escape
-
Bangladesh: ఆ 700 మంది ఖైదీలు ఎక్కడ?
ఢాకా: బంగ్లాదేశ్లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది(2024) జూలై-ఆగస్టులలో బంగ్లాదేశ్లో ఆందోళనలు చెలరేగిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గతంలో వివిధ జైళ్ల నుంచి పరారైన ఖైదీలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. సుమారు 700 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారని బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఢాకాలో విలేకరులకు తెలిపారు. వారిని వెదికి పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న వారి వివరాలను పూర్తిగా వెల్లడించకుండానే.. ఈ తరహా ఖైదీలలో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టు ఐదు తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషి కూడా జైలు నుండి విడుదల కాలేదని అన్నారు. అయితే బెయిల్పై విడుదలైన వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దాదాపు 700 మంది ఖైదీలు, దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు పరారీలో ఉన్నారని గతంలో బంగ్లాదేశ్ జైలు అధికారులు ప్రకటించారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
నా భార్యకు నేను మూడో భర్తను!
బనశంకరి: వివాహం చేసుకోవడానికి అమ్మాయిల కొరత ఉందనే సాకుతో కొందరు మోసగాళ్లు పురుషులను నిండా ముంచుతున్నారు. ఓ వ్యక్తికి ఉత్తుత్తి పెళ్లి చేసి లక్షలాది రూపాయలను తీసుకుని బ్రోకర్, వధువు ఉడాయించారు. బాగల్కోటె జిల్లా ముధోళ్వాసి సోమశేఖర్ బాధితుడు. శివమొగ్గ మంజుళ అనే యువతిని పెళ్లి చేసి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెకు 3వ పెళ్లి ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకున్న శివమొగ్గవాసి మంజుళతో బ్రోకర్ సత్యప్ప మాట్లాడాడు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి వేటలో ఉన్న సోమశేఖర్ను టార్గెట్ చేసుకున్నారు. అమ్మాయిని చూపించి పెళ్లి చేస్తామని రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. ఆడపిల్ల దొరకలేదని బాధలో ఉన్న సోమశేఖర్ ఎగిరి గంతేశాడు. ముధోళ్లోని కాళికా దేవి దేవస్థానంలో ఏడాది క్రితం పెళ్లి జరిపించారు. ఆ రోజునే బ్రోకర్ రూ.4 లక్షలు వసూలు చేశాడు. నెలరోజులు కాపురం సాగిందో లేదో ఓ రోజు మంజుళ ఉడాయించింది. సోమశేఖర్ ఆమె గురించి విచారించగా ఇప్పటికే రెండు పెళ్లిళ్లయినట్లు తెలిసింది. బ్రోకర్ ఇలాంటివారితో కలిసి మోసాలకు పాల్పడుతుంటాడని గుర్తించాడు. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాలని బ్రోకర్ను కోరాడు. అతడు పట్టించుకోకపోవడంతో 7 మందిపై కేసు పెట్టాడు. -
అమెరికా పోలీసుల కోతుల వేట
పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని? ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కాదు. పరిశోధన కేంద్రం నుంచి తప్పించుకున్నవి. సౌత్ కరోలినాలోని ఎమసీ పట్టణంలో ఓ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ఆల్ఫా జెనెసిస్ ఉంది. ఇక్కడ వైద్య పరీక్షలు, పరిశోధనల కోసం కోతులను పెంచుతుంటారు. ప్రస్తుతం సంస్థలో 50 కోతులున్నాయి. అయితే బుధవారం దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. కోతులు మాత్రం తప్పించుకున్నాయి. బయటి ఎన్క్లోజర్ తలుపులు తెరిచి ఉండటంతో 43 కోతులు బయటికి పారిపోయాయని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్నాయని, ప్రజలంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలని, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తప్పించుకున్నవి 3.2 కిలోల బరువున్న ఆడ కోతులని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. కోతులు ఫెసిలిటీలో ఆపిల్స్ వంటి ఆహారాన్ని తిని పెరిగాయని, అడవిలో ఆకులు, అలములు తప్ప ఏమీ దొరకవు కాబట్టి అవి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆల్ఫా జెనెసిస్ సీఈఓ గ్రెగ్ వెస్టర్గార్డ్ చెబుతున్నారు. ఈ కేంద్రం నుంచి కోతులు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో 19 కోతులు తప్పించుకుని ఆరు గంటల తర్వాత తిరిగొచ్చాయి. రెండేళ్ల కిందట 26 కోతులు తప్పించుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల్ని కర్ణాటక పోలీసులు క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం గత గురువారం నగరానికి తీసుకువచ్చారు. వీరంతా పోచారంలోని బృందావన్ హోటల్లో బస చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కీలక నిందితుడు అంకుర్ రాణా తప్పించుకుని పారిపోయాడు. దీంతో కర్ణాటక పోలీసులు ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వెలుగులోకి వచి్చన అంశాల ప్రకారం కేసును ఇక్కడకు బదిలీ చేయాల్సి ఉండగా.. కర్ణాటక పోలీసులు చూపించిన అత్యుత్సాహం కారణంగానే ఇలా జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తుకారాంగేట్ టు సంస్కృతి టౌన్షిప్ నగరంలోని తుకారాంగేట్కు చెందిన రమేష్ కుమార్ భార్య, కుమార్తెకు దూరంగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్íÙప్లో ఒంటరిగా ఉండేవారు. భువనగిరికి చెందిన ఆకుల లత చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఈ నేపథ్యంలోనే తన పేరును నిహారికగా మార్చుకుంది. గతంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని, వారి నుంచి వేరు పడిన నిహారికకు మాట్రిమోనియల్ సైట్ ద్వారా రమే‹Ùతో పరిచయం ఏర్పడింది. 2018లో రిజిస్టర్ వివాహం చేసుకున్న వీళ్లు సంస్కృతి టౌన్షిప్లోనే కాపురం పెట్టారు. నిహారిక మాత్రం ఉద్యోగ నిమిత్తం అంటూ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉండేది. ఈమె తన రెండో భర్తతో కలిసి హరియాణాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి జైలుకు వెళ్లింది. అక్కడే ఈమెకు అంకుర్ రాణా అనే నేరగాడి తల్లితో పరిచయమైంది. ఆమెను కలవడానికి ములాఖత్కు వచ్చే అంకుర్తోనూ స్నేహం ఏర్పడింది. జర్మనీలో ఉద్యోగం కోసం నగదు అవసరమంటూ.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్ వెటర్నరీ డాక్టర్గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిహారిక తనకు జర్మనీలోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం వచి్చందని, దాని నిమిత్తం రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉందంటూ రమే‹Ùతో చెబుతూ వస్తోంది. కొన్నాళ్లుగా ఆమె ప్రవర్తన, మాటలపై సందేహాలు రావడంతో డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ విషయంలోనే వీరి మధ్య వివాదం నెలకొంది. రమేష్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచ్చిన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం వేసింది. రమేష్ను హత్య చేయడం ద్వారా దీన్ని అమలు చేయాలని అంకుర్ రాణాను సంప్రదించింది. అతడు అంగీకరించడంతో ఇరువురూ కలిసి గత నెల 1న నగరానికి చేరుకున్నారు. పీర్జాదిగూడలో చంపి.. మృతదేహంతో 800 కి.మీ ప్రయాణించి.. బోడుప్పల్ ప్రాంతంలో అంకుర్ బస చేయగా.. నిహారిక మాత్రం రమేష్ ఇంటికి వెళ్లింది. రెండు రోజుల పాటు వీరి మధ్య నగదు విషయంలో వాగ్వాదం జరిగింది. గత నెల 3 రాత్రిన తనను విమానాశ్రయంలో వదిలి రావాలంటూ నిహారిక కోరగా.. రమేష్ తన మెర్సిడిస్ బెంజ్ కారులో (టీఎస్ 07 ఎఫ్ఎస్ 5679) బయలుదేరారు. బోడుప్పల్–ఉప్పల్ మధ్యలో అంకుర్ వీరి వాహనం ఎక్కాడు. అతడిని తన సహోద్యోగిగా పరిచయం చేసింది. వీరి వాహనం పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకున్నాక వెనుక సీటులో కూర్చున్న అంకుర్ తన వద్ద ఉన్న వైరుతో రమే‹Ùకు ఉరి బిగించి చంపాడు. ఆపై వీళ్లు నిఖిల్ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు మృతదేహాన్ని కారులో ఉంచుకుని దాదాపు 800 కి.మీ ప్రయాణించారు. ఊటీ సమీపంలోని సుంటికొప్పలో (కర్ణాటక) ఉన్న కాఫీ ఎస్టేట్లో పెట్రోల్ పోసి మృతదేహాన్ని దహనం చేసి కారుతో పారిపోయారు. గత నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు నిహారిక, నిఖిల్లను బెంగళూరులో, అంకుర్ను హరియాణాలో అరెస్టు చేశారు.అవకాశం ఉన్నా బదిలీ చేయకుండా... నిందితుల విచారణ నేపథ్యంలో ఈ హత్య పీర్జాదిగూడలో జరిగినట్లు తేలింది. నిబంధనల ప్రకారం ఆ వెంటనే ఈ కేసును రాచకొండకు బదిలీ చేయాలి. కొడుగు పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ అలా చేయలేదు. దర్యాప్తు కొనసాగిస్తూ నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం వారిని తీసుకుని నగరానికి వచ్చి పోచారంలోని బృందావన్ లాడ్జిలో బస చేశారు. గత గురువారం సంస్కృతి టౌన్షిప్, బోడుప్పల్, పీర్జాదిగూడల్లో వీరిని తిప్పారు. ఆ రోజు రాత్రి హోటల్ గదిలో అంతా నిద్రపోతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అంకుర్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో కర్ణాటక పోలీసులు దీనిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను తీసుకుని శనివారం కొడుగు వెళ్లిపోయారు. పరారైన అంకుర్ కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. -
రియల్టర్ రమేష్ హత్య కేసు: నిందితుడు రాణా పరార్
సాక్షి,హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాణా కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అక్టోబర్ 4వ తేదీన హైదరాబాద్లోని పోచారం ఐటీకారిడార్ ఠాణా పరిధి సంస్కృతి టౌన్ షిప్లో నివాసం ఉంటున్న రియల్టర్ రమేష్ కుమార్ భార్య నిహారిక, ప్రియుడు రాణాల చేతులో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం నిందితులు రమేష్కుమార్ మృతదేహాన్ని కారులో కర్ణాటకు తరలించారు. అక్కడ నిహారిక మరో ప్రియుడు నిఖిల్ రెడ్డితో కలిసి కొడుగు జిల్లా సుంటికుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి నిప్పు పెట్టిన నిందితులు పారిపోయారు. నిందితులను సీసీ కెమెరా ద్వారా నిందితులను గుర్తించిన సుంటికుప్ప పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం నిందితులను 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. సీన్ రీ కన్స్ట్రషన్ కోసం అక్టోబర్ 30వ తేదీన నిందితులను పోచారం ఐటీకారిడార్ ఠాణాకు తీసుకువచ్చారు. దర్యాప్తు లో భాగంగా రెండు రోజుల పాటు ఇక్కడనే ఉండేందుకు వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న బృందావనం హోటల్లో 6 గదులను అద్దెకు తీసుకున్నారు. తెల్లవారుజామున నిందితుడు రాణా కానిస్టేబుల్ హరీష్ మొబైల్ తీసుకుని పారిపోయాడని ఎస్ఐ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం స్థానిక పోలీసులతో పాటు కర్ణాటక పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య -
జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం
-
జైలు నుంచి తప్పించుకుంటూ... 129 మంది ఖైదీలు మృతి
కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. -
పోకిరీల భయంతో రైలెక్కిన ఇద్దరు బాలికలు
యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్లోని ఇటావా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్లోని వారి ఇళ్లకు పంపించారు. -
ఏటీఎంల్లో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో ఉద్యోగి పరార్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి దానవాయిపేటలో ఘరానా మోసం జరిగింది. హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన రూ.2 కోట్లతో హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసంశెట్టి అశోక్ పరారయ్యాడు. 19 ఏటీఎంల్లో ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా డబ్బుతో హుడాయించాడు. అశోక్పై 'ఇటాచి ప్రైవేట్ ఏజెన్సీ' అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాజమండ్రి సౌత్ జోన్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలో ఉన్న టోల్ గేట్లు వద్ద తనిఖీలు చేస్తున్నారు. -
వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
బీహార్లోని గయ జిల్లాలో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్లో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.గయ జిల్లాలో గల ఈస్ట్ సెంట్రల్ రైల్వే గ్రాండ్ కార్డ్ రైల్వే సెక్షన్ పరిధిలోని మాన్పూర్ జంక్షన్లో హోమ్ సిగ్నల్ దగ్గర ఓవర్హెడ్ వైరు తెగిపోయింది. ఈ నేపధ్యంలో రాంచీ-పట్నా వందే భారత్ ఎక్స్ప్రెస్, రాంచీ-పట్నా జనశతాబ్ది ఎక్స్ప్రెస్లను ముందుజాగ్రత్త చర్యగా అంతకు ముందుగల స్టేషన్లలో నిలిపివేశారు. తెగిన వైర్ను సరిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. దీంతో వందే భారత్, జన శతాబ్ది ఎక్స్ప్రెస్లలోని ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.మాన్పూర్ జంక్షన్ హోమ్ సిగ్నల్ సమీపంలో ఓవర్ హెడ్ వైరు తెగిపోవడంతో రైల్వే సిబ్బంది వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. దీంతో ట్రాక్షన్ డిపార్ట్మెంట్, ఇతర విభాగాలకు చెందిన బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటలకు మరమ్మతు పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోని కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రమాద సమయంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ను గుర్పా రైల్వే స్టేషన్లో, జన శతాబ్ది ఎక్స్ప్రెస్ను టంకుప్ప రైల్వే స్టేషన్లో నిలిపివేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. -
ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..!
చిరుతపులి వస్తే పెద్దవాళ్లమే కంగారు పడిపోతాం.. అస్సలు ఏం చేయాలో తోచదు.. కానీ ఒక 12 ఏళ్ల బుడ్డోడు మాత్రం భలే చాకచక్యంగా వ్యవహరించాడు. అదీ చాలా తాపీగా...దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్లోని మాలేగావ్లో వెలుగుచూసింది. మోహిత్ అహిరే (12) ఇంటి మెయిన్ డోర్ తలుపు దగ్గరే ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్ఫోన్ మొబైల్ గేమ్లో మునిగిపోయాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ, నేరుగా ఇంట్లోకి వచ్చేసింది చిరుతపులి. అనూహ్యంగా మోహిత్కి అతి సమీపంనుంచే లోపలికి దర్జాగా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది చూసిన మోహిత్ ఏమాత్రం కంగారు పడకుండా అక్కడినుంచి లేచి, బయటికి వచ్చేసి, తలుపు లాక్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవలో రికార్డ్ అయ్యాయి. అతని రియాక్షన్ ఇపుడు ఇంటర్నెట్లో ప్రశంసల్ని దక్కించు కుంటోంది. వన్య ప్రాణులు ఎదురుపడి నపుడు ప్రశాంతంగా ఉండటం, అక్కడినుంచి తప్పించుకోవడం అనే విషయాలను గుర్తు చేసింది. What an amazing presence of mind Mohit Ahire, a 12-year-old boy, locked a leopard inside an office cabin until assistance arrived in Malegaon & the leopard was rescued. Mohit immediately informed his father, who is a security guard, that he trapped a leopard inside the office. pic.twitter.com/FELlOGac1t — Anshul Saxena (@AskAnshul) March 6, 2024 మోహిత్ అహిరే తండ్రి మ్యారేజ్ హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ క్యాబిన్లో కూచుని గేమ్ ఆడుకుంటుండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్లో దానిని బంధించారు. ‘‘ముందు దాన్ని చూడగానే షాక్ అయ్యా..కానీ, వెంటనే తేరుకుని బైటపడ్డా..తలుపును వేగంగా లాక్ చేశా..’’అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు మోహిత్ అంతకుముందే సమీప నివాస ప్రాంతంలో చిరుతపులిని గమనించారు స్థానికులు. తరువాత మ్యారేజ్ హాల్ యజమానికి ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు , అధికారులు వేగంగా స్పందించారు. ఐదేళ్ల మగ చిరుతపులిని బంధించారు. సమీపంలోనే వ్యవసాయ పొలాలు, నది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిలి్కయారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా బయటకురాలేదు. వారం రోజుల క్రితం సొరంగం కూలిపోవడంతో వారు అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కార్మికులు బయటకు రావడానికి వీలుగా ఎస్కేప్ మార్గాన్ని సిద్ధం చేయడానికి తలపెట్టిన డ్రిల్లింగ్ పనులను ఆదివారం నిలిపివేశారు. డ్రిల్లింగ్ యంత్రానికి అడ్డంకులు ఎదురు కావడమే ఇందుకు కారణం. గట్టి రాళ్లు రప్పలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం సమీక్షించారు. బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి భారీ డయామీటర్ స్టీల్ పైపులైన్ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సొరంగం శిథిలాల గుండా ఈ పైపులైన్ను పంపించనున్నట్లు తెలిపారు. సొరంగంలో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవడానికి నిట్టనిలువుగా కంటే అడ్డంగా తవ్వడమే సరైందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా యంత్రానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుంటే రెండున్నర రోజుల్లో కార్మికులు ఉన్న చోటుకి చేరుకోవచ్చని వెల్లడించారు. సొరంగంలో కార్మికులు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగగలుగుతున్నారని, వారికి ఆహారం, నీరు, విద్యుత్, ఆక్సిజన్ అందుతున్నాయని, ప్రాణాపాయం లేదని నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు.అమెరికా యంత్రంతో అతిత్వరలో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. సొరంగంలో ఉన్న కార్మికులకు మల్టీ విటమిన్ మాత్రలు, ఎండు ఫలాలు తదితరాలు అందిస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఆదివారం తెలిపారు. -
పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
సాక్షి, గుంటూరు: నాలుగు రోజుల క్రితం ఏలూరుకు చెందిన రైతులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుల దాడి చేసిన సంగతి తెలిసిందే. సంగం డెయిరీకి పాలు పోయించుకుని బోనస్ ఇస్తామంటూ ధూళిపాళ్ల మోసానికి తెరతీశాడు. సంగం డెయిరీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన రైతులపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాడ్డులతో విక్షచణారహితంగా ధూళిపాళ్ల అనుచరులు దాడి చేశారు. దాడిలో పలువురు రైతులు గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదుతో ధూళిపాళ్ల నరేంద్రతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు పోలీసులు .. వారిని పట్టుకోవడానికి మూడు స్పెషల్ టీంలుగా రంగంలోకి దిగారు.. నిన్న రాత్రి నుంచి నరేంద్రతో పాటు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు. నరేంద్ర ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. చదవండి: పెత్తందార్ల పెద్దా.. ఇదేనా మీ బాధ! -
టాలీవుడ్ తెరపై మరో డ్రగ్ మరక
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్ ఫ్లాట్లో చిక్కిన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డి ఉండగా... గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్–నాబ్ ఎస్పీ (వెస్ట్) డి.సునీతా రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్నాప్చాట్లో గాడ్ హెడ్స్ పేరుతో... నెల్లూరుకు చెందిన బి.బాలాజీ గతంలో ఇండియన్ నేవీలో అధికారిగా పని చేశాడు. కంటికి తీవ్రమైన గాయం కావడంతో మెడికల్లీ అన్ఫిట్ అయ్యాడు. దీంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచుగా హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా ఇతడికి హైదరాబాద్తో పా టు బెంగళూరు డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్ప డ్డాయి. దీంతో హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్ల్లో రేవ్ పార్టీలు ఏర్పాటు నిర్వహించేవాడు. స్నాప్చాట్లో గాడ్ హెడ్స్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి దీని ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ యాప్లో మెసేజ్ చదవగానే డిస్అప్పియర్ అయ్యే ఆప్షన్ ఉండటంతోపాటు కస్టమర్లకు ప్రత్యేక కోడ్లు ఇవ్వడం ద్వారా దందా సాగించాడు. గత నెల 31న ఇతడితోపాటు రమణారెడ్డి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పని చేస్తున్న డి.మురళిని అరెస్టు చేశారు. వీరిని విచారించడంతో ఈ డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. నైజీరియన్ల ద్వారా రామ్ కిషోర్కు... బాలాజీ ముగ్గురు నైజీరియన్లతోపాటు నగరానికి చెందిన రామ్ కిషోర్ వైకుంఠం (పరారీలో ఉన్నాడు) నుంచి డ్రగ్స్ ఖరీదు చేసేవాడు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నైజీరియన్లు అమోబీ చికోడి మొనగాలు, ఇక్బావే మైకేల్, థామస్ అనఘకాలు నుంచి బాలాజీకి కొకైన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ అందుతున్నాయి. డ్రగ్ పార్టీల నిర్వహణకు బాలాజీకి రమణా రెడ్డి ఫైనాన్స్ చేస్తుండేవాడు.ఇతడికి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఖాతా ఉంది. ఇందులో ప్రస్తుతం రూ.5.5 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతోపాటు రమణారెడ్డి, బాలాజీలకు ఉన్న ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన 18 మంది కస్టమర్లలో సినీ రంగానికి చెందిన వారితోపాటు పబ్లు, స్నూకర్ పార్లర్ల నిర్వా హకులు ఉన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్లో టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో నిర్వహించే అర్జున్, గుంటూరులో స్నూకర్ పార్లర్ నిర్వహించే పీఎస్ కృష్ణ ప్రణీత్ కీలకం. వీరు తమ సంస్థల్లోనే రహస్య గదులు ఏర్పాటుచేసి డ్రగ్స్ వినియోగానికి సహకరిస్తూ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్లు ఆఫ్ చేసుకున్న నవ్దీప్, రవి బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్లతోపాటు కలహర్రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు బెంగళూరులో జరిగిన డ్రగ్ పార్టీకి హాజరయ్యారనే విషయం 2021లో వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది. ఈ పార్టీ నిర్వాహడుకు కలహర్రెడ్డే కావడం గమనార్హం. మరోపక్క ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేసిన 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు ఉంది. నిందితుల కోసం ఏసీపీ కె.నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్, కానిస్టేబుల్ సత్యనారాయణ తదితరుల బృందం గాలించింది. అమోబీ చికోడి, ఇక్బావే మైకేల్, థామస్తోపాటు సురేశ్ రావ్, కొల్లి రామ్చంద్, కూరపాటి సందీప్, అనుగు సుశాంత్ రెడ్డి, కృష్ణ ప్రణీత్లను పట్టుకుంది. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. నవదీప్, రవి ఉప్పలపాటి సహా మిగిలిన నిందితులు తమ ఫోన్లు ఆఫ్ చేసుకుని, కుటుంబంతో సహా పరారయ్యారు. -
ఐదో ప్రేమికునితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. పోస్టర్తో భర్త వెదుకులాట!
ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్లో ముగ్గురు పిల్లల తల్లి తన ఐదవ ప్రేమికునితో వెళ్లిపోయింది. బాధిత భర్త తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని, చేతిలో భార్యకు సంబంధించిన ఫొటో పోస్టర్తో తిరుగుతూ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ అతని ప్రయత్నాలు ఫలించలేదు. తన భార్య అదృశ్యమయ్యిందంటూ ఆ భర్త పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. భర్త అనిల్ రాజ్భర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను పనుల నిమిత్తం గతంలో చండీగఢ్ వెళ్లానని, అక్కడే రీనా అనే యువతితో పరిచయం అయ్యిందని తెలిపాడు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో తాము వింద్యాచల్ మందిరంలో పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. పెళ్లి తరువాత తాము గ్రామానికి వచ్చేశామని, ఇక్కడే కాపురం పెట్టామని, తమకు ముగ్గురు పిల్లలు కలిగారని తెలిపాడు. ఈ విధంగా 9 ఏళ్లు గడిచిందని పేర్కొన్నాడు. బాధితుడు రాజ్భర్ పని నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాలకు వెళుతుండేవాడు. ఈ సమయంలో ఆమె ఎవరితోనే మాట్లాడుతుండేదని రాజ్భర్ గమనించాడు. ఈ విషయమై ఆమెను ప్రశ్నంచగా ఆమె జవాబు చెప్పకుండా తప్పించుకునేది. అయితే ఇటీవల ఆమెకు ఎవరి దగ్గరి నుంచో ఫోను వచ్చింది. దీంతో ఆమె బయట ఏదో పని ఉందని వెళ్లింది. రాజ్భర్ సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఆమె ఇంటిలో లేదు. పిలలకు కూడా తల్లి ఎక్కడకు వెళ్లిందో తెలియలేదు. దీంతో తమకు తెలిసిన అన్ని ప్రాంతాలలోనూ వెదికినా రాజ్భర్కు భార్య ఆచూకీ దొరకలేదు. దీంతో అతను తన భార్య అదృశ్యం అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నెల్లాళ్లు గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రాజ్భర్ తన భార్యకు సంబంధించిన పోస్టర్తో తనకు తెలిసిన అన్నిప్రాంతాల్లో తిరుగుతూ, భార్యకోసం వెదుకుతున్నాడు. రాజ్భర్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య గతంలో తనకు ఎంతో మంది స్నేహితులు, ప్రేమికులు ఉండేవారని చెప్పేదని, దానిని తాను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదన్నారు. అయితే అప్పుడప్పుడు ఆమె తన ఐదవ ప్రేమికుని గురించి చేప్పేదని, అతనితోనే తన భార్య వెళ్లిపోయి ఉండవచ్చనే అనుమానం కలుగుతున్నదని రాజ్ భర్ పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి:ప్రపంచం మెచ్చిన ఐదుగురు హిందూ రాజులు -
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..!.. ఆచూకీ చెబితే..
ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లా జైలులో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)సాయంతో పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెకింగ్ కట్టుదిట్టం చేశారు. ఆచూకీ చెబితే రూ. 10 వేలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్గఢ్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్ల సాయంతో ఆ యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మాదకద్రవ్యం తరలిస్తుండగా.. నేపాల్లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్ఎస్బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
అమ్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదో ఫ్లోర్ నుంచి దూకి..
చైనాలో దారుణం జరిగింది. అమ్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఓ బాలుడు(6) ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ నుంచి దూకేశాడు. బయటకు వెళ్లకూడదని కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ వస్తున్న తల్లిని చూసి పిల్లాడు ఆందోళన చెంది భవనంపై నుంచి దూకాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్లో తల్లి తన కుమారునితో జీవిస్తోంది. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడు అల్లరితో విసుగు తెప్పిస్తున్న క్రమంలో తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలున్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది. ఓ కర్ర పట్టుకుని చివాట్లు పెడుతూ బాలుని వైపు వచ్చింది. అమ్మ తిడుతుందనే భయంతో బాలుడు ఐదు ఫ్లోర్ల భవనంపై భాగం నుంచి దూకేశాడు. అక్కడే ఉన్నవారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అయితే.. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ కాళ్లు, చేతులు విరిగిపోయాయని చైనా మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కొందరు నెటిజన్లు ఫైరయ్యారు. పిల్లల రక్షణకు మరిన్ని చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
తార్నకలో దారుణం.. నడిరోడ్డుపై లైంగిక దాడికి యత్నం!
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చే వంకతో ఓ యువతిపై నడిరోడ్డుపై.. అదీ బైక్ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది. తార్నక వద్ద లిఫ్ట్ ఇచ్చే వంకతో బైక్పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: కిక్ ఎక్కి.. దోస్తును చంపేశారు! -
త్వరలో ఎస్కేప్
ఒకే ఒక్క పాత్రతో బాణాల క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ పై శ్రీధర్ బాణాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎస్కేప్’. శ్రుతీ ఫులారి హీరోయిన్గా నటించారు. ‘‘ఈ చిత్రానికి ఉత్తమ కథ, నటి, చిత్రం, సంగీతదర్శకుడు, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, గాయని, కాస్ట్యూమ్ డిజైనర్.. ఇలా దాదాపు 30 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘‘హీరోయిన్గా తొలి చిత్రంలోనే సింగిల్ క్యారెక్టర్ చేయడం హ్యాపీ’’ అన్నారు శ్రుతి. ‘‘త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతం కుమార్ పీఏ. -
జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్
న్యూఢిల్లీ: కేరళలో వరుసగా నమోదవుతున్నమొబైల్ ఫోన్ బ్లాస్ట్ సంఘటనలు ఆందోళన రేపుతున్నాయి. కేరళలోని త్రిస్సూర్లో 70 ఏళ్ల వృద్ధుడి చొక్కా జేబులో మొబైల్ ఫోన్ పేలడంతో తృటిలో ప్రమాదం తప్పింది. నెల రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొబైల్ పేలుడు సంభవించడం ఇది మూడోది. ఇటీవల ఎనిమిదేళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం యూజర్లను కలవర పెడుతోంది. (టెక్ దిగ్గజం గూగుల్కు భారీ షాక్: కేంద్ర ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు) మనోరమ న్యూస్ వివరాల ప్రకారం పెద్దాయన ఇలియాస్ టీ షాపులో టీ తాగుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీ తాగుతుండగానే సడెన్గా షర్ట్ జేబులో ఉన్న ఫోన్కు మంటలు వ్యాపించాయి. చొక్కా మీద మంటలు వ్యాపిస్తున్న షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి. ఈ వీడియో వైరల్గా మారింది. ఏడాది క్రితం రూ.1000కు మొబైల్ కొనుగోలు చేశానని,ఇది ఫీచర్ ఫోన్ అని బాధితుడు ఇలియాస్ పోలీసులకు తెలిపాడు. ఇప్పటి దాకా ఎలాంటి సమస్యలు లేవని కూడా వెల్లడించాడు. గత వారం, కోజికోడ్ నగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక వ్యక్తి ప్యాంటు జేబులో ఉన్నట్టుండి స్మార్ట్ ఫోన్ పేలింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఫోన్ వేడెక్కడంతోనే బ్యాటరీ పేలిపోయినట్టు సమాచారం. అలాగే త్రిసూర్లో కూడా ఎనిమిదేళ్ల బాలిక చేతిలో ఉన్న మొబైల్ పేలి అసువులు బాసిన సంగతి తెలిసిందే. (Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!) -
చెత్త వేసొస్తానని పారిపోయి.. పోదల్లో నిద్రపోయిన ఖైదీ.. చివరికి
సాక్షి, పరకాల(హనుమకొండ): చుట్టూ పచ్చనిపొలాలు.. పంటకాల్వల్లో ఉరకలేస్తున్న జలాలు.. ఆ పక్కనే చీమ చిటుక్కున్నా వినిపించేంత నిశ్శబ్దం అలుముకున్న చెట్లపొదలు. ఆ పొదల్లో ఓ వ్యక్తి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి చుట్టూ సాయుధులైన పోలీసులు. తప్పించుకోబోయి చివరికి పోలీసులకు చిక్కాడు. జైలు సిబ్బందిని నమ్మించి పారారైన రిమాండ్ ఖైదీ చివరికి అతడి భార్య ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు పట్టుబడ్డాడు. 2019లో మహదేవ్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచారం కేసులో ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామానికి చెందిన సైకిల్ మెకానిక్ షేక్ గౌస్ పాషా అలియాస్ చోటు(22) కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్పై బయటకు వచ్చి తిరిగి కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో ఈ ఏడాది మార్చి 18న పోలీసులు అతడిని అరెస్టు చేసి పరకాల సబ్జైలుకు తరలించారు. అప్పటి నుంచి జైలు సిబ్బందితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్ వాహనంలో చెత్తవేయడానికని తాజాగా సోమవారం తెల్లవారుజామున 6.20 గంటలకు జైలు గేటు దాటి వచ్చి పరారయ్యాడు. భార్య ఇచ్చిన సమాచారంతో... పరారైన తరువాత భార్యకు నిందితుడు ఫోన్ చేసి ఉంటాడని జైలు అధికారులు పసిగట్టి పరారీ విషయాన్ని ఆమెకు ఫోన్ద్వారా తెలియజేశారు. అతడు తిరిగి జైలుకువస్తే శిక్ష తక్కువగా ఉంటుందని, లేకపోతే మరింత ఎక్కువ కాలం శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తరువాత అనుకున్నట్టే గౌస్ పాషా ఇతరుల సెల్ఫోన్తో భార్యకు ఫోన్ చేశాడు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ నంబర్ లొకేషన్ గుర్తించి అయ్యప్ప గుడి వద్దకు చేరుకున్నారు. అతడు అదే ప్రాంతంలో ఉంటాడని భావించిన పోలీసులు ఆ చుట్టుపక్కల పంటపొలాలు, కాల్వలు, చెట్లపొదలలో గాలించారు. చివరకు ఓ పంటకాల్వ సమీపంలోని చెట్లపొదల్లో నిద్రపోతూ పోలీసులకు చిక్కాడు. -
పక్కా ప్లాన్ వేసి కిడ్నాప్.. చిన్నారి దెబ్బకు దిమ్మతిరిగింది కదా!
చిన్న పిల్లల కిడ్నాప్లు ఇటీవల పెరిగిపోతున్నాయి. అందుకు కిడ్నాపర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కిడ్నాప్ చేసే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అందరి ముందే పిల్లాడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడవుగా అమలు కూడా చేశాడు. అయితే ఆ చిన్నారి చిచ్చర పిడుగులా ప్రవర్తించే సరికి చివరిక అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడు ఏం చేశాడు..? వివరాల్లోకి వెళితే.. చిక్కమగళూరు నగరంలోని ఎంజీ రోడ్డులో ఫుట్పాత్పై ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ఓ అజ్ఞాత వ్యక్తి ప్రయత్నించాడు. అది కూడా అందరూ చూస్తుండగానే ఈ ప్లాన్ వేశాడు. ఇంకేముంది సైలెంట్గా అపహరించి, భుజాలపై ఎత్తుకుని, అక్కడి నుంచి జారుకునేందుకే సిద్ధమయ్యాడు. అయితే అదే సమయంలో అప్రమత్తమైన బాలుడు కిడ్నాపర్ భుజం నుంచి సినిమాటిక్గా తప్పించుకున్నాడు. దీంతో ఖంగుతిన్న ఆ కిడ్నాపర్ వెంటనే పారిపోయాడు. కిడ్నాపర్ బారి నుంచి తప్పించుకుని ఆ చిన్నారి చూపిన ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ కాగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. -
Viral Video: అదృష్టం అంటే ఈమెదే..!
-
ఆర్డర్ ఇస్తే అడ్రస్ లేకుండా పరార్.. రూ.88లక్షల విలువైన ఆభరణాలతో..
సాక్షి, హైదరాబాద్: నగలు తయారు చేసేందుకు ఇచ్చిన బంగారు, వజ్రాలతో ఓ జ్యూవెలరీ షాప్ యజమాని పరారైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో బషీర్బాగ్కు చెందిన శ్రీయాష్ జ్యూవెలరీస్ భాగస్వామి ఆనంద్కుమార్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడలోని శ్రీయాష్ జ్యూవెలర్స్ నిర్వాహకులు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ షాప్లు, కస్టమర్ల కోరిక మేరకు వారికి నచ్చిన విధంగా బంగారు, వజ్రాభరణాలను తయారు చేసి ఇస్తుంటారు. గత ఏడాది ఆనంద్కుమార్ అగర్వాల్కు గణేష్ చంద్ర దాస్(అతిక్ జ్యువెల్లర్స్) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన గత నవంబర్లో పలు దఫాలుగా రూ.కోటి విలువైన ఆభరణాల తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. గణేష్ చంద్రదాస్ వీటిలో దాదాపు రూ.30లక్షల విలువైన ఆభరణాలను తయారు చేసి అప్పగించాడు. రూ.65లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.17లక్షల వజ్రాల ఆభరణాల తయారీలో జాప్యం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుంచి గణేష్ చంద్ర దాస్ ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన యాష్ జ్యూవెలరీస్ యజమాని ఆనంద్కుమార్ అగర్వాల్ చార్మినర్లోని అతని దుకాణానికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో అతను నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందం కోల్కత్తాకు వెళ్లింది. చదవండి: Fire Accident: లభించని ఆ ముగ్గురి ఆచూకీ.. డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ -
15 ఏళ్ల నుంచి పరారీలో నిందితుడు.. హోటల్లో మేనేజర్గా అవతారం ఎత్తి..
సాక్షి, గోవా: గత 15 ఏళ్ల నుంచి తప్పించుకు తిరుగుతన్న హత్య కేసు నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో పుర్బా మేదినీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఏప్రిల్ 23, 2005న గోవాలోని కరంజాలెం వద్ద అల్టినో నివాసి గాడ్విన్ డీఎస్లీవా అనే వ్యక్తిని రుడాల్ గోమ్స్, జాక్సన్ డాడెల్ అనే వ్యక్తులు హత్య చేశారు. అనంతరం వారిని పనాజీ పోలీసులు అరెస్టు చేసి సెషన్స్ కోర్టు ముందు హాజరుపర్చగా...కోర్టు వారిని దోషులుగా నిర్ధారించింది. ఐతే ఆ ఇద్దరు వ్యక్తులు శిక్ష పడక మునుపే జ్యుడిషియల్ కస్టడీ ఉన్న మిగతా 12 మంది ఇతర నిందితులతో కలిసి జైలు గేటును తెరిచి గార్డులపై దాడి చేసి పరారయ్యారు. ఐతే అప్పటి నుంచి ఆ నిందితుల్లో జాక్సన్ డాడెల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఐతే అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు బృందానికి కోల్కతాకు 200 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ బెంగాల్ జాక్సన్ డాడెల్ ఉన్నట్లు సమాచారం అందింది. నిందితుడు పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని దిఘా పట్టణంలోని ఓ హోటల్లో ఆఫీస్ మేనేజర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఐతే నిందితుడు పేరు మార్చుకుని, తాను జైలు నుంచి తప్పించుకున్న తేదీనే పుట్టినరోజు తేదీగా మార్చకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ సూరజ్ నేతృత్వంలోని గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల కోసం మార్గోవ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. (చదవండి: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు: అఫ్తాబ్ అతని కుటుంబంపై చర్యలు తీసుకోవాలి: శ్రద్ధా తండ్రి) -
Hyderabad: ఏటీఎంలో భద్రపరచాల్సిన నగదుతో డ్రైవర్ పరారీ
సాక్షి, హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్ చేసేందుకు వచ్చిన డ్రైవర్ అదును చూసి రూ.3 లక్షలతో ఉడాయించాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్లతో పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్ సేఫ్ గార్డు సంస్థ నగదును లోడ్ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్ చేస్తారు. గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్ ఫారూఖ్తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్నగర్, ఎన్ఎండీసీ, గగన్పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్ చేశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్ వేసుకుని నగదును లోడ్ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్ పిస్తల్లను వాహనంలోనే ఉంచారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఫారూఖ్ వాహనంతో ఉడాయించాడు. రాజేంద్రనగర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు పక్కన వాహనాన్ని పార్కు చేసి అందులో ఉన్న ఒక బాక్సు, రెండు గన్లను తీసుకుని పరారయ్యాడు. ఒక్కడే ఉండడం, బాక్సులు పెద్దగా ఉండడంతో నగదు మొత్తం తీసుకెళ్లేందుకు అతడికి వీలు కాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు లోడ్చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చదవండి: Road Accident: బస్సు, టవేరా వాహనం ఢీ.. 11 మంది దుర్మరణం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఏజెన్సీ నిర్వహకుల సమాచారంతో పోలీసులు కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్ పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల పరిశీలన... డ్రైవర్ ఫారూఖ్ ఒక్కడే నగదును దొంగలించాడా అతడికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్ నుంచి కిస్మత్పూర్ బ్రిడ్జీ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతను ట్రంక్ బాక్సుతో పాటు రెండు గన్లను తీసుకువెళ్లడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డులకు చెందిన ఈ తుపాకులు బరువుగా ఉంటాయని వాటిని తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారన్నారు. స్థానికంగా వాటిని పడేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు దాదాపు గంట సేపు గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. -
దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...
ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఒక మహిళను భర్త చేతిలో హతం కాకుండా కాపాడింది. సరికొత్త ఫ్యూచర్లతో మంచి ఎలక్ట్రానిక్ గాడ్జ్ట్లు ఆకర్షణీయంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అంతే క్రేజ్గా కొంటున్నారు. ఈ కొంగొత్త టెక్నాలజీలు మనుషులను కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అచ్చం అలానే ఇక్కడొక మహిళను ఒక యాపిల్ వాచ్ విపత్కర సమయంలో దేవుడిలా రక్షించింది. వివరాల్లోకెళ్తే..వాషింగ్టన్కి చెందిన యంగ్ సూక్ ఆన్ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్తో గత కొంతకాలంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే విడిపోతే ఆమెకు భరణంగా తన రిటైర్మెంట్ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా చాంగ్ క్యోంగ్ ఆమె ఇంటికి వచ్చి గొడవపడటేమే గాక తన కుట్రలో భాగంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. తదనంతరం ఆమెను టేప్తో చుట్టి గ్యారెజ్ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్వ్యాన్లో ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడుతున్న వినలేదు. దీంతో ఆమె తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ సాయంతో అత్యవసర నెంబర్ 911కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి....వాషింగ్టన్లోని సీటెల్కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. ఐతే ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది. ఆమె ఆ సమయంలో తన 20 ఏళ్లు కూతురుకి కూడా తాను ప్రమాదంలో ఉన్నట్లు వాచ్ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అందరూ సమయానికి అప్రమత్తమవ్వడంతోనే ఆమెను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రక్షించే సమయంలో ఆమె మొత్తం టేప్తో సీల్ చేసి తీవ్ర గాయలపాలై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతక మునుపు కూడా ఈ యాపిల్ వాచ్ ఎంతమందినో పలురకాలుగా వారి ప్రాణాలను కాపాడింది. (చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!) -
అరే ఏంట్రాఇది.. ఏకంగా పోలీసు వాహనాన్నే..
సాక్షి, అమరాపురం (సత్యసాయి జిల్లా): ఓ వ్యక్తి ఏకంగా పోలీసు వాహనాన్నే ఎత్తుకెళ్లాడు. చాలా దూరం వెళ్లి ఓ చెట్టును ఢీకొన్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి అని తెలిసి అవాక్కయ్యారు. అమరాపురంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం వడ్డేపాళ్యం గ్రామానికి చెందిన రామన్న కుమారుడు నవీన్కుమార్ సోమవారం ఉదయం అమరాపురం పోలీస్స్టేషన్కు వచ్చాడు. పరిసరాల్లో నిలిపి ఉంచిన పోలీసు జీపులో తాళం కూడా ఉండడంతో వేసుకుని వెళ్లిపోయాడు. మండలంలోని వలస సమీపంలో ఓ చింతచెట్టుకు ఢీ కొట్టాడు. అక్కడున్న వారు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, వారు వచ్చి నవీన్కుమార్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు సదరు వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారు. పోలీసులు నవీన్కుమార్ను తీసుకెళ్లారు. పోలీసు వాహనాన్ని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడన్న విషయం చర్చనీయాంశమైంది. చదవండి: (కారు డ్రైవర్కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే) -
కారు డ్రైవర్కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే
సాక్షి, బెంగళూరు: కారు డ్రైవర్కు మద్యం తాగించి కారుతో పరారైన రౌడీషీటర్ మేకె మంజ (27), అతని భార్య వేదవతి అలియాస్ జ్యోతి (25)ని యలహంక ఉపనగర పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి అనూప్ శెట్టి తెలిపిన మేరకు వీరు ఇటీవల రాత్రి 10.30 సమయంలో నాగేనహళ్లి గేట్ దగ్గర ఓలా కార్ను బుక్ చేసి నగరంలోని వివిధ ప్రదేశాలు తిరిగారు. డ్రైవర్ శివశంకర్తో మంచిగా మాట్లాడుతూ డాబాలో పార్టీ చేసుకుందామని తీసుకెళ్లి అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు. మత్తులో డ్రైవర్ కారులో పడుకుని ఉండగా మంజ తాళాలు తీసుకుని నడుపుకొంటూ వెళ్లి రాజనుకుంటె దగ్గర డ్రైవర్ను బయటికి తోసేసి, అతని మొబైల్ను తీసుకుని ఉడాయించారు. మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్ యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు జరిపి ఘరానా జంటను అరెస్టు చేసి కారు, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంజపై హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. చదవండి: (లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా!) -
పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్
బెంగళూరు: వివాహమై ఇద్దరు పిల్లలున్న తల్లి... ఇంజనీరింగ్ చదివిన యువకుడు. ఇద్దరికి బాల్యం నుంచి పరిచయం, ఈ నేపథ్యంలో ఇద్దరు పారిపోయి కారవార్ వచ్చారు. భార్య అదృశ్యంపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కథ అంతా బయట పడింది. దీంతో పోలీసులు యువకుడితో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు... బీర్ మోహిద్దీన్ చెన్నైకి చెందినవాడు. ఇటీవల ఇంజినీరింగ్ను పూర్తి చేశారు. దూరపు బంధువైన అబ్దుల్ ఖాదర్ యువకుడికి పెళ్లి సంబంధాలను చూడటాన్ని ప్రారంభించారు. దీంతో బీర్ మోహద్దీన్ అప్పుడప్పుడు ఖాదర్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అయన కోడలు అయిషాతో బాల్యం నుండి పరిచయం. దీంతో అయిషాను తీసుకుని బీర్ మోహద్దీన్లు కారవారకు పారిపోయాడు. ఎవరికి తెలియకుండా ఆరు నెలల నుండి అక్కడే కలిసి నివాసం ఉంటున్నారు. దీంతో తమిళనాడు పోలీసులు అదృశ్యమైన అయిషాను కోసం వెతుకుతూ కారవారకు రావటంతో స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుండి ఇద్దరు అద్దె ఇంటిలో కారవారలో ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. చదవండి: (గుజరాత్పై కుట్రలు) -
స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
బషీరాబాద్(వికారాబాద్ జిల్లా): ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ఫిర్యాదుదారుడి వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావణి (పేరుమార్చాం) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు. చదవండి: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం ఈ క్రమంలో పరమేశ్ భార్యతో విశ్వనాథ్ సన్నిహితంగా మెలిగేవాడు. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై అనుమానం రావడంతో పరమేశ్ తన భార్యను నిలదీశాడు. అయినా వీరి తీరు మారకపోవడంతో కొద్ది రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. ఆనాటి నుంచి పావణి, విశ్వనాథ్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 30న పావణి తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండాపోయింది. అదే రోజున విశ్వనాథ్పై అనుమానం వ్యక్తంచేస్తూ పరమేశ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను విశ్వనాథ్ అపహరించుకుపోయాడని, ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.42 వేలు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. విశ్వనాథ్కు మూడు నెలల క్రితమే అనురాధ అనే యువతితో వివాహం జరిగింది. మరో మహిళను తీసుకుని పారిపోయాడని తన భర్తపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనురాధ.. తన జీవితం ఏం కావాలని..? మామ పిట్టలి అంజిలప్పను నిలదీసింది. దీనిపై స్పందించిన ఆయన నాలుగు రోజుల్లో తన కొడుకు తిరిగిరాకపోతే.. ఆస్తి మొత్తాన్ని కోడలి పేరున రాస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా తన భర్త కనిపించకుండా పోయాడని, ఆయన ఆచూకీ కనుక్కోవాలని విశ్వనాథ్ భార్య అనురాధ సైతం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విశ్వనాథ్, పావణిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి తెలిపారు. -
అభిషేక్ను పట్టుకోవడంతో అర్జున్ జంప్!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీప బంధువైన అర్జున్ వీరమాచినేని తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున పబ్పై పోలీసులు దాడిచేసి అందరినీ బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం అర్జున్ ఠాణా వద్దకు వచ్చాడు. తానెవరో చెప్పకుండా గమనించడం మొదలుపెట్టాడు. అప్పటికే పబ్ భాగస్వామి అభిషేక్, మేనేజర్ అనిల్కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇది చూసిన అర్జున్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిర్ధారించుకున్నట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు గురువారం అర్జున్, కిరణ్రాజ్ల ఇళ్లకు వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పబ్లో అభిషేక్తోపాటు అర్జున్, పెనుమత్స కిరణ్రాజు భాగస్వాములుకాగా.. అనిల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు దాడి చేసినప్పుడు అనిల్, అభిషేక్ పబ్ వద్దే ఉండటంతో పట్టుబడ్డారు. రిమాండ్లో ఉన్న ఈ ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై శుక్రవారం ఎంఎస్జే కోర్టులో వాదనలు జరగనున్నాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. ఎంత ఈజీగా జైలు నుంచి తప్పించుకున్నాడో!
వాడొక కరడు గట్టిన క్రిమినల్. డ్రగ్ సప్లయ్తో యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. పోలీసులు కష్టపడి పట్టుకుంటే.. చావు నాటకం ఆడి తెలివిగా తప్పించుకున్నాడు. ఆపై ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రూపు మార్చుకున్నా.. టైం బాగోలేక దొరికిపోయాడు. కానీ, ఇప్పుడు ఏదో చుట్టాల ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు జైలు, అదీ కఠినమైన భద్రత నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా.. కరడుగట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్. నైరుతి కొలంబియా నారినో ప్రావిన్స్లో 20 శాతం కొకైన్ మాఫియాకు కారణం ఇతనే. బోగోటాలోని లా పికోటా జైల్ నుంచి గత శుక్రవారం తప్పించుకున్నాడు. అది అలా ఇలా కాదు. సెక్యూరిటీ గార్డు దుస్తుల్లో, ముసుగు ధరించి చాలా క్యాజువల్గా బయటకు వచ్చేశాడు. గట్టి భద్రత, ఏడు హైసెక్యూరిటీ గేట్లు ఉన్నా, అలవోకగా దాటేశాడు. 🔴 En los videos se aprecia al poderoso narcotraficante salir por una reja que le deja abierta un inspector de apellido Jiménez ► https://t.co/66DoBnmIKk 📹: cortesía. pic.twitter.com/2iTgOgZYgQ — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 సిబ్బంది తొలగింపు ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు Iván Duque Márquez సీరియస్ అయ్యారు. హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. దర్యాప్తులో.. జువాన్ క్యాస్ట్రో పారిపోయేందుకు సహకరించిన గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు అధికారి మిల్టన్ జిమెనెజ్తో పాటు 55 మంది గార్డులపైనా వేటు వేశారు. సుమారు ఐదు మిలియన్ డాలర్ల లంచం పోలీసులకు చెల్లించి.. తప్పించుకున్నాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అంతేకాదు ఈమధ్యకాలంలో కొంత మంది జువాన్ను వచ్చి కలిసినట్లు పేర్కొన్నారు. 🚨 Finalmente, alias Matamba sale por la puerta haciendo un gesto con su mano derecha en señal de que todo está bien. Acá los detalles ► https://t.co/66DoBnmIKk Vía @JusticiaET pic.twitter.com/dGzH7s3q9x — EL TIEMPO (@ELTIEMPO) March 20, 2022 కంత్రిగాడు జువాన్ ఇప్పటివరకు పన్నెండుసార్లు అరెస్ట్ అయ్యాడు. అయితే తప్పించుకోవడం మాత్రం రెండోసారి. 2018లో జైలు నుంచి మెడికల్ లీవ్లో వెళ్లిన అతను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించాడు స్వేచ్ఛగా తిరిగాడు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని కొత్త లుక్తో స్వేచ్చగా తిరిగాడు. కిందటి ఏడాది.. పుట్టినరోజు వేడుకల్ని ఫ్లారిడాబ్లాంకాలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో నిర్వహించుకున్నాడు. అయితే పేరుతో ఇన్విటేషన్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు పోలీసులు పట్టేసుకునేవారు. జువాన్ క్యాస్ట్రో అలియాస్ మటాంబా మే 2021లో అరెస్ట్ అయ్యాడు. ఇంకో నెలలో అతన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంది. ఈలోపే తప్పించుకుని పోవడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. -
పాపం.. దురదృష్టవంతుడు! ఆ హింస పడలేక దేశం విడిస్తే.. మళ్లీ అదే పరిస్థితి!
Afghan Man Again Escape Poland: అఫ్గనిస్తాన్కి చెందిన అజ్మల్ రహ్మనీ ఒక ఏడాది క్రితం అప్గనిస్తాన్ విడిచి పెట్టి ఉక్రెయిన్ వచ్చాడు. అఫ్గాన్లోని హింస నుంచి తప్పించుకుని ఉక్రెయిన్లో హాయిగా జీవిద్దామని అనుకున్నాడు. అయితే అఫ్గాన్లో అనుక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన అతనికి ఉక్రెయిన్ అత్యంత స్వర్గధామంగా అనిపించింది. మళ్లీ గత నాలుగు రోజులుగా రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తుండటంతో భయాందోళనలతో మళ్లీ పోలాండ్ సరిహద్దుకు పరిగెత్తాడు. ఈ బాంబుల మోత తనను వదలడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. తాను ఒక యుద్ధం నుంచి తప్పించుకుని మరో దేశం పరిగెత్తాను, మళ్లీ ఈ దేశంలో యుద్ధం మొదలైంది ఎంత దురదృష్టం అంటూ ఆవేదన చెందాడు. రహ్మనీ తన భార్య మినా, కుమారుడు ఒమర్, కూతురు మార్వాతో కలిసి ఉక్రెయిన్ సరిహద్దుకు కాలినడకన 30 కిలోమీటర్లు నడిచి వెళ్లామని చెప్పాడు. తాను పోలాండ్ వైపున ఉన్న మెడికాకు చేరుకున్న తర్వాత తన కుటుంబం ఇతర శరణార్థులతో కలిసి సమీపంలోని ప్రజెమిస్ల్ నగరానికి తీసుకెళ్లే బస్సులో వెళ్లామన్నారు. 40 ఏళ్ల రహ్మానీ, కాబూల్ విమానాశ్రయంలో 18 ఏళ్ల పాటు అఫ్గనిస్థాన్లోని నాటో కోసం పనిచేశానని చెప్పారు. యూఎస్ బలగాల ఉపసంహరణకు నాలుగు నెలల ముందు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అఫ్గాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అంతేకాదు తనకు అప్గనిస్తాన్లో మంచి జీవితం ఉందని తనకొక మంచి ఇల్లు, కారు మంచి జీతం అన్ని ఉన్నాయని రహ్మానీ చెప్పారు. అఫ్గనిస్తాన్ను విడిచిపెట్టడానికి వీసా కోసం తాను చాలా కష్టపడ్డానని, పైగా తనను అంగీకరించే ఏకైక దేశం ఉక్రెయిన్ మాత్రమేనని అతను చెబుతున్నాడు. రహ్మానీ అతని కుటుంబం పోలాండ్లో వీసా లేని ఇతరుల మాదిరిగానే ఉన్నాడని, నమోదు చేసుకోవడానికి 15 రోజుల సమయం ఉందని వలసదారుల స్వచ్ఛంద సంస్థ అయిన ఓక్లైన్ (సాల్వేషన్) ఫౌండేషన్ న్యాయవాది టోమాస్జ్ పీట్ర్జాక్ అన్నారు. అయితే ఉక్రెయిన్ నుంచి దాదాపు 2 లక్షల మంది వలసదారులు పోలాండ్లోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు. (చదవండి: రష్యాతో జతకట్టనున్న బెలారస్!) -
రాజేంద్రనగర్ కస్తూర్బా ఆశ్రమం నుంచి 14 మంది మహిళలు పరార్
-
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు.. 14 మంది మహిళలు పరార్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు గృహాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ రెస్క్యూ టీమ్ దాడులు చేసింది. అందులో ఉన్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 19 - 25 సంవత్సరాల వయసు గల మహిళలను కోర్టు ఆదేశంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా అనాథాశ్రమంలో చేర్పించారు. వీరి పరివర్తనలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయాలని వీరికి అక్కడ 20 రోజులుగా తర్ఫీదు ఇస్తున్నారు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఆశ్రమం నిర్వాహకులు నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య) -
వాష్ రూమ్కని వెళ్లి బాలిక, యువతి పరార్
సాక్షి, వరంగల్: వరంగల్ కాశిబుగ్గలోని స్వధార్ హోం నుంచి వేర్వేరుగా ఒక బాలిక, ఒక యువతి పరారయ్యారు. ఈ ఘటనపై హోం నిర్వహకులు వనం బాలరాజు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం గొల్లకొండకు చెందిన భూక్య భానుశ్రీ(15), హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం వంగపహడ్కు చెందిన ముస్కు మీనా(22) గత కొద్ది రోజులుగా కాశిబుగ్గలోని స్వధార్ హోంలో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భాను శ్రీ వాష్ రూమ్కు వెళ్లి వస్తానని చెప్పి హోంలోని పై రూమ్కి వెళ్లింది. చదవండి: కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక! చాలా సేపయ్యినా కిందకు రాకపోవడంతో హోం వాచ్ ఉమెన్ పైకి వెళ్లి చూసినా కనిపించలేదు. అలాగే శనివారం రాత్రి ముస్కు మీనా కూడా వాష్ రూమ్కి వెళ్తున్నాని చెప్పి పైకి వెళ్లింది. తను కూడా తిరిగి రాకపోవడంతో వాచ్ ఉమెన్ వెళ్లి పరిశీలించగా.. ఆమె కనపడలేదు. హోమ్ నిర్వహకులు పరిసర ప్రాంతాలు వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. చదవండి: మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను -
‘ఎస్కేప్’ కార్తీక్ దొరికాడు.. 80 ఇళ్లలో చోరీ, 17వసారి అరెస్ట్
సాక్షి, బెంగుళూరు: చోరీ కేసులో అరెస్ట్ అవడం.. జైలు నుంచి లేదా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని మళ్లీ దొంగతనాలు చేయడం అతనికి అలవాటుగా మారింది. కర్ణాటకలోని కల్యాణ్ నగర్లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల కార్తిక్ కుమార్ అలియాస్ (ఎస్కేప్ కార్తిక్)ను కామాక్షిపాళ్య పోలీసులు 17వసారి అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్కేప్ కార్తిక్ మళ్లీ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న సుమారు రూ.11లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే కార్తిక్కు చోరీలు చేయటం అలవాటుగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 80 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల గుండా తిరుగుతూ ముందుగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి వెళ్లి చోరీలు చేస్తాడని పోలీసులు వివరించారు. 2008లో ఓ చోరీ కేసులో అరెస్టై పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఉన్న సమయంలో భోజనం పంపిణీ చేసేందుకు వచ్చిన ఫుడ్ వ్యాన్లో దాక్కొని పారిపోయాడు. దీంతో అతనికి ‘ఎస్కేప్ కార్తీక్’ అనే పేరు వచ్చింది. పోలీసులు 45 రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. 2010లో మరోసారి కార్తిక్ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. కామాక్షిపాళ్య పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. బసవేశ్వర నగర్, కేపీ అగ్రహారాల్లో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు. -
తెలిసీ తెలియక.. ఇంటిని విడిచివెళుతున్నారు!
మెంటాడ మండలానికి చెందిన పదేళ్ల బాలిక విజయనగరం చూద్దామని బస్సుఎక్కి సోమవారం వచ్చేసింది. ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి చైల్డ్లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్చేసి సమాచారం అందించారు. చైల్డ్లైన్ సిబ్బంది వెంటనే బాలికను కార్యాలయానికి తీసుకొచ్చారు. వివరాలు సేకరించి రక్షణ కల్పించారు. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు తల్లికి అప్పగించారు. విశాఖపట్నానికి చెందిన 11 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు మందలించారని ఈనెల 10వ తేదీన బస్సులో విజయనగరం వచ్చేసింది. ఆర్టీసీ కాంప్లెక్సులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఓ వ్యక్తి చైల్డ్లైన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వారు బాలికను సంరక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. మక్కువకు చెందిన చెందిన 14 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు మందలించారని కొద్ది రోజుల కిందట రైలులో ముంబయి వెళ్లిపోయాడు. అక్కడ పోలీసులు బాలుడిని విచారించి మక్కువ ప్రాంతంగా గుర్తించారు. విజయనగరం పోలీసులకు సమాచారం అందించి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. విజయనగరం ఫోర్ట్: తెలిసీతెలియని వయసులో పిల్లలు క్షణికావేశానికి లోనవుతున్నారు. కొందరు ఇంటిని విడిచిపెడుతున్నారు. చదువుపై శ్రద్ధ చూపకపోవడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, పట్టణాలు చూసొద్దామని, స్నేహితులపై మోజుతో.. ఇలా వేర్వేరు కారణాలతో చిన్నవయసులో ఇంటి నుంచి పారిపోతున్నారు. రైలు, బస్సు ల్లో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో అనాథులుగా తిరుగుతున్నారు. ఆ సమయంలో పోలీసులకు, చైల్డ్లైన్ సభ్యులకు తారసపడిన వారు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. పొరపాటున అగంతుకులకు చిక్కితే అంతే సంగతి. మూడేళ్లలో జిల్లాకు చెందిన 229 మంది చిన్నారులు ఇళ్ల నుంచి పారిపోయి పోలీసులు, చైల్డ్లైన్ సిబ్బంది సహకారంతో తిరిగి ఇంటికి చేరినట్టు రికార్డులు చెబుతున్నాయి. పిల్లల పెంపకంపై శ్రద్ధ అవసరం చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఇష్టాఇష్టాలను తెలుసుకోలేకపోతున్నారు. పనులు, ఉద్యోగాల్లో నిమగ్నమై పిల్లల ప్రవర్తనను గమనించడంలేదు. అసలు వారు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీలో తల్లిదండ్రులు ఉంటున్నారు. పిల్లలు చిన్న పొరపాటు చేసినా, చదువులో వెనుకబడినా కోపం ప్రదర్శిస్తున్నారు. గట్టిగా మందలిస్తుండడంతో పిల్లలు బెదిరిపోయి ఇంటిని విడిచిపెడుతున్నట్టు పోలీస్ అధికారులు, చైల్డ్లైన్ ప్రతినిధులు చెబుతున్నారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి పిల్లల ప్రవర్తను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారి ఆసక్తులను తెలుసుకోవాలి. కోపపడడం, తిట్టడం వల్ల పిల్లలు భయపడి ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి చెడులు గురించి పెద్దలు చెప్పేవారు. ఓదార్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – ఎం.రాజేశ్వరి, పీడీ, ఐసీడీఎస్ ఆదర్శంగా జీవించాలి.. తల్లిదండ్రులు ఆదర్శంగా జీవిస్తే పిల్లల్లో మంచి నడవడిక అలవడుతుంది. అలాకాకుండా చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందే గొడవకు దిగుతున్నారు. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటి నుంచి వెళ్లిపోయేలా ప్రేరేపిస్తోంది. సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లలపై ఉంటుంది. సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛఉండడం లేదని, తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – జి.హైమావతి, చైల్డ్లైన్ ప్రతినిధి -
పోలీసులకే టోకరా.. వాష్రూమ్ వెళ్తానని చెప్పి..
సాక్షి, వికారాబాద్: దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏకంగా పోలీసులనే మోసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. వారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ వాష్రూమ్కు వెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో వారు.. అతడిని వదిలిపెట్టారు. ఎంత సమయం గడిచిన నిందితుడు రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెళ్లి చూశారు. అక్కడ నిందితుడు లేడు. దీంతో షాకైన పోలీసులు.. తప్పించుకున్న నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
ఈడ్చుకొచ్చి, గొంతు కోసి రేప్ చేయాలని చూశాడు...కానీ
తిరువనంతపురం: అమ్మాయిలు, మహిళలపై కామాంధుల అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. మైనర్ బాలురు కూడా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే కేరళలోని ఒక యువతి దారికాచి దాడిచేసిన మైనర్బాలుడి దుర్మార్గంనుంచి తృటిలో తప్పించుకుంది. కేరళ, మలుప్పురం జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలుడు(15) స్థానిక మహిళ (21) పై దారి కాచి దాడిచేశాడు.సోమవారం మధ్యాహ్నం కంప్యూటర్ క్లాసులకు వెళ్తున్న మహిళను వెంబడించి మరీ రోడ్డు పక్కనే ఉన్న ప్లాంటేషన్ ప్రాంతానికి ఈడ్చుకెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాధిత యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో ఎటాక్ చేశాడు. ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. అనంతరం ఆమె దుపట్టాతో చేతులు కట్టి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే ఆ క్రమంలో నిందితుడు ఆమె గొంతు కోసేందుకు కూడా ప్రయత్నించాడని మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ సుజిత్ దాస్ ఎస్ తెలిపారు. అయితే బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని సమీపంలోని ఇంటికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందన్నారు.నిందితుడిపై కేసునమోదు చేసిన పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ షాక్నుంచి బాధితురాలు తేరుకోవడానికి సమయం పడుతుంది కనుక విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాదు నిందితుడికి మార్షల్ ఆర్ట్ జూడోకూడా తెలుసని, జిల్లా స్థాయి ఛాంపియన్ అని వెల్లడించారు. అయినా ఆమె చాకచక్యంగా తప్పించుకోవడం విశేషమన్నారు. -
ఎంత పనిచేశావ్.. వెంకట్రావ్..! నమ్మించి..
సాక్షి, కందుకూరు: నమ్మినవాళ్లను నిలువునా ముంచాడు ఓ మున్సిపల్ ఉద్యోగి. అందినకాడికి అప్పు తీసుకొని అడ్రస్ లేకుండా పోయాడు. ఈ ప్రబుద్ధుడికి అప్పులిచ్చిన వాళ్లలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. గత నాలుగు నెలలుగా అతని ఆచూకీ లేకపోవడంతో అప్పు ఇచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. విధులకు ఎగనామం పెట్టిన ఉద్యోగిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చీరాలకు చెందిన వెంకట్రావు అనే వ్యక్తి కందుకూరు మున్సిపల్ కార్యాలయంలో గత ఆరేళ్లుగా హెల్త్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలో పరిచయాలు పెంచుకున్నాడు. సొంత అవసరాలు ఉన్నాయంటూ తెలిసిన వారి వద్ద అప్పు తీసుకోవడం ప్రారంభించాడు. కందుకూరు పట్టణంలో పలువురు ఉద్యోగులు, ఇతర వ్యక్తుల వద్ద సుమారు రూ.25 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని అడిగిన వారికి సాకులు చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే 4 నెలల నుంచి వెంకట్రావ్ అడ్రస్ లేకుండా పోయాడు. వెంకట్రావు కుటుంబం తూర్పుకమ్మపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రెండు రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందుకూరు వచ్చి ఇంట్లో సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా అప్పులిచ్చినవాళ్లు అడ్డుకున్నారు. వివాదం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకుని అప్పులవాళ్లకి సర్దిచెప్పి పంపారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో సామాగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వెంకట్రావ్ ఆచూకీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అతనిపై చీటింగ్ కేసు పెట్టేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వెంకట్రావ్పై ఇదే విధమైన కేసులు ఒంగోలులోనూ ఉన్నాయని, కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు చెబుతున్నారు. చదవండి: (ప్రతి నెలా రూ. కోటి వడ్డీ కడుతున్నాం.. గత్యంతరం లేక ఐపీ పెట్టాం) నాలుగు నెలలుగా విధులకు డుమ్మా మున్సిపాలిటీ హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వెంకట్రావ్ గత నాలుగు నెలల నుంచి విధులకు హాజరుకావడం లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్ 23వ తేదీన రెండు రోజులు సీఎల్ పెట్టి వెళ్లారని, అప్పటి నుంచి విధులకు రావడం లేదని చెప్పారు. ఇప్పటికే ఆయన అద్దెకు ఉంటున్న ఇంటి అడ్రస్కు పలుమార్లు నోటీసులు పంపామని, కానీ ఇల్లు లాక్ చేసి ఉండటంతో తిరిగి మున్సిపాలిటీకి వచ్చాయని వెల్లడించారు. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీకి ఫిర్యాదు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసన్ తెలిపారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఉన్నతాధికారులతో పరిచయాలు.. రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం
సాక్షి, జగిత్యాల (కరీంనగర్): అధిక వడ్డీ ఆశచూపి, పలువురి నుంచి రూ.10 కోట్ల వరకు అప్పు తీసుకున్న ఓ వ్యాపారి పరారయ్యాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల పోచమ్మవాడకు చెందిన ఓ వ్యాపారి జిల్లా కేంద్రానికి చెందిన సుమారు 80 నుంచి 95 మంది వద్ద రూ.10 కోట్లు, రెండున్నర కిలోల బంగారం తీసుకున్నాడు. కొంతకాలం వడ్డీ చెల్లించాడు. గత వారం రోజులుగా కనిపించక పోవడంతో శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అధికారులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులందరూ అక్కడికివెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా సదరు వ్యాపారి గతంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకొని, జిల్లా వ్యాప్తంగా పెట్టుబడుల పేరుతో సుమారు రూ.22 కోట్ల వరకు అప్పు తీసుకున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓ బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: చేనుపనులు ముగించుకుని వస్తున్నాడు.. అంతలోనే -
నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్!
సాక్షి, పహాడీషరీఫ్ (హైదరాబాద్): నిఖా పూర్తయిన నిమిషానికే ఓ పెళ్లి కూతురు భర్త ఇచ్చిన మెహర్ (కానుకలు)ను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైన సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. వివరాలివీ... బెంగుళూర్కు చెందిన 28 ఏళ్ల యువకుడికి మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని వట్టెపల్లిలో నివాసం ఉండే యువతితో ఈ నెల 16న పెద్దల సమక్షంలో వివాహ నిశ్చయమయ్యింది. అదేరోజు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వివాహ స్థలమైన బాలాపూర్లోని షాహిన్నగర్కు చేరుకున్నారు. బాగా అలసిపోయామంటూ 17వ తేదీకి నిఖాను వాయిదా వేశారు. 17వ తేదీన ఖాజీ సమక్షంలో నిఖా జరిగాక... ఆనవాయితీ ప్రకారం మెహర్ కింద పెళ్లి కుమారుడు తన భార్యకు రూ. 50 వేలతో పాటు రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అందజేశారు. అనంతరం జరగాల్సిన కార్యానికి ముస్తాబయ్యేందుకు బ్యూటీ పార్లర్కు వెళ్లొస్తానంటూ పెళ్లి కుమార్తె బయటికి వెళ్లింది. గంట.. రెండు గంటలవుతున్నా ఆమె రాలేదు. దీంతో పెళ్లి కొడుకు ప్రశ్నించడంతో పెళ్లికుమార్తె తల్లి విషయం బయటపెట్టింది. తన కుమార్తె తమకే తెలియకుండా తన ప్రియుడితో కలిసి వెళ్లిందని వెల్లడించింది. దీంతో పెళ్లి కొడుకు తరఫు వారు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో చివరకు వధువు ఇంటి వారు మెహర్ కింద అందించిన సొమ్మును అప్పగిస్తామని వేడుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వలేదంటూ చివరకు ఖాజీ కూడా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని బాలాపూర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపారు. చదవండి: Raj Kundra: నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా -
తల మీద నుంచి ట్రాక్టర్ టైర్ దూసుకెళ్లింది.. చివరికి ఏమైందంటే!
గాంధీనగర్: ఇటీవల గుజరాత్లోని దాహోద్లో టూవీలర్పై వెళ్తున్న ఓ వ్యక్తి బస్సును ఓవర్టేక్ చేస్తూ ప్రమాదం అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే మరోసారి దాహోద్లో చోటుచేసుకుంది. ఈసారి ఓ వ్యక్తి తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లినప్పటికీ అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. దహోద్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి బైక్ ఒక మహిళ, చిన్నారితో కలిసి వెళ్తున్నాడు. రోడ్డుపై వర్షపు నీరు చేరి ఉండటంతో నీటిలో గుంత కారణంగా వారి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు కుడివైపుకు పడిపోయారు. అంతలోనే బైక్పై ఉన్న ముగ్గురు పక్కన వెళ్తున్న ట్రాక్టర్ కింద పడిపోయారు. అయితే ట్రాక్టర్ టైర్ ఫోర్స్కు మహిళ, శిశువు దూరంగా నెట్టివేయబడ్డారు. కానీ ఆ వ్యక్తి తలపై మాత్రం ట్రాక్టర్ వెనక టైర్ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ.. అది కూడా పక్కకు జరిగినట్టుగా కనిపిస్తుంది. దీంతో అతడు మరణించి ఉంటాడని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #Gujarat: A man had a narrow escape in #Dahod when the wheel of a tractor trolley passed on his head. The man was wearing a helmet which is believed to have rescued him. This is the second incident of its kind in Dahod in as many days. pic.twitter.com/v3n39MSU1B — TOI Vadodara (@TOIVadodara) September 15, 2021 చదవండి: రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ ట్రైన్ జర్నీలో యువకుడి డేంజరస్ ఫీట్లు.. ఒళ్లు గగుర్పుడిచే దృశ్యాలు షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ! -
చావు నోట్లో తలపెట్టి వచ్చాడు.. భయానక వీడియో వైరల్
గాంధీ నగర్: జీవితాన్ని కోల్పోడానికి రెప్పపాటు సమయం చాలు. కళ్లు మూసి తెరిచేలోపు ఎన్నో ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై వెళుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తాజాగా ప్రమాదం అంచుల దాకా వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను గోపి మనియార్ ఘంగర్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో టూవీలర్పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బస్సును డీకొట్టడంతో అతను టూవీలర్నుంచి కింద పడిపోయాడు. ఈ క్రమంలో బస్సు కిందకు యువకుడు దూసుకెళ్లాడు. అయితే వెంటనే బస్సు చక్రాల కింద పడకుండా తప్పించుకొని బస్సు మధ్యలోకి వెళ్లాడు. బస్సు కింద పడిన వ్యక్తిని గమనించిన డ్రైవర్వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో సదరు యవకుడు ఏలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చి తన బైక్ను తీసుకొని వెళ్లిపోయాడు ఈ భయంకర ఘటన సోమవారం మధ్యాహ్నం దాహోద్ జిల్లాలోని జలోద్ రహదారిపై సంభవించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఇన్స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. చివరికి తాపీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు.. -
జైలు మరుగుదొడ్డిలో సొరంగం
-
జైలు మరుగుదొడ్డిలో సొరంగం: అచ్చం ‘జులాయి’ సినిమాలో మాదిరి
జెరూసలెం: కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలు అది. వారిని బంధించిన జైలు చుట్టూ భారీ బందోబస్తు ఉంటుంది. అయితే ఇవన్నీ తమనేం చేయవని నేరస్తులు, దొంగలు నిరూపించారు. చిన్న వస్తువుదొరికితే చాలు వాటితో ఎలాగైనా తప్పించుకోగలరని చేసి చూపించారు. ఒక చిన్న చెంచాతో జైలు గోడలను తవ్వేసి బయట వరకు సొరంగం తవ్వేశారు. ఆ సొరంగ మార్గం నుంచి జైలు నుంచి బయటకు వచ్చారు. జులాయి సినిమాలో బ్రహ్మానందం ఒక ప్లేటును వంచి గోడను తవ్వేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. ది శాశంక్ రిడంప్షన్ అనే హాలీవుడ్ సినిమాలో మాదిరి ఈ ఘటన ఇజ్రాయెల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇజ్రాయెల్లోని గిల్బోవా జైలు ఉంది. ఆ జైలులో కరుడుగట్టిన నేరస్తులను బందీగా ఉంచుతారు. ఆ జైలు లోపల, బయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అయినా కూడా ఆరుగురు ఖైదీలు భదత్రా దళాల కళ్లు గప్పి జైలు నుంచి పారిపోయారు. వారు పారిపోయేందుకు వాడిన ఒకటే ఆయుధం ‘తుప్పుపట్టిన చెంచా. వారు బందీగా ఉన్న జైలు గదిలోని మరుగుదొడ్డిలో ఖైదీలు తుప్పుపట్టిన చెంచాతో సొరంగం తవ్వకం మొదలుపెట్టారు. కొన్నేళ్లుగా అలా చేశారని సమాచారం. చివరకు సొరంగం పూర్తవడంతో సోమవారం ఆ ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. జైలు నుంచి పొలాల వెంట పారిపోతుండగా రైతులకు కనిపించారు. జైలు నుంచి పరారయ్యారని గుర్తించి వెంటనే జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు జైలులో గాలించగా ఆరుగురు పరారయ్యారని గుర్తించారు. పారిపోయిన వారిలో మాజీ మిలిటెంట్ నాయకుడు ఉన్నాడు. మిగతా ఐదుగురు గాజాకు చెందిన ఇస్లామిక్ జిహాద్కు చెందినవారుగా అధికారులు తెలిపారు. పారిపోయినవారంతా పాలస్తీనా వైపు వెళ్లి ఉంటారని అధికారులు చెబుతున్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఖైదీలు పారిపోవడం భద్రతా లోపాలను ఎత్తి చూపింది. మరికొందరు పారిపోకుండా అప్రమత్తమైన అధికారులు మిగతా 400 మంది ఖైదీలను మరో చోటకు మార్చినట్లు సమాచారం. -
Escape From Taliban: అఫ్గన్లకు ఇప్పుడు ఇవే దిక్కు
అఫ్గన్ అల్లకల్లోలం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణభీతితో పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు జనాలు. ఈ తరుణంలో వారు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారని ఎంఐటీ రివ్యూ వెల్లడించింది. గూగుల్ ఫామ్స్ గూగుల్, వాట్సాప్.. ఇప్పుడు తాలిబన్ల కంటపడకుండా తప్పించుకునేందుకు అఫ్గన్లకు మార్గనిర్దేశకాలుగా మారాయి. జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు.. ఆఫ్గన్ల పేర్లతో ఆన్లైన్ లిస్ట్లు తయారుచేసి సాయం అందిస్తున్నారు. మరికొన్ని గ్రూపులు తాలిబన్ల కదలికల ఆధారంగా ఎలా వెళ్లాలో అఫ్గన్ పౌరులకు సూచనలు చేస్తున్నాయి. వీటిలో చాలావరకు కాబూల్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు అక్కడి పౌరులకు సాయపడుతున్నాయి. ఇందుకోసం గూగుల్ ఫామ్స్ను సర్క్యులేట్ చేస్తున్నారు. నిఘా సూచనలు ప్రశ్నలు..వాటికి సమాధానాలు అందించడం కోసం గూగుల్ ఫామ్స్ చాలా తేలికైన వ్యవహారం. అంతేకాదు అందులోనే పౌరుల పూర్తి సమాచారం మొత్తం పొందుపరుస్తున్నారు. ఇక వాట్సాప్లోనూ సమాచారం ఫార్వర్డ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. స్థానిక గ్రూపులతో పాటు అమెరికా విభాగాలు సైతం.. ఈ-మెయిల్స్ ద్వారా కాకుండా వాట్సాప్ గ్రూపులనే ఉపయోగించుకోవాలని సూచిస్తున్నాయి. మిగతావి కష్టం ఓవైపు ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ తాలిబన్ల కంటెంట్ కట్టడికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ ఇవి సులువుగా ఉపయోగించుకుంటున్నారు తాలిబన్లు. దీంతో వీటిలో ఎలాంటి అప్డేట్స్ పెట్టొద్దని అఫ్గన్లకు సూచనలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఫామ్స్, వాట్సాప్ గ్రూపుల వినియోగం పెరిగింది. చదవండి: Afghanistan Trade: తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్కు ఇక భారీ దెబ్బే! -
కరోనా సోకిన ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్
అస్సాం: కరోనా వైరస్ బారిన పడిన కొందరు బాధితులు చికిత్స పొందుతూ ఆస్పత్రుల నుంచి పారిపోయిన వార్తలను చూశాం. అయితే తాజాగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయి చికిత్స పొందుతున్న ఓ ఖైదీ ఆస్పత్రి నుంచి పారిపోవటం అస్సాంలోని కర్బీ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని కర్బీ జిల్లాలో ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకడంతో గురువారం మధ్యాహ్నం డిఫు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి ఆస్పత్రి వైద్యులు కోవిడ్ వార్డులో కరోనా చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కోవిడ్ వార్డులో ఆ ఖైదీ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు ఆ ఖైదీ కోవిడ్ వార్డు నుంచి పారిపోయినట్ల తెలిపారు. అతను జూన్ 12న డిఫు పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రగ్స్తో పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను జూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పారిపోయిన ఖైదీ కోసం బృందాలుగా ఏర్పడి తీవ్రంగా వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వ్యక్తిగత సమస్యలతో జర్నలిస్ట్ ఫేక్ డ్రామా: నొయిడా పోలీసులు -
వైరల్ : షూటింగులో హీరో విశాల్కు తప్పిన పెద్ద ప్రమాదం
హైదరాబాద్ : తమిళ స్టార హీరో విశాల్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమిళ స్టార్ హీరో విశాల ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా విశాల్ తలకు గాయమైంది. డూప్ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్రయూనిట్ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగినా బ్రేక్ తీసుకోకుండా విశాల్ నటించడం విశేషం. ఇక ఈ ప్రమాదంపై హీరో విశాల్ స్పందిస్తూ.. తృటిలో తప్పించుకున్నానని, ఆ ఫైటర్ తప్పేమీ లేదని చెప్పారు. టైమింగ్ మిస్ అయ్యిందని, అయినా యాక్షన్ సీన్లలో ఇలాంటివి జరగడం సాధారణమేనని పేర్కొన్నారు. ఆ దేవుడి దయ, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ కంటిన్యూ చేశామని, యాక్షన్ సీక్వెన్స్ను ఇంత అద్బుతంగా తెరకెక్కించినందుకు ఫైట్ మాస్టర్ రవివర్మకు థ్యాంక్యూ అని విశాల్ పేర్కొన్నారు. ఫైట్ సీన్స్కు సంబంధించిన వీడియోను విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక విశాల్31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. A close call,lucky escape,no fault of de stunt artist,just mistiming,mishaps do happen in action sequences, God willing&with all blessings,back 2 shoot&successfully done fight sequence&continuing shoot @ Hyd tks 2 RaviVarma Master 4 lovely fight sequence,will be a treat 2 watch pic.twitter.com/3wE61jjZ1U — Vishal (@VishalKOfficial) June 18, 2021 చదవండి : Vishal31 : మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన విశాల్ -
ఈ రోజు వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి.. ఎందుకో తెలుసా?
