిప్పులే జూబ్లీబస్స్టేషన్ నుంచి ఉద్దమర్రికి గతంలో రోజుకు 6 ట్రిప్పులు ఉండేవి. ఇప్పుడు కేవలం 2 ట్రిప్పులు మాత్రమే వస్తున్నాయి. విద్యార్థులు బాగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. – సత్తిరెడ్డి, ఉద్దమర్రి ఎట్టకేలకు స్పందించారు సింగపూర్ టౌన్షిప్నకు రెండేళ్ల క్రితం కోవిడ్ కారణంగా బస్సులను నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు ఇప్పుడు వేశారు. – వెంకట్ మాధవ రెడ్డి, సింగపూర్ టౌన్షిప్ -
డ్రగ్స్ ఫెడ్లర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
-
హైదరాబాద్లో భారీ వర్షం
-
క్రీస్తు జనన వేళ ప్రపంచవ్యాప్తంగా వేడుకలు
-
హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు
-
అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని నగరంలో ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై అనేక మంది కోర్టులను ఆశ్రయిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదని అక్షింతలు వేసింది. ఈ అంశంపై ఇకపై పిటీషన్ల దాఖలు కాకూడదని అధికారులను హెచ్చరించింది. అధికారులు కఠిన చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించింది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను కోరింది. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు? వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో పొందుపరచాలని సూచించింది. స్టేలు తొలగించాలని ఎన్ని పిటిషన్లు వేశారో తెలపాలని కోరింది. స్టే వెకేట్ పిటిషన్లు వేయని పక్షంలో కారణాలు తెలపాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పీపీల నియామకంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కొరత వల్ల కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణ ప్రక్రియలో పీపీల పాత్ర కీలకమని వ్యాఖ్యానించింది. పీపీల నియామకంపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. 414 పీపీ పోస్టులకు గాను 212 పోస్టులు భర్తీ అయ్యాయని, మిగిలిన పోస్టుల భర్తీ విషయమై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందిస్తూ.. చర్చలు కాదు, ఫలితాలు కావాలని వ్యాఖ్యానించింది. అలాగే ప్రాసిక్యూషన్ విభాగానికి పూర్తి స్థాయి డైరెక్టర్ను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై రెండు వారాల్లో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: 2017లో 325.. 2018లో 428.. 2019లో 1393.. ఈ ఏడాది డిసెంబర్ 20 నాటికే 2456.. ఓ పక్క సైబర్ నేరాలు ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోపక్క సిటీ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో సిబ్బంది మాత్రం అరకొరగా 58 మందే ఉన్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులతోనే నెట్టుకు వస్తుండటంతో పనిభారం పెరిగిపోతోంది. ఓ పక్క ఈ ఠాణాలో నానాటికీ పెరుగుతున్న ఫిర్యాదులు, కేసుల్ని సమర్థంగా విచారించడం/దర్యాప్తు చేయడం కోసం అదనపు సిబ్బందిని కేటాయిస్తూనే.. పోలీసుస్టేషన్ల స్థాయిలోనూ సైబర్ క్రైమ్ టీమ్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 2021లో అయినా ఈ దిశగా అడుగులు పడాలని నగరవాసులు కోరుతున్నారు. పదేళ్ల క్రితం నాటి కేటాయింపులే.. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల దర్యాప్తు చేయడం కోసం తొలినాళ్లలో సీసీఎస్ ఆ«దీనంలో సైబర్ సెల్ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 2010లో సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ కేటాయించింది. ప్రాథమికంగా 40 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితోనే రెండు సైబర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్కు ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించేలా.. సహకరించడానికి ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్–కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. గడిచిన పదేళ్లలో పెరిగిన సిబ్బంది సంఖ్య కేవలం 8 మాత్రమే. సైబర్ నేరాలు నానాటికీ కొత్తపుంతలు తొక్కుతూ ప్రజలనే కాదు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఓ పక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్తో పాటు నైజీరియన్ ఫ్రాడ్స్, డేటా థెఫ్ట్ తదితరాలు పెరుగుతూ పోతున్నాయి. వీటికి తోడు హ్యాకింగ్తో పాటు ఎస్ఎమ్మెస్, ఈ–మెయిల్ ఫ్రాడ్స్ సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యలో సిబ్బంది పెరగకపోవడంతో కేసుల దర్యాప్తులో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ఫిర్యాదులు.. సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో నైజీరియన్ ఫ్రాడ్స్తో పాటు ఆర్థిక సంబంధ నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. నమోదయ్యే కేసులకు దాదాపు పది రెట్లు పిటిషన్లు వస్తున్నాయి. గతేడాది 325 కేసులు నమోదు కాగా.. ఆరు వేల పిటిషన్లు వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్ 20 వరకు 2,456 కేసులు నమోదు కాగా.. ఏడు వేల పిటిషన్లు వచ్చాయి. ఒక్కో పిటిషన్ను విచారించిన తర్వాత మాత్రమే కేసుగా నమోదు చేసేలా నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల్ని విచారించడం సైతం ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారిపోయింది. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా పేర్కొంటూ తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్ యాప్ల్లో, ఫేస్బుక్లోని మార్కెట్ ప్లేస్లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్(ఓటీపీ) కూడా తీసుకోవడం లేదంటే టీమ్ వ్యూవర్ సహా వివిధ రకాలైన యాప్స్ను డౌన్లోడ్ చేయించి ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటున్నాయి. ఉద్యోగాలు, విదేశీ వీసా, ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, గిఫ్టులు, లాటరీల పేరుతో చేసే కాల్ సెంటర్ ఫ్రాడ్స్ కేసులది మూడో స్థానం. పోలీసుస్టేషన్లలో టీమ్స్ అవశ్యం.. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి జోనల్ స్థాయిలో బృందాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే పోలీసుస్టేషన్లలోనే టీమ్స్ ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం సిటీ సైబర్ క్రైమ్ ఠాణా పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాటు. ఈ ఏడాది బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ కంపెనీ అకౌంట్ టేకోవర్ స్కామ్లో రూ.2.09 కోట్లు పోగొట్టుంది. అలాగే అంబర్పేట్కు చెందిన ఓ యువకుడు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్లో రూ.6 వేలు కోల్పోయాడు. ఈ రెండు కేసులూ సైబర్ క్రైమ్ పోలీసులే దర్యాప్తు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా పోలీసుస్టేషన్లలో ఉండే యూనిట్స్ చిన్నచిన్న కేసుల్ని పర్యవేక్షించేలా రూపొందించాలి. భారీ మొత్తాలు, సంచలనాత్మక కేసుల్ని మాత్రమే ఈ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలి. అన్ని పోలీసుస్టేషన్లలోనూ యూనిట్లనూ సీసీఎస్ ఆధీనంలో ఉంచి, తరచూ శిక్షణ ఇస్తుండాలి. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు అత్యవసరంగా 19 మందిని కేటాయించాల్సిందిగా కోరుతూ అధికారులు దాదాపు రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్సైలతో పాటు 10 మంది కానిస్టేబుళ్లను కోరారు. ఇప్పటి వరకు వీటికి మోక్షం లభించలేదు. పోలీసుస్టేషన్లలో యూనిట్ల ఏర్పాటు అంశమూ ఇలా కాకుండా 2021లో అమలులోకి రావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతాలకు చెందిన వారే నిందితులుగా.. నగరంలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే 95 శాతం వరకు నిందితులుగా ఉంటున్నారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య, అశ్లీల సందేశాలు, ఫొటోలు పంపడం, కంపెనీల డేటా దురి్వనియోగం వంటి వాటిలో మాత్రమే స్థానికులు నిందితులుగా ఉంటున్నారు. మార్కెట్ ప్లేస్, ఓఎల్ఎక్స్ నేరగాళ్లకు రాజస్థాన్లోని మేవాట్ రీజియన్లో ఉన్న ఆల్వార్, భరత్పూర్.. ఓటీపీ ఫ్రాడ్స్టర్స్కు జార్ఖండ్లోని జామ్తార, దేవ్ఘర్, గిరిధ్.. కాల్ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ, కోల్కతా అడ్డాలుగా మారాయని ఇప్పటికే గుర్తించారు. ఈ సైబర్ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్కాల్స్ ఆధారంగానే వీళ్లు తమ పని పూర్తి చేసుకుంటారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటారు. ఈ తరహా సైబర్ నేరాలు చేసే వాళ్లు పశి్చమ బెంగాల్లో ఉన్న చిత్తరంజన్, అసన్సోల్లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు. ఈ కారణంగానే అనునిత్యం సైబర్ క్రైమ్ పోలీసులకు చెందిన ఓ టీమ్ ఉత్తరాదిలోనే ఉండిపోవాల్సి వస్తోంది. నేరుగా మూసేయడమూ సాధ్యం కాదు.. ఈ సైబర్ నేరగాళ్లు నూటికి నూరు శాతం నకిలీ ‘ఆధారాలతోనే’ నేరాలు చేస్తుంటారు. బాధితుల్ని సంప్రదించడానికి వినియోగించే ఫోన్ నంబర్లు, వీరి నుంచి డబ్బు కాజేయడానికి వాడే బ్యాంకు ఖాతాలు, వాలెట్స్ సహా ఏ ఒక్కటీ వీరి పేరుతో ఉండదు. నకిలీ వివరాలతో లేదా కమీషన్లకు ఆశపడి తమకు సహకరించే మనీమ్యూల్స్గా పిలిచే మధ్యవర్తుల సాయంతో తమ ‘పని’ పూర్తి చేసుకుంటారు. ఈ కారణంగానే ఏటా నమోదవుతున్న కేసుల్లో అనేకం ఎలాంటి ఆధారాలు దొరక్క క్లోజ్ అవుతూ ఉంటాయి. ఫిర్యాదులోని అంశాలు, కేసు తీరుతెన్నుల ఆధారంగా ఇలా క్లోజ్ అయ్యే వాటిని సైబర్ క్రైమ్ అధికారులు తేలిగ్గానే గుర్తిస్తారు. అలాగని పెండెన్సీ తగ్గించుకోవడానికి ఇలాంటి కేసుల్ని తక్షణం క్లోజ్ చేయడానికీ ఆస్కారం లేదు. దర్యాప్తు నిమిత్తం ఒకటి రెండుసార్లు ఆయా రాష్ట్రాలకు వెళ్లి వచ్చి, పక్కాగా ఆధారాలు దొరలేదని నిరూపించిన తర్వాతే ఈ క్లోజర్కు ఆస్కారం ఉంటుంది. ఓ పక్క సిబ్బంది కొరత.. మరోపక్క పెరుగుతున్న నేరాలతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఠాణాలో కేసుల పెండెన్సీ ఎక్కువవుతోంది. ఇవీ సిటీ సైబర్ ఠాణా సిబ్బంది వివరాలు ఏసీపీ: 1, ఇన్స్పెక్టర్లు: 7, ఎస్సైలు: 13 కానిస్టేబుళ్లు, హెడ్–కానిస్టేబుళ్లు: 33 హోంగార్డులు: 4, మొత్తం: 58 -
జర్నలిస్టులపై కరోనా పంజా!
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్క రోజే 23 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 70కు చేరింది. వరుసగా గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్ నగరంలోని పాత సచివాలయం భవన సముదాయంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం జర్నలిస్టులు, కొందరు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 153 మందికి పరీక్షలు నిర్వహించగా, 23 మందికి కరోనా సోకినట్టు ఆదివారం ఫలితాలొచ్చాయి. ఇంతకు ముందటి మూడు రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 20 మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలింది. గతంలో ఇతర ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మంది జర్నలిస్టులకు వ్యాధి సోకింది. దీంతో ఇప్పటివరకు కరోనా వ్యాధి బారినపడిన జర్నలిస్టుల సంఖ్య 70కు చేరిందని జర్నలిస్టుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఓ తెలుగు వార్తా చానల్లో పనిచేసిన మనోజ్కుమార్ అనే జర్నలిస్టు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. సచివాలయంలో మరొకరికి.. రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్కు కరోనా సెగ తగిలింది. ఇప్పటికే ముగ్గురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు కరోనా బారినపడగా, తాజాగా ఐటీ శాఖ పరిధిలోని ఎన్ఐసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. -
బోసిపోయిన పట్టణ ప్రధాన కూడళ్లు
-
హైదరాబాద్ లో హోలీ సంబరాలు
-
నిశీధి వేళలో.. నిశ్శబ్ద నగరి
సాక్షి, హైదరాబాద్: జన జీవనం ఉలిక్కపడ్డ రోజు రాత్రి చీకటి ఘనీభవించింది. రహదారులపై లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నా క్రీనీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. మృగాళ్ల మరణవార్త తెల్లవారు జామునే నలు‘దిశ’లా పాకడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరం ఊరేగింపయింది. పగలంతా సందడిగా ఉన్నా.. అర్ధరాత్రి వేళ మాత్రం ఏ రోడ్డులోనూ ‘భరోసా’ కనిపించలేదు. ‘దిశ’ ఉదంతం ఇంకా వణికిస్తూనే ఉంది.. రాత్రితో పాటే భయం కూడా పాకుతూనే ఉంది. ‘దిశ’ హంతకులను అంతమొందించిన శుక్రవారం రాత్రి నగరం ఎలా ఉంది? ప్రత్యేకించి రాత్రి 11.30 నుంచి తెల్లవారు జాము 2 గంటల వరకు జనజీవనం ఏ విధంగా ఉందో? తెలుసుకునేందుకు ‘సాక్షి’ నగరంలోని పలు ప్రాంతాల్లో ‘నైట్ విజిట్’ నిర్వహించింది. అక్కడక్కడా ఆగిన పోలీసు వాహనాలు, ఫుడ్స్ట్రీట్స్లో యువకుల సందడి కనిపించింది. రాత్రి 11 గంటల సమయంలో నిబ్బరంగా, నిశ్చింతగా రాకపోకలు సాగించే మహిళల జాడ మాత్రం కనిపించలేదు. ఓ సంఘటన తర్వాత భాగ్యనగర వీధుల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. అమీర్పేట మెట్రోస్టేషన్ ప్రధాన రహదారిని గతంలో మహిళా పారిశుధ్య కార్మికులు ఎవరికి వారు వేర్వేరుగా శుభ్రం చేసేవారు. కానీ శుక్రవారం అర్ధరాత్రి 12.05కు మాత్రం ముగ్గురు, నలుగురు కలిసి జట్టుగా ఒకేచోట రోడ్డు ఊడ్చే పనిలో ఉన్నారు. వారిని పలకరిస్తే.. ‘ఒంటరిగా ఉంటే పోకిరీలు వేధిస్తారు’ అంటూ గత సంఘటనలను గుర్తు చేశారు. ‘దిశ’ ఉదంతం తర్వాత పరిస్థితి మరింత భయానకంగా ఉందంటూ బసవమ్మ, శ్రీలక్ష్మి, లత, పద్మ అనే కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. నగరం నిద్ర పోతున్న వేళ.. ఆ విశేషాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.. ⇒ గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ 1.50 శంషాబాద్ వైపు నుంచే వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కూడలి నుంచి భారీ వాహనాలు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్ల రాకపోకలతో బిజీగా ఉంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో తెల్లవారు జామున 2 గంటలకు బండరాళ్ల టిప్పర్ల రాకపోకలతో బిజీగా ఉంది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 20 టిప్పర్లు బండరాళ్ల లోడ్తో వెళ్లాయి. టిప్పర్లతో పాటు లారీలు, వాటర్ ట్యాంకర్ల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. ⇒ అమీర్పేట మెట్రోస్టేషన్ 12.05 మెట్రోస్టేషన్ ప్రధాన రహదారిని పారిశుధ్య మహిళా కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు కలిసి ఒక టీమ్గా ఊడుస్తున్నారు. ఒంటరిగా ఉంటే పోకిరీలు వేధిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘దిశ’ ఉదంతం తరువాత పరిస్థితి మరింత భయానకంగా ఉందంటూ బసవమ్మ, శ్రీలక్ష్మి, లత, పద్మలు వాపోయారు. నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అమీర్పేట చౌరస్తాలో రోడ్డు ఊడుస్తున్న పారిశుధ్య మహిళా కార్మికులు ⇒ నెక్లెస్రోడ్డు..1.10 నెక్లెస్రోడ్డులోకి అప్పటికే ప్రవేశాన్ని నిలిపివేశారు. అంతకముందే ఐ లవ్ హైదరాబాద్, జలవిహార్ తదితర చోట్ల బర్త్ డే కేక్ కటింగ్ కోసం చాలామంది నెక్లెస్ రోడ్డులోకి వెళ్లి తిరుగుపయనమయ్యారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చే వాహనాలను సైఫాబాద్ పోలీస్స్టేషన్ ఎస్ఐ సైదులు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అయితే కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడాన్ని పోలీసులు గుర్తించారు. నెక్లెస్రోడ్డులో యువకులను ప్రశ్నిస్తున్న పోలీసులు ⇒ మూసాపేట వై జంక్షన్.. 11.30 ఇంకా వాహనాల రద్దీ తగ్గలేదు. అటు కూకట్పల్లి వైపు నుంచి ఇటు బాలానగర్ నుంచి వాహనాలు దూసుకొస్తూనే ఉన్నాయి. మూసాపేట మెట్రోస్టేషన్ సమీపంలో రహదారి చిమ్మచీకటిగా ఉంది. అమీర్పేట మెట్రోస్టేషన్ కింద పార్కు చేసిన ఆటోలు ⇒ ఎస్ఆర్నగర్ బస్టాపు వద్ద 11.45 ట్రావెల్స్ బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. తాము వెళ్లాల్సిన బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. డీఎల్ఎఫ్ మొదటి, రెండవ గేట్ ముందు ఫుడ్ స్టాళ్ల వద్ద ఐటీ ఉద్యోగులు ⇒ మాదాపూర్ విఠల్రావునగర్ 12.00 కరాచీ బేకరీ నుంచి రత్నదీప్ సూపర్ మార్కెట్ వరకు సర్వీస్ రోడ్డులో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బిజీబిజీగా ఉన్నారు. వందలాది మంది ఐటీ ఉద్యోగులు అన్ని రకాల టిపిన్స్, కబాబ్స్, ఐస్క్రీమ్, చాట్ రుచి చూస్తున్నారు. రాత్రి ఒంటి గంట వరకు వేడి వేడి వంటకాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీరంతా దిశ ఎన్కౌంటర్పై చర్చించుకుంటూ కనిపించారు. చాలామంది ఎన్కౌంటర్ను సమర్ధిస్తూ మాట్లాడుకున్నారు. మాదాపూర్– ఎంసీహెచ్ఆర్డీ జంక్షన్లో టిఫిన్ సెంటర్ వద్ద జనం ⇒ పంజగుట్ట చౌరస్తా .. 12.37 ఎస్ఆర్ టైర్స్లో 24 గంటల పాటు పంక్చర్ సేవలు అందిస్తున్నారు. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో పంక్చర్ పడినా తన వద్దకు వస్తే పంక్చర్ వేసేందుకు వెళ్తానని అస్లాం చెప్పుకొచ్చాడు. షిప్టుల వారీగా పగలు ఒకరు, రాత్రి మరొకరు ఇక్కడ పంక్చర్ సేవలు అందిస్తున్నారు. ⇒ ట్యాంక్బండ్1.40 లేక్ పోలీసులు పహారా కాస్తున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు హుస్సేన్సాగర్ తీరానికి వచ్చేవారిని కాపాడడం వాళ్ల ప్రధాన విధి. ఫజల్ అహ్మద్ఖాన్, మహబూబ్ బాషా, పవన్కుమార్ ట్యాంక్పై విధులు నిర్వర్తిస్తూ కనిపించారు. హుస్సేన్సాగర్ తీరాన బర్త్ డే వేడుక ⇒ రాంగోపాల్పేట..1.55 క్లాక్ టవర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ కొందరు కార్మికులు సీసీ కెమెరాల కోసం స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. రాంగోపాల్పేట్ పాత పోలీస్స్టేషన్ రోడ్డులో తాజ్ హోమ్ హోటల్ వద్ద నిద్రిస్తున్న యాచకులు ⇒ ప్యారడైజ్ చౌరస్తా 1.50 ఒక రెస్టారెంట్ ముందు టీ స్టాల్ తెరిచే ఉంది. చాలా మంది అక్కడ టీ తాగుతున్నారు. నగరంలో ఇలా.. రాత్రి 11గంటల నుంచి 2.30 గంటల వరకు చింతల్కుంట నుంచి ప్రారంభమైన ‘సాక్షి’ విజిట్ ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోఠి, అబిడ్స్ వరకు సాగింది. రాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్ను పెంచారు. ప్రధాన చౌరస్తాలో మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నల్లగొండ చౌరస్తాలో పోలీస్పెట్రోలింగ్ పాయిధ దళాలను తలపించే విధంగా అయుధాలు ధరించి పోలీసులు బందోబస్తుతో నిఘా పెట్టారు. ఎల్బీనగర్ చౌరస్తాలో మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో రద్దీగా ఉండే పాతబస్తీలోని ప్రధాన రోడ్లతో పాటు ఆఫ్జల్గంజ్, మొజంజాహీ మార్కెట్, కంట్రోల్ రూం, లక్డీకాపూల్, మాసాబ్టాంక్, బంజారాహిల్స్ రోడ్డు నెం.1 ప్రధాన రూట్లో జన సంచారం తగ్గింది. చార్మినార్–మక్కా మసీదు వద్ద అర్దరాత్రి దాటిన అనంతరం కూడా ప్రజల హడావుడి కనిపించేది. డిసెంబర్ 6 తో పాటు దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపధ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 12 గంటలు దాటిన తర్వాత నలువైపుల నుంచి చార్మి నార్ కట్టడం వరకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది చార్మినార్ – మక్కా మసీదు గ్రానైట్ రోడ్లను శుభ్రం చేశారు. 12.10 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి మహిళలు గౌస్నగర్, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, ఆరాంఘర్లకు వెళ్లేందుకు ఆటోల కోసం ఎదురు చూస్తూ కనిపించారు. షంషీర్గంజ్, శాలిబండ రోడ్లలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు వెళ్లడం కనిపించింది. చార్మినార్ వద్ద రాత్రి 12.15 గంటలు: ఉప్పుగూడకు చెందిన పద్మావతి అనే మహిళ తమ కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అర్దరాత్రి రోడ్డుపై వెళుతున్న ఆమెను పలకరించగా... మాకెం కాదు.. భయమెందుకు అంటూ ధీమాగా బదులిచ్చింది. చార్మినార్ వద్ద 12.30: జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది గ్రానైట్ రోడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. తెల్లవారు జామున 1.15 గంటలకు అఫ్జల్గంజ్ కూడలి జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది. 1.55 గంటలకు కంట్రోల్ రూమ్ ఎదురుగా అసెంబ్లీ రోడ్డుపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గుంపులుగా వీధులను శుభ్రం చేస్తూ కనిపించారు. 