బ్యాంకులో వేయమని రూ.4.53 లక్షలు ఇస్తే.. | employee escape with Rs 4 lakhs | Sakshi
Sakshi News home page

బ్యాంకులో వేయమని రూ.4.53 లక్షలు ఇస్తే..

Published Sat, Jun 3 2017 5:25 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

బ్యాంకులో జమచేయమని ఇచ్చిన డబ్బుతో ఓ ఉద్యోగి కనిపించకుండా పోయాడు.

హైదరాబాద్‌: యజమాని బ్యాంకులో జమ చేయాలని చెప్పి ఇచ్చిన నాలుగున్నర లక్షల రూపాయలతో ఓ ఉద్యోగి కనిపించకుండా పోయాడు. ఎల్బీనగర్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

ఓ ఏజెన్సీలో పనిచేస్తున్న జంగ సంజయ్‌ అనే ఉద్యోగికి అతని యజమాని కృష్ణకుమార్‌ రూ. 4.53 లక్షల డబ్బు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలని పురమాయించాడు. అయితే, సంజయ్‌ ఆ మొత్తాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా కారులో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అక్కడే సిద్ధంగా ఉన్న ఓ రైలు ఎక్కి ఎటో వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన వాడని, కర్ణాటక లేదా ఢిల్లీ పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement