
సమన్వయ కమిటీ అంత పెద్దదా?: వీహెచ్
టీపీసీసీ సమన్వయ కమిటీలో 31 మందిని నియమించి దానికి విలువ లేకుండా చేశారని ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ సమన్వయ కమిటీలో 31 మందిని నియమించి దానికి విలువ లేకుండా చేశారని ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. సోమవారం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. అంత పెద్ద సమన్వయ కమిటీలోని సభ్యుల మధ్య సమన్వయం సాధించడం కష్టమన్నారు. అలాంటిది ఈ కమిటీ టీపీసీసీని సమన్వయమేం చేస్తుందన్నారు.