2.15 గంటలకు బంజారాహిల్స్ రోడ్డు నెం.1లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది వీధుల్ని శుభ్రం చేస్తూకనిపించారు. రాత్రి 11గంటల నుంచి 2.30 గంటల వరకు చింతల్కుంట నుంచి ప్రారంభమైన ‘సాక్షి’ విజిట్ ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోఠి, అబిడ్స్ వరకు సాగింది. uరాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్ను పెంచారు. ప్రధాన చౌరస్తాలో మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నల్లగొండ చౌరస్తాలో పోలీస్పెట్రోలింగ్ పాయిధ దళాలను తలపించే విధంగా అయుధాలు ధరించి పోలీసులు బందోబస్తుతో నిఘా పెట్టారు. ఎల్బీనగర్ చౌరస్తాలో మాత్రం దూర ప్రాంతాలకు వెళ్లే వారు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో రద్దీగా ఉండే పాతబస్తీలోని ప్రధాన రోడ్లతో పాటు ఆఫ్జల్గంజ్, మొజంజాహీ మార్కెట్, కంట్రోల్ రూం, లక్డీకాపూల్, మాసాబ్టాంక్, బంజారాహిల్స్ రోడ్డు నెం.1 ప్రధాన రూట్లో జన సంచారం తగ్గింది. చార్మినార్–మక్కా మసీదు వద్ద అర్దరాత్రి దాటిన అనంతరం కూడా ప్రజల హడావుడి కనిపించేది. డిసెంబర్ 6 తో పాటు దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపధ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 12 గంటలు దాటిన తర్వాత నలువైపుల నుంచి చార్మి నార్ కట్టడం వరకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది చార్మినార్ – మక్కా మసీదు గ్రానైట్ రోడ్లను శుభ్రం చేశారు. 12.10 గంటల సమయంలో చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి మహిళలు గౌస్నగర్, మైలార్దేవ్పల్లి, కాటేదాన్, ఆరాంఘర్లకు వెళ్లేందుకు ఆటోల కోసం ఎదురు చూస్తూ కనిపించారు. షంషీర్గంజ్, శాలిబండ రోడ్లలో మహిళలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ఇళ్లకు వెళ్లడం కనిపించింది. చార్మినార్ వద్ద రాత్రి 12.15 గంటలు: ఉప్పుగూడకు చెందిన పద్మావతి అనే మహిళ తమ కుమారులతో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. అర్దరాత్రి రోడ్డుపై వెళుతున్న ఆమెను పలకరించగా... మాకెం కాదు.. భయమెందుకు అంటూ ధీమాగా బదులిచ్చింది. చార్మినార్ వద్ద 12.30: జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది గ్రానైట్ రోడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. తెల్లవారు జామున 1.15 గంటలకు అఫ్జల్గంజ్ కూడలి జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించింది. 1.55 గంటలకు కంట్రోల్ రూమ్ ఎదురుగా అసెంబ్లీ రోడ్డుపై జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు గుంపులుగా వీధులను శుభ్రం చేస్తూ కనిపించారు. 2.15 గంటలకు బంజారాహిల్స్ రోడ్డు నెం.1లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది వీధుల్ని శుభ్రం చేస్తూ కనిపించారు. -
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► ఏపీ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో మరో మార్పు చేపట్టిన ప్రభుత్వం మంత్రులు, అధికారుల పేషీల్లో సిబ్బంది కాలపరిమితి విధిస్తూ ఉత్తర్వులు మంత్రుల పేషీలు, ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీ కార్యాలయాల్లోని సిబ్బందివి వర్తింపు మూడేళ్లకు మించి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు క్లాస్ వన్ నుంచి క్లాస్ ఫోర్ ఉద్యోగి వరకు వర్తింపు పేషీల్లో బదిలీలకు సంబంధించి నిలుపుదలకు కేవలం సీఎంవోకే అధికారం డిసెంబర్ 31లోగా మార్పుచేర్పులు జరగాలని స్పష్టం చేసిన ప్రభుత్వం ► గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మించిన టీడీపీ కార్యాలయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆర్కే అక్రమ నిర్మాణమంటూ, భవనం కూల్చివేసి భూమిని సీఆర్డీఏ సరెండర్ చేసుకోవాలని పిటిషన్ సర్వే నెంబర్ 392లో 3.65 ఎకరాల పోరంబోకు భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం 99 సంవత్సరాల పాటు లీజులకు తీసుకున్నట్టు పిటిషన్లో పేర్కొన్న ఆర్కే ఇది అక్రమమని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఆర్కే న్యాయవాది వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను ఇతరులకు కేటాయించడం పర్యావరణ చట్టాలకు విరుద్ధం గతంలో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పిందని పేర్కొన్న ఆర్కే గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషన్ తెలంగాణ ► బ్లాక్ డే సందర్భంగా హైదరాబాద్లో 144 సెక్షన్ విధింపు నగరంలో బైక్ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు నిషేధం ► నేడు భారత్ - వెస్టిండీస్ మధ్య మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం స్టేడియం వద్ద 1800 మంది పోలీసులతో భారీ భద్రత అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు వెస్టిండీస్తో మొత్తం మూడు టీ20లు ఆడనున్న భారత్ జాతీయం ► బాబ్రీ మసీదు కూల్చివేసి నేటికి 27 ఏళ్లు 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత ఉత్తరప్రదేశ్లో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసు ఉన్నతాధికారులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు -
32 కాదు.. 28 దంతాలే..
సాక్షి, హైదరాబాద్: చిన్నతనంలో పాలదంతాలు వస్తాయి. 7–9 సంవత్సరాల మధ్యలో ఇవి ఊడిపోయి.. పైన, కింద కలిపి కొత్తగా 28 దంతాలు ఏర్పడతాయి. కానీ బాల్యంలో ఆహారాన్ని ఎక్కువగా నమిలే అలవాటు లేకపోవడం, ఐస్క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల నోటికి సరైన వ్యాయామం ఉండటం లేదు. దీంతో దవడలు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా అమ్మాయిల్లో 16 ఏళ్లు, అబ్బాయిల్లో 18 ఏళ్లు దాటాక పుట్టుకొచ్చే నాలుగు జ్ఞానదంతాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. నేటితరం యువతీ యువకుల్లో 90 శాతం మందికి జ్ఞానదంతాలు లేవు. ఒకవేళ ఉన్నా.. అవి ఎగుడుదిగుడుగా, చిగుళ్లలోకి చొచ్చుకుపోయి ఉన్నాయి. పిల్లల దవడ సైజు తగ్గడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంత యువతతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. జ్ఞానదంతాలు సరిగా ఏర్పడని వారు ఆహారం తీసుకునేప్పుడు ఆ దంతాలు చిగుళ్లకు గుచ్చుకుని తీవ్రమైన పంటి, తల నొప్పి కలుగుతున్నాయి. ప్రస్తుతం యువతలో వెలుగుచూస్తున్న ఈ సమస్యలకు ఇదే కారణమని సర్వేలో తేల్చారు. మన దంత ఆరోగ్యం అంతంతే! ►విదేశీయులు విధిగా రోజుకు రెండుసార్లు దంతా లు శుభ్రం చేసుకుంటారు. ఇది వారి దినచర్యలో ఒక భాగం. మన దేశంలో నూటికి 90 శాతం మందికి దంత ఆరోగ్యంపై అవగాహన లేదు. ►ఇట్టే కరిగిపోయే చాక్లెట్లు, స్వీట్లు వంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం, రాత్రి పడుకునే ముందు దంతాలు శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోట్లో వివిధ రకాల బ్యాక్టీరియా ఏర్పడుతోంది. ►15 నుంచి 30 ఏళ్ల యువతలో 30 – 40% మంది నోటి నుంచి దుర్వాసనతో బాధపడుతుంటే, 60 నుంచి 70 శాతం మంది చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ►ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తి శాతం తగ్గిపోతోంది. దీంతో ‘హెచ్పైలోరే’ అనే బ్యాక్టీరియా కడుపులోకి చేరి అజీర్తి, అల్సర్లకు కారణమవుతోంది. ఏం చేయాలి? ►ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి. దీనివల్ల దవడల పరిమాణం పెరుగుతుంది. జ్ఞానదంతాల పుట్టుకకు వీలవుతుంది. ►గట్టిగా ఉన్న కాయలు, పండ్లు, గింజలు మెత్తగా నమలడం వల్ల పంటికి ఎక్సర్సైజ్ అవుతుంది. నోటిలో లాలాజలం సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ►రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకుంటే దంత ఆరోగ్యం మెరుగవుతుంది. దంత కేన్సర్లో సిటీది మూడో స్థానం ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే దంత కేన్సర్ ఎక్కువ. పొగాకు, జర్దా, పాన్, గుట్కాలు ఎక్కువగా నమలడమే ఇందుకు కారణం. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, బిహార్ ఒకటి, రెండో స్థానాల్లో ఉంటే, హైదరాబాద్ మూడో స్థానంలో నిలుస్తోంది. కోల్కతా, చెన్నై, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వారిలో 38 శాతం మంది నోటి కేన్సర్తో, 28 శాతం మంది నోటి చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. మనతో పోలిస్తే దంత ఆరోగ్యంపై కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వాసుల్లో అవగాహన ఎక్కువ. – డాక్టర్ బి.చంద్రకాంత్రావు, దంత వైద్యనిపుణుడు, మహావీర్ హాస్పిటల్, మాసబ్ట్యాంక్ -
నగరంలో మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు చలి తీవ్రత పెరగడంతో స్వేచ్ఛగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి నెలకొంది. చలి ప్రభావంతో సాయంత్రమైందంటే చాలు శ్వాసనాళాలు మూసుకుపోతుండడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న రోగుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఇన్హేలర్ సపోర్ట్ లేనిదే ఊపిరి తీసుకోవడం కష్టతరంగా మారింది. నగరంలో 12–15 శాతం మంది శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండగా... ప్రస్తుత సీజన్లో బాధితుల సంఖ్య 15–20 శాతానికి పెరిగినట్లు అంచనా. అంతేకాకుండా ప్రస్తుత వాతావరణం స్వైన్ఫ్లూ కారక వైరస్, ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, పిల్లలు, గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వాహన, పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్ఎస్పీఏం అధికం.. గ్రేటర్ పరిధిలో సుమారు 50వేల పరిశ్రమలు ఉండగా.. 55లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న ఉద్గారాలు వాతావరణంలో చేరుతున్నాయి. ఈ కాలుష్యానికి చలి తీవ్రత తోడైంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం పొగతో కూడిన మంచు కురుస్తోంది. వాతావరణంలో రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (ఆర్ఎస్పీఎం)నిర్ణీత ప్రమాణాలకు మించి నమోదవుతోంది. సాధారణంగా వాతావరణంలో 60 మైక్రో గ్రాములు/క్యూబిక్ మీటరు వరకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ దీపావళి తర్వాత వాతావరణ కాలుష్యం తీవ్రత మరింత పెరిగింది. శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5. పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమైదైంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం, పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాససంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జాగ్రత్తలు అవసరం గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరంలో వాహన కాలుష్యం ఎక్కువ. ముఖ్యంగా బేగంపేట, బాలానగర్, నెహ్రూ జులాజికల్ పార్క్, జీడిమెట్ల, పంజగుట్ట, ఖైరతాబాద్, అబిడ్స్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆయా పరిసరాల్లో నివసించే వృద్ధులు, పిల్లల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్న శ్వాస సంబంధ సమస్యలకు ఇదే కారణం. వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారక ఉద్గారాలు గాలి ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం, ఇంటి పరిసరాల్లో పచ్చదనాన్ని వృద్ధి చేసుకోవడం, సాధ్యమైనంత వరకు గ్రీనరీ ప్రదేశాల్లో ఎక్కువగా గడపడం వల్ల వీటి నుంచి బయటపడొచ్చు. సాధ్యమైనంత వరకు ఈ సీజన్లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ముక్కుకు మాస్క్ ధరించడం తప్పనిసరి. – డాక్టర్ రఫీ,ఫల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