సాక్షి,సెంట్రల్ డెస్క్: అదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం.. ఓ రోజు అర్ధరాత్రి.. పక్కనే ఏముందో కూడా కానరానంతగా చిమ్మచీకటి కమ్ముకుంది.. అంతా నిశ్శబ్దం.. కానీ ఒక్కసారిగా ఏదో అలజడి. ఓ మందలోని గొర్రెలన్నీ కంచెను విరగ్గొట్టుకుని మరీ బయటికి పరుగెత్తడం మొదలుపెట్టాయి. కొంత దూరంలో ఉన్న మరో మందలోనూ ఇది మొదలైంది. కాసేపటికే చుట్టూ ఉన్న ఊర్లలోనూ అదే పరిస్థితి.. పదులు, వందలు కాదు.. వేలకొద్దీ గొర్రెలు.. ఒకే సమయంలో ఉన్నట్టుండి పిచ్చిపట్టినట్టు వగరుస్తూ పరుగెత్తాయి. మందలు ఉన్న కంచెలపై నుంచి దూకి, కొన్నిచోట్ల కంచెలను విరగ్గొట్టుకుని పారిపోయాయి. మధ్యలో పంటలను, తోటలను అన్నింటినీ ధ్వంసం చేసేశాయి. గొర్రెల యజమానులు పొద్దున లేచిచూసే సరికి.. మందలన్నీ ఖాళీ. ఇదేమిటని వెతకడం మొదలుపెడితే.. కిలోమీటర్ల దూరంలో మైదానాలు, పొదల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్ని అప్పటికీ వగరుస్తూ, ఏదో భయం భయంగా ఉన్నట్టు కనిపించాయి. ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్షైర్ కౌంటీలో 1888 నవంబర్ 3న ఈ ఘటన జరిగింది. తర్వాత ఐదేళ్లకు 1893 డిసెంబర్ 4న మరోసారి ఇలాగే వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఈ ఘటనలు జనంలో తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. అసలు ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ తేలని మిస్టరీ.. నిజానికి గొర్రెలు చాలా పిరికి జంతువులు. ముందు ఏదైనా చిన్నగా అడ్డంగా ఉన్నా దాటకుండా ఆగిపోతాయి. అలాంటిది ఏకంగా కంచెలను విరగ్గొట్టి మరీ పరుగెత్తడం, ఒకేసారి వేలకొద్దీ గొర్రెలు పారిపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ఆస్తులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదేమిటో తేల్చేద్దామని ప్రయత్నించారు. ఉరుములు, పిడుగులకు భయపడ్డాయని.. స్వల్ప స్థాయి భూకంపం వచ్చి ఉంటుందని.. అడవి జంతువులు దాడిచేసి ఉంటాయని.. ఎవరో కావాలని అలా చేసి ఉంటారని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్తూ వచ్చారు. కానీ ఇవేవీ ఆ ఘటనను సరిగా తేల్చలేకపోయాయి. ఎందుకంటే.. గొర్రెలు పరుగెత్తింది ఒకటీ రెండు చోట్ల నుంచి కాదు.. పదుల సంఖ్యలో గ్రామాల నుంచి.. సుమారు 500 కిలోమీటర్ల వైశాల్యంలో ఒకే సమయంలో వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఆ రోజు ఉరుములు, మెరుపులు, తుపాను వంటివేమీ రాలేదు కూడా. నల్లటి మేఘం కమ్మేసి.. ఈ ఘటన గుట్టు తేల్చేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారు. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారులు ప్రభుత్వానికి రాసిన ఓ లెటర్లో కాస్త ఆసక్తికర అంశం ఒకటి ఉంది. ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు కూడా.. ఆకాశంలో పెద్ద నల్లటి మేఘం కనిపించింది. మెల్లగా ఆ ప్రాంతమంతా ఆవరించింది. పక్కనే ఎవరు ఉన్నారో కూడా తెలియనంతగా చిమ్మ చీకటి కమ్ముకుంది. కాసేపటికే గొర్రెలన్నీ పారిపోవడం మొదలైంది. దీన్ని ఆధారంగా చేసుకునీ శాస్త్రవేత్తలు ఓ ప్రతిపాదన చేశారు. అసలేమీ కనిపించని చీకటి కారణంగా.. తమనెవరో బంధించారని, ఏదో జరగబోతోందని గొర్రెలు భయపడ్డాయని, కొన్ని గొర్రెలు అటూఇటూ పరుగెత్తడంతో మిగతావీ బెదిరి పారిపోయి ఉంటాయని పేర్కొన్నారు. ఇదీ జస్ట్ ఓ అంచనా మాత్రమే. అసలేం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే.. చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్ వెంటే.. -
బైక్ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు
పాట్నా: వాహనాలు దొంగతనం చేస్తున్న దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు చిక్కకుండా డ్రైనేజీలోకి దూరాడు. ఈ విషయం తెలియని పోలీసులు తీవ్రంగా గాలించి డ్రైనేజీ వద్ద నిలబడ్డారు. అకస్మాత్తుగా డ్రైనేజీపై అనుమానం కలిగింది. డ్రైనేజీని పరిశీలించి చూడగా దొంగ కనిపించాడు. ఈ ఘటనతో షాక్కు గురయిన పోలీసులు దొంగను పైకి రమ్మన్నారు. అతడు ఎంతకూ పైకి రాకపోవడంతో పోలీసులు డ్రైనేజీని తవ్వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన బిహార్లో చోటుచేసుకుంది. అరారియా జిల్లా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగపై వాహనాల దొంగతనం కేసు నమోదైంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం అతడు పోలీసులకు చిక్కాడు. స్టేషన్కు తీసుకెళ్లి అనంతరం కోర్టుకు తరలిస్తుండగా సంకెళ్లు విడిపించుకుని పరారయ్యాడు. దొంగ పరారవడంతో సీడీపీఓ పుష్కర్ కుమార్ తన పోలీస్ బృందంతో గాలించారు. డ్రైనేజీలో దూరాడని గుర్తించారు. అతడిని పైకి రావాలని చెప్పగా రాలేదు. పైగా చెత్తాచెదారంతో పాటు మురుగు నీరు అధికంగా ఉండడంతో దొంగ బయటకు రావడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు జేసీబీని తీసుకచ్చి తవ్వేశారు. పక్కన ఉన్న బండలు తొలగించి అతడిని పైకి తీసుకొచ్చారు. చివరకు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో ప్రధాన డ్రైనేజీ కావడంతో ఇబ్బందులు ఎదురవుతుందనే ఉద్దేశంతో పోలీసులు స్పందించి డ్రైనేజీని తవ్వించేశారు. చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. చదవండి: Siddartha Murder: సిద్ధార్థది పరువు హత్య? -
ఆలస్యంగా నిద్రలేస్తున్నావని మందలించిన భర్త.. దీంతో
సాక్షి, కంది(సంగారెడ్డి): భర్త మందలించాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ సంఘటన సంగారెడ్డి రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం.. కంది మండలం ఆరుట్ల గ్రామనికి చెందిన నిరూఢి పద్మ(50) అనారోగ్య కారణాలతో ఉదయం నిద్ర లేవకపోవడంతో తన భర్త నిరుడి జగయ్య(55) మందలించాడు. దీంతో ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, స్థానికంగా వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో బుధవారం ఆమె కుమారుడు కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గ్రామంలోనికి అంబులెన్స్ .. కరోనా రోగి పరార్..
సాక్షి,యశవంతపుర(కర్నాటక): గ్రామంలోకి వచ్చిన అంబులెన్స్ను చూసి కరోనా రోగి పారిపోయిన ఘటన హావేరిలో జరిగింది. కాగా, కబ్బూరు తండాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. అతడు కరోనా సోకిన కూడా బైట స్వేచ్చగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గ్రామస్థులు అతడిని ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలని కోరినా ఏవరి మాట వినలేదు. దీంతో, అతడిని ఎలాగైనా ఆసుపత్రికి తరలించాలని గ్రామస్థులు భావించారు. ఈ క్రమంలో.. స్థానికంగా ఉన్నా ఒక ఆసుపత్రికి సమాచారం అందించారు. అతడిని ఆస్పత్రికి తరలించడానికి గ్రామంలోకి అంబులెన్స్ వచ్చింది. దీనిని గమనించిన సదరు వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది, గ్రామస్తులు ఎంత గాలించినా కూడా ఆ వ్యక్తి కనిపించలేదు. -
కొత్త సెల్ఫోన్: బైక్ దిగగానే ఒక్కసారిగా షాక్..
సోమందేపల్లి: మొబైల్షాపులోని కొత్తసెల్ఫోన్తో ఓ అపరిచిత వ్యక్తి ఉడాయించాడు. వివరాల్లోకెళ్తే.. సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల మొబైల్షాప్కు బుధవారం ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. తాను పక్కనే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడినని పరిచయం చేసుకున్నాడు. తోటి మహిళా ఉపాధ్యాయురాలికి సెల్ఫోన్ కొనేందుకు వచ్చానని, వీవో కంపెనీకి చెందిన రూ.18వేలు విలువ చేసే పీస్ని ఎంపిక చేసుకుని, దీన్ని చూపించుకుని వస్తానన్నాడు. కావాలంటే తన వెంట మీ సేల్స్మన్ను కూడా పంపించండి అని అనడంతో షాపు యజమాని ఈశ్వరయ్య సరేనన్నాడు. అలా సేల్స్మన్తో ద్విచక్రవాహనంపై ఉన్నతపాఠశాల వద్దకు వెళ్లాడు. అక్కడ సేల్స్మన్ కిందకు దిగగానే అపరిచిత వ్యక్తి సెల్ఫోన్తో బైక్పై తుర్రుమన్నాడు. బాధిత షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య -
ఆస్పత్రి నుంచి ఉడాయించిన గ్యాంగ్స్టర్ షేక్ హైదర్
భువనేశ్వర్: కేంద్రపడా ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రి నుంచి గ్యాంగ్స్టర్ షేక్ హైదర్ శనివారం రాత్రి 7 గంటల సమయంలో పరారయ్యాడు. ఈ ఘటనపై ఉలిక్కిపడిన పోలీస్ అధికార యంత్రాంగం అతడి ఆచూకీ కోసం మొత్తం 5 ప్రత్యేక బృందాలను నియమించింది. కటక్ మహానగరం నలువైపులా ఉన్న ఇన్, ఔట్ పోస్ట్ ప్రాంతాలతో పాటు కేంద్రాపడా, జాజ్పూర్, జగత్సింగ్పూర్, మయూర్భంజ్, బాలాసోర్ జిల్లాల సరిహద్దుల్లో కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, విమానాశ్రయాల్లో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పోలీస్ ఠాణాలకు కూడా పరారైన గ్యాంగ్స్టర్ ఫొటోని జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. 2011లో జరిగిన షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చున్నా అలియాస్ మాలిక్ హనాన్ హత్య కేసులో హైదర్కి యావజ్జీవ కారాగార శిక్ష కోర్టు విధించి, ఝరపడా జైలుకి తరలించింది. అయితే అక్కడ 2017లో దలసామంత్ సోదరులతో జరిగిన ఘర్షణ కారణంగా ఇతడిని సంబల్పూర్ సర్కిల్ జైలుకి తరలించారు. బుర్లా విమ్సార్ ఆస్పత్రిలో.. ఇక్కడి జైలులో ఉంటుండగా, తీవ్రఅనారోగ్యానికి గురైన ఇతడిని వైద్యసేవల నిమిత్తం మార్చి 28వ తేదీన బుర్లా విమ్సార్ ఆస్పత్రిలో చేర్చారు. శస్త్ర చికిత్స చేయాలన్న అక్కడి వైద్యుల సూచనల మేరకు ఇతడిని కటక్ ఎస్సీబీ మెడికల్కి తరలించారు. అక్కడే చికిత్స పొందుతుండగా పోలీసులు, అధికారుల కళ్లుగప్పి హైదర్ పారిపోయాడు. దీనికి సంబంధించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను అతడికి కాపలాగా వెళ్లిన ఆరుగురు పోలీసులపై అధికారులు సస్పెన్షన్ వేటువేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో జవాన్లు బుల్బుల్ సాహు, దీపక్ సాహు, మహ్మద్ మౌసిమ్, ఉమాకాంత బెహరా, సుధాంశు మాఝి, హవల్దారు రమేష్ చంద్ర దెహురి ఉన్నట్లు సంబల్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బత్తుల గంగాధర్ తెలిపారు. చదవండి: స్నేహితులతో మద్యం తాగి.. తల పగిలి రక్తపు మడుగులో -
పరారీలో టీడీపీ నేత కూన రవికుమార్
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మరోసారి పరారయ్యారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, ఆ గ్రామ సర్పంచ్ భర్త మురళీకృష్ణపై కూన రవికుమార్ వర్గీయులు మారణాయుధాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా కూన అక్కడ ఉండగానే జరిగింది. అంతేకాకుండా పోలీసుల విధులకు కూడా ఆయన ఆటంకం కలిగించారు. దీనిపై మురళీకృష్ణ పొందూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన ముందుగానే పారిపోయారు. శనివారం పోలీసులు ఆయన ఇంటికెళ్లి చూడగా.. అప్పటికే ఆయన పరారయ్యారు. (చదవండి: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..) -
ఛీఛీ ఇదేం పని, 7వ తరగతి పిల్లాడితో ముగ్గురు పిల్లల తల్లి..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విస్తుపోయే సంఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి 7వ తరగతి చదువుతున్న పిల్లాడితో పరారీ అయిన సంఘటన స్థానికంగా చర్చనియాంశంగా మరింది. దీనిపై బాలుడి కుటుంబ సభ్యలు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేడయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కంపియాగంజ్కు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల కుర్రాడితో ఆమె ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ కుర్రాడు తరచూ వివాహిత దగ్గరికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మరింత సన్నిహితం పెరిగింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సదరు మహిళ కుర్రాడితో ఈనెల 10న పరారైయింది. అది తెలిసి పిల్లాడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులు పిల్లాడి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎంతకి వారి ఆచూకి తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన సంగతి చెప్పి తమ పిల్లాడి వెతికి పెట్టమని పోలీసులను అతడి కుటుంబ సభ్యులు కోరారు. మొదట ఈ విషయం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికి పోలీసులకు కూడా వారి ఆచూకి తెలియరాలేదని సమాచారం చదవండి: మైనర్తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్లో.. భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్ -
పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు..
పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని నవ వధువు ఉడాయించిన ఘటన కమ్మవారిపల్లిలో సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. పెద్దపప్పూరు మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల కేశవమురళి భార్య ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ఇద్దరు సంతానం. పిల్లల సంరక్షణ కోసమంటూ గత నెల 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. మరుసటి రోజు భర్త ఇంటికి కాపురానికి వచ్చిన ఆమె.. ఇంటిలో ఉన్న మూడు తులాల బంగారు నగలు, రూ.80వేలు తీసుకుని పారిపోయింది. ప్రియుడితో కలిసి భార్య ఒడిశాలో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి, వివాహిత కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..! ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్ -
ఒక్క క్షణం ఆలస్యమైతే.. పరిస్థితి? వైరల్ వీడియో
సాక్షి, రాజమండ్రి : రైల్వే క్రాసింగ్ల వద్ద, రైలు పట్టాలవద్ద ఎన్ని ఘోర ప్రమాదాలు జరుగుతున్నా.. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా..జనాల నిర్లక్ష్యం మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. తొందరగా వెళ్లి పోవాలన్న ఆతృతలో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సీసీటీవీలో రికార్డైంది. టూవీలర్తో పాటు పట్టాలను దాటాలని ప్రయత్నించాడో యువకుడు. ఇంతలో అదుపుతప్పి పడబోయాడు. చివరి క్షణంలో చేతిలో బైక్ను అక్కడే వదిలేసి పక్కకు తప్పుకున్నాడు. అంతే.. వేగంగా దూసుకొచ్చిన రైలు ధాటికి ఆ బైక్ తునా తునకలైపోయింది. ఈ దృశ్యాల్ని చూసిన యువడికి గుండె అరచేతిలోకి వచ్చినంత పనైంది. క్షణాల్లో ప్రమాదం తప్పడంతో ఆ యువకుడు బతుకు జీవుడా... అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఆఖరి నిమిషంలో ప్రాణాలు దక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా....రాజమండ్రి అన్నపూర్ణమ్మ పేట రైల్వే గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
పెరోల్పై వచ్చాడు.. టిఫిన్ షాపు పెట్టాడు
కాశీబుగ్గ(శ్రీకాకుళం జిల్లా): మహిళ హత్యకేసులో జీవిత ఖైదీగా జైలు పాలయ్యాడు.. సోదరి వివాహం కోసం పెరోల్పై వచ్చి ఎస్కార్ట్ కళ్లుగప్పి పరారయ్యాడు. ఒడిశా రాష్ట్రంలో తలదాచుకుంటూ టిఫిన్షాపు సైతం పెట్టేశాడు. సుమారు ఏడేళ్లుగా పోలీసులు గాలిస్తున్నా ఎక్కడా పట్టుబడలేదు. ఎట్టకేలకు స్వగ్రామంలో భూతగాదా విషయమై కాశీబుగ్గ వచ్చి పోలీసులకు చిక్కాడు. కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన సార దుర్యోధనరావు 2007లో పాతపట్నానికి చెందిన జి.పార్వతి అనే మహిళను హత్య చేశాడు. కేసు రుజువు కావడంతో 2013 ఆగస్టు 3న జిల్లా కోర్టు జీవితఖైదు విధించడంతో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. నాలుగు నెలల తరువాత దుర్యోధనరావు సోదరికి వివాహం నిర్ణయించడంతో హాజరయ్యేందుకు అనుమతి కోరగా రెండురోజుల పాటు పెరోల్ ఇచ్చారు. ఎస్కార్ట్ సహాయంతో కాశీబుగ్గ వచ్చి పరారయ్యాడు. బతుకు తెరువు కోసం ఒడిశాలోని కొంధమాల్ జిల్లా బల్లిగుడలో టిఫిన్ షాపు నిర్వహిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆయన సోదరుడికి చెందిన ఇళ్లస్థలాల గొడవ జరుగుతుండడంతో అతనికి మద్దతుగా దుర్యోధనరావు తరచూ పోలీసులు కళ్లుగప్పి కాశీబుగ్గ వచ్చివెళ్తుండేవాడు. బుధవారం కూడా అతను రావడంతో ఎంపీడీవో కార్యాలయం రోడ్డులో చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అతన్ని గురువారం పలాస కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ మధుసూదనరావు పాల్గొన్నారు. క్రైం టీంకు అభినందనలు పరారీలో ఉన్న జీవితఖైదీ దుర్యోధనరావును పట్టుకోవడంలో కీలకభూమిక పోషించిన క్రైం టీం సభ్యులు హెడ్కానిస్టేబుల్ బి.ఢిల్లీశ్వరరావు, కానిస్టేబుళ్లు బి.లోకనాథం, ఎం.ఢిల్లీశ్వరరావులను కాశీబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి, సీఐ జి.శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. -
హాపూర్ ఘటన.. పోలీసులు వచ్చేలోపు పరార్
లక్నో: ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసులు మృగాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారి ఊహా చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలికపై దారుణానికి ఒడిగట్టిన వారిలో ఓ వ్యక్తి అమ్రోహాలోని తన సొంత గ్రామ శివార్లలో చేతిలో మద్యం బాటిళ్లతో తిరుగుతుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపే నిందితుడు తప్పించుకున్నాడు. స్థానికులు నిందితుడిని దల్పత్గా గుర్తించారు. అతడు అమ్రోహాలోని గజ్రౌలా ప్రాంతం మహమూద్పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. దాంతో పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. గత ఆరు రోజులుగా పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం అమ్రోహాలోని గజ్రౌలా సమీపంలోని అటవి ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం స్థానికులు నిందితులను గుర్తించి పోలీసులకు తెలిపారు. కానీ వారు వచ్చేలోపే నిందితులు తప్పించుకున్నారు. (బాలికపై అత్యాచారం: నిందితుల ఊహా చిత్రాలు!) ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో పోయిన గురువారం ఆరేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీని గురించి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు శుక్రవారం ఉదయం పొలాల్లో ఒంటిపై తీవ్ర గాయాలతో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. అనంతరం ఆమెను మీరట్లోని ఆస్పత్రికి తరలించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్దారించారు. బాలిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. నాటి భయానక సంఘటన నుంచి చిన్నారికి ఇంకా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. -
కోవిడ్ ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ
రాజానగరం (తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ కోవిడ్ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ సోకిన రిమాండ్ ఖైదీ ఒకరు పరారయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు చర్చిపేటకు చెందిన తురుగోపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య అలియాస్ సత్తిబాబు అలియాస్ మురళి (40) గృహహింస, హత్యా యత్నం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడికి కరోనా వైరస్ సోకడంతో గతనెల 30న జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న అతను శనివారం అర్ధరాత్రి బెడ్పై వేసిన దుప్పటితో పాటు తాను కప్పుకునే మరో దుప్పటిని తాడుగా ఉపయోగించుకుని ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్న కిటికీల నుంచి కిందికి దిగి పరారయ్యాడు. దీనిపై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సిరిపురం నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రాజానగరం సీఐ ఎంవీ సుభాష్ చెప్పారు. -
కరోనా ఉందంటూ నాటకమాడి ఖైదీ పరారీ
సాక్షి, చెన్నై : కరోనా వైరస్ లక్షణాలను ఒక ఖైదీ తనకు అనుకూలంగా మలచుకున్నాడు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా శ్రీవైంకుఠంకు చెందిన మాయండి అనేక దోపిడీ, చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతడి కోసం పోలీసులు గాలిస్తూ వస్తున్నారు. అయితే గత వారం ఆళ్వార్ తిరునగర్లో జరిగిన ఓ దోపిడీ కేసులో మాయాండిని ఎట్టకేలకు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకుడి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచానంతనరం తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలోని కేంద్రకారాగారానికి సాయంత్రం తరలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వాహనంలో ఎక్కించుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో మాయాండి కరోనా వైరస్ లక్షణాలున్నట్లుగా ప్రవర్తించాడు. మార్గం మధ్యలో అదే పనిగా దగ్గడం, తుమ్మడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. తనకు జ్వరం, జలుబు దగ్గు ఉందని పేర్కొంటూ ఇది కరోనా ప్రభావం ఏమో అని పేర్కొన్నాడు. దీంతో భద్రతా సిబ్బంది హడలెత్తారు. రాత్రి ఏడు గంటల సమయంలో అతడ్ని పాళయం కోట్టై మార్గంలో ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎందుకైనా మంచిదనుకున్న పోలీసులు అతడికి కాస్త దూరంగానే ఉన్నారు. దీనిని పరిగణించి మాయాండి వైద్యుల వద్ద మరుగుదొడ్డికి వెళ్తున్నట్టు చెప్పి జారుకున్నాడు.(కరోనా : 40 రోజుల బతుకు లాక్డౌన్) పరారీలో ఉన్న ఖైదీ కోసం ఆరా తీస్తున్న పోలీసులు ఈ మాయగాడి కోసం తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లా పోలీసులు వేట మొదలెట్టారు. దీంతో పోలీసులు తూత్తుకుడి, తిరునల్వేలి పరిసరాల్లో ఉన్న 25 చెక్ పోస్టులలో గాలింపు చేపట్టారు. విషయాన్ని ముందే ఊహించిన మాయాండి వేందనాకులం నదిలో ఈదుకుంటూ ఉడాయించడం గమనార్హం. మాయండి బంధువు ఒకరు సమాచారం అందించడంతో ఫైబర్ పడవల్ని రంగంలోకి దించి నదిలో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 'మాయాండి ..వాంటెడ్' అంటూ వాట్సాప్ గ్రూపుల్లో అతడి ఫోటోల్ని షేర్ చేశారు. అలాగే, అతడికి భద్రత నిమిత్తం వచ్చి నలుగురు పోలీసులకు ముందస్తుగా పాళయం కోట్టై కరోనా కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. పోలీసునే చితక్కొట్టాడు.. లాక్ డౌన్వేళ పోలీసులు లాఠీలకు పని పెట్టిన సంఘటనలు అనేకం. అయితే, మాస్క్ ధరించ లేదని తనను ప్రశ్నించడాన్న ఆగ్రహంతో ఓ టీ వ్యాపారి పోలీసును చితక్కొట్టాడు. తంజావూరు జిల్లా తిరునంతాల్ గ్రామంలో సైకిల్ మీద ఓ వ్యాపారి టీ విక్రయిస్తూ వచ్చాడు. లాక్ డౌన్ వేళ ఎవరు బయటకు రాకూడదన్న నిబంధనలు ఉన్నా అది లెక్కచేయకుండా ఆ వ్యాపారి రోడ్డుమీదకు వచ్చాడు. అయితే భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆ వ్యాపారి పోలీసు మీద తిరగబడి చేతిలోని లాఠీ లాక్కుని చితక్కొట్టేశాడు. లాఠీ దెబ్బల నుంచి తప్పించుకునేందుకు కానిస్టేబుల్ యత్నించాడు. చివరకు జనం అడ్డుకోవడంతో వ్యాపారి ఉడాయించాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. -
మహిళ అనుమానాస్పద మృతి: పరారీలో భర్త
మొయినాబాద్(చేవెళ్ల): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎత్బార్పల్లిలోసోమవారం ఉదయం జరిగింది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. ఏపీ గుంటూరు జిల్లా పత్తిపాడు గ్రామానికి చెందిన కుంచాల శ్రీను, కోటేశ్వరమ్మ(38) దంపతులు రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లికి వచ్చారు. స్థానికంగా అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం తెల్లవారినా కోటేశ్వరమ్మ నిద్రలేవకపోవడంతోఅక్కడే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమె సోదరి రమణమ్మ ఇంటి వద్దకు వెళ్లి చూసింది. బయటి నుంచి గడియ ఉండటంతోతీసి తలుపులు తెరిచి చూసింది. పడుకొని ఉన్న కోటేశ్వరమ్మను ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆమె చుట్టుపక్కల వారిని పిలిచింది. ఆమెను పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పడుకున్న చోటనే కోటేశ్వరమ్మ మృతి చెంది ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అనుమానంతో హత్య? వివరాలు సేకరిస్తున్న పోలీసు కోటేశ్వరమ్మను ఆమె భర్త శ్రీను హత్యచేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీను భార్యపై అనుమానంతో నిత్యం గొడవపడేవాడని.. ఆదివారం రాత్రి కూడా ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి దిండుతో గొంతు నుమిలి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి శ్రీను పరారీలో ఉండటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈమేరకు పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. -
కాంగ్రెస్ నేత పొన్నాలకు తప్పిన ప్రమాదం
-
పొన్నాల కారును ఢీకొట్టిన షూటింగ్ వాహనం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 1/45 చౌరస్తాలో సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే కారులో నుంచి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్లోకి వెళ్లిన సమయంలోనే ఈ ఉదంతం చోటు చేసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. పొన్నాల తన మనవడితో కలిసి కారులో జూబ్లీహిల్స్ రోడ్నెంబర్–1 వైపు షాప్కు వచ్చాడు. కారు పక్కన ఆపి లోపలికి వెళ్లాడు. అదే సమయంలో సినిమా షూటింగ్ వాహనం రివర్స్ తీసుకునే క్రమంలో చూసుకోకుండా పొన్నాల కారు ముందు భాగాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘ప్రేమ’కు పెళ్లి శాపమైంది
హన్మకొండ చౌరస్తా: ప్రేమ పెళ్లి ఓ యువకుడికి శాపమైంది. కట్టుబాట్లను కాదని వివాహం చేసుకున్న ఆ జంటను ఇరువైపుల కుటుంబాలు బహిష్కరించాయి. గర్భవతైన ఆ ఇల్లాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా పాపకు జన్మనిచ్చిన అనంతరం రక్తస్రావంతో మృతి చెందింది. అయితే జేబులో చిల్లిగవ్వ లేని ఆ భర్త, భార్య మృతదేహాన్ని తీసుకెళ్లలేని స్థితిలో సాయంకోసం 16 గంటలపాటు ఎదురుచూపులు చూశాడు. ఈ ఘటన ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి లో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపురం గ్రామానికి చెందిన మామిండ్ల ప్రేమ్కుమార్, మందమర్రికి చెందిన ప్రవళిక (21) ప్రేమించుకున్నారు. ప్రవళిక ప్రేమ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేశారు. కూతురు పుట్టిన తర్వాతా ప్రేమ్కుమార్, ప్రవళికల మధ్య ప్రేమ చావలేదు. దీంతో భర్తను వదిలేసిన ప్రవళిక ప్రేమ్ వద్దకు చేరగా ఇద్దరూ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారు మంచిర్యాల జిల్లా కేంద్రం గాంధీనగర్కాలనీలో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ప్రేమ్కుమార్ ట్రాక్టర్ నడుపుతూ భార్యను పోషించుకుంటున్నాడు. శనివారం ప్రసవ తేదీ కావడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు జీఎంహెచ్కు తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయడానికి రక్తం అవసరమని చెప్పడంతో ప్రేమ్ వరంగల్లోని ఎంజీఎం బ్లడ్బ్యాంకు వెళ్లి ఒక బాటిల్ తీసుకొచ్చాడు. ఒక బాటిల్ సరిపోదని మరోటి తేవాలని వైద్యులు చెప్పడంతో మరోసారి నగరంలోని బ్లడ్బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎక్కడా రక్తం దొరక్కపోవడంతో ఆందోళనతో తిరిగి ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే ఆపరేషన్ ముగించిన వైద్యులు పాపకు జన్మనిచ్చిన ప్రవళిక సీరియస్గా ఉండడంతో అబ్జర్వేషన్లో ఉంచినట్లు చెప్పారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఆమె మృతి చెం దిందని సిబ్బంది ప్రేమ్కు తెలిపారు. జేబులో చిల్లిగవ్వ లేక, సాయంకోసం భార్య తల్లిదండ్రులతోపాటు తన కుటుంబానికి తెలియజేస్తే వారి నుంచి స్పందన రాలేదు. ప్రేమ్కుమార్కు ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది రూ.5 వేలు అందజేయగా ఆదివారం ప్రవళిక మృతదేహంతో ప్రేమ్ బయటకు వచ్చాడు. -
ఇంకా పరారీలోనే టీడీపీ నేత చింతమనేని
-
ఇంకా అజ్ఞాతంలోనే కూన రవికుమార్
-
పరారీలో మాజీ విప్ చింతమనేని ప్రభాకర్
-
పరారీలో కూన రవికుమార్
-
చెల్లెలి భర్తతో మహిళ పరారీ
కర్ణాటక, హొసూరు: నలుగురు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ చెల్లెలి భర్తతో పరారైన సంఘటన నాగరసంబట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. తట్రహళ్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గోవిందరాజ్, అతని భార్య రమ్య(28) దంపతులకు హేమవర్షిణి(8), అంబికా(6), కోకిల(4), దినేష్(2) అనే పిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితం రమ్య తన నలుగురు పిల్లలతో సహా అదృశ్యమైంది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు రమ్య చెల్లెలి భర్త కార్తీక్తో పరారైనట్లు తెలిసింది. ఈ సంఘటనపై నాగరసంబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అరరే ! ప్లాన్ బెడిసి కొట్టిందే..
బయ్యారం : హాస్టల్ నుంచి తప్పించుకోవటమే గాకుండా తన మాటలతో పలువురిని బురిడి కొట్టిద్దామనుకున్న ఓ విద్యార్థిని చివరకు తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకుల చెంతకు చేరింది. ఈ ఘటన శనివారం బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఏకలవ్య రెసిడెన్షీయల్ పాఠశాలలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంకు చెందిన మానపాటి మల్లయ్య తన కుమార్తె భానును ఐదవతరగతిలో ఇటీవల జాయిన్ చేశారు. అయితే తల్లిదండ్రులను వదిలి పాఠశాలలో ఉండేందుకు ఇబ్బంది పడిన భాను ఉదయం పాఠశాల గేటు నుంచి టీచర్ల కండ్లుగప్పి బయటకు వచ్చి పరుగున గాంధీసెంటర్కు చేరుకుంది. ఇంతలో అటు వైపు నుంచి బస్టాండ్ సెంటర్కు వెళ్తున్న ఆటోను ఆపిన భాను అబ్బాయిపాలెం వెళ్లాలని డ్రైవర్కు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ బస్టాండ్ సెంటర్లో ఆటో నుంచి దింపాడు. తనను శుక్రవారం నలుగురు వ్యక్తులు కారులో బయ్యారం తీసుకొచ్చారని, తాను వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు బురిడి కొట్టించడానికి ప్రయత్నించింది. దీంతో ఆ బాలిక చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన స్థానిక ఆటోడ్రైవర్లు బాలికను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీస్స్టేషన్లో బాలికకు ఎస్సై మురళీధర్ కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడుగగా తాను పాఠశాలలో ఉండేందుకు ఇష్టం లేక ఇంటికి వెళ్లేందుకు వచ్చానని అసలు విషయం తెలిపింది. దీంతో ఎస్సై బాలిక తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. మొత్తానికి సినీ ఫక్కిలో చిన్నారి చెప్పిన కథ స్థానికులను ఆందోళనకు గురిచేసినా ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. -
నమ్మించాడు.. ఉడాయించాడు!