చలో పల్లె‘టూర్’
-
ఆర్థిక వ్యవస్థపై రోడ్డు ప్రమాదాల ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతపై నగర ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రోడ్లు, రవాణా, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఖైరతాబాద్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్లో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేప్టీ’ పై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డిమాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 12 లక్షల మంది మరణిస్తున్నారని, 5 కోట్ల మంది గాయపడుతున్నారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ పెద్దను కోల్పోవలసి వస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తగ్గుతున్న దేశ జీడీపీ.. ప్రమాదాల వలనే 3 శాతం దేశ జీడీపీ తగ్గిపోతుందన్నారు. వాహనాలు నడిపే వ్యక్తి అజాగ్రత్త, సేఫ్టీపై అవగాహన లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రహదారి సౌకర్యం సరిగా లేని కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల విద్యలో రోడ్డు భద్రతపై సిలబస్ ప్రవేశపెట్టడం ద్వారా అవగాహన పెంచవచ్చన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో సెలబ్రెటీలు, ప్రముఖులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలి.. రోడ్డు భద్రత విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినగా అమలు చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు పొల్యూషన్ చెక్ చేసి వాహనాల కండిషన్ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు. జాతీయ రహదారులపై అంబులెన్స్లు సంఖ్య పెంచాలన్నారు. బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించి వాటిని పూడిస్తే ప్రమాదాలు తగ్గుతాయని ఆర్అండ్బి అధికారులకు విజ్ఞప్తి చేశారు. లైసెన్స్ల మంజూరులో నిబంధనలు కఠినతరం చేయాలని కోరారు. లైసెన్స్లు ఇచ్చినప్పుడే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రతపై అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి జానార్ధన్ రెడ్డి, అర్అండ్బి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ డీజీపీ కృష్ణ ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చార్మినార్ ఘటనలో కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్లోని యునాని హాస్పిటల్ తరలింపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చార్మినార్ కానిస్టేబుల్ పరమేశ్ను నగర సీపీ సస్సెండ్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సీపీ యునాని ఆస్పత్రి ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరపాలని సౌత్ జోన్ డీసీపీని ఆదేశించారు. -
చార్సౌ సాల్ కాదు.. వేల ఏళ్ల వైభవం
భాగ్యనగరం అనగానే కులీ కుతుబ్షా 1591లో నిర్మించిన పట్టణం... అని చరిత్ర చెబుతుంది. మరి అంతకు పూర్వం సంగతేంటి? చరిత్ర పుటలు తిరగేస్తే 1518లో కుతుబ్షాహీ పాలన ఆరంభం కాకముందు ఢిల్లీ సుల్తానులు, అంతకు పూర్వం కాకతీయులు, వారికంటే ముందు చాళుక్యుల పాలన.. ఇలా కనిపిస్తాయి. కాకతీయుల కాలం కంటే పూర్వమే గోల్కొండ పట్టణం ఉండేదన్న సంగతిని చరిత్ర చెబుతుంది, కానీ ఎక్కడా ఆధారాలు కనిపించవు. దాదాపు మూడు వేల ఏళ్ల క్రితమే ఈ నగర ప్రాంతంలో మానవ సంచారం ఉందనడానికి ఇప్పుడు ఆధారాలు లభించాయి. రాతి యుగానికి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఆధారాలు వెలుగు చూడటం సహజమే. కానీ హైదరాబాద్ మహానగరంలో వాటి జాడలు దొరకడం అరుదు. నగరం మధ్య గుండా సాగుతున్న మూసీ నదిలో మూడు వేల ఏళ్ల క్రితం కొత్తరాతి యుగం జాడలు, దాని ఒడ్డున దాదాపు 1,500 ఏళ్ల క్రితం విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధ ఉద్దేశిక స్తూపాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ చరిత్ర కొత్త పుటను పరిచయం చేస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. –సాక్షి, హైదరాబాద్ బౌద్ధానికి తెలంగాణ నేలతో ఉన్న అనుబంధం అసాధారణం. బుద్ధుడి బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు ఆయన బతికున్న కాలంలోనే ప్రచారం మొదలైంది తెలంగాణ నుంచే అన్న విషయం ఇప్పుడిప్పుడే ఆధార సహితంగా రూఢీ అవుతోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బౌద్ధ ఉద్దేశిక స్తూపాలెన్నో విస్తరించి ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రాచుర్యం కల్పించకపోవటంతో మరుగున పడిపోయాయి. ఇప్పుడు బుద్ధవనం ప్రాజెక్టు ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో కొత్త అన్వేషణ సాగుతుండటం కొంతలో కొంత శుభపరిణామం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అన్వేషణలోనే హైదరాబాద్ చరిత్రలో పురాతన కోణం వెలుగుచూడటం విశేషం. ఆ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎం.ఎ.శ్రీనివాసన్, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్ మూసీ తీరంలో రెండు రోజుల క్రితం జరిపిన అన్వేషణలో ఆధారాలు వెలుగు చూశాయి. దిల్సుఖ్నగర్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న కొసగుండ్ల నరసింహస్వామి దేవాలయంలో బౌద్ధం జాడలున్నాయన్న సంగతిని దాదాపు 4 దశాబ్దాల క్రితమే పురావస్తుశాఖ అధికారి పరబ్రహ్మచారి గుర్తించారు. ఇక్కడ దాదాపు ఐదో శతాబ్దం నాటి శాసనాన్ని ఆయన కనుగొన్నారు. ఆ తర్వాత అన్వేషణ ముందుకు సాగలేదు. తాజాగా బుద్ధవనం తరఫున ఈ ఇద్దరు ఆ దేవాలయం గుట్టపై అన్వేషించే క్రమంలో ఆసక్తికర విషయాలు గుర్తించారు. పెద్దగుండుపై విష్ణుకుండిల కాలానికి చెందిన గోవిందరాజ వర్మ ఏర్పాటు చేసిన శాసనాన్ని గుర్తించారు. ఇదే ప్రాంతంలో రెండు బౌద్ధ ఉద్దేశిక స్తూపాలను గుర్తించారు. సాధారణంగా బౌద్ధ స్తూపాల్లో బుద్ధుడి ధాతువు ఉంటుంది. కానీ ఉద్దేశిక స్తూపాలను నాటి ముఖ్యమైన బౌద్ధ సన్యాసుల స్మారకంగా నిర్మిస్తారు. ఇక్కడ తదనంతర కాలంలో ఏర్పాటు చేసిన ఓ శివలింగంతో కూడిన రాయి దిగువన ఉద్దేశిక స్తూపం ఉన్నట్టు గుర్తించారు. గుట్టకు ఆనుకుని వెనక వైపు ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో భూమిలో కూరుకుపోయి ఉన్న మరో ఉద్దేశిక స్తూపాన్ని గుర్తించారు. చెట్ల పొదలు, కొంత మట్టిని పక్కకు జరపగా వృత్తాకారంలో ఉన్న ఈ స్తూపం కనిపించింది. దాని చుట్టూ మట్టిని తొలగిస్తే ఆ స్తూపం పూర్తి ఆకృతి వెలుగు చూస్తుంది. నగరం నడిబొడ్డున బౌద్ధానికి చెందిన ఉద్దేశిక స్తూపం వెలుగుచూడటం ఇదే తొలిసారి. మూసీ మధ్యలో కొత్తరాతియుగం చిత్రాలు... చైతన్యపురికి సమీపంలోనే ఉన్న మూసీ నది మధ్యలో ఉన్న ఓ భారీ బండరాయి మూడు వేల ఏళ్ల నాటి కొత్తరాతియుగం మానవ సంచారానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఆ బండరాయిపై నాటి మానవులు గీసిన ఎరుపు వర్ణం చిత్రం కనిపించింది. దాదాపు మూడు అడుగుల పొడవుతో ఉన్న ఈ చిత్రంలో పశువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. రాతియుగంలో మానవులు సమూహంగా ఉంటూ ఆవాసయోగ్యంగా చేసుకున్న ప్రాంతాల్లో ఇలా చిత్రాలు గీయటం సహజం. నగరంలో కూడా ఇలా ఆవాసాలు ఎన్నో ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. పట్టణీకరణ క్రమంలో చాలా గుట్టలను క్వారీలతో మాయం చేయటంతో ఈ ఆధారాలు నాశనమయ్యాయి. గండిపేట సమీపంలోని కోకాపేటలో ఓ గుట్టపై ఇప్పటికీ అద్భుతమైన చిత్రాలున్నాయి. ఆ గుట్టలన్నీ క్వారీల పేరుతో కనుమరుగు కాగా, స్థానికుల చొరవతో ఈ చిత్రాలున్న ఒక్క గుండును మాత్రం వదిలేశారు. అది తప్ప రాక్ పెయింటింగ్స్ నగరంలో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మూసీ మధ్యలో పెద్ద గుండుపై కనిపించటం ఆసక్తిరేపుతోంది. ఆ చుట్టుపక్కన ఉన్న రాళ్లను జల్లెడ పడితే మరిన్ని చిత్రాలు కనిపించే అవకాశం ఉందని శ్రీనివాసన్ అంటున్నారు. ప్రత్యేక పద్ధతిలో ఆ చిత్రాలు మరింత స్పష్టంగా కనిపించేలా చేయాల్సి ఉంది. నాటి మానవులు ఆయుధాలను నూరుకునేందుకు ఏర్పాటు చేసిన గ్రూవ్స్ కూడా బండలపై ఉన్నాయి. వెలికితీసి పరిరక్షించాలని మంత్రికి వినతి ఇప్పుడు గుర్తించిన ఉద్దేశిక స్తూపాలను వెంటనే వెలికి తీసి పరిరక్షించాలంటూ బుద్ధవనం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండురోజుల క్రితం గుర్తించిన ఆధారాల వివరాలను హెరిటేజ్ తెలంగాణ విభాగం అధికారులకు, మంత్రి శ్రీనివాసగౌడ్కు అందజేశారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి స్తూపాలను పూర్తిగా వెలికి తీయాలని కోరారు. తవ్వకాలు జరిపితే మరిన్ని ఆధారాలు వెలుగు చూస్తాయని శ్రీనివాసన్ అంటున్నారు. ఇది హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన విషయం అయినందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. -
నిందితులు కాదు.. బాధితులే: సినీ సెలబ్రెటీలపై సిట్ రిపోర్ట్
-
డ్రగ్స్కేసు : సినీ సెలబ్రిటీలకు క్లీన్ చీట్!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్కేసులో సినీ సెలబ్రిటీలు నిందితులు కాదని, బాధితులేనని సిట్ రిపోర్ట్లో పేర్కొంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఎక్సైజ్ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది. దీంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. అయితే చార్జిషీట్లలో సినీ ప్రముఖులను బాధితులుగా పేర్కొవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సిట్ 4 చార్జిషీట్లను దాఖలు చేసినట్టు సమాచారం. కేసులో హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖుల నుంచి గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించిన విషయం విదితమే. అయితే టాలీవుడ్ నటుల పేర్లను చార్జిషీట్లలో సిట్ అధికారులు చేర్చలేదు. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులను సిట్ నమోదు చేసింది. అయితే దాఖలైన చార్జిషీట్లలో సినీ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేసిన నాలుగింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్పై ఉంది. ముంబై నుంచి హైదరాబాద్కు కొకైన్ను తరలించి విక్రయిస్తున్నాడని 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : డ్రగ్స్కేసు : సినీ సెలబ్రెటీలు నిందితులు కాదు.. బాధితులే.. -
విశ్వనగరానికి పక్కా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరాన్ని అసలు సిసలు విశ్వనగరం (గ్లోబల్ సిటీ)గా మార్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నగరాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని, అలాంటి సమస్య లను ముందుగానే అంచనావేసి పరిష్కారాలు చూపే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో భవిష్యత్తు అవసరాలకు తగినట్టు హైదరాబాద్ నగర ‘మాస్టర్ ప్లాన్’రూపొందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా సన్నద్ధం చేసే అంశంపై శనివారం ప్రగతి భవన్లో అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే మాస్టర్ ప్లాన్లో రాష్ట్ర కేబినెట్ మినహా మరెవరూ మార్పులు చేయకుండా చట్టం రూపొందిస్తామన్నారు. హైదరాబాద్ నగర సమగ్రాభివద్ధి ప్రణాళికను అమలు చేసే బాధ్యతను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తోపాటుగా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వివిధ ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరాభివృద్ధికి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) నిధులతోపాటు ఇతరత్రా నిధులను కూడా సమకూరుస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్ మహానగర ప్రజలకు మంచినీరు అందించడానికి కేశవాపూర్లో నిర్మించతలపెట్టిన మంచినీటి రిజర్వాయర్కు ఈ నెలలోనే శంకుస్థాపన చేసి శరవేగంగా పనిపూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. మెట్రోరైలును ఎయిర్పోర్టు వరకు విస్తరిస్తామని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల ఉన్న నగరం, ఓఆర్ఆర్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య ఉన్న నగరం, ట్రిపుల్ ఆర్ అవతల విస్తరించే నగరం ఇలా మూడు యూనిట్లుగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. పెరుగుతున్న వలసలకు తగ్గట్లుగా.. ‘హైదరాబాద్ శరవేగంగా అభివద్ధి చెందుతోంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్కు వలస వస్తున్నారు. నగరంలోని వాతావరణం, సామరస్యపూర్వక జీవనం, పారిశ్రామిక విధానం ఫలితంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు, పరిశ్రమలు తరలిరావడంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో ఏటా ఐదారు లక్షల జనాభా హైదరాబాద్కు తరలుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడుతున్నారు. ఉద్యోగ, వ్యాపారాలరీత్యా నిత్యం హైదరాబాద్ నగరానికి వచ్చి పోయే వారి సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి ఏటా రెండు కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇవన్నీ ఆర్థికాభివృద్దికి దోహదపడే అంశాలు. పెరుగుతున్న జనాభా, వారి అవసరాలకు తగ్గట్లుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దకుంటే.. నగర జీవితం నరకప్రాయం కాక తప్పదు’అని సీఎం పేర్కొన్నారు. నాడు స్వర్గమే.. కానీ నేడు! ‘నేను నగరాన్ని కాదు, జన్నత్ (స్వర్గం) నిర్మిస్తున్నా అని హైదరాబాద్ నగరం నిర్మించేటప్పుడు కులీ కుతుబ్షా అన్నారు. నిజంగా హైదరాబాద్ ఒకప్పుడు స్వర్గంగానే ఉండేది. ముత్యాలు, సరస్సులు, ఉద్యానవనాలతో నిండి ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. రాన్రానూ పరిస్థితి మారిపోయింది. మూసీ మురికితో నిండిపోయింది. నగరంలో కాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. పచ్చదనం తగ్గిపోయింది. రానున్న కాలంలో జనాభా మరింత పెరిగి పరిస్థితి చేయిదాటిపోతుంది. జీవనం మరింత దుర్భరంగా మారడం ఖాయం. అందుకే మనమంతా ఇప్పుడే మేల్కోవాలి. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి దానికి తగ్గట్లుగా హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి.. అమలు చేయాలి’అని కేసీఆర్ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ‘హైదరాబాద్ ఇప్పుడెలా ఉంది? జనాభా ఎంతుంది? రోడ్లెలా ఉన్నాయి? ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి? సీవరేజి పరిస్థితి ఏమిటి? గ్రీన్ కవర్ పరిస్థితి ఏమిటి? వాహనాలు ఎన్ని ఉన్నాయి? రవాణా వ్యవస్థ ఎలా ఉంది? విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటి? అనే దానిపై ఓ స్పష్టమైన నిర్ధారణకు రావాలి. పదేళ్ల తర్వాత హైదరాబాద్ ఎలా ఉండబోతుందో శాస్త్రీయంగా అంచనా వేయాలి. దానికి తగినట్లుగా ఏం చేయాలనే దానిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఢిల్లీ, బెంగళూరులతోపాటు చైనా రాజధాని బీజింగ్ కూడా ప్రస్తుతం జనజీవనానికి అనుకూలంగా లేదు. ఢిల్లీ కాలుష్య వలయంలో చిక్కుకుంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. మన కళ్ల ముందే నగరాలు ఆగమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు మేల్కొని సరైన విధంగా సన్నద్ధం కాకుంటే మనకు కూడా విషమ పరిస్థితులు తప్పవు. నగర ప్రజల జీవితాన్ని సౌకర్యంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది’అని సీఎం చెప్పారు. పచ్చదనం పెరగాలి ‘హైదరాబాద్ నగరం లోపలా, బయటా పచ్చదనం పెంచడంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండీఏ పరిధిలోని భూభాగం చాలా పెద్దగా ఉండడంతో మొత్తం భూభాగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వ్యవసాయ క్షేత్రాలను ఓపెన్ ప్లేసులుగా పరిగణించి, మిగతా చోట్ల ఇష్టారీతిన భవనాలకు, నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. దీంతో నగరంలో పచ్చదనం కరువవుతోంది. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరమంతా కాలుష్యమయం అవుతుంది. అందుకే అనుమతుల విషయంలో నియంత్రణ ఉండాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలన్నింటినీ ప్రధాన నగరం అవతలికి తరలించాలి. మూతపడిన పరిశ్రమల భూముల్లో పార్కులు ఏర్పాటు చేయాలి. నగరంలో ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పచ్చదనం పెంచాలి. 1.50 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ బ్లాకుల్లో అడవిని పునరుద్ధరించాలి. హైదరాబాద్ నగరాన్ని ఓఆర్ఆర్ లోపలున్న నగరం, ఓఆర్ఆర్ అవతలి నుంచి ప్రతిపాదిత ట్రిపుల్ ఆర్ వరకుండే నగరం, ట్రిపుల్ ఆర్ అవతల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించే నగరం.. ఇలా మూడు భాగాలుగా విభజించుకుని మంచినీరు, డ్రైనేజి, సీవరేజి, ట్రాఫిక్, రవాణా, విద్యుత్ సరఫరా తదితర అంశాల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అంచనా వేయాలి. భవిష్యత్తులో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో నిర్ణయించాలి. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, హెల్త్ సిటీలను ప్లాన్ చేసి వీటికి అనుకూలంగా ఉండే ప్రాంతాలను గుర్తించాలి. దాని ప్రకారమే అనుమతులు ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదు. మాస్టర్ ప్లాన్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే దానికి కేబినెట్ అనుమతి తప్పనిసరి చేస్తూ చట్టం తెస్తాం’అని ముఖ్యమంత్రి అన్నారు. సిటీ జనాభా పెరుగుతోంది! ‘నగరాలకు వలసలను ఆపలేం. అనేక అనుకూలతలున్న హైదరాబాద్కు వలసలు మరింత ఎక్కువ కాకతప్పదు. పెరిగే జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధం చేయడం ఒక్కటే మనముందున్న మార్గం. మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఆస్కీకి ఆ పని అప్పగిస్తాం. వారు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను కన్సల్టెన్సీలుగా నియమించుకోవాలి. వారికి అవసరమైన మౌలిక సమాచారాన్ని ఇవ్వాలి. మూడు నెలల్లో నగరానికి మంచి మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ఒక్క హెచ్ఎండీఏకి సాధ్యం కాదు. మరికొన్ని ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలి. ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది’అని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి, ఆస్కి అర్బన్ గవర్నెన్స్ విభాగాధిపతి వి.శ్రీనివాసాచారి, ఫ్యాకల్టీ మాలినీ రెడ్డి, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, మాణిక్ రాజ్, సందీప్ సుల్తానియా, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనచారి పాల్గొన్నారు. -
పంజాగుట్టలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ క్రైమ్ : పంజాగుట్టలోని ఓ వైన్ షాపులో సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న డ్యూ పాయింట్ వైన్స్లో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చెలరేగుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారుగా రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు. -
పండులో..విషముండు