సాక్షి, సత్యనారాయణపురం (విజయవాడ): నమ్మి ఐదు లక్షల విలువైన సరుకు పంపిస్తే గుట్టుచప్పుడు కాకుండా దుకాణం మూసివేసి యజమాని పరారైన సంఘటన సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ముత్యాలంపాడు అల్లూరి సీతారామరాజు వీధికి చెందిన గోపరాజు వెంకట శంకర్ కేసరీ పుడ్ ఫీడ్స్ పేరిట మొక్కజొన్నలు, వంట నూనెలు విక్రయిస్తుం టాడు. ఆయనకు 2016లో రాకేశ్రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో రాకేశ్కు గాయత్రినగర్ ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఉన్న రక్షా ఇన్ఫ్యాక్ట్స్ దుకాణానికి సరుకును పంపించమన్నాడు. ఆదిలో వ్యాపార లావాదేవీలు సక్రమంగానే సాగినా తర్వాతి కాలంలో 5 లక్షల విలువైన సరుకు పంపించగా అందుకు సంబందించిన ఆర్థిక పరమైన లావాదేవీలు నిలిచిపోయాయి. ఈమేరకు డబ్బును వెంకట శంకర్ అడుగుతుండగా రాకేశ్రెడ్డి వాయిదా వేస్తూ వ చ్చాడు. ఈక్రమంలో వెంకట శంకర్కు పలువురు దుకాణం నడవడం లేదని, రాకేశ్ కని పించడం లేదని చెప్పడంతో పరిశీలించి చూడగా దుకాణం మూసివేసి పరారయ్యాడని గమనించాడు. దీంతో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!
సాక్షి, మధురానగర్ (విజయవాడ): బాలికను వృద్ధుడు వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించిన ఘటన నున్న రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజీవ్నగర్కు చెందిన జాన్ బాబు(74) అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు జాన్బాబును హెచ్చరించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పురాక పోగా బాలిక స్కూలుకు వెళ్లే సమయంలో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. దీంతో బాలిక తల్లి మంగళవారం నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
గురుకులం విద్యార్థిని పరార్
సాక్షి, ధర్మపురి: మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి అర్ధరాత్రి ఓ విద్యార్థిని పరారైన సంఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురి మండలం మగ్గిడిలోని మైనార్టీ గురుకుల పాఠశాలను ఇటీవల ధర్మపురి పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ స్తంభంకాడి మోహన్ పర్యవేక్షణలో సుమారు 260కి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ధర్మపురికి చెందిన అశ్వియా సోహాన్ అనే 7వ తరగతి విద్యార్థిని పాఠశాల వెనుక గేట్ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. రాత్రిపూట కూతురు ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. జరిగిన సంఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు హాసియా, అలీపాషాతో పాటు మాజీ వైస్ ఎంపీపీ అయ్యోరి రాజేశ్, ముస్లీం నాయకులు ప్రిన్సిపాల్ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఒంటరిగా పాఠశాల నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించకపోవడం ఏంటని సిబ్బంది తీరుపై ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. ఇటీవల ఇక్కడ చదివే ఇద్దరు విద్యార్థినులు ఇదే విధంగా పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్లగా ఆ విషయాన్ని కప్పిపుచ్చారంటూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామని ప్రిన్సిపాల్ చెప్పడంతో శాంతించారు. -
‘అజ్ఞాతవాసి’ అరెస్టు!
సాక్షి, సిటీబ్యూరో: అందినకాడికి అప్పులు చేసి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతూ పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఓ ఘరానా మోసగాడిని మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై నగరంలోని రెండు కమిషనరేట్లలో 20 కేసులు ఉండగా... ఐదు కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడని, మరో ఏడు నాన్–బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయని డీసీపీ పి.రాధాకిషన్రావు సోమవారం వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన జి.మధుసూదన్రావు వృత్తిరీత్యా వ్యాపారి. బతుకుతెరువు నిమిత్తం 1984లో హైదరాబాద్కు వలస వచ్చాడు. 1994లో అబిడ్స్ ప్రాంతంలో షార్ప్ సెక్యూరిటీ సర్వీసెస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్లు నడిచిన ఇది ఆపై మూతపడింది. ఆపై పారామౌంట్ సర్వైలెన్సెస్ పేరుతో మరో సంస్థను తెరిచాడు. వివిధ సంస్థలకు మానవ వనరులను అందించే వ్యాపారం నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే అనేక మందికి చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి భారీగా అప్పులు తీసుకున్నాడు. రూ.5 కోట్ల వరకు చేరిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు ఇతడి చెక్కులను బ్యాంకుల్లో వేసుకోగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో ఇతడిపై హైదరాబాద్, రాచకొండల్లోని వివిధ ఠాణాల్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఇప్పటి వరకు మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో అరెస్టు అయిన మధుసూదన్రావు బెయిల్పై వచ్చి కోర్టు వాయిదాలకు హాజరుకావట్లేదు. ఈ నేపథ్యంలో ఇతడిపై ఏడు నాన్–బెయిలబుల్ వారెంట్లు, ఐదు బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో పాటు మరో ఐదు కేసుల్లో వాంటెడ్గా ఉన్నాడు. దాదాపు ఏడాది కాలంగా పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మధుసూదన్రావు ఎవరికీ దొరకట్లేదు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఏర్పాటైన బృందం ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు సోమవారం పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించింది. -
చేజారిన కార్ల దొంగ!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కార్లను లీజు పేరిట తీసుకున్న ఒక ఘరానా దొంగ వాటిని తాకట్టు పెట్టేశాడు. దీంతో బాధితులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కార్ల కేసులకు సంబంధించి ఇప్పటికే ఎంవీపీ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసుని కూడా టేకప్ చేసింది. కానీ నిందితుడిని రెండుసార్లు విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఫలితంగా సదరు నిందితుడు కొద్దిరోజులుగా పరారీలో ఉంటూ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఏం చేయాలో తోచని అయోమయ దుస్థితి నెలకొంది. వివరాలిలా వున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన అడపా ప్రసాద్ (28) ఆరిలోవ టీఐసీ పాయింట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను సెవెన్హిల్స్ ఆస్పత్రి దరి రాక్డేల్ లే అవుట్ ప్రాంతంలో 369 కేబ్స్ పేరిట ట్రావెల్స్ నడుపుతున్నాడు. కొందరు కార్ల యజమానులు, ట్రావెల్స్ నుంచి 200 వరకు కార్లు లీజుకి తీసుకున్నాడు. మొదట్లో ఐదు నెలల వరకు లీజు మొత్తం చెల్లించాడు. తరువాత అద్దె చెల్లించకపోవడంతో బాధితులు ఎంవీపీ, త్రీటౌన్, ఆరిలోవ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లలో గత ఏడాది డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. కొంప ముంచిన అరెస్టులో జాప్యం నిందితుడిని రెండుసార్లు విచారణకు పిలిపించిన ఎంవీపీ సిట్ పోలీసులు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. మద్దిలపాలెం భానునగర్కి చెందిన బల్లా గౌరి, శ్రీహరిపురం ప్రాంతాలకు చెందిన ఎస్.సునీల్కుమార్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు ప్రసాద్ని విచారించిన ఎంవీపీ పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా నిందితుడు పరారీలో ఉన్నాడు. పైగా అతని మొబైల్ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎంవీపీ సిట్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎంఆర్పేట ఎస్ఐ గణపతి, ఎంవీపీ ఎస్ఐ సూర్యనారాయణ సిట్ కింద ఈ కార్ల కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు ఈ సందర్భంగా ఎంవీపీ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితుడు అడపా ప్రసాద్ కోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన కార్ల కోసం గాలిస్తున్నామన్నారు. గతంలో సిట్ పోలీసులు ఒడిశాకి చెందిన ఒక కార్ల దొంగను అరెస్టు చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసిందే. ఇతను కూడా యజమానుల నుంచి తీసుకున్న కార్లను అనపర్తి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఫైనాన్సియర్లకు తాకట్టు పెట్టేశాడు. ట్రావెల్స్ యజమానులు కార్లు అద్దె లేదా లీజుకి ఇచ్చేముందు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అద్దెలు చెల్లించలేక తాకట్టు కార్లు లీజుకి తీసుకున్న అడపా ప్రసాద్ బేరాలు లేని కారణంగా కొన్నాళ్లుగా అద్దెలు చెల్లించలేకపోయాడు. అయితే నిబంధనల ప్రకారం కార్ల యజమానులకు అద్దె విధిగా చెల్లించాల్సి ఉంది. పలువురు కార్ల యజమానులు డబ్బు కోసం ప్రసాద్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రసాద్ ఈ కార్లను తన స్నేహితులు శ్రీనివాస్, సుదర్శన్ ద్వారా అనకాపల్లి, అనపర్తి, రాజమండ్రి, కాకినాడ, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన ఫైనాన్సియర్లకు తాకట్టు పెట్టేశాడు. కార్ల ఖరీదు ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.7లక్షల వరకు తాకట్టు పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సిట్ పోలీసులు ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేశారు. -
పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: పోలీసుల నుంచి తప్పించుకోబోయి పరుగెత్తి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం కోడి పందేలు నిర్వహించారు. స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరం దగ్గరకు వెళ్తుండగా.. పందేలకు పాల్పడుతున్నవారు గమనించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తారు. వారిలో ఎర్రగుంట కే కాలనీకి చెందిన మళ్లా వెంకటేశ్వర్లు(55) కూడా ఉన్నాడు. ఆయన పరిగెడుతూ గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలో కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీరాముల శ్రీనును వివరణ కోరగా.. అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. -
రిమాండ్ ఖైదీ పరారీ
నెల్లూరు(క్రైమ్): రైల్వే పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన బుధవారం అర్ధరాత్రి నెల్లూరులో జరిగింది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేట మండలం సనత్నగర్కు చెందిన రంగా అలియాస్ ఎలాంగో అలియాస్ రవి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల రేణిగుంట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి నెల్లూరు రైల్వే కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి నిందితుడు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ అనుభవిస్తున్నారు. నిందితుడిపై తమిళనాడు రాష్ట్రం జోలార్పేటై రైల్వేపోలీసుస్టేషన్ పరిధిలో కేసులు ఉన్నాయి. నిందితుడిని తిరువత్తూరు జేఎఫ్సీఎం(111) కోర్టులో హాజరు పరిచేందుకు జోలార్పేటై రైల్వే సీఐ ఎస్.శివాహమిరమి తన సిబ్బందితో కలిసి బుధవారం నెల్లూరుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్పై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బంగారు వ్యాపారిని తరలించే యత్నం.. అడ్డుకున్న సహచర వ్యాపారులు రంగాను రైల్వేపోలీసులు ఓ దొంగతనం కేసుకు సంబంధించి విచారించగా చిన్నబజారులోని ఓ బంగారు దుకాణంలో చోరీ సొత్తును విక్రయించాడని వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితుడిని వెంట బెట్టుకుని సదరు బంగారు దుకాణం వద్దకు వెళ్లి దుకాణ యజమానిని విచారించారు. అతను తన వద్ద అమ్మలేదని చెప్పడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా సహచర వ్యాపారులు పోలీసులను అడ్డుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న సంతపేట ఎస్సై సుభాన్ ఘటన స్థలానికి చేరుకుని రైల్వేపోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరూ కలిసి సంతపేట పోలీసుస్టేషన్కు వెళ్లారు. అక్కడ నిందితుడు చెప్పిన వివరాల మేరకే వ్యాపారిని అదుపులోకి తీసుకుంటున్నామని తమిళనాడు పోలీసులు సంతపేట పోలీసులకు తెలిపారు. అయితే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపకపోవడంతో అవి తీసుకు వచ్చి వ్యాపారిని తీసుకెళ్లాలని పోలీసులు చెప్పడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. ప్యాసింజర్లో తరలిస్తుండగా కళ్లుగప్పి బుధవారం రాత్రి నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి కాకినాడ తిరుపతి ప్యాసింజర్లో తిరుపతికి బయలుదేరారు. రైలు సిగ్నల్ కోసం కొమ్మరపూడి సమీపంలో ఆగగా నిందితుడు మరుగుదొడ్డికి వెళ్లాలని చెప్పడంతో వారు అతన్ని బాత్రూమ్వద్దకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుడు వారిని తోసేసి రైల్లోంచి దూకి పరారయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో కంగుతిన్న రైల్వే సిబ్బంది, సీఐ హుటావుటిన రైల్లో నుంచి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటంతో అప్పటికే నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ మేరకు సీఐ నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్డీ సిరాజుద్దీన్ కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బదిరుల హాస్ట్ల నుంచి విద్యార్థుల పరారీ
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబరపేట బదిరుల ఆదర్శ పాఠశాల హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పరారీ అయ్యారు. వివరాలు.. చిన్నారులు మహేష్, లోకేశ్, యశ్వంత్ బదిరుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో హాస్టల్లో తమను వేధిస్తున్నారంటూ వీరు ముగ్గురు ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చారు. వీరిలో మహేష్, లోకేశ్ ఇద్దరు కలిసి ఔటర్ రింగ్ రోడ్ వెంట నడచుకుంటూ వెళ్తుండగా చూసిన స్థానికులు వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెవిటివారైన ఆ పిల్లలు తమ సైగలతో హాస్ట్ల్లో తమను వేధిస్తున్నారని.. అందుకే ఇలా బయటకు వచ్చామని వారికి తెలిపారు. దాంతో స్థానికలు వీరిని కోహెడ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మరో విద్యార్థి యశ్వంత్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ లోపు పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారయ్యరంటూ మెట్టూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
క్షణం ఆలస్యమైతే...అంతే..
సాక్షి, చెన్నై: ఉరుకుల పరుగుల పయనంలో కన్నుమూసి తెరిచేలోపే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న కాలంలో బతుకుతున్నాం.. కానీ ఒక్కక్షణం ఆ ప్రమాదం నుంచి బయటపడితే.. పునర్జన్మ లభిస్తే.. నిజంగా జీవితం విలువ ఏమిటో తెలిసి వస్తుంది. చెన్నైలోని ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. క్షణాల్లో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు ప్రయాణికుడిని మృత్యుముఖం నుంచి బయటపడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కదులుతున్నరైలును అందుకునేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. అంతే ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్పీఎఫ్ ఉద్యోగి ఒకరు మెరుపువేగంతో కదిలి ఆ ప్రయాణికుడిని రక్షించారు. దీంతో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఏ మాత్రం ఆలస్యమైనా ప్లాట్ఫాంకు, రైలుకు మధ్య పడి ప్రాణాలు పోవడం ఖాయం. జస్ట్ వాచ్ ది వీడియో.. అండ్ బీ ఎలర్ట్ #WATCH: Railway Protection Force (RPF) personnel saved a passenger's life by rescuing him from falling, while he was boarding a train at Egmore Railway Station's platform. The passenger didn't suffer any injury. #TamilNadu (12.11.18) pic.twitter.com/OdNDYMdu2y — ANI (@ANI) November 14, 2018 -
ముహూర్త సమయానికి వధువు పరార్
అన్నానగర్: ఆత్తూర్లో సోమవారం వివాహము హూర్త సమయానికి పెళ్లికూతురు పరారైంది. దీంతో వరుడికి మరో యువతితో వివాహం జరిగింది. సేలం జిల్లా ఆత్తూర్ ముల్లైవాడికి చెందిన యువకుడు సుంగచావడిలో పనిచేస్తున్నాడు. ఇతనికి, పెత్తనాయక్కన్ పాళయం చిన్నమ్మ సముద్రంకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. యువతి ఎమ్ఎస్సీ చదువుతోంది. ఆత్తూర్లో ఓ ఆలయంలో సోమవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి, రిసెప్షన్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం వేకువజామున వధువు తరఫు వారు వివాహ మండపానికి వచ్చారు. ఆ సమయంలో వధువు కనిపించలేదు. దీనిపై ఆత్తూర్ పోలీసు స్టేషన్కి సమాచారం అందించారు. తరువాత వాళప్పాడి ప్రాంతానికి చెందిన బంధువు కుమార్తెతో వరుడికి వివాహం జరిపించేందుకు పెద్దలు చర్చలు జరిపారు. అనంతరం యువతిని అలంకరించి వివాహం జరిపించారు. ఆత్తూర్ పోలీసుల విచారణలో, వివాహం నిశ్చయమైన యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి అతనితో వెళ్లినట్టు తెలిసింది. -
హరియాణా గ్యాంగ్రేప్పై ‘సిట్’
చండీగఢ్/న్యూఢిల్లీ: హరియాణాలో సీబీఎస్ఈ టాపర్గా నిలిచిన యువతి(19)పై సామూహిక అత్యాచారం చేసినవారిలో ఓ ఆర్మీ జవాను కూడా ఉన్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ బీఎస్ సంధూ తెలిపారు. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డ దుండగులు ఇంకా పరారీలోనే ఉన్నారని వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నూహ్ ఎస్పీ నజ్నీన్ భాసిన్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశామన్నారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆర్మీ జవాన్ పంకజ్ను అరెస్ట్ చేసేందుకు ఓ బృందాన్ని రాజస్తాన్లోని కోటకు పంపామని సంధూ పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామనీ, పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ తెలియజేస్తే రూ.లక్ష నజరానాగా అందజేస్తామని ప్రకటించారు. వైద్య పరీక్షల్లో యువతిపై లైంగికదాడి జరిగినట్లు తేలిందన్నారు. కాగా, జవాన్ పంకజ్ విషయంలో పోలీసులకు సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ).. వీలైనంత త్వరగా దీనిపై నివేదికను సమర్పించాలని హరియాణా డీజీపీ సంధూను ఆదేశించింది. కనియా జిల్లాలో కోచింగ్ క్లాస్కు వెళ్లి తిరిగివస్తున్న ఓ యువతిని బుధవారం ముగ్గురు యువకులు కిడ్నాప్చేసి గ్యాంగ్రేప్ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరో 9 మంది బాధితురాలిపై లైంగికదాడికి దిగారు. ఆమె స్పృహ కోల్పోవడంతో బస్టాండ్లో పడేసి వెళ్లిపోయారు. -
కథ అల్లి.. ప్రియుడితో వెళ్లి..!
విజయవాడ ,నూజివీడు : ట్రిపుల్ ఐటీకి వచ్చేందుకు బయలుదేరి నూజివీడు వరకు వచ్చి, కట్టుకథ అల్లి ఆ తర్వాత ప్రియుడితో కలిసి చెన్నై వరకు ఓ విద్యార్థిని వెళ్లిన ఘటన ట్రిపుల్ ఐటీలో సంచలనం కలిగించింది. తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (17) జూలై 29న ఇంటి నుంచి సోదరుడితో కలిసి నూజివీడుకు సాయంత్రం 4 గంటలకు వచ్చింది. నూజివీడు బస్టాండులో దిగాక సోదరుడిని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆ తర్వాత నాన్స్టాప్ బస్సులో విజయవాడకు చేరుకుని రైల్వే స్టేషన్కు వెళ్లింది. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి చెన్నై వరకు వెళ్లి అక్కడ రైల్వే పోలీసులకు చిక్కింది. దీంతో తమ బాబాయి ఇక్కడ ఉన్నాడంటూ చెప్పడంతో ఆయనకు అప్పగించారు. అయితే ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే తాను ఆటోలో ఎక్కానని, పక్కన కూర్చున్న వ్యక్తి ఏదో గుచ్చినట్లుగా ఉందని, అనంతరం ఏం జరిగిందో తెలియదని, తెలివి వచ్చేసరికి చూస్తే చెన్నై స్టేషన్లో ఉన్నానంటూ నమ్మశక్యం కాని కథను వినిపిస్తోంది. సోదరుడు నూజివీడు బస్టాండు వరకు రాగా, అక్కడి నుంచి ఎందుకు వెనక్కు వెళ్లిపొమ్మందో అడిగితే సమాధానం లేదు. నూజివీడు నుంచి చెన్నై వరకు బాలిక నిద్రమత్తులోనే ఉంటే రైల్వే స్టేషన్లోకి ఆగంతకులు ఎలా తీసుకెళ్లారు.. నిజంగా ఎవరైనా మత్తు ఇచ్చినా నూజివీడు చుట్టుపక్కల అన్ని తోటలు, అటవీ ప్రాంతం కాబట్టి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారే గాని చెన్నై వరకు ఎందుకు తీసుకెళ్తారనే విషయం అంతుబట్టడం లేదు. అక్కడ వరకు వెళ్తే తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, వారు ఏమయ్యారు అనేది ప్రశ్నార్ధకం. బస్టాండు వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే కట్టు కథ అవునా, కాదా అనే విషయం వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు బాలికను కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి రమ్మని మంగళవారం పంపించి వేసినట్లు సమాచారం. -
పెళ్లి మండపం నుంచి వధువు ఎస్కేప్
మైసూరు: మరికొద్ది క్షణాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు ప్రేమించిన వ్యక్తితో పారిపోగా వరుడు అదే మండపంలో మరొక యువతి మెడలో తాళికట్టిన ఘటన ఆదివారం జిల్లాలోని నంజనగూడు పట్టణంలో చోటు చేసుకుంది. తాలూకాలోని మార్బళ్లి గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తికి హెచ్డీ కోటె తాలూకాలోని హోసహళ్లి గ్రామానికి చెందిన యువతితో ఆరు నెలల క్రితం నిశ్చితార్థమైంది. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని శ్రీకంఠేశ్వర కళ్యాణ మండపంలో నందిని, నారాయణల వివాహం జరగాల్సి ఉంది. శనివారం రాత్రి వధూ, వరులతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధు మిత్రులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం శాస్త్రోక్త కార్యక్రమాలు పూర్తయిన అనంతరం వధువు నందిని అందరి కళ్లుకప్పి కళ్యాణ మంటపడం నుంచి ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. విషయం బయటకు రావడంతో తమ కుమారుడి వివాహం రద్దు చేయడం ఇష్టం లేని నారాయణ తల్లితండ్రులు వివాహానికి వచ్చిన బంధువుల యువతితో అదే ముహూర్తానికి వివాహం జరిపించారు. కూతురు చేసిన పనికి అవమాన భారంతో నందిని తల్లితండ్రులు కళ్యాణ మంటపంలో కన్నీటి పర్యంతమయ్యారు. -
మానవసహిత యాత్రలు!
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/ బెంగళూరు / హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష యాత్రల దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ముందడుగు వేసింది. అంతరిక్ష నౌకల్ని ప్రయోగించే సమయంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే అందులోని వ్యోమగాముల్ని కాపాడేందుకు ఉద్దేశించిన ‘క్రూ ఎస్కేప్ సిస్టమ్’ను గురువారం తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగం సందర్భంగా వాహకనౌకలో ఏదైనా సమస్య తలెత్తితే.. వెంటనే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అప్రమత్తమై వ్యోమగాములున్న మాడ్యూల్ను రాకెట్ నుంచి వేరుచేసి దూరంగా, సురక్షితంగా దిగేలా చేస్తుంది. ఈ వ్యవస్థ సామర్థ్యం, విశ్వసనీయతను పరిశీలించేందుకే తాజా ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి గురువారం ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. రాకెట్ 259 సెకన్లపాటు ఆకాశంలోకి దూసుకెళ్లిన అనంతరం క్రూ ఎస్కేప్ వ్యవస్థ వ్యోమగాములు కూర్చునే మాడ్యూల్ను వేరుచేసినట్లు పేర్కొంది. దాదాపు 12.6 టన్నుల బరువున్న ఈ మాడ్యూల్ ప్రత్యేకంగా అమర్చిన మోటార్ల సాయంతో 2.7 కి.మీ ఎత్తునుంచి వాహకనౌకకు దూరంగా, సురక్షితంగా బంగాళాఖాతంలో దిగిందని ఇస్రో తెలిపింది. దాదాపు 300 సెన్సార్ల సాయంతో ఈ ప్రయోగాన్ని నిశితంగా పరిశీలించినట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో దిగిన మాడ్యూల్ను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చినట్లు పేర్కొంది. ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి భూమిపైకి తిరిగిరాగల పునర్వినియోగ వాహకనౌకను ఇస్రో గతంలో పరీక్షించిన సంగతి తెలిసిందే. 2014లో జీఎల్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా 3 వ్యోమగాములు పట్టే డమ్మీ మాడ్యూల్ను సైతం ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. చాలా దూరంలో ఉన్నాం: కిరణ్కుమార్ మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు భారత్ ఇంకా చాలా పురోగమించాల్సి ఉందని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ వ్యాఖ్యానించారు. ‘మానవసహిత అంతరిక్ష యాత్రల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ ప్రయోగాలను క్రమపద్ధతిలో ఒకదానితర్వాత మరొకటి చేపట్టాల్సి ఉంటుంది. ఇందులోభాగంగా ప్రస్తుతం ఇస్రో చేపడుతున్నవన్నీ ప్రాథమికస్థాయి పరీక్షలే. మనకు అందుబాటులో పరిమిత వనరుల సాయంతోనే ఈ కీలక అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడుతున్నాం’ అని కిరణ్ కుమార్ తెలిపారు. కాగా, మానవసహిత యాత్రల్లో కావాల్సిన వాతావరణ నియంత్రణ, ప్రాణాధార, ఇతర సాంకేతిక వ్యవస్థలతో పాటు ప్రత్యేకమైన దుస్తుల తయారీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నట్లు బెంగళూరులోని ఇస్రో ఉన్నతాధికారులు వెల్లడించారు. మానవసహిత అంతరిక్ష యాత్రకు కేంద్రం ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. భారీ వ్యయం కారణంగానే ప్రభుత్వం మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని గతంలో కిరణ్కుమార్ అభిప్రాయపడ్డారు. -
ఎట్టకేలకు నాని దొరికిపోయాడు!
ఆదోని టౌన్: ఆదోని సబ్జైల్ నుంచి తప్పించుకున్న మహేష్ అలియాస్ నాని అనే ఖైదీని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మంగళవారం రాత్రి గుంటూరు–మంగళగిరి మధ్యలో అరెస్ట్ చేసి, ఆదోనికి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎమ్మిగనూరుకు చెందిన ఇతను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, చీటీల పేరిట పలువురిని మోసం చేశాడు. ఈ కేసుల్లో శిక్ష పడడంతో 2013 జూన్ 21న ఆదోని సబ్జైలుకు వచ్చాడు. జైలులోనే ఉంటూ తప్పించుకునేందుకు అనుచరగణం, పోలీస్, న్యాయవ్యవస్థలోని కొంతమందితో కలిసి పథకాన్ని రచించాడు. ఈ పథకం అమల్లో భాగంగా కొందరు వ్యక్తులు 2013 జూలై 17న తాము పోలీసులమని, మహేష్ను తీసుకెళ్లడానికి పీటీ వారెంట్తో వచ్చామని ఆదోని సబ్జైలు సిబ్బందిని నమ్మించారు. అది నకిలీ పీటీ వారెంట్ అని గుర్తించేలోపే అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి..వెంటనే ప్రత్యేక వాహనంలో సరిహద్దు దాటించారు. దీంతో ఈ విషయంపై జైలు సూపరింటెండెంట్ రత్నం ఆదోని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్, మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్ కోసం అప్పట్లో ప్రత్యేక బృందాలతో గాలించినా ఫలితంలేకపోయింది. మిగిలిన వారిని మాత్రం అరెస్టు చేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. జైలు నుంచి పరారైన తర్వాత మహేష్ తనను ఎవరూ గుర్తు పట్టకుండా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ మత గురువుగా మారి జనానికి చేరువైనట్లు సమాచారం. అయితే..ఇతను మారువేషంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు ఉప్పందింది. దీంతో డీఎస్పీ క్రైంపార్టీ ఏఎస్ఐ ఆనంద్, పోలీసులు శాంతరాజ్, క్రిష్ణ, రంగన్న మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అతన్ని ఆదోనికి తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
పరారీలో నటుడు
యశవంతపుర : మాస్తిగుడి నిర్మాత సుందర పి.గౌడను అరెస్టు చే యటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటం కం కలిగించిన విషయానికి సంబంధించి పరారీలో ఉన్న నటుడు దునియా విజయ్ అరెస్టు చేయటానికి పోలీసులు ప్రత్యేక బృం దాలను రంగంలోకి దించారు. మాస్తిగుడి సిని మాకు సంబంధించి నిర్మాతను మాత్రమే అరెస్టు చేయాటనికి వచ్చిన పోలీసులు ఇప్పుడు నటుడు దునియా విజయ్ను కూడా అరెస్టు చేయాలని గాలింపు ముమ్మరం చేశారు. అయితే నిర్మాత సుందర్ గౌడకు రామనగర జెఎంఎఫ్సీ కోర్టు షరుతులతో కూడిన జామీన్ మంజూరు చేసింది. పోలీసుల విధులకు అటం కం కలిగించిన నటుడు దునియా విజయ్కు కోర్టు అయనకు బెయిల్ను నిరాకరించింది. పోలీసులు కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి దునియా విజయ్ పరారీలో ఉన్నాడు. -
వేడి వేడి రసంలో నుంచి బయటపడ్డ చేప
-
వైరల్: ఆ చేపకు ఇంకా భూమ్మీద నూకలున్నాయి...