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో పీల్చే గాలి, తాగే నీరే కాదు.. ఆకుకూరలు, కూరగాయలతో పాటు నిగనిగలాడుతూ నోరూరించే పండ్లు సైతం విషతుల్యమవుతున్నాయి. మార్కెట్కు ప్రతిరోజు దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే, వాటిని మగ్గించేందుకు ఇక్కడి వ్యాపారులు రసాయనాలు వినియోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని ప్రధాన పండ్ల మార్కెట్లు, బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్న వివిధ రకాల పండ్లను చైనా పౌడర్, ఇతరరసాయనాలతో కృత్రిమంగా మగ్గబెడుతున్నారని, దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ తాజా అధ్యయనంలో గుర్తించింది. కాయలను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రసాన పౌడర్తో పాటు ఎసిటలిన్ గ్యాస్, కార్బైడ్ వంటి పదార్థాలు వాడుతున్నారని తేల్చింది. ఈ పండ్లలో ఆర్సినిక్, ఫాస్పరస్ వంటి మూలకాల ఆనవాళ్లున్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలున్న పండ్లు తిన్నవారికి మెదడు, నరాలు, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు, చర్మవ్యాధులు, కడుపులో మంట వంటి సమస్యలతో బాధపడతారని హెచ్చరించింది. మోతాదు మించితే ప్రమాదం మార్కెట్లో పండ్లను మగ్గబెట్టేందుకు కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఇప్పుడు పలువురు వ్యాపారులు చైనా పౌడర్, ఎసిటలిన్ గ్యాస్, ఫాస్పరస్, ఆర్సెనిక్ తదితర మూలకాలున్న రసాయనాలను వాడుతున్నారు. పైగా ఆయా రసాయనాలను అతిగా వినియోగిస్తుండడంతో పరిస్థితి చేయిదాటుతోంది. పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టేందుకు ఇథిలిన్ గ్యాస్ను పెద్దమొత్తంలో వినియోగిస్తున్నారు. పండ్లను మగ్గబెట్టే ఛాంబర్లో ఈ గ్యాస్ మోతాదు 100 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) యూనిట్లకు మించరాదన్నది ప్రభుత్వ నిబంధన. కానీ చాలామంది వ్యాపారులు ఈ నిబంధనను పాటించడంలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి గ్యాస్ను నేరుగా పండ్లకు తగలకుండా పేపర్లో చుట్టిన తరవాతనే గ్యాస్ను ప్రయోగించాలి. అయితే ఈ నిబంధనకు కూడా చాలామంది వ్యాపారులు నీళ్లొదిలి నేరుగా వాడుతున్నట్టు గుర్తించారు. ఇంకొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కంప్రెస్డ్ ఇథిలిన్ గ్యాస్, ఇథనాల్, ఇథోపాన్ వంటి రసాయనాలను అవసరాన్ని మించి వినియోగిస్తున్నారని, ఇది నేరుగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని హెచ్చరించింది. అమ్మో చైనా పౌడర్ హానికారక రసాయనాలు, మూలకాలున్న చైనా పౌడర్ను చెన్నై, ముంబై పోర్టుల నుంచి నేరుగా నగరంలో పలువురు దళారులు, వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. దీన్ని పండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సంస్థ దాడుల్లో బయటపడింది. ఐపీఎం అధికారుల దాడులతో అప్రమత్తమవుతోన్న వ్యాపారులు గోడౌన్ల బయట కొన్ని పండ్లను నిబంధనల ప్రకారం మగ్గబెట్టి రసాయనాల ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గోడౌన్ లోపల భారీగా నిల్వ ఉంచిన పండ్లను మాత్రం రసాయనాలతో పండిస్తున్నారు. ఈ పండ్లలోనే ప్రమాదకర రసాయన ఆనవాళ్లు అధికంగా ఉంటోందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. కొనే ముందు పరిశీలించాలి.. ♦ మార్కెట్లో కొనుగోలు చేసే పండ్లపై అధిక సంఖ్యలో నల్లటి మచ్చలుంటే వాటిపై రసాయనాల ఆనవాళ్లున్నట్లు గుర్తించాలి. ♦ యాపిల్, ఆరెంజ్, దానిమ్మ వంటి పండ్లు బాగా నిగనిగలాడుతుంటే వాటిపై రసాయనాల పూత ఉన్నట్టు. ♦ పండ్లను తినేముందు బాగా కడిగి తినాలి. ♦ సహజసిద్ధంగా పక్వానికి వచ్చే పండ్లను తింటేనే ఆరోగ్యానికి మంచిదని, ఆయా పండ్లలో ఆవశ్యక పోషకాలుంటాయని గుర్తించాలి. -
'ఢీ'హెచ్ఎంసీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత అసెంబ్లీని గురువారం రద్దు చేస్తారనే సంకేతాల నేపథ్యంలో జీహెచ్ఎంసీలోని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. బుధవారం జీహెచ్ఎంఈయూ–టీఆర్ఎస్ కేవీ యూనియన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ప్రవేశ ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ నేతలు ప్రగతిభవన్కు వెళ్లేందుకు సిద్ధపడగా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కార్మికులు, నాయకులు అక్కడకు వెళ్లకుండా కార్యాలయ అన్ని గేట్లను మూసివేశారు. అయితే ఆందోళన చేస్తున్నవారికి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ నచ్చజెప్పేందుకు యత్నించినా వారు ససమిరా అనడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా జీహెచ్ఎంసీలోని 20 వేల పైచిలుకు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తారని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు జీహెచ్ఎంసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, వారు ప్రభుత్వాన్ని రద్దుచేసుకుని వెళ్లిపోతే, వారినే నమ్ముకున్న కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని, వారికి హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారన్నారు. అయితే నాలుగున్నర ఏళ్లయినా హామీలను అమలు చేయలేదన్నారు. ఇంత కాలం ప్రభుత్వం ఉందని, తమకు న్యాయం చేస్తుందన్న భరోసాతో ఉన్నామని, ఇప్పుడు తమ గతేంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం కానీ, కమిషనర్ కానీ తమను పట్టించుకోలేదని, తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రగతి భవన్కు వెళుతుంటే పోలీసులు వచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన బహుమతి ఇదని వేదన వ్యక్తం చేశారు. సమ్మెలో అన్ని విభాగాల కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి పారిశుధ్య కార్మికులతో సహా వెటర్నరీ, రవాణా, ఉద్యానవన, తదితర అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటారని యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ప్రకటించారు. సేవలు చేసే పేద కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కంటే మరింత ఎక్కువగా తమ సత్తా చాటుతారన్నారు. తమకు జరిగే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు.. టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న యూనియన్ సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం. దీనిపై యూనియన్ నేతలు స్పందిస్తూ తమది కార్మికులకు అనుబంధమైన సంస్థ అని, పదవులపై తమకు ఆశలు లేవన్నారు. తాము ఏ రాజకీయ పార్టీతోనూ కలసి ఉండమని ప్రకటించారు. కార్మికుల జీవితాలు బాగుపడతాయనే ఆశతో టీఆర్ఎస్కు దగ్గరగా ఉన్నామని తెలిపారు. పారిశుధ్య కార్మికులు విధుల్లో ఉండగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నా వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై పోలీసులను ఉసిగొలిపిన వారు రేపట్నుంచి వారితోనే తమ డ్యూటీలు చేయించుకోవాలన్నారు. మంత్రివర్గ సమావేశంలో జీహెచ్ఎంసీ కార్మికుల కోసం ఏవైనా వరాలు ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురు చూసినా ఆ ప్రస్తావన రాకపోవడం బాధాకరమన్నారు. నేటి నుంచి జోన్లు, సర్కిల్ కార్యాలయాల్లో.. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా గురువారం నుంచి కార్మికులు విధులను బహిష్కరించనున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. శుక్రవారం నుంచి పర్మనెంట్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన తమ డిమాండ్లు నెరవేర్చాలని ఐఎన్టీయూసీ అనుబంధ విభాగం ఆ«ధ్వర్యంలో కార్మికులు బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శనకు దిగారు. ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కార్మికుల వేతనాలు రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కాగా కార్మికులు ఉదయం నుంచి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించడంతో అధికారులు, ఉద్యోగులు మేయర్ ద్వారం నుంచి కార్యాలయం లోనికి వెళ్లారు. -
కదిలిస్తే కన్నీటి వరదే..
ఉప్పల్: లుంబిని పార్కు, గోకుల్ చాట్ దుర్ఘటన జరిగి 11 ఏళ్లు గడిచినా వారి కుటుంబ సభ్యులు నేటికీ ఆ పేరు గుర్తు చేస్తే ఉల్లిక్కి పడుతున్నారు. ఎవరిని కదలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉప్పల్ శాంతినగర్కు చెందిన గాదే అంజయ్య, వెంకటలక్ష్మిల కూతురు స్రవంతి(14), చిన్నమ్మ సుశీల(30), అంజయ్య అన్న కూతురు శ్రీలేఖ(19)తో కలసి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కొనేందుకు వెళ్లి షాపింగ్ అనంతరం గోకుల్ చాట్కు వెళ్లారు. వారు లోపల ఉండగానే బాబు పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సుశీల(30), శ్రీలేఖ(19), స్రవంతి(14) ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే వారు భయపడుతున్నారు. ఆలస్యమైనా కఠినశిక్ష పడాల్సిందే.. ‘ఆలస్యమైనా తప్పుచేసిన నిందితులకు మాత్రం కఠిన శిక్షపడితేనే మరణించిన వారి అత్మలకు శాంతి కలుగుతుంది. గత 11 సంవత్సరాలుగా నిందితులకు రాజభోగాలు అందించడం చూసి బాధేసింది. వారికోసం రూ. కోట్లు ఖర్చు చేసారు. మాకు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మాటను ప్రభుత్వం దాటవేసింది. నింధితులను కోర్టుకు తీసుకు వచ్చినప్పుడల్లా రాజులా సెక్యూరిటీ మధ్యలో తీసుకువస్తుంటే బాధ పడ్డాం. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. అయినా పర్వాలేదు.. బాద్యులందరినీ ఉరికంభం ఎక్కించాల్సిందే’ అని మృతురాలు స్రవంతి తండ్రి అంజయ్య డిమాండ్ చేశారు. ఆగస్టు అంటే భయమేస్తుంది.. ‘రాఖీ పండగ అంటే మా కుటుంబంలో భయంతో కూడిన విషాదం కనబడుతుంది. నేరాలు చేసినవారు రాజాలా బతుకుతున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలే వారి జ్ఞాపకాలతో రోదిస్తున్నాయి. నిందితులకు అప్పటికప్పుడే శిక్ష వేయ్యాలే తప్పా 11 ఏళ్లుగా కేసులను నానబెట్టారు. ఏం సాదించింది.. కేవలం ఇద్దరికే శిక్ష ఖరా>రు చేసింది. విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారు. చాలా బాధగా ఉంది’ అని గోకుల్ చాట్ ఘటనలో మృతిచెందిన సుశీల సోదరి చంద్రకళ ఆవేదన చెందింది. ఇప్పటికీ సుశీల కుమారుడు సాయికుమార్ నిద్రలో భయంతో కలవరిస్తాడని కన్నీటి పర్యంతమైంది. -
ఐస్క్రీం భామ సూపర్!
-
మ్యూజియంపై పట్టున్నవారి పనేనా!