బీజింగ్ : కొన్ని సంఘటనలు చూస్తుంటే భూమ్మీద నూకలుంటే ఎవరేం చేయలేరంతే.. అనే సామెత నిజమనిపించక మానదు. చైనాలోని ఓ రెస్టారెంట్లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. రెస్టారెంట్లో వంట వండుతుండగా.. దాదాపు తినడానికి సిద్ధమైన వేడి వేడి రసంలో నుంచి ఓ క్రేఫిష్(ఎండ్రికాయను పోలిన చేప) బయటపడి తన ప్రాణాలను నిలుపుకుంది. మరుగుతున్న రసంలోంచి పాత్రపై భాగానికి చేరుకున్నక్రేఫిష్ అందులోంచి బయటపడ్డానికి తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు అది విజయం సాధించింది. అంత వేడిగా ఉన్న రసంలో నుంచి క్రెఫిష్ బయటపడటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన క్రేఫిష్ను రెస్టారెంట్ సిబ్బంది పట్టుకున్నారు. తిరిగి దానిని వండేందుకు సిద్దపడ్డారు. కానీ జూక్ అనే వ్యక్తి దానిని పెంచుకోవడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
పరారీలోనే వైస్చైర్పర్సన్ ఈశ్వరమ్మ
సూళ్లూరుపేట/సూళ్లూరుపేట రూరల్: క్యామెల్ కేసులో ప్రధాన నిందితురాలు, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ గరిక ఈశ్వరమ్మ ఇంకా పరారీలోనే ఉంది. కాగా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కథనాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన కీలక నిందితురాలిని అధికార పార్టీ నేత ఒత్తిడితో వదిలేయడంతో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా హోంగార్డ్ని బాధ్యురాలిని చేస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు గురించి ఎస్పీ ఆరాతీస్తున్నట్లు తెలిసింది. వెలుగుచూస్తున్న విషయాలు క్యామెల్ కో–ఆపరేటివ్ మహిళా సొసైటీకి ఈశ్వరమ్మ కేవలం కార్యదర్శిగా ఉంటూ అధ్యక్షురాళ్లుగా తనకు అనుకూలంగా ఉన్న నిరక్షరాస్యులను నియమించింది. బుజ్జమ్మ, చెంగమ్మ, జమీలా అనే వారిని రెండేసి సంవత్సరాలు అధ్యక్షురాళ్లుగా ఉంచి తర్వాత తీసివేసింది. ఈశ్వరమ్మ బ్యాంకులను మోసం చేసిన విషయాన్ని జమీలా అనే మహిళ కనిపెట్టి సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయింది. అనంతరం ఈ వ్యవహారాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లింది. తర్వాత ఈశ్వరమ్మ వనిత అనే మహిళను అధ్యక్షురాలిగా నియమించుకుని చెక్కుల మీద సంతకాలు చేయించుకుంటూ వచ్చి ఆమెను కేసులో ఇరికించింది. వనిత భర్త చెంగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగి మంచం పట్టాడు. ఈనెల 21వ తేదీ సోమవారం రాత్రి ఈశ్వరమ్మ భర్త ఈశ్వరయ్య ఫోన్ చేసి పరిస్థితి బాగాలేదు మీరు వెంటనే ఊరు వదిలి నాలుగురోజులు పాటు ఎక్కడైనా తలుదాచుకోమని సలహా ఇచ్చాడని చెంగయ్య చెబుతున్నాడు. ఎంతెంత తీసుకున్నారంటే.. క్యామెల్ మహిళా మ్యాక్స్ సంస్థ పేరుతో రూ.కోట్లు రుణాలుగా తీసుకుని దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు రుణాలుగా ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఈశ్వరమ్మ అనేక సమావేశాల్లో చెప్పారు. వీటికి నాబార్డ్, కో–ఆపరేటివ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధికారులు కూడా హాజరయ్యారు. క్యామెల్ సొసైటీని 2002 నుంచి నిర్వహిస్తున్నారు. సొసైటీ అభివృద్ధి పేరుతో 2012లో నాబార్డు నుంచి రూ.1.69 కోట్లు, వీపీఎన్ఆర్ఎం గ్రాంట్ రూ.8.76 లక్షలు, నాబార్డ్ అనుబంధ సంస్థ అగ్రి బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి 2012 జూన్లో రూ.95 లక్షలు, అక్టోబర్లో మరోమారు రూ.99.75 లక్షలు రుణాలుగా తీసుకున్నారు. మళ్లీ అదే ఫైనాన్స్ సంస్థ నుంచి డిసెంబర్ 2013లో రూ.కోటి, బిజినెస్ కరస్పాండెంట్ రుణంగా రూ.2.50 కోట్లు తీసుకున్నారు. 2013లోనే సూళ్లూరుపేట స్టేట్ బ్యాంక్ నుంచి సీసీ రుణంగా రూ.1.99 కోట్లు పొందారు. కాగా స్టేట్ బ్యాంక్ ఇండియా వారు ఈశ్వరమ్మకు పట్టణంలోని పరమేశ్వరినగర్లో ఉన్న రెండు ప్లాట్లను అటాచ్మెంట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. పోలీసుల తీరుపై అనుమానాలు ఆర్థికపరమైన కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఈశ్వరమ్మను పోలీసులు విచారణ పేరుతో తీసుకువచ్చిన వెంటనే టీడీపీ నాయకుడు పరసా వెంకటరత్నయ్య ఒక్క ఫోన్కాల్తో విడిచి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈశ్వరమ్మను వదిలిపెట్టడంతో ఆమె కుటుంబసభ్యులతో సహా ఇంటికి తాళాలు వేసుకుని పరారైంది. ఇదిలా ఉండగా 22వ తేదీ మంగళవారం రాత్రి ఈశ్వరమ్మకు ఓ పోలీసు అధికారి ఫోన్ చేసి అరెస్ట్ గురించి చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈశ్వరమ్మకు, ఆమె భర్తకు ఇంకా ముందే అరెస్ట్ గురించి తెలుసని, అందుకే వారు పక్కాప్లాన్తో పరారైనట్లు చెబుతున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు వారిపాలిట శాపంగా మారింది. సంస్థ అధ్యక్షురాలైన వనిత మాత్రం మూడురోజులుగా పోలీస్ కస్టడీలోనే ఉంది. రెండురోజులుగా సీఐ కిషోర్బాబు, ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి రెండు బృందాలుగా ఏర్పడి ఈశ్వరమ్మ కోసం గాలించినా ఎక్కడా దొరకలేదు. ఇప్పటికి కేసులో ఎటువంటి పురోగతి లేదు. కాగా ఈ కేసు వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. 22వ తేదీ రాత్రి ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకుచ్చారు. ఆ సమయంలో నిందితురాలు తనకు రుతుస్రావం మొదలైందని బుకాయించడం మొదలుపెట్టింది. దీంతో ఎస్సై ఈశ్వరమ్మను ఇంటికి తీసుకెళ్లి తిరిగి తీసుకురావాలని హోంగార్డు నాగూరమ్మకు చెప్పారు. అయితే హోంగార్డు ఈశ్వరమ్మతో వెళ్లకపోవడంతో ఆమె సులభంగా తప్పించుకు పారిపోయింది. తాజాగా హోంగార్డు నాగూరమ్మపై చర్యలు తీసుకున్నారు. ఆమెను సరెండర్ చేసి సమస్యను జిల్లా ఎస్పీ ముందుకు నెట్టేశారు. ఈశ్వరమ్మ బెంగళూరుకు పరారైందని అనుమానిస్తున్నారు. ఆమె కాల్ రికార్డును పరిశీలిస్తున్నారు. వనిత అమాయకురాలు రూ.కోట్లు మింగేసిన ఈశ్వరమ్మను పోలీసులు, రాజకీయ నాయకులు విడిచిపెట్టేసి వనితను మాత్రం పోలీసుల కస్టడీలో ఉంచుకోవడం దారుణం. నేను కూడా టీడీపీలో ఉన్నాను. పరసారత్నం కార్యకర్తలకు చిన్నపాటి సాయం చేయుడు. అయితే రూ.7 కోట్లు బ్యాంకుల సొమ్మను స్వాహా చేసిన మహిళను ఎలా విడిచిపెట్టమని చెప్తారు?. పరసారత్నం వెంటనే మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన ఈశ్వరమ్మను అప్పగించి అమాయకురాలైన వనితను విడిపించాలి. – రాజేశ్వరి, నిరుపేద మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు -
జువైనల్ హోం విద్యార్థుల పరారీ కేసు దర్యాప్తు వేగవంతం
-
జువైనల్ హోం నుండి 15 మంది బాలురు పరార్
-
పరారీలో 3 వేల కుటుంబాలు
టీ.నగర్: పిల్లల కిడ్నాపర్ అని వృద్ధురాలి హత్య కేసుకు భయపడి పోలూరు, పరిసర ప్రాంతాల్లో మూడు వేల కుటుంబాలు ఇళ్లను విడిచి పరారయ్యాయి. వీరంతా చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో బసచేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వాట్సాప్లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఉత్తర జిల్లాల నుంచి వచ్చిన ఈ సమాచారం ప్రజల్లో భీతి పుట్టించింది. ఈ క్రమంలో తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపం కిడ్నాప్ ముఠా భీతి కారణంగా రుక్మిణి అమ్మాళ్ అనే 65 ఏళ్ల వృద్ధురాలి హత్యా సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ విషయం తెలియగానే తిరువణ్ణామలై ఎస్పీ సంఘటన స్థలానికి నేరుగా వచ్చి విచారణ జరిపారు. రుక్ష్మిణి అమ్మాళ్పై దాడి దృశ్యాలు సామాజిక మా«ధ్యమాల్లో ప్రసారం కావడంతో సంచలనం ఏర్పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. పిల్లల కిడ్నాప్ భీతి కారణంగా కలియం, ఆత్తిమూరు గ్రామాల్లో ఉదయాన్నే కనిపించే కొబ్బరిబొండాల వ్యాపారులు కనిపించడం లేదు. ఈ ప్రాంతాల్లో పోలీసులు రహస్య పర్యవేక్షణ జరుపుతున్నారు. మానసిక రోగి హత్య కేసులో 15 మంది అరెస్టు: కిడ్నాపర్గా భావించి మానసిక రోగిని హత్య చేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పళవేర్కాడు ప్రాంతంలో పిల్లల కిడ్నాప్ ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి ఒక మానసిక రోగిని ప్రజలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
రూ.39.55 లక్షల స్వాహా..
వైరా : అతను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశాడు. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులతో నవ్వుతూ మాట్లాడి, మాటలతో మచ్చిక చేసుకుంటాడు. నమ్మకం కలిగేలా పరిచయాన్ని పెంచుకోవటంతో పాటు తోటి ఉద్యోగులకు కూడా టోకరా పెట్టి పరారీ అయ్యాడు. ఎట్టకేలకు వైరా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆ వివరాలను వైరా సీఐ నాయుడు మల్లయ్యస్వామి బుధవారం విలేకరులకు తెలిపారు. కల్లూరుకు చెందిన పిల్లి సతీష్కుమార్ వైరా డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూ బ్యాంకుకు వచ్చి పోయే ఖాతాదారులు, రైతులతో పరిచయాన్ని పెంచుకొని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదును బదిలీ చేస్తూ మొత్తం 34 మంది ఖాతాదారుల ఖాతాలను వాడుకొని ఎవరికీ అనుమానం రాకుండా డిపాజిట్, విత్డ్రా చేయటం, ఓచర్లలో ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.39,55,728 నగదును డ్రా చేసుకొని ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి ఊడాయించాడు. మరోవైపు బ్యాంకులో సహ ఉద్యోగుల ఐడీ, పాస్ వర్డ్లను వినియోగించి ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు. గతేడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ పిల్లి సతీష్కుమార్ గత ఏడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ నగదును వినియోగదారులు ఖాతాలకు జమచేయమని ఇవ్వటం, ఇచ్చిన నగదును ఖాతాల్లో జమచేసి వినియోగదారులకు తెలియకుండానే నగదును మాయం చేశాడు. సతీ ష్కుమార్ వద్ద నుంచి రూ.39,55,528 నగదును స్వాధీనం చేసుకొని, ఖమ్మం డీసీసీబీ సీఈఓ వి వసంతరావు ఫిర్యాదు మేరకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్డుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైన బ్యాంకు ఖాతా నంబరు, పిన్ నంబర్లు తెలియజేయవద్దని సూచించారు. జల్సాలకు అలవాటు పడి... ఓ వైపు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనే సతీష్కుమార్ను బ్యాంకు నేరాలకు పాల్పడేందుకు చేసింది. బ్యాంకు నుంచి కాజేసిన మొత్తాన్ని విలాసాలకు వినియోగించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. -
నమ్మితే నట్టేట ముంచాడు
పెర్కిట్(ఆర్మూర్): సుమారు 20ఏళ్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నగల తయారీ కోసం ఆర్డరు ఇచ్చిన బంగారంతో రాత్రికే రాత్రి బిచాన ఎత్తేశాడు ఆర్మూర్లో స్థిర పడ్డ భూపాల్ మన్నా అనే నగల తయారీదారుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భూపాల్ మన్నా 20ఏళ్ల క్రితం ఆర్మూర్కు కుటుంబంతో వలస వచ్చాడు. అనంతరం ఇక్కడి బంగారు వర్తకులు, సామాన్య ప్రజల విశ్వాసం పొందుతూ నగల తయారీ వ్యాపారం చేపట్టాడు. ఆర్మూర్ ప్రాంతంతో పాటు నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సైతం తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఏజెంట్లను నియమిస్తూ వ్యాపారులు, సామాన్యుల నుంచి బంగారు నగల ఆర్డర్లు తీసుకునేవాడు. ఈ క్రమంలో భూపాల్ మన్నా ఆదివారం రాత్రికి రాత్రే సుమారు రూ.41 లక్షల 60 వేల విలువ గల కిలోన్నర బంగారంతో ఉడాయించాడు. సోమవారం ఆర్డరు ఇచ్చిన నగలను తీసుకెళ్లడానికి వచ్చిన వ్యాపారులకు భాపాల్ దుకాణం మూసి ఉంది. దీంతో ఫోన్ చేసి చూడగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్హెచ్వో సీతారాం తెలిపారు. వారం క్రితం నుంచే ప్రణాళిక భూపాల్ మన్నా బంగారంతో ఉడాయించేందుకు వారం క్రితం నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం క్రితమే భార్యను ఆర్మూర్ నుంచి పంపిచేశాడు. తన వద్ద ఉన్న 15 మంది నగల తయారీదారులు సైతం ఆదివారం నుంచి కనిపించడం లేదని స్థానికుల సమాచారం. ఈ వ్యాపారంలో భూపాల్ మన్నా బాగానే గడించాడని వ్యాపారంతో సంబంధమున్నవారు తెలిపారు. ఇళ్లల స్థలాలతో పాటు ఇటీవలే నూతనంగా ఒక ఇంటిని ఖరీదు చేసినట్లు సమాచారం. ఈజీ మనీ ఆశలో భూపాల్ అప్పుల పాలైనట్లు సమాచారం. తక్కువ ధరకే బంగారం వచ్చే పలు స్కీముల ఉచ్చులో పడి అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఆర్మూర్ ప్రాంతవాసుల వద్ద వేసిన చీటీలకు సైతం ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఒకరొకరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రెండు కిలోల వరకు బంగారాన్ని భూపాల్ తనతో తీసుకెళ్లి ఉంటాడని వ్యాపారవర్గాల సమాచారం. కూతురు పెళ్లి కోసం.. తన కూతరితో పాటు, బావ మరిది కూతరు వివాహానికి అవసరమయ్యే నగల కోసం 400 గ్రాముల బంగారాన్ని భూపాల్ మన్నాకు ఇచ్చాం. ఈరోజు నగలను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తీరా దుకాణానికి వచ్చే సరికి మూసి ఉంది. నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు. –లింగన్న, నిర్మల్ న్యాయం చేయాలి... నగల తయారీ కోసం భూపాల్ మన్నాకు 40 తులాల బంగారాన్ని ఇచ్చాం. బంగారం తీసుకుని ఉడాయిస్తాడని అనుకోలేదు. నమ్మక ద్రోహం చేసి భూపాల్ను పోలీసులు అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలి. –వెంకటేశ్, డీకంపల్లి, నందిపేట -
సునీల్ కోసం వేట.!
కడప అర్బన్ :దాదాపు మూడు జిల్లాల్లో కిడ్నాప్, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సునీల్ కుమార్ అలియాస్ సునీల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తన ముఠాతో కలిసి కిడ్నాప్లు, హత్యలకు పాల్పడిన సునీల్ రెండోసారి గత నెల 27న పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ సంఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు బంధువులు, ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను రెండు రోజుల క్రితం పెండ్లిమర్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ పారిపోయేందుకు సహకరించిన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పారిపోయిన రోజు నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు అతన్ని కడప– నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కానీ జిల్లా పోలీసులు మాత్రం అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
పథకం ప్రకారమే పరారీ
కడప అర్బన్ : జీవితఖైదీ సునీల్ పథకం ప్రకారమే పరారయ్యాడు. అతను ఈ నెల 27న పోలీసులను ప్రలోభ పెట్టి, వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ కేసులో ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు సునీల్ పారిపోయేందుకు సహకరించిన అతనికి చెందిన ముగ్గురు బంధువులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ వివరాలను కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా తమ కార్యాలయంలో సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో నాలుగేళ్ల క్రితం సునీల్కుమార్ అలియాస్ సునీల్ కొంత మంది యువకులను మభ్యపెట్టి సునీల్ గ్యాంగ్గా ఏర్పరుచుకుని.. కిడ్నాప్లు, హత్యలు లాంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వాటిని పథకం ప్రకారం చేస్తూ తన జల్సాలకు యువతను లోబరుచుకుని నేరాలకు పాల్పడేవాడు. అదే పద్ధతిలో ఎస్కార్టుగా వచ్చిన కానిస్టేబుళ్లను సైతం ప్రలోభపెట్టి పథకం ప్రకారం పరారయ్యాడు. ఆటో డ్రైవర్గా సాధారణ జీవితాన్ని ప్రారంభించిన సునీల్ ప్రొద్దుటూరులో అనతికాలంలోనే ఇంటర్మీ డియెట్, ఇంజినీరింగ్ విద్యార్థులను సైతం దురలవాట్లకు బానిసలుగా మార్చి నేరాలకు పాల్పడే వాడు. సదరు కేసులకు సంబంధించి ప్రస్తుతం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కోర్టులలో విచారణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జీవిత ఖైదు పడింది. తాను ఎలా తప్పించుకోవాలో పథకాన్ని రచించుకోసాగాడు. ఆ ప్రకారంగానే కానిస్టేబుళ్లను లోబరుచుకుని తన వంతు ప్రయత్నం చేసి వారి కళ్లు గప్పి ఎంచక్కా పరారయ్యాడు. సునీల్ ఎలా పరారయ్యాడంటే.. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్కుమార్ అలియాస్ సునీల్ పథకం ప్రకారం తాను పరారయ్యేందుకు వ్యూహ రచన చేసుకున్నాడు. ఈ నెల 27న కర్నూలుకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జమ్మలమడుగు పెద్ద అన్వర్బాషా, ఏఆర్ కానిస్టేబుళ్లు కుంటా సత్యనారాయణ, ఏటూరి బాలస్వామి కర్నూలు నుంచి కడప కేంద్ర కారాగారానికి వచ్చారు. సునీల్కుమార్ను కర్నూలులోని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్లారు. తర్వాత తిరుగు ప్రయాణంలో తనకు డబ్బులు రావాలని, పులివెందుల మార్గంలో నందిమండలం వద్దకు వెళితే వచ్చిన డబ్బుల్లో వారికి ఇస్తానని ప్రలోభ పెట్టాడు. తర్వాత సంఘటనను తాను అనుకున్న ప్రకారం కడప బిల్టప్ సర్కిల్ వద్దకు రాగానే డస్టర్ కారు (ఏపీ37 బీఎస్ 0369)ను అప్పటికే అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తలారి పాపమ్మగారి గోపాల్ అద్దెకు వెళుతున్నానని తాడిపత్రికి చెందిన తన యజమానికి చెప్పి చేరుకున్నాడు. ఇతనితోపాటు పెండ్లిమర్రికి చెందిన బాలకృష్ణ, శ్రీనివాసులు, మరో మహిళ అమ్మణ్ణి కూడా వచ్చారు. వీరితోపాటు ఓ మోటారు సైకిల్ (ఏపీ04 ఏజీ 7228)ను పై నిందితుల్లో ఒకరైన శ్రీనివాసులు తీసుకొచ్చారు. గత నెల 27వ తేది రాత్రి 8 గంటల సమయంలో కారులో సునీల్, కానిస్టేబు ళ్లు ఇరువురు బంధువులతో కలిసి నందిమండలం వద్దకు వెళ్లారు. అక్కడ కొండమీద గంగమ్మ గుడి సమీపంలో సునీల్ కారులో మహిళతో ఏకాంతంగా గడిపారు. ముచ్చట్లు ఆడుతుండగా.. కానిస్టేబుళ్లు, సునీల్ బంధువులు కారు సమీపంలో ముచ్చట్లు ఆడుతుండగా .. కొంత సేపటికే సునీల్ తన పని ముగించుకుని మహిళను అక్కడే దించేసి కారులో కొంతదూరం పరారయ్యాడు. గమనించిన పోలీసులు వెంబడించారు. రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత మరో మోటారు సైకిల్లో అతనికి సహకరించిన వారు రావడంతో.. అదే బైక్ ద్వారా పరారైనట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే కానిస్టేబుళ్లు పెండ్లిమర్రి పోలీసుస్టేషన్కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందే హెడ్ కానిస్టేబుల్ మార్గంమధ్యలో చాగలమర్రిలో దిగిపోయాడు. ఇరువురు కానిస్టేబుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎస్పీ బాబూజీ అట్టాడ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ షేక్ మాసుంబాషా ఆధ్వర్యంలో కడప రూరల్ సీఐ హేమసుందర్రావు, పెండ్లిమర్రి ఎస్ఐ ఎస్కే రోషన్, కడప తాలూకా ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వర్రెడ్డి, చిన్నచౌకు ఎస్ఐ మోహన్, తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. ఆదివారం ఉదయం పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకు చెందిన పెండ్లిమర్రి బాలకృష్ణ, అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గాండ్లపాడుకు చెందిన తలారి పాపమ్మగారి గోపాల్, పెండ్లిమర్రికి చెందిన చింతాకుల శ్రీనివాసులును అరెస్ట్ చేశారు. వీరు ఎత్తుకుపోయిన రెండు తుపాకులను, సెల్ఫోన్లు, బుల్లెట్ సామగ్రిని, కారు, మోటారు సైకిల్ను సీజ్ చేశారు. అలాగే జీవిత ఖైదు సునీల్కుమార్కు పారిపోవడానికి అవకాశం కల్పించిన కర్నూలుకు చెందిన ఒక ఏఆర్ హెడ్ కానిస్టే బుల్ జమ్మలమడుగు పెద్ద అన్వర్బాష, ఏఆర్ కానిస్టే బుళ్లు కుంట సత్య నారాయణ, ఏటూరి బాలస్వామిని కూడా అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యల కోసం రిమాండ్కు తరలించారు. త్వరలోనే సునీల్ను, అతను పారిపోవడానికి సహకరించిన మిగిలిన నిందితులను అరెస్ట్ చేస్తామనీ డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో కడప రూరల్ సీఐ హేమసుందర్ రావు, పెండ్లిమర్రి ఎస్ఐ రోషన్, కడప తాలూకా ఎస్ఐ ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, చిన్నచౌక్ ఎస్ఐ మోహన్ పాల్గొన్నారు. -
రక్షించండి.. కాపాడండి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘రక్షించండి.. కాపాడండి.. అంటూ మంగళవారం అర్ధరాత్రి చెన్నై మందవల్లిలోని ఓ ప్రాంతం మార్మోగిపోయింది. ముగ్గురు దుండగుల చేతిలో తీవ్రమైన కత్తిపోట్లకు గురై ఆ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యారు. కాపాడండీ అని ఎవరైనా కేకలు వేస్తే సహజంగా పోలీసులు వచ్చి రక్షిస్తారు. అయితే కానీ సాక్షాత్తు పోలీసు హెడ్కానిస్టేబులే ప్రాణభయంతో పరుగులు పెడుతూ కాపాడండి అంటూ ఆర్త నాదాలు చేసిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో నేరాల అదుపునకు పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ వాహనాల తనిఖీలు, రాత్రివేళల్లో గస్తీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పూందమల్లి పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేసే అన్బళగన్(45) కొందరు కానిస్టేబుళ్లు, స్థానిక యువకులను తోడుగా పెట్టుకుని మంగళవారం రాత్రి తన మోటార్ సైకిల్పై తిరుగుతూ గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎవరికి వారు బృందాలుగా విడిపోయిగస్తీ జరుపుతున్నారు. రాత్రి 12.30 గంటల సమయంలో హెడ్కానిస్టేబుల్ అన్బగళన్ ఒంటరిగా నిలుచుని వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొద్ది దూరంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ముగ్గురు వ్యక్తులను గమనించి పిలిచాడు. అయితే సదరు వ్యక్తులు అన్బళగన్ వద్దకు రాకపోగా హేళనగా వ్యవహరించారు. దీంతో అతనే వారి వద్దకు వెళ్లి పిలిస్తే రారా అని గదమాయించాడు. సదరు వ్యక్తులు అన్బగళన్నే బెదిరించి తమ వాహనాలపై బయలుదేరబోయారు. అన్బగళన్ వారిని అడ్డగించి తన సెల్ఫోన్ కెమెరాలో ఫోటోలు తీయడం ప్రారంభించాడు. ఆ సెల్ఫోన్లోని ఒక ప్రత్యేక యాప్లోకి ముగ్గురి ఫోటోలు అప్లోడ్ చేసినట్లయితే వారంతా పాత నేరస్తులా కాదా అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. మూడో వ్యక్తికి ఫోటో తీస్తుండగా మిగిలిన ఇద్దరు వ్యక్తులు అన్బగళన్ చేతిలోని సెల్ఫోన్ను లాక్కుని ‘మమ్మల్నే దారికాచి ఫోటోలు తీస్తావా’ అంటూ ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అయినా ఏమాత్రం వెరవని అన్బళగన్ తమాయించుకుని ముగ్గురుని పట్టుకునే యత్నం చేయగా వారిలో ఇద్దరు బైక్లో పారిపోగా ఒకడు మాత్రం రహస్యంగా తన వద్ద దాచుకున్న పొడవాటి పట్టా కత్తితో పొడిచాడు. ఈలోగా బైక్లో పారిపోయిన వారు సైతం వెనక్కు తిరిగి వచ్చి అన్బగళన్పై దాడిచేయడం ప్రారంభించడంతో ‘కాపాడండీ.. కాపాడండీ’ అంటూ కేకలు పెడుతూ అన్బగళన్ రోడ్డుపై పరుగులు తీసాడు. దుండగులు సైతం ఆయన వెంటపడి తీవ్రంగా దాడులు చేశారు. అదే సమయంలో ఏదో వాహనం అవైపు రావడంతో దుండగులు ముగ్గురు తమ వాహనాల్లో పారిపోయారు. ఈలోగా గస్తీ విధుల్లో ఉన్న మిగతా కానిస్టేబుళ్లు అక్కడి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ అన్బళగన్ను స్టాన్లీ ఆస్పుత్రిలో చేర్చారు. దుండగులు అన్బగళన్ సెల్ఫోన్ను ఎత్తుకెళ్లడంతో దాని సిగ్నల్స్ ఆధారంగా సతీష్కుమార్ (31), పన్నీర్సెల్వం (24), రంజిత్ (22) అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ అధికారిపై హత్యాయత్నం, దారి దోపిడి సెక్షన్లపై కేసులు పెట్టారు. దుండగులు ముగ్గురూ దోపిడీలు, దొంగతనాలు, హత్యకేసుల్లో నిందితులని విచారణలో తేలింది. -
మళ్ళీ తప్పించుకున్నాడు..!
-
ఇంటి నుంచి పారిపోయేందుకు బాలికల యత్నం
మంగళగిరి రూరల్:ముగ్గురు బాలికలు వారికి నచ్చిన వారితో బతకాలనుకున్నారు. ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పార్క్ రోడ్ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. వీరు ముగ్గురూ కొద్దికాలంగా పట్టణానికి చెందిన ముగ్గురు యువకులతో స్నేహం చేస్తూ ప్రేమలో పడ్డారు. వారితో కలసి జీవించడం కోసం ఇంట్లో నుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. పక్కాగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలో నుంచి వచ్చేసి బస్టాండ్ సమీపంలో వారు ప్రేమించిన యువకుల కోసం తిరుగుతున్నారు. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పట్టణ ఎస్.ఐ. బాలకృష్ణ వారి వద్దకు చేరుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ముగ్గురు ప్రేమించిన యువకులు కూడా మైనర్లే కావడం విశేషం. బాలికల నుంచి ఎస్ఐ తల్లిదండ్రుల సమాచారం తెలుసుకుని వారిని పిలిపించి అప్పగించారు. సోమవారం ఉదయం బాలికలతో సహా తల్లిదండ్రులను పట్టణ సీఐ హరికృష్ణ, ఎస్ఐ బాలకృష్ణ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అయితే, ఆ ముగ్గురు యువకుల వివరాలు మాత్రం తెలియలేదు. -
నమ్మించి.. వంచించి..
విశాఖపట్నం, రావికమతం: రెండేళ్లుగా ప్రేమించాడు... కులాలు వేరైనా వివాహం చేసుకుంటానన్నాడు.తీరా వివాహ ముహూర్తం సమయానికి పరారై యువతికి తీరని ఆవేదన మిగిల్చాడు. న్యాయం చేయాలని కోరుతూ ఆ దళిత యువతి అత్తింటి ముందు గురువారం ఆందోళనకు దిగింది. కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని మర్రివలస గ్రామానికి చెందిన దళిత యువతి కొత్తి హరితేజ (20) అదే గ్రామం కాపు సామాజిక వర్గానికి చెందిన గూటాల శివాజి (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరైనా.. హరితేజ విశాఖలో బీఎస్సీ నర్సింగ్ చేస్తుండగా శివాజి పీజీ చేసి గుంటూరు జిల్లాలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులాలు వేరైనా పెద్దల అంగీకారం లేకున్నా వివాహం చేసుకుంటానని నమ్మించడంతో ఇరువురూ మరింత దగ్గరయ్యారు. అయితే శివాజీకి గర్నికం గ్రామానికి చెందిన మరొక యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న హరితేజ గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. పెద్దలు సైతం ప్రేమించిన యువతికి న్యాయం చేయాలని హితవు పలికారు.తల్లిదండ్రులు ఇష్టపడటం లేదని అవసరమైతే హరితేజకు నష్టపరిహారం చెల్లిస్తామని శివాజి రాజీకి ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. దీనిపై ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావును ఆశ్రయించింది. ఆయన శివాజీ, తల్లిదండ్రులకు ఇటీవల కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వివాహానికి ఒప్పుకున్న శివాజి పెద్దల సమక్షంలో పూచీకత్తులు కూడా రాశాడు. ఈ మేరకు గురువారం రోలుగంటలోని దేవాలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయం వరకూ వచ్చేస్తున్నానంటూ చెప్పిన శివాజీ ఆపై ముహూర్తం దాటిపోయినా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన పెండ్లికుమార్తె హరితేజ మర్రివలసలో అత్తింటి ముందు ఆందోళన చేపట్టింది. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రియుడు శివాజి, అతని తల్లిదండ్రులు భవాని, తాతబ్బాయితోపాటు గర్నికం, బైలపూడి గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తకోట ఏఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరుడా ఇదేమి చోద్యం.?
సాక్షి, కర్ణాటక (దేవనహళ్లి) : కల్యాణమండపం నచ్చడం లేదని వరుడు ఇంటి నుంచి ఉడాయించాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వివాహం జరిపించారు. ఈ ఘటన దేవనహళ్లి తాలూకా విశ్వనాథపురం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. తాలూకాలోని సుణ్ణఘట్ట గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడికి, తరహుణసె గ్రామానికి చెందిన శోభ అనే యువతికి స్థానిక పటాలమ్మ కల్యాణమండపంలో శుక్రవారం వివాహం జరపాలని పెద్దలు నిశ్చయించారు. వధువు తరపు పెద్దలు వధువుతో కలిసి కల్యాణ మండపం చేరుకున్నారు. ఇంతలో వరుడు ఆనంద్ వధువు బంధువులకు ఫోన్ చేసి తనకు ఈ వివాహం ఇష్టంలేదని చెప్పి ఉడాయించాడు. కంగారుపడ్డ వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై శ్రీనివాస్ సాయంత్రానికల్లా వరుడిని పట్టుకొచ్చారు. పోలీస్స్టేషన్లోనే వధువుకు తాళికట్టించి వివాహం జరిపించేశారు. వివాహం ఎందుకు వద్దన్నావు అని పోలీసులు ప్రశ్నించగా కల్యాణమండపం నచ్చలేదని, అందుకే వివాహం వద్దన్నానని నవ్వుతూ సమాధానం చెప్పాడు. -
వజ్రం వివాదం.. ఊరొదిలిన ఓ కుటుంబం
కర్నూలు, ఆదోని అర్బన్: పట్టణంలోని బీరప్పనగర్లో వజ్రం అమ్మకం వివాదంగా మారింది. ఓ నాయకుడి జోక్యంతో వివాదం మరింత ముదిరే అవకాశం ఉండడంతో ఓ కుటుంబం వజ్రం అమ్ముకున్న డబ్బుతో ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికుల సమాచారం మేరకు.. నెల రోజుల క్రితం ఓ ఫ్యాక్టరీలో బీరప్ప నగర్కు చెందిన ఓ దినసరి మహిళా కూలీకి వేరుశనగ దిగుబడులను శుభ్రం చేస్తుండగా తళుకులీనుతున్న ఓ చిన్న గాజు లాంటి రాయి దొరికింది. ఆ రాయిని పక్కనే ఉన్న ఓ మహిళకు చూపించింది. దీంతో ఆమె భర్తతో కలిసి రాయిని తీసుకుని తుగ్గలి మండలం పెరవలిలోని వజ్రాల వ్యాపారికి సంప్రదించగా వజ్రంగా గుర్తించిన ఆయన రూ.20 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే వజ్రం ఇచ్చిన మహళ సదరు మహిళను ప్రశ్నించగా అది మెరిసే రాయని, పిల్లలు ఎక్కడో పడేశారని చెప్పుకొచ్చింది. అయితే రూ.20 లక్షలకు వజ్రాన్ని అమ్మారని తెలియడంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఐదు తులాల బంగారం ఇస్తామని, గొడవ చేయొద్దని వజ్రం అమ్ముకున్న మహిళా కుటుంబం బేరానికి దిగింది. అయితే ఇందుకు వజ్రం దొరికిన మహిళ అంగీకరించలేదు. తాను పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో వజ్రం అమ్ముకున్న మహిళ సూసైడ్ నోట్లో నీపేరు రాసి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వివాదం బహిరంగం కావడంతో ఆ వీధికి చెందిన ఓ నాయకుడు జోక్యం చేసుకుని వజ్రం అమ్ముకున్న కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిసింది. వివాదం ముదరడంతో భయపడిన వజ్రం అమ్ముకున్న మహిళ కుటుంబం మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరొదిలి వెళ్లింది. -
బతికితే చాలని గన్స్ వదిలేసి పోలీసులు పరార్
కొలంబో : సాధారణంగా పోలీసులు దొంగలను తరుముతుంటారు. అప్పుడప్పుడు దొంగలే పోలీసులను తరుముతున్నట్లు కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. అయితే, శ్రీలంకలో మాత్రం ఈ రెండు రకాల సంఘటనలు కాకుండా భిన్నమైన చోటుచేసుకుంది. పోలీసులకు ఏనుగులు చుక్కలు చూపించాయి. గంజాయి తోటను గుర్తించిన పోలీసులు దాని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పెద్ద పెద్ద ఏనుగులు వారికి తారస పడ్డాయి. అవి చూసిందే తడవుగా వారివైపు మెల్లగా రావడం మొదలుపెట్టాయి. కాసేపట్లో వాటి వేగం పెంచడంతో చచ్చాం దేవుడో అనుకొని తమ తుపాకులను సైతం అక్కడ పడేసి పరుగులు తీయడం పోలీసుల వంతైంది. ‘అనూహ్యంగా ఏనుగులు దాడికి దిగడంతో కానిస్టేబుళ్లు వారి తుపాకులను వదిలేసి పరుగులు పెట్టి తమ ప్రాణాలు రక్షించుకున్నారు’ అని ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు. -
సీఎంకు తప్పిన ప్రమాదం..ఎయిర్ ఇండియాకు చురకలు
గువహటి: మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించుకున్నారు. ఎయిర్ ఇండియా విమానం లాండింగ్ సమయంలో అకస్మాత్తుగా పక్షి అడ్డం రావడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వయంగా సీఎం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకు జరిగిన ప్రమాదంపై బీరేన్ సింగ్ ట్విటర్లో వెల్లడించడంతో పాటు.. ప్రయాణీకులకు సరైన సౌకర్యాలుకల్పించలేకపోయిందంటూ ఎయిర్ ఎండియా యాజమాన్యంపై స్వయంగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. గువహటి ఎయిరిండియా విమారం ఇంపాల్ వెడుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 160 మందితో ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, కానీ గువహటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని శుక్రవారం బీరేన్ ట్వీట్ చేశారు. పక్షి తాకి వుంటే.. రంధ్రం పడేదనీ.. కానీ అప్పటికే విమానం ల్యాండ్ అవుతూ వుండడంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. అక్కడి మేనేజ్మెంట్ తీరు అస్సలు బాగోలేదంటూ, వసతులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బీరేన్ ట్విటర్లో ఆరోపించారు. ఇంకా చాలామంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం, వసతి లాంటివేవీ లేదన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం అందుబాటులో లేదని కూడా అధికారులు తెలిపినట్లు బీరేన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనపై ఎ యిరిండియాకూడా స్పందించింది. ప్రమాద విషయాన్ని ధ్రువీకరించిన సంస్థ అధికార ప్రతినిధి.. ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కోలకతానుంచి తమ ఇంజనీర్ల బృందం పరిశీలనకు వెళ్లినట్టు చెప్పారు. అలాగే మరో విమానం ద్వారా ఈ మధ్యాహ్నానికి సంబంధిత ప్రయాణీకులను ఇంపాల్ చేర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. -
బాలికను గర్భవతిని చేసి యువకుడి పరార్
పామిడి: బాలికను ప్రేమపేరుతో నమ్మించి, వాంఛతీర్చుకుని, గర్భం దాల్చిన తర్వాత కనిపించకుండా వెళ్లిపోయిన యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రవిశంకర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామగిరి ఎగువతండాకు చెందిన బాలిక కుటుంబం గత ఏడాది బంజారాల ఆరాధ్య దైవం సేవాఘడ్కు వెళ్లింది. అప్పుడు అక్కడకు వచ్చిన వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి చిన్నతండాకు చెందిన అశోక్నాయక్తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకున్న యువకుడు అమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా కలిశాడు. ఇటీవల ఆరోగ్యం బాగలేదని అమ్మాయిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా గర్భవతి అని బయటపడింది. ఈ విషయం తెలియగానే అశోక్నాయక్ కనిపించకుండా పోయాడు. బాధితురాలి అన్న పామిడి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అశోక్నాయక్పై పోక్సో చట్టం కింద 5–జే, 5–1 సెక్షన్లు, 420, 376 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్రెడ్డి మంగళవారం తెలిపారు. -
హాస్టల్ నుంచి 8 మంది విద్యార్థుల పరారీ
కరీంనగర్ఎడ్యుకేషన్: నగరంలోని ఎస్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8 మంది శనివారం ఉదయం నుంచి జాడలేకుండా పోయారు. వివరాల్లోకెళితే.. బస్టాండ్ సమీపంలోని కిమ్స్ డిగ్రీ కళాశాల వద్దనున్న ఎస్టీ గురుకులంలోని విద్యార్థులు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గోడదూకి పోయినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు సంక్షేమశాఖ అధికారులు పారిపోయిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లారా.. వేరే చోటికి వెళ్లారా అనే విషయంపై స్పందించకుండా ఉండడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. గురుకుల విద్యాలయంలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అధికారులు 8 మంది విద్యార్థులు పారిపోయి 18 గంటలపాటు జాడతెలియకపోయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండడం పట్ల గిరిజన సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన గిరిజన జేఏసీ జిల్లా చైర్మన్ బీమాసాహెబ్ హాస్టల్ను సందర్శించి విద్యార్థుల వివరాలను ఆరా తీశారు. అద్దె భవనంలో పిల్లలకు సరైన రక్షణ లేదని, రూంలు సరిపడా లేవని, వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులపై గిరిజన సంక్షేమ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే 8 మంది విద్యార్థులు గోడదూకి వెళ్లిపోయారని ఆరోపించారు. హాస్టల్ సందర్శించిన వారిలో డీవైఎస్ఐ నాయకులు తిరుపతినాయక్, బోడ మోహన్ సదయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గర్భశోకం
విజయనగరం టౌన్: గర్భసంచి ఇస్తే లక్షల రూపాయాలు ఇస్తామని ఆశ చూపి బాధితులను బుట్టలో వేసుకునే విష సంస్కృతి జిల్లాకు పాకింది. ఒక్కో మహిళకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి టెస్ట్ల పేరిట ముందస్తుగా కొంత సొమ్ము తీసుకుని ఓ ముఠా పరారైంది. కొన్నాళ్లుగా ఎంతో సీక్రెట్గా జరుగుతున్న ఈ తంతును స్థానికుల సమాచారంతో పోలీసులు ఛేదించారు. ఇందులో ప్రధానసూత్రధారిగా భావిస్తున్న జ్యోతి అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. పోలీసులు ఇద్దరు బాధితులను అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు జరిగే పనేనా..? కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అయిపోయిన తర్వాత కూడా మహిళల వద్ద నుంచి గర్భసంచి తీసుకుని వేరే మహిళకు అమర్చి సంతాన ప్రాప్తి కల్పిస్తామని ముఠా సభ్యులు చెబుతున్న వాదన. అయితే ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు. యూట్ర స్ మార్పిడి చాలా క్లిస్టతరమైనదని.. ఎక్కడో ఒకచోట సక్సెస్ సాధించి ఉండవచ్చు గాని విజయావకాశాలు బాగా తక్కువని తెలిపారు. కి‘లేడీ’పై కేసు నమోదు గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తామని ఆశ జూపి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టూటౌన్ ఎస్సై వి. అశోక్కుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో కమ్మవీధి, బూడివీధి, తదితర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళలను విశాఖ జిల్లా భీమిలి పట్నానికి చెందిన ఆదిలక్ష్మి అలియాస్ జ్యోతి అనే మహిళ మచ్చిక చేసుకుని గర్భసంచి ఇస్తే రూ. 8 లక్షలు ఇస్తానని నమ్మబలికింది. దీంతో కానూరి రాజేశ్వరి, బుజ్జి అనే మహిళ ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.750లు, ఆధార్ కార్డు, మూడు ఫొటోలు నిందితురాలు తీసుకుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వారిని కలిసి పరీక్షల పేరుతో రూ. 50 వేల నుంచి 80 వేల రూపాయల వరకు తీసుకుంది. ఈ క్రమంలో మరికొంతమంది బాధితులు రూప, భూదేవి, రమ, సంతోషి, రాజీ, తదితరులు డబ్బులు సమర్పించుకున్నారు. అయితే జ్యోతి పరారుకావడంతో బాధితల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో లేదు.. యూట్రస్ (గర్భసంచి) మార్పిడి సౌకర్యం మనదేశంలోనే లేదు. ఇతర దేశాల్లో చేసినట్లు కూడా కచ్ఛితంగా తెలియదు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స (ట్యూబెక్టీమీ) జరిగిన తర్వాత గర్భం రావడం అసాధ్యం. – డాక్టర్ రాజ్యలక్ష్మి, గైనికాలజిస్టు, కేంద్రాస్పత్రి -
ముంబైలో ప్రేమికుల ఆచూకీ లభ్యం
మంగళూరు(సాక్షి,బెంగళూరు): వివాహానికి రెండు రోజుల ముందు ఇంట్లో ఉంచిన ఆభరణాలు, డబ్బు, పాస్పో ర్ట్, ఆధార్కార్డుతో సహా యువతి ప్రేమికుడితో కలసి పా రిపోయిన కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీ సులు శుక్రవారం యువతిని ఆమె ప్రియుడిని ముం బ యిలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంగళూ రు నగరంలోని మూడబిదిరి పోలీస్స్టేషన్ పరిధిలోని ధరగుడ్డె ప్రాంతానికి చెందిన ప్రియాంక ఇదే నెల 9న ప్రియుడితో కలసి పారిపోయింది. దీనిపై ప్రియాంక తల్లి తండ్రులు, హిందూ సంఘాలు ఇది ముమ్మాటికీ లవ్జిహాదేనని, గత కొద్ది కాలంగా ప్రియాంక ఇనోళి ప్రాం తానికి చెందిన హైదర్ అనే యువకుడితో ప్రేమలో ఉంద ని ప్రియాంకను హైదర్ మాయమాటలతో నమ్మించి తనతో పాటు తీసుకెళ్లి ఉంటాడని మూడబిదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలిసాయి. కొద్ది సంవత్సరాల క్రితం ప్రియాంక కుటుంబం కోణాజీ సమీపంలోని ఇనోళిలో నివసించేవా రు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన హైదర్ అనే వ్యక్తితో ప్రియాంకకు పరిచయమైంది. అనతికాలంలో వీరి పరిచయం ప్రేమకు దారి తీయడంతో విషయం తెలుసుకున్న ప్రియాంక తల్లితండ్రులు అక్కడి నుంచి మూడబిదిరికి మకాం మార్చారు. అప్పటికీ ప్రియాంక తల్లితండ్రులకు తెలియకుండా హైదర్తో ప్రేమను కొనసాగిస్తుండేది. అంతేకాకుండా ప్రియాంక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచి ప్రియాంక బ్యాంకు ఖాతాలో లక్షల కొద్ది డబ్బు జమవుతున్నట్లు తెలిసింది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రియాంక ఈనెల 9న ప్రియాంక ఇంట్లోనున్న ఆభరణాలు, పాస్పోర్ట్, ఆధార్కార్డు తీసుకొని పారిపోయింది. ప్రియాంకను తీసుకొని ముంబయికి చేరుకున్న ఆమె ప్రియుడు హైదర్ తన స్నేహితుడు ఝమీర్ సహాయంతో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. శుక్రవారం ప్రేమికులతో పాటు వారికి సహకరించిన ఝమీర్ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురిని విచారణ చేస్తున్నారు. -
పరారీలో వనిత ...?
బంజారాహిల్స్: హాస్యనటుడు విజయ్సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత కోసం జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులుగా ముమ్మర గాలింపు చేపట్టారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల వద్ద పోలీసుల నిఘా ఉంచారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఆరోపణలపై నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న వనితకు నోటీసులు జారీ చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు యత్నిస్తున్నారు. అయితే ఆమె అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులను ప్రశ్నించారు. అయితే తన కుమార్తె సూర్యాపేటలో ఉందని ఆమె తల్లి చెప్పింది. వనిత ఫోన్ సిగ్నల్స్ పరిశీలించగా రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను విచారిస్తే ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు పేర్కొన్నారు. రెండు బృందా లుగా ఏర్పడ్డ పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. -
పక్కా ప్లాన్తో..
సాక్షి, కామారెడ్డి: ‘‘దశాబ్ద కాలంగా చిట్టీలు వేస్తున్నాడు.. నమ్మకంగా డబ్బులిస్తున్నాడు.. అతడిని నమ్మి ఫైనాన్స్లో పెట్టుబడులు పెట్టాం.. ఇలా ముంచి పారిపోతాడనుకోలేదు’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని రాంమందిర్ రోడ్డులో ఫైనాన్స్ నిర్వహిస్తూ ఇటీవల పారిపోయిన వ్యాపారికి సంబంధించి సోమవారం ‘సాక్షి’లో ‘నట్టేట ముం చేశాడు’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. ఇది జిల్లాలో సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్నవారు సదరు వ్యాపారి నిర్వహించిన ఫైనాన్స్ల వద్దకు పరుగులు తీశారు. సదరు వ్యాపారి తమతో ఎంతో నమ్మకంగా మెలిగాడని, ఇంత దగా చేస్తాడని అనుకోలేదని ఓ బాధితుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశాడు. ఖరీదైన భవనం.. ఫైనాన్స్లో ఉండే డబ్బంతా తన సొంతమే అన్నట్టుగా వ్యవహరించిన సదరు వ్యాపారి.. ఇటీవలే ఖరీదైన భవనం నిర్మించుకున్నాడు. పట్టణంలోని జ్ఞానదీప్ కాలేజీ రోడ్డులో రూ. 16 వేలకు గజం చొప్పున దా దాపు 160 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి, ఆధునిక హంగులతో ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవలే గృహప్రవేశం కూడా చేశాడు. ప్రస్తుతం ఇంటి విలువ రూ.70 లక్షల దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇంటిపై కూడా బ్యాం కులో హౌసింగ్ లోన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇంటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు, సొంత అవసరాలకు వాడుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో ఉండడంతో డబ్బులను సర్దుబాటు చేయడం ఇబ్బందికరంగా మారడంతోనే పారిపోయేందుకు సిద్ధమై ఉంటాడని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగానే తాను పారిపోయే రోజు వర కు కూడా ఎవరికీ అను మానం రానీయకుం డా మెదిలాడని తెలుస్తోంది. కొత్తగా ఫైనాన్స్ల్లో భాగ స్వామ్యం కల్పిస్తానని కొందరి వద్ద డబ్బులు కూడా తీసు కుని వెళ్లినట్టు సమాచారం. అంతటా అదే చర్చ.. కామారెడ్డి పట్టణంలో ఫైనాన్స్ వ్యాపారి పరారీకి సంబంధించిన విషయం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో చాలా మందికి తెలిసింది. కొందరు వ్యాపార భాగస్వాములకు కూడా ఆయన పరారీ సంఘటన తెలియలేదు. మూడు రోజులుగా కనిపించకపోవడంతో ఎటైనా ఊరికి వెళ్లొచ్చని భావించారు. అయితే ఫోన్లు మొత్తం స్విచ్ఆఫ్ చేసి ఉండడం, ఇంటికి, ఫైనాన్స్కు తాళాలేసి ఉండడంతో వారు కంగుతిన్నారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అంతటా చర్చ మొదలైంది. ఎవరెవరు ఎంతెంత మోసపోయారో లెక్కలు కట్టుకుంటున్నారు. వ్యాపారి మోసంపై చర్చ జరుగుతోంది. పథకం ప్రకారమే.. ఫైనాన్షియర్ పారిపోయిన తర్వాత మకాం పెట్టేందుకుగాను ముందుగానే ఓ పట్టణంలో ఇళ్లు మా ట్లాడుకున్నట్టు తెలుస్తోంది. వెళ్లేముందు కామారెడ్డి పట్టణంలో ఓ సూపర్మార్కెట్కు వెళ్లి రెండు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశాడని తెలిసినవారు చెబుతున్నారు. అలాగే బియ్యం షాపునకు వెళ్లి బియ్యం కొన్నాడని, వాటిని ఎక్కడైతే మకాం పెట్టాలనుకున్నాడో అక్కడికి తరలించాడని తెలుస్తోంది. మూడు జిల్లాలవారు.. పారిపోయిన ఫైనాన్షియర్ నిర్వహిస్తున్న ఫైనాన్స్లలో కా మారెడ్డితోపాటు సిరిసిల్ల, నిజా మాబాద్ జిల్లాలకు చెందిన వారు భాగస్వాములుగా ఉన్నారు. ఐదు గ్రూపుల్లో దాదాపు వంద మం ది భాగస్వాములు ఉన్నారని సమాచారం. అందులో సదరు ఫైనాన్షియర్ రక్తసంబంధీకులు, బంధువులు, స్నేహితులు కూడా ఉండడం గమనార్హం. ఓ రిటైర్డ్ టీచర్ రూ. 6 లక్షలు పెట్టినట్టు తెలుస్తోంది. ఓ చిరు వ్యాపారి తాను కష్టపడి జమ చేసుకున్న రూ.2 లక్షలు, మరో వ్యాపా రి రూ.4 లక్షలు, ఇంకో వ్యాపారి రూ. 17.50 లక్షలు, మరొకరు రూ.6.50 లక్షలు ఫైనాన్స్లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఇంకో వ్యాపారి రూ. 10 లక్షలు, ఓ రైతు నెల క్రితమే ఒక షేర్ కింద రూ.2 లక్షలు పెట్టారు. ఇలా దాదాపు వంద మందికిపైగా బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్లో భాగస్వామ్యం, చిట్టీలకు సంబంధించి దాదాపు రూ. 2.50 కోట్ల దాకా పెట్టు బడులు ఉన్నట్లు సమాచారం. -
ఇద్దరు పెళ్లి కుమారులు పరార్!
మెట్పల్లి: మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా యువకులు పరారయ్యారు. మెట్పల్లిలో నాగరాజు, సుల్తానాబాద్లో కుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మెట్పల్లి మండలం ఆత్మకూర్కు చెందిన కోల నాగరాజు(24)కు అదే గ్రామ యువతితో ఈనెల 27న వివాహం చేయ నిశ్చయించారు. నాగరాజు శనివారం మెట్పల్లికి పోతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలు చోట్ల వెదికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుల్తానాబాద్లో మరొకరు సుల్తానాబాద్: మండలకేంద్రంలోని గౌడవీధిలో ఉంటున్న గాజుల కుమార్(30) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇంట్లో నుంచి ఈనెల 24న గేదెలను గడ్డి మేపేందుకు తీసుకొని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లల్లో వెదికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి భూదమ్మ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన యువతితో ఈనెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. కుమార్కు రెండో వివాహమైనప్పటికీ వివాహ సమయానికి కనిపించకుండా పోవడంతో చర్చనీయాంశమైంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో పెళ్లి !
బనశంకరి : ఓ టెక్కీతో నిశ్చితార్థం చేసుకున్న ఓ యువతి మరో యువకుడిని వివాహం చేసుకున్న సంఘటన హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. .హాసన్ జిల్లా సకలేశపుర తా లూకా యసళూరు గ్రామానికి చెందిన యువతితో బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్తో వివా హం చేయడానికి పెద్దలు రెండు నెలల క్రితం నిశ్చితార్థం జరిపించారు. ఆదివా రం (19న) హాసన్లో వివాహ ముహుర్తం నిర్ణయించారు. అయితే సదరు యువతి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 11న వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. శనివారం రాత్రి యువతి ఇంట్లో పెళ్లికి ముందు నిర్వహించే సంప్రదాయాలు నిర్వహిం చారు. అనంతరం రాత్రి అందరూ నిద్రకు ఉపక్రమించిన అనంతరం యువతి అదృశ్యమైంది. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు యువతి కోసం గాలించారు. ఈ సమయంలో ఇండోర్ యువకుడు మొబైల్ వాట్సాస్ నుంచి ఇద్దరికీ వివాహమైన ఫొటో, వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను అప్లోడ్ చేశాడు. దీన్ని గమనించిన రెండు కుటుంబాలు షాక్కు గురయ్యారు. -
కాసేపట్లో పెళ్లి..పెళ్లికొడుకు పరార్!
-
కాసేపట్లో పెళ్లి.. వరుడు పరార్!