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్లోని హిజ్ ఎక్సాల్టెడ్ హైనెస్(హెచ్ఈహెచ్) నిజాం మ్యూజియంలో దొంగతనాన్ని చాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 10 టాస్క్ ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మ్యూజియం మీద పట్టు ఉన్న వ్యక్తులే పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో స్టార్ సెక్యూరిటీ ద్వారా మ్యూజియంలో గతంలో సెక్యూరిటీగా పని చేసిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న గ్రూప్ 9 సెక్యూరిటీని కూడా విచారిస్తున్నారు. నిజాం మ్యూజియంలో ఆదివారం రాత్రి అత్యంత విలువైన డైమండ్, బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైన విషయం తెలిసిందే. మ్యూజియంలోని మూడు గ్యాలరీల్లో నిజాం పాలకులు వాడిన డైమండ్, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. ప్రతిరోజు మాదిరిగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజియాన్ని సిబ్బంది మూసివేశారు. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఐదుగురు సెక్యూరిటీ గార్డులు గ్యాలరీలకు తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు మ్యూజియాన్ని తెరిచి చూడగా దొంగతనం వెలుగు చూసింది. రెండో గ్యాలరీలో ఉన్న డైమండ్ టిఫిన్ బాక్స్, బంగారు టీ కప్పు, సాసర్, స్పూన్లు కనిపించలేదు. మ్యూజియం వెనుకాల ఉన్న వెంటిలేటర్లను విరగ్గొట్టి లోనికి వచ్చిన దొంగలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లు మ్యూజియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను సేకరించాయి. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. మ్యూజియాన్ని సోమవారం మధ్యాహ్నం నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సందర్శించారు. చోరీ జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. మ్యూజియానికి సంబంధించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. -
క్రికెట్ అభివృద్ధికి కృషిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ (సీపీఏహెచ్) ఏర్పాటుతో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తామని హెచ్సీఏ అపెక్స్ కమిటీ సభ్యులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం అపెక్స్ కమిటీ సభ్యులతో నూతనంగా నియమితులైన స్టీరింగ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీపీఏహెచ్ ఏర్పాటుతో పాటు, హెచ్ సీఏలో ఉన్న లోపాలు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. త్వరలోనే ఎలక్టోరల్ అధికారిని నియమించి అతని ఆధ్వర్యంలో సీపీఎహెచ్ ఏర్పాటు కోసం ఎలక్షన్స్ను నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 9 నుంచి 15వ తేదీ మధ్యలో ఎలక్షన్స్ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. సీపీఏహెచ్ ఏర్పాటయ్యేంత వరకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో క్రీడాకారుల ప్రాతినిధ్యం ఉండబోదని అన్నారు. ఈ సమావేశంలో అపెక్స్ కమిటీ సభ్యుల మధ్యన ఉన్న విభేదాలను పక్కనపెట్టి క్రికెట్ అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. క్రీడాకారులు అయోమయానికి లోనవ్వకుండా నియమ నిబం ధనలు దృష్టిలో పెట్టుకుని అధికారికంగా ఒకే టీమ్ను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో హెచ్సీఏ అపెక్స్ కమిటీ సభ్యులైన అనిల్ కుమార్, శేష్నారాయణ్, మహేందర్, అజ్మల్ అసద్, హనుమంతుతో పాటు, స్టీరింగ్ కమిటీ సభ్యులు వీవీఎస్ లక్ష్మణ్, అజహరుద్దీన్, విద్యా యాదవ్, రజిని వేణుగోపాల్ పాల్గొన్నారు. -
పెరిగిన ఓటర్లు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. తాజా ఓటర్ల జాబితానే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు నగర జనాభా, ఓటర్ల సంఖ్యలో పురోగతి కనిపిస్తోంది. దాదాపు 7నెలల వ్యవధిలోనే మహేశ్వరం నియోజకవర్గ జనాభా 25శాతం పెరిగింది. అలాగే ఎల్బీనగర్లో 15శాతం, నాంపల్లిలో 6.5శాతం మేర ఓటర్లు పెరిగినట్లు తాజా ముసాయిదా జాబితాలో వెల్లడైంది. హైదరాబాద్ జిల్లాలో కొత్తగా ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకున్న నియోజకవర్గాల్లో నాంపల్లి, కార్వాన్లు అగ్రస్థానంలో ఉన్నాయి. జనవరి 20న ఓటర్ల తుది జాబితా అనంతరం... తాజా ముసాయిదా విడుదల వరకు నాంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 17,860 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితా మేరకు నియోజకవర్గంలో 2,73,079 మంది ఓటర్లు ఉండగా... 6.5శాతం పెరిగారు. కార్వాన్ నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 2,86,436 మంది ఓటర్లుండగా.. కొత్తగా 10,879(4శాతం) మంది నమోదు చేసుకున్నారు. ఇక శివార్లలోని మహేశ్వరం నియోజకవర్గంలో తుది జాబితా నాటికి 3,23,660 మంది ఓటర్లు ఉండగా... ప్రస్తుతం 4,02,442 మంది ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో తుది జాబితాలో 4,01,137 మంది ఓటర్లుండగా... తాజా ముసాయిదాలో 4,65,154 మంది ఉన్నారు. నగర శివార్లలో వేగంగా విస్తరిస్తుండడంతో అక్కడ ఎక్కువ మంది నివాసం ఉంటున్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే చాంద్రాయణగుట్టలో పురుషులతో దాదాపు సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పురుషులు 1,49,348 మంది ఉండగా, మహిళలు 1,42,415 మంది ఉన్నారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పురుషులు 1,16,886 మంది కాగా... మహిళా ఓటర్లు 1,12,793 మంది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్, మల్కాజిగిరిలలో మాత్ర మే థర్డ్జెండర్స్ లేరు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 840 మంది ఓటర్లున్నారు. తగ్గిన తొలగింపులు... గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, కోర్టులకు వెళ్తుండడం తదితర కారణాలతో ఓటర్లను తొలగించేందుకు అధికారులు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చాలామంది అధికారులు ఇంటింటి సర్వే చేయకుండానే ముసాయిదా రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇళ్లకు వెళ్లకుండానే తొలగిస్తే తీవ్ర సమస్యలు ఎదురవనుండడంతో చిరునామాలు మారినవారు, మరణించిన వారి పేర్లను అలాగే ఉంచారనే అభిప్రాయాలున్నాయి. -
పేదలకు ఊరట
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అయితే గతంలో జీవో 166 కింద వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించేందుకు వెసులుబాటు కల్పించింది. జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల స్థలాలను జీవోలు 58, 89 కింద క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ తాజాగా జీవో 179 జారీ చేసింది. అదే విధంగా క్రమబద్ధీకరణ విధివిధానాలు పేర్కొంటూ, మూడు విడతల్లో రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పిస్తూ మరో జీవో 134 విడుదల చేసింది. నిలిచిపోయిందిలా... దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నగరంలోని ఆక్రమిత స్థలాల్లోపేదలు నిర్మించుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ 2008 ఫిబ్రవరి 16న జీవో 166 జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 1,22,637 మంది ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు కొన్నింటిని తిరస్కరించారు. అర్హులకు తగిన రుసుం చెల్లించేందుకు కన్వెయన్స్ డీడ్ కూడా అందజేశారు. అయితే క్రమబద్ధీకరణ దశలవారీగా కొనసాగుతుండగా, ప్రక్రియను నిలిపి వేయాలని సీపీఎం అప్పటి నగర శాఖ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జీవో 166 కింద క్రమబద్ధీకరణను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా క్రమబద్దీకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అర్హులు తక్కువే... ఇళ్ల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అందులో అర్హత సాధించినవి తక్కువే. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31,960 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోగా.. జిల్లా భూ అథారిటీ (డీఎల్సీ) 27,744 దరఖాస్తులను తిరస్కరించింది. మరో 102 దరఖాస్తులను పెండింగ్లో పెట్టగా... 4,114 మంది దరఖాస్తుదారులు డబ్బులు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే అందులో కేవలం 32 మంది మాత్రమే రుసుం చెల్లించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 80చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 19,927 దరఖాస్తులు రాగా.. వాటిలో 2,342 మాత్రమే అర్హత సాధించాయి. 80–250 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 10,277 దరఖాస్తులు రాగా 1308... 250–500 చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 1,133 దరఖాస్తులు రాగా 351... 501కి పైగా చదరపు గజాల స్థలం క్రమబద్ధీకరణకు 823 దరఖాస్తులు రాగా 113 మాత్రమే అర్హత సాధించాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇళ్ల భూ క్రమబద్ధీకరణకు 90,677 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. అందులో 79,549 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హత సాధించిన దరఖాస్తులను మూడు దశల్లో పరిధిల్లో క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించారు. రెవెన్యూ జిల్లా స్థాయి పరిధిలో మొత్తం 7,683 దరఖాస్తులు అర్హత సాధించగా... వాటిలో 5,034 మంది దరఖాస్తుదారులకు కన్వెయన్స్ డీడ్ అందజేశారు. అయితే 92 మంది దరఖాస్తుదారులు మాత్రమే రుసుం చెల్లించారు. మిగిలిన 2,557 మంది రుసుం చెల్లించలేదు. అదే విధంగా సీసీఎల్ఏ విభాగం 996 దరఖాస్తులను ఆమోదించి... 582 కన్వెయన్స్ డీడీ నోటీసులు జారీ చేసింది. వారిలో ఇద్దరు మాత్రమే రుసుం చెల్లించారు. ప్రభుత్వ పరిధిలో మొత్తం 351 దరఖాస్తులు అర్హత సాధించాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో అర్హులైన దరఖాస్తులకు ఊరట లభించినట్లయింది. రుసుం చెల్లింపులిలా... దరఖాస్తుదారులు ఆక్రమిత స్థలాల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుం మూడు వాయిదాల్లో చెల్లించొచ్చు. నవంబర్ 1లోగా తొలి వాయిదా, డిసెంబర్ 1లోగా రెండో వాయిదా, జనవరి 1లోగా మూడో వాయిదా చెల్లించాలి. ఏక కాలంలో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తారు. క్రమబద్ధీకరణ ఇలా.. ♦ 125 గజాలకు ఉచితంగాక్రమబద్ధీకరణ. ♦ 150 గజాల లోపు భూములు నోటిఫైడ్ గుర్తించిన మురికివాడల్లో ఉంటే మార్కెట్ విలువలో 10 శాతం. ♦ 250 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 25 శాతం. ♦ 500 గజాల లోపు ఉంటే మార్కెట్ విలువలో 50 శాతం. ♦ 1,000 గజాల లోపు ఉంటే 75 శాతం. ♦ 1,000 గజాల కంటే అధికంగా ఉంటే పూర్తి మార్కెట్ విలువ చెల్లించాలి. ♦ ఖాళీ స్థలాలకు మాత్రం విస్తీర్ణంతో సంబంధం లేకుండా పూర్తి మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. ♦ జీవో 58, 59 తరహాలోనే ఆన్లైన్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులుసమర్పించాలి. ♦ ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. ♦ దరఖాస్తుల స్వీకరణ అనంతరం తక్షణమే ఆన్లైన్లోనే దరఖాస్తుదారుడికి నోటీసు జారీ. ♦ 1,000 గజాలు దాటితే ప్రభుత్వానికి దరఖాస్తు సిఫార్సు. ♦ ప్రభుత్వం ఆమోదిస్తే సంబంధిత తహసీల్దార్ ద్వారా కన్వెయన్స్డీడ్ జారీ. ♦ జనవరి 31, 2019లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి. -
ఔటర్.. రిపేర్
సాక్షి, సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఆదివారం టీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో ప్రత్యేక దారులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. మెయిన్ క్యారేజ్వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక రహదారుల మూసివేతపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) దృష్టి సారించింది. ప్రధానంగా రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో మంగళవారం నుంచి ఓఆర్ఆర్ మెయిన్ క్యారేజ్వే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. మెయిన్ క్యారేజ్వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక మట్టి రహదారులను తొలగించడంతో పాటు ఓఆర్ఆర్ పటిష్టత దెబ్బతినకుండా ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులుచేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థన మేరకు ఆదివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 12గంటల వరకు వెళ్లిన వాహనాల టోల్ ఫీజు చెల్లింపులపై తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కమిషనర్ జనార్దన్రెడ్డి అధ్యక్షతన అధికారులు సమవేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజు వచ్చి వెళ్లిన వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టోల్ ఫీజు చెల్లించాలంటూ టీఆర్ఎస్ పార్టీకి లేఖ రాయనున్నారు. టోల్ ఫీజుపై నేడు స్పష్టత... నగరాభివృద్ధిలో 158కి.మీ ఔటర్ కీలకంగా మారింది. వివిధ జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేయడంతో ఔటర్పై వాహనాల రద్దీ నానాటికీ పెరుగుతోంది. రోజు సగటున లక్షకు పైగా వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. టోల్ రుసుములను వసూలు చేసేందుకు గాను 19 ఇంటర్ఛేంజ్ల వద్ద 180 టోల్ లేన్లు ఉన్నాయి. ఓఆర్ఆర్లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తద్వారా హెచ్ఎండీఏకు రోజు రూ.87లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా టోల్ వసూలు చేస్తున్న హెచ్ఎండీఏకు ఈ సంస్థ ప్రతి నెలా రూ.26 కోట్లు చెల్లిస్తోంది. ఇటీవల వాహనదారుల సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్కార్డుల ద్వారా టోల్ చెల్లింపుతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాయిదా వేసిన హెచ్ఎండీఏ అధికారులు... సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్ వసూలు చేస్తే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న విషయాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఆ రోజు వచ్చే వాహనాలకు టోల్ చెల్లిస్తామంటూ హెచ్ఎండీఏకు లేఖ రాయడంతో అందుకు అనుమతించారు. దీంతో లక్షలాది వాహనాలు ఔటర్పైకి వచ్చినా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. ఈ టోల్ ఫీజు వసూలుపైనే హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి చార్జీలు చెల్లించాలంటూ లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షంతో ఇబ్బందులు... ప్రగతి నివేదన సభకు అనుబంధంగా వాహనాల పార్కింగ్ కోసం రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్ మార్గంలో ఔటర్ నుంచి కొత్తగా నిర్మించిన 8 మట్టి రహదారుల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి వాహనదారుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతమంది వాహనదారులు టోల్ చెల్లించాల్సి వస్తుందని ఈ మార్గాల ద్వారా సర్వీసు రోడ్ల మీదకు వచ్చి వెళ్లారని టోల్ వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థ అధికారులు వాపోతున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ రహదారులను మూసివేయాలని కోరుతున్నారు. -
మెడిసీన్!
సాక్షి, సిటీబ్యూరో: వైద్య విద్య సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ర్యాంక్ రాకపోతే ‘రేటు’తో అయినా సీటు దక్కించుకునేందుకు అనేక మంది సిద్ధంగా ఉంటున్నారు. ఈ క్రేజ్నే కొన్ని ముఠాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఉత్తరాది నుంచి వచ్చిన ముఠాలు నగరవాసులకు టోకరా వేస్తుంటే... నగరం కేంద్రంగా కొన్ని గ్యాంగ్స్ ఉత్తరాదికి చెందిన వారిని ముంచుతున్నాయి. గడిచిన రెండు నెలల వ్యవధిలో సైబర్ క్రైమ్, వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రెండు ఘరానా ముఠాలను పట్టుకోగా... 10 రోజుల వ్యవధిలోనే మాదాపూర్లో రెండు కేసులు నమోదయ్యాయి. వెబ్సైట్స్ నుంచే డేటా... ఎంబీబీఎస్తో పాటు మెడిసిన్ పీజీ సీట్ల పేరుతో టోకరా వేస్తున్న ముఠాల్లో కొన్ని కన్సల్టెన్సీలు ఏర్పాటు చేస్తున్నాయి. మరికొన్ని గ్యాంగ్స్ కేవలం ఫోన్కాల్స్, ఈ–మెయిల్స్, బల్క్ ఎస్సెమ్మెస్లతో ఎర వేస్తున్నాయి. వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న అభిమన్యుకుమార్ సింగ్ నేతృత్వంలోని ముఠా బిహార్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సోమాజిగూడలో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసింది. సీసీఎస్ అధీనంలోని సైబర్ క్రైమ్ కాప్స్కు రెండు నెలల క్రితం చిక్కిన సంతోష్రాయ్ నేతృత్వంలోని గ్యాంగ్ ఢిల్లీ కేంద్రంగా కేవలం బల్క్ ఎస్సెమ్మెస్లతో కథ నడిపించింది. ఇలాంటి మోసగాళ్లకు అభ్యర్థుల వివరాలు ‘అధికారికంగానే’ అందుతున్నాయి. ఆయా ప్రవేశ పరీక్షలు నిర్వహించే విభాగాలు తమ అధికారిక వెబ్సైట్స్లో అభ్యర్థుల పేర్లు, ర్యాంక్లతో పాటు వారి ఫోన్ నెంబర్లు సైతం పొందుపరుస్తున్నాయి. వీటిని సంగ్రహించి, వాటి ఆధారంగానే వారికి కౌన్సెలింగ్లో సీట్లు వస్తాయా? రావా? అనేది అంచనా వేస్తున్న మోసగాళ్లు రంగంలోకి దిగి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఫిర్యాదుకు వెనకడుగు... ఇలాంటి ముఠాల చేతిలో మోసపోతున్న వారిలో బడాబాబులతో పాటు వైద్యులూ ఉంటున్నారు. తమ పిల్లలకు అడ్డదారిలో సీట్లు ఖరీదు చేయడానికి ముందుకొచ్చి నిండా మునుగుతున్నారు. అయితే మోసపోయిన వారిలో కనీసం 10శాతం మంది కూడా ముందుకొచ్చి ఫిర్యాదు చేయట్లేదు. దీనికి ప్రధాన కారణం ఇన్కమ్ ట్యాక్స్ భయమని పోలీసులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఘరానా ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఇలాంటి వారికి ప్రధానంగా బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో వివిధ కోటాల్లో సీట్లు ఇప్పిస్తామంటూ పేర్కొంటున్నారు. ఆపై ఒక్కో సీటుకు రూ.50 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఖర్చవుతుందని స్పష్టం చేస్తున్నారు. దీనికి అంగీకరించిన వారి నుంచి తొలుత అడ్వాన్స్లు తీసుకుంటున్నారు. కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు చేస్తున్నారు. దీనికోసం అవసరమైతే తమ అనుచరుల్ని పంపిస్తున్నారు. ఇలా చేయడంతో మోసపోయిన వారు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. పోలీసుల్ని ఆశ్రయిస్తే ముందు తామిచ్చిన నగదుకు లెక్కలు చెప్పాల్సి వస్తుందని, ఐటీ విభాగం రంగంలోకి దిగుతుందని భయపడి ఫిర్యాదులే చేయడం లేదు. ఇటు వారటు... అటు వారిటు... ఉత్తరాదికి చెందిన ముఠాలు నగరానికి చెందిన వారిని మోసం చేసి సైబర్ క్రైమ్, టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాయి. ఇలానే నగర కేంద్రంగా ఉత్తరాదికి చెందిన వారినీ కొందరు మోసం చేస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో దీనికి సంబంధించి మాదాపూర్లో రెండు కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఓ వ్యక్తికి ఎర వేసిన మోసగాళ్లు అతడి నుంచి రూ.16 లక్షలు కాజేశారు. దీనికి సంబంధించి గత నెల 24న బాధితుడు మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఈ మోసగాళ్లు హైదరాబాద్తో పాటు పుణెలోనూ కన్సల్టెన్సీ నిర్వహించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఇది జరిగిన వారం రోజుల్లోనే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ రైల్వే ఉద్యోగి నుంచి మెడిసిన్ సీట్ల పేరుతో రూ.29 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గత నెల 31న అదే మాదాపూర్ ఠాణాలో మరో కేసు నమోదైంది. ఈ రెండూ వేర్వేరు కన్సల్టెన్సీలని, బెంగళూరులోని మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇస్తామంటూ మోసం చేశారని పోలీసులు చెబుతున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ గ్యాంగ్స్ సైతం నగదు రూపంలోనే డబ్బు తీసుకున్నాయని, తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకూ ఇలా చేసి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలో, డీడీలు, చెక్కులో వినియోగిస్తే తాము చిక్కుతామని నగదునే తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఆ ఇద్దరి కస్టడీకి నిర్ణయం... బెంగళూర్లోని వివిధ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతూ వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు శుక్రవారం చిక్కిన ముఠాలోని ఇద్దరినీ పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వీరిద్దరినీ పంజగుట్ట అధికారులు రిమాండ్కు తరలించినవ విషయం విదితమే. ఈ గ్యాంగ్ రెండు రాష్ట్రాల్లో అనేక మంది నుంచి రూ.90 లక్షల వరకు దండుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సిటీలో ఏర్పాటు చేసిన కార్యాలయం కేంద్రంగా 20 మందికి ఎర వేశారు. ఒక్కో సీటు రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చవుతుందంటూ చెప్పారు. వీరి నుంచి రూ.50 లక్షలు అడ్వాన్స్గా తీసుకొని ఉడాయించారు. అయితే కేవలం రెండు కేసులే రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన బాధితుల్ని గుర్తించడంతో పాటు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడానికి అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు. -
ఐస్క్రీమ్లో ఫంగస్, పురుగులు
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఓ ప్రముఖ ఐస్క్రీమ్ షాపులో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ ఐస్క్రీమ్లో ఫంగస్, పురుగులు ఉన్నాయని ఆరోపిస్తూ రంజిత్ ఆకుతోట అనే వ్యక్తి మంత్రి కేటీఆర్తో పాటు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఆన్లైన్కు ట్వీట్ చేశాడు. ఆదివారం రాత్రి తన సోదరుడి బర్త్డే సందర్భంగా చాక్లెట్ కేక్ ఐస్క్రీమ్ను ఆర్డర్ చేశానని అందులో పురుగులు కనిపించడం చూసి షాక్కు గురయ్యామని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే సదరు ఐస్క్రీమ్ షాపుపై చర్యలు తీసుకుంటామని ట్వీట్టర్ ద్వారా సమాధానం చెప్పారు.