పశ్చిమగోదావరి: మరి కొద్దిసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు పరారయ్యారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చింతలపుడి మండలం యర్రగుంట పల్లి గ్రామానికి చెందిన ఎర్రమాల రాజేష్కు తాళ్లపుడి మండలం తిరుగురు మెట్టకు చెందిన మాధవితో పెళ్లి నిశ్చయమైంది. ఈ రోజు పెళ్లి తంతు నిర్వహించడానికి వధువు తరుపు బంధువులంతా కలిసి వరుడి గ్రామానికి చేరుకున్నారు. పెళ్లి మండపంలో గండల తరబడి ఎదురుచూసినా పెళ్లికొడుకు అక్కడికి రాలేదు. ఏం జరిగిందోనని వధువు బంధువులు అతని ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని ఆరాదీయగా వరుడు పరారయ్యారని తెలిసింది. కాగా.. పెళ్లికి ముందు మాట్లాడుకున్న పది లక్షల కట్నంలో ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని వధువు తల్లిదండ్రులు చెప్పారు. -
ముగ్గురు విద్యార్థుల పరార్
ఇళ్ల నుంచి పారిపోయిన వైనం రాయగడ : రాయగడ సెంట్జేవియర్ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ నెల 19వ తేదీన తమ ఇళ్లల్లో ప్రైవేటు కు వెళతాం అని చెప్పి పరార్ అయినట్టు తెలిసింది. రాయగడ రైతులకాలనీ, న్యూకాలనీ, రైల్వే కాలనీలో ఉంటున్న కె.అవినాష్, ఎస్.శ్రీనివాసు, టి.పవన్ అనే ముగ్గురు విద్యార్థులు స్నేహితులు. మంగళవారం వీరు ముగ్గురు ప్రైవేటుకు వెళతామని ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. రాత్రి అయినా తిరిగి ఇళ్లకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే వీరు వినియోగించిన మోటార్సైకిల్ రాయగడ బస్స్టాండులో లభించింది. ఈ ముగ్గురు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి ఉంటారని వారు కుటుంబీకులు అనుమానిస్తున్నారు. అయితే వీరి సెల్ఫోన్ నెట్వర్కు ఆధారంగా హట్శశికళ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటనపై అవినాష్ తల్లి సూజాత, ఇతర విద్యార్థుల కుటుంబ సభ్యులు రాయగడ పోలీసులను బుధవారం ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. దీనిపై ఐఐసీ ఆర్.కె.పాత్రో మాట్లాడుతూ పిల్లల ఆచూకీ తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. -
పెళ్లి చేసుకొని పారిపోయాడు
♦ న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు ♦ గతంలోనూ పలు పెళ్లిళ్లు చేసుకున్నాడన్న మొదటి భార్య సాక్షి పలమనేరు : తాను రియల్టర్నని, తన భార్య చనిపోయిందని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని నెలరోజుల తర్వాత భర్త పారిపోయాడు. బాధితురాలు న్యాయం కోసం ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన మనోహర్ విశాఖ జిల్లా చోడవరం మండలం లక్కవరంలో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. తాను రియల్టర్నని అక్కడ చెప్పుకునేవాడు. ఈ క్రమంలో తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, భార్య చనిపోయిందని అదే గ్రామానికి చెందిన ఓ మ్యారేజ్ బ్రోకర్కు చెప్పాడు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. బ్రోకర్ ద్వారా అదే గ్రామానికి చెందిన తాతాబాయి కుమార్తె నాగమణిని గత నెల 16న సింహాచలం ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. అత్తగారింట్లోనే కాపురం పెట్టాడు. అదే ప్రాంతంలో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న మనోహర్ భార్యను వదలి అక్కడి నుంచి ఉడాయించాడు. అతను మరిచిపోయిన పర్సును పరిశీలించగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన వాడిగా గుర్తించారు. బాధితురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పలమనేరు పోలీసులను ఆశ్రయించింది. మనోహర్ మొదటి భార్యను పోలీసులు విచారించారు. మనోహర్ గతంలోనూ కదిరి, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిపింది. స్థానికంగా ట్రాన్స్కోలో ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురికి టోపీ పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు నాగమణి లబోదిబోమంటోంది. న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ వద్దే వేచి చూస్తోంది. మనోహర్ అందుబాటులో లేడని అతని మొదటి భార్య చెప్పడం గమనార్హం. -
ఖైదీ పరారీ
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీ జీరో రోడ్డుకు చెందిన బోయ వీరేష్(20) అనే ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. వీరేష్ 2015లో స్థానిక త్రీ టౌన్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం కేసులో నిందితుడు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. అప్పట్లో రిమాండ్కు ఆదేశించింది. అప్పటి నుంచి ఆదోని సబ్జైలులో ఉంటున్నాడు. గురువారం తీర్పు ఉండడంతో పోలీసులు అతన్ని కోర్టుకు తీసుకొచ్చారు. ఆదోని ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిరాం కేసు పూర్వపరాలను పరిశీలించి..అతనికి ఆరు నెలల జైలుశిక్ష ఖరారు చేశారు. దీంతో వీరేష్ను త్రీటౌన్ పోలీసులు భాస్కర్,సురేష్ సబ్ జైలుకు తరలిస్తుండగా.. వారి కళ్లు కప్పి పరారయ్యాడు. ఖైదీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్?
డోన్ టౌన్: ఇద్దరు రిమాండ్ ఖైదీలు పారిపోయేందుకు కారణంగా పేర్కొంటూ పట్టణ పోలీస్స్టేషన్కు చెందిన హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్యను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ విధుల నుంచి తొలగిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. డోన్ పట్టణంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడి గతంలో బెయిల్పై విడుదలైన నారాయణస్వామి, కొండలరెడ్డి అనే ఇరువురూ ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి ముద్దాయిలను డోన్ కోర్టులో ఈ నెల 7న హాజరు పరిచారు. వీరిని తిరిగి తెనాలి సబ్జైలుకు రైలులో తరలిస్తుండగా ప్రకాశం జిల్లా ఖమ్మం రైల్వేష్టేషన్లో పోలీసుల కన్నుగప్పి పారిపోయారు. విచారణ జరిపిన అనంతరం జిల్లా ఎస్పీ రవికృష్ణ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్, కానిస్టేబుల్ యాగంటయ్యను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై డోన్ ఎస్సై శ్రీనివాసులును వివరణ కోరగా కానిస్టేబుళ్ల సస్పెన్షన్ ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదన్నారు. -
తమ్ముడికి అన్న ట్రైనింగ్: వైరల్ వీడియో
ఇద్దరు చిన్నారుల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. డైలీ బంప్స్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 4 కోట్ల మంది వీక్షించారు. అంతలా హల్చల్ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అన్న తన తమ్ముడికి జైలు లాంటి బెడ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతుంది. ఆటలాడే సమయం అయిపోయిందంటూ ఇద్దరు పిల్లలు ఒలివర్, ఫిన్లను తల్లిదండ్రులు బెడ్ ఎక్కించేశారు. అయితే.. ఇంకా కలిసి ఆడుకోవాలని అనుకున్నారో ఏమో ఆ పిల్లలు అందుకోసం పెద్ద సాహసమే చేశారు. ఒలివర్ తన తమ్ముడికి బెడ్ నుంచి ఎలా బయటపడాలో పెద్ద డెమాన్స్ట్రేషన్తో చూపించి.. ఎట్టకేలకు తన తమ్ముడికి విముక్తి కల్పిస్తాడు. అంతేనా.. 'యూ కెన్ డూ ఇట్' అంటూ తమ్ముడిని ఒలివర్ ఎంకరేజ్ చేసిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ట్విస్ట్ల మీద ట్విస్ట్ల ప్రేమాయణం
కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): మండలంలోని కుంచనపల్లిలో ఓ యువకుడి ప్రేమాయణం సినిమా స్టోరీని తలపించింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో కొనసాగుతోంది. కుంచనపల్లికి చెందిన ఓ యువకుడు ఇంటి పక్కనే ఉండే యువతి ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. వీరి మధ్య కొంతకాలం ప్రేమాయణం సాగింది. కట్ చేస్తే.. అదే గ్రామానికి గుంటూరు నుంచి ఓ కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబంలోని యువతిపై ఆ యువకుడి కన్ను పడింది. ఆమెకు కూడా ప్రేమ కబుర్లు చెప్పి మొత్తానికి మనసు దోచుకున్నాడు. వీరిద్దరి వ్యవహారం పెద్దల వరకు చేరింది. అయితే ఈ పెద్దోళ్లు వారి మనసులను అర్థం చేసుకున్నారు. వేరు వేరు సామాజిక వర్గాలైనప్పటికీ పిల్లల ఇష్టాలను గౌరవించారు. ప్రేమికులిద్దరినీ ఈ నెల రెండో తేదీన పెళ్లిపీటలు ఎక్కించారు. ఇదిగో ట్విస్ట్ ఆ పెళ్లినాటి జ్ఞాపకాల దొంతరలు ఆ పెళ్లి కుమార్తె ఊసుల్లో కదిలాడుతుండగానే ఆ యువకుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. పెళ్లికి ముందు ప్రేమించిన యువతిని తీసుకొని గురువారం పరారయ్యాడు. యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే యువకుడి అత్తామామలు మాత్రం అల్లుడిపై కేసులేమీ వద్దు..మాకు అప్పగిస్తే చాలు అంటున్నారు. చివరకు పోలీసులు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి. -
బ్యాంకులో వేయమని రూ.4.53 లక్షలు ఇస్తే..
హైదరాబాద్: యజమాని బ్యాంకులో జమ చేయాలని చెప్పి ఇచ్చిన నాలుగున్నర లక్షల రూపాయలతో ఓ ఉద్యోగి కనిపించకుండా పోయాడు. ఎల్బీనగర్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ ఏజెన్సీలో పనిచేస్తున్న జంగ సంజయ్ అనే ఉద్యోగికి అతని యజమాని కృష్ణకుమార్ రూ. 4.53 లక్షల డబ్బు ఇచ్చాడు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలని పురమాయించాడు. అయితే, సంజయ్ ఆ మొత్తాన్ని తీసుకుని బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా కారులో కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడే సిద్ధంగా ఉన్న ఓ రైలు ఎక్కి ఎటో వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన వాడని, కర్ణాటక లేదా ఢిల్లీ పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. -
పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతుండగా ప్రమాదం
– ట్రాక్టర్ ఢీకొని నిందితునికి తీవ్ర గాయాలు – పోలీసుల అదుపులో ట్రాక్టర్ డ్రైవర్ – చికిత్స ఖర్చుల భారం మొత్తం అతనిపైనే కర్నూలు: పోలీస్ స్టేషన్కు ఎవరు వస్తున్నారు.. వారి పనేంటి.. అనే విషయాలపై అక్కడ ఉండే సిబ్బంది నిత్యం పర్యవేక్షణ ఉండాలి. కానీ నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్లో దొంగలు పారిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయితీలపై ఉన్న శ్రద్ధ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కళ్లగప్పి స్టేషన్ నుంచి దొంగ పరారైన సంఘటన సంచలనంగా మారింది. శనివారం రాత్రి కొత్తబస్టాండు పరిసర ప్రాంతాల్లో నలుగు జేబు దొంగల(అనుమానితులు)ను నాల్గో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వారిదైన శైలిలో ట్రీట్మెంటు ఇచ్చి విచారణ జరిపారు. అందులో ఒక నిందితుడు తెల్లవారుజామున పారిపోతూ పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అనంతపురం పట్టణానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు ఈశ్వరయ్య (30) కొలిమిలో పని చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా కర్నూలులోని బస్టాండు పరిసర ప్రాంతాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. జేబు దొంగగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకోగా స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యాడు. నిడ్జూరు గ్రామానికి చెందిన ఏపీ 21 టీజడ్ 3773 ట్రాక్టర్ ఢీ కొనడంతో తలకు, మొహానికి తీవ్ర గాయాలకు గాలయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ట్రాక్టర్ డ్రైవర్ సురేందర్ను అదుపులోకి తీసుకున్నారు. గాయాలకు గురైన ఈశ్వరయ్య దగ్గర ఆరుగురు పోలీసులు ఉండి వైద్య చికిత్సలు చేయిస్తున్నారు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఈశ్వరయ్యకు ప్రస్తుతం న్యూరో సర్జరీ వార్డులో చికిత్స చేస్తున్నారు. ఖర్చుల భారమంతా ట్రాక్టర్ యజమాని కానీ, డ్రైవర్ కానీ భరిస్తేనే వదులుతామంటూ పోలీసులు ఇప్పటికే బేరం కుదుర్చుకున్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకనే ఈశ్వరయ్య పారిపోతూ ప్రమాదానికి గురయ్యాడు. మూడు రోజుల క్రితం కూడా ఇదే స్టేషన్ నుంచి నరేష్ అనే దొంగ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. స్టేషన్లో సిబ్బంది నిఘా సక్రమంగా లేకపోవడం వల్లే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. గుజిరి వ్యాపారి కర్ణ కోసం అనంతపురం నుంచి కర్నూలుకు వచ్చినట్లు ఈశ్వర్య తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. -
చిట్టీల పేరుతో ఘరానా మోసం
రాజమహేంద్రవరం: చిట్టీల పేరుతో చుట్టు పక్కల వారికి రూ. 20 లక్షలు టోపీ పెట్టి ఓ దంపతులు తమ స్వగ్రామం పరారైన ఘటన ఇది. స్థానిక వీవర్స్ కాలనీలోని బాగిరెడ్డి కనకమాణిక్యం ఇంట్లో కడపకు చెందిన కారపురెడ్డి సాయి కృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతులు కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. నమ్మకంగా ఉంటూ చుట్టుపక్కల వారితో చిట్టీలు వేయిస్తుంటారు. వారి వద్ద ఇంటి యజమాని నాగకనకరత్నం కూడా చిట్టీ వేసింది. అధిక వడ్డీలు ఆశ చూపిన సాయి కృష్ణారెడ్డి దంపతులు రూ.20 లక్షలు వసూలు చేసి శనివారం రాత్రి చెప్పాపెట్టకుండా పరారయ్యారు. విషయం తెలుసుకున్నకాలనీ బాధితులు బోడె కృష్ణ, సత్యవతి, ఇంటి యజమాని, తదితరులు మూడోపట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రామకోటేశ్వరరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై షరీఫ్ తెలిపారు. -
బార్ షాప్ ఓనర్...అతి తెలివి..!
-
తప్పించుకున్న దొంగ దొరికాడు!
ఆత్మకూరు : పోలీసుల అదుపులోంచి తప్పించుకుపోయిన దొంగ షేక్ ఖాదర్ బాషాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దొంగలించిన సొమ్మును రికవరీ చేశారు. స్థానిక సీఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్కుమార్ మాట్లాడుతూ.. పట్టణంలోని గరీబ్ నగర్కు చెందిన షేక్ ఖాదర్ బాషా ఇటీవల సాయిబాబానగర్లో రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. అలాగే నంద్యాల ఎస్బీఐ కాలనీ వద్ద మోటార్ సైకిల్ను దొంగతనం చేసి ఆత్మకూరుకు వస్తుండగా భానుముక్కల మలుపు వద్ద అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి వద్ద 593.4 గ్రాముల వెండి కంచం, 165.5 గ్రాముల వెండి చెంబు, 95.1 గ్రాము వెండి గిన్నె, 248.5 గ్రాముల వెండి ప్లేటు, 50.8 గ్రాముల నాలుగు చిన్న వెండి గిన్నెలు, 14.9 గ్రాముల వెండి భరణి, ఒక నోకియా మోడల్ సెల్ఫోన్, ఏపీ 28 సీసీ 8983 నెంబర్ గల పల్సర్ బైక్, ఎల్జీ కంపెనీకి చెందిన ఎల్ఈడీ టీవీ, ఏపీ 21 ఏజె 0644 నెంబర్ గల హోండా ట్విస్టర్ బైక్, ఏపీ 21 క్యూ 1882 పల్సర్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, పాములపాడు ఎస్ఐ సుధాకరరెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ వెంకటసుబ్బయ్య, వెలుగోడు ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భార్య గొంతు కోసి పరారైన భర్త
చిలకలూరిపేట(గుంటూరు): మద్యానికి బానిసైన ఓ వ్యక్తి భార్య గొంతుకోసి పరారైన సంఘటన జిల్లాలోని చిలకలూరిపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని కుమ్మరకాలనీకి చెందిన శిఖ వనజాక్షి(40), మాణిక్యరావు దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసైన మాణిక్యరావు మద్యానికి డబ్బివ్వాలని వనజాక్షిని వేధిస్తున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో.. ఆమె నిద్రిస్తున్న సమయంలో కొడవలితో ఆమె గొంతు కోసి, అనంతరం కూరగాయలు కోసే కత్తితో ఆమై పై దాడి చేసి చచ్చిందో లేదో నిర్ధరించుకోవడానికి ఆమె ముఖంపై దిండు వేసి హత్యచేశాడు. ఇది గుర్తించిన ఆమె చిన్న కూతురు తండ్రిని అడ్డుకోబోగా.. చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్టేషన్ నుంచి అనుమానితులు పరారీ
మొగల్తూరు : మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో విచారించేందుకు తీసుకువచ్చిన ఇద్దరు అనుమానితులు శుక్రవారం వేకువ జామున మొగల్తూరు స్టేషన్ నుంచి పరారయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మొగల్తూరు స్టేషన్ పరిధిలో మోటార్ సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో అనుమానితులపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ తేదీన అత్తిలి మండలం రేలంగికి చెందిన ఆగిశెట్టి నాగేశ్వరరావు, ముంగుల వెంకటకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలో పలు స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. అయితే వీరు శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లను మభ్యపెట్టి వేకువ జామున పరారయ్యారు. దీంతో ఎస్సై కె.గురవయ్య సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులు తణుకులో తచ్చాడుతున్నట్టు సమాచారం అందడంతో ఎస్సై చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. -
పోలీస్స్టేషన్ నుంచి పాత నేరస్తుల పరారీ
ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీస్స్టేషన్ నుంచి ముగ్గురు పాత నేరస్థులు పారిపోయారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 6 రాత్రి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న చామాకూర శ్రీకాంత్ అనే వ్యక్తిని ఆటోలో వచ్చిన ఐదుగురు యువకులు అడ్డగించి అతని వద్ద ఉన్న రూ.12 వేల విలువ చేసే మొబైల్ ఫోన్ను లాక్కొన్ని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘట్కేసర్కు చెందిన పాత నేరస్థులు మహేశ్, రోహిత్గౌడ్, ఉదయ్, పృద్వీ, మునీర్లను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. అర్థరాత్రి స్టేషన్లో కాపాలదారుడిగా ఉన్న కానిస్టేబుల్ రమేష్ కళ్లుగప్పి స్టేషన్ కిటికీలను తొలగించి మహేశ్, రోహిత్గౌడ్, ఉదయ్లు పారిపోయారు. ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు నేరస్థుల కోసం గాలిస్తున్నారు. -
పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు నిందితుల పరారీ!
హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ముగ్గురు నిందితులు తప్పించుకుపోయారు. ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. -
చిట్టీపాటల పేరుతో ఘరానా మోసం
► రూ.30 లక్షలతో పరారైన నిర్వాహకురాలు ► విలపిస్తున్న 70 మంది బాధితులు ► చర్యలు తీసుకోవాలని వినతి కత్తివారిపాలెం (పిట్టలవానిపాలెం): రూపాయి, రూపాయి కూడబెట్టుకుని చిట్టీలు కడితే గూడు ఏర్పాటు చేసుకోవడానికో లేక పిల్లల పెళ్లిళ్లకో ఉపయోగపడతాయని ఆశ పడ్డారు. కానీ చిట్టీ నిర్వాహకురాలు వారిని నిలువునా ముంచింది. రూ.30 లక్షలతో ఉడాయించింది. ఈ ఘరానా మోసం పిట్టలవానిపాలెం మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు పిట్టలవానిపాలెం మండలం చందోలు పంచాయతీ పరిధిలోని కత్తివారిపాలెం గ్రామానికి చెందిన తెల్లాకుల సోనియారాణి భర్త పాగమల్లేశ్వరరావుతో కలిసి గత ఏడేళ్లుగా నివాసం ఉంటుంది. భర్త ఆటో నడుపుతాడు. సోనియారాణి మాత్రం గ్రామంలో చిట్టీలు నిర్వహిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఒక్కో చిట్టీ రూ.లక్ష చొప్పున ఐదు చిట్టీలు నిర్వహిస్తుంది. ఒక్కో పాటలో 20 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 100 మంది సభ్యులతో పాటలు నిర్వహిస్తూ ఉంది. ఒక్కొక్కరు 20 నెలల పాటు నెలకు రూ. 5వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాటలు 10 నుంచి 15 నెలలు పూర్తి కాగా మరికొన్ని మాత్రం 5 నుంచి 10 పాటలు పూర్తయ్యాయి. పూర్తయిన పాటలన్నీ నిర్వాహకురాలు సోనియారాణి దక్కించుకుంది. కొందరు బాధితులు పాటలు చెల్లించడంతోపాటు అధిక వడ్డీలు ఇస్తామని ఆశ పెట్టడంతో వేలకు వేలు అప్పుగా కూడా ఇచ్చారు. మొత్తం మీద పాటల తాలూకా రూ.25 లక్షలు, వడ్డీకి తీసుకున్న తాలూకా రూ.5 లక్షలకు పైబడి మొత్తం రూ.30 లక్షల మేర వసూలు చేసుకుని సోనియారాణి కన్పించకుండా పరారైయింది. ఉన్నతాధికారులు విషయాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు.. సోనియారాణి పుట్టిల్లు కత్తివారిపాలెం, అత్తవారిల్లు కృష్ణా జిల్లాలోని మొవ్వగా చెబుతున్నారు. అయితే పెళ్లి అయిన నాటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నారు. ఈమె గత వారం రోజులుగా కన్పించడం లేదు. ఫోన్ పనిచేయడం లేదు.ఈ విషయంపై ఆమె తల్లిదండ్రులను బాధితులు, సంఘపెద్దలతో కలిసి అడుగగా మాకు ఎలాంటి సంబంధంలేదనీ, ఆమె ఎక్కడ ఉందో మీరే తీసుకురండని సమాధానం చెప్పినట్లు బాధితులు వాపోయారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాధితులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని చందోలు పోలీసులు తెలిపారు. -
మైనర్ బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం
చీరాల(ప్రకాశం): ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లాలోని చీరాల జవహర్నగర్కు చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. కాలనీకి చెందిన బాలుడు(17) ఇంటి పక్కనే ఉంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని(13)తో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
పెళ్లైన నెలరోజులకే వేరే వ్యక్తితో వధువు పరార్!
చెన్నై: తమిళనాడులోని సేలంలో వివాహం జరిగిన నెల రోజుల్లోనే నవవధువు బావతో పరారైంది. ఆమె కోసం వెళ్లిన మామ హత్యగురయ్యాడు. సేలం ఎంజీఆర్ నగర్కు చెందిన పచ్చియప్పన్ (60) గాజులవ్యాపారి. ఇతని కుమారుడు జగన్నాథన్ (28)కు, సేలం జిల్లా తీవట్టిపట్టికి చెందిన అనిత (22)కు వివాహం జరిగింది. వివాహమైన నెల రోజుల్లోనే అనిత పుట్టింటికి చేరి మేనమామ కుమారుడు లక్ష్మణన్తో వెళ్లిపోయి వేలూరులో కాపురం పెట్టింది. లక్ష్మణన్ వేలూరులో ఆటో నడుపుతున్నాడు. ఈ క్రమంలో పచ్చియప్పన్ పెళ్లి ఖర్చులకు రూ.40 వేలు అయ్యిందని దాన్ని తిరిగివ్వాలని కోరారు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో ఘర్షణ జరిగింది. పచ్చయప్పన్కు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందాడు. పోలీసులు లక్ష్మణన్, అనితలను అరెస్టు చేశారు. -
పరారీలో జొన్నల వ్యాపారి
–పోలీసులను ఆశ్రయించిన బాధితులు చాగలమర్రి: చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్ కాలనీకి చెందిన ముద్దేటి అశోక్ అనే జొన్నల వ్యాపారి రైతులకు రూ. 3 కోట్ల వరకు కుచ్చు టోపి పెట్టి పరారయ్యాడు. దీంతో బాధితులైన రైతులు, చిరువ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు లబోదిబో మంటూ మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. జొన్నలవ్యాపారి అశోక్ తోపాటు అతడి సోదరుడు ముద్దేటి హరి పై ఎస్ఐ మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దేటి అశోక్, హరి గత రెండు సంవత్సరాలుగా రైతులు, కమీషన్ దారుల నుంచి జొన్నలు కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయించే వారు. ఈ నేపథ్యంలో కర్నూలు, వైఎస్సార్ కడప లోని పలు ప్రాంతాల రైతుల నుంచి రూ. 3 కోట్ల విలువ చేసే జొన్నలు తీసుకున్నాడు. వారందరికి ఈనెల 20వ తేదీన డబ్బులు ఇస్తానని నమ్మించాడు. ఆ ప్రకారం రైతులు, కమీషన్ దారులు అశోక్, హరి ఇంటి వద్దకు పోయారు. అయితే వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో చుట్టు పక్కల వారిని విచారించారు. గత కొన్ని రోజులుగా వారు ఇక్కడ లేరని చెప్పడం.. ఫోన్లు పనిచేయకపోవడంతో పరారైనట్లు నిర్ధారించుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు రోజుల్లోనే కర్నూలు, వైఎస్ఆర్కడప జిల్లాల నుంచి 38 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. -
మరణ శిక్ష ఖైదీ పరారీ..
-
మరణ శిక్ష ఖైదీ పరారీ..
బక్సర్: బిహార్లోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. శుక్రవారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆరోగ్యం సరిగా లేదనే కారణంతో వీరంతా జైలులోని హాస్పిటల్ వార్డులో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అక్కడ టాయ్లెట్ విండోను బద్దలుకొట్టి పరారైనట్లు అధికారులు వెల్లడించారు. పరారైన ఐదుగురిలో ఓ ఖైదీ మరణ శిక్ష విధించబడిన వ్యక్తి కాగా.. మరో నలుగురు వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు. ప్రదీప్ సింగ్, డియోదరి రాయ్, సోను పాండే, ఉపెందర్ సహ, సోను సింగ్ అనే ఐదుగురు ఖైదీలు పరారైనట్లు అధికారులు వెల్లడించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
గార్డును కొట్టి.. తాళాలు లాక్కొని..
జబల్పూర్: వివిధ కేసుల్లో రిమాండ్లో ఉన్న పది మంది బాలనేరస్తులు జువెనైల్ హోం నుంచి పరారైన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జువెనైల్ హోంకు గార్డుగా ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టి బాలనేరస్తులు పరారయ్యారు. రాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గార్డును తీవ్రంగా కొట్టి తాళాలు లాక్కొని.. పది మంది బాల నేరస్తులు పరారయ్యారని రిమాండ్ హోం అధికారి పునిత్ వర్మ వెల్లడించారు. పరారైన వారికోసం గాలింపు చేపడుతున్నామని రాంజీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సంజయ్ శుక్లా తెలిపారు. -
భోపాల్ జైల్ బ్రేక్ మాదిరిగానే..
వరంగల్: వరంగల్ సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సైనిక సింగ్, బీహార్కు చెందిన రాజేష్ యాదవ్ అనే ఇద్దరు ఖైదీలు శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జైలు గోడ దూకి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న వరంగల్ అర్బన్ పోలీస్లు ఇద్దరి కోసం నగరమంతా జల్లెడ పడుతున్నారు. భోపాల్ జైలు నుంచి సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న మాదిరిగానే దుప్పట్ల సహాయంతో జైలు గోడ దూకి ఖైదీలు పరారయ్యారు. రెండు నెలల క్రితమే ఈ ఇద్దరిని చర్లపల్లి జైలు నుంచి ఇక్కడికి తరలించారు. సైనిక్ సింగ్ అనే ఖైదీ ఏకే-47 ఎత్తుకెళ్లిన కేసులో ఐదేళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. మరొక ఖైదీ రాజేష్ యాదవ్ రంగారెడ్డి జిల్లాలో ఓ మర్డర్ కేసులో జీవిత ఖైదీ అనుభవిస్తున్నాడు. ఈ ఇద్దరు చర్లపల్లి జైలులో సిబ్బందితో గొడవ పెట్టుకోవడంతో పాటు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో.. వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా.. అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యారు. జైలులోని సీసీ కెమెరాలతో పాటు పెద్ద లైట్స్ కూడా పనిచేయకపోవడంతో వారి పని సులువైనట్లు తెలుస్తోంది. -
సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరారీ
-
పోలీస్స్టేషన్ నుంచి దొంగ పరారీ
కామారెడ్డి: దొంగతనం కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఓ దొంగ పోలీసుల కన్నుగప్పి బేడీలతో సహా పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసులో అరెస్టైన రంజాన్ అనే వ్యక్తి, పోలీసులు ఆదమరిచి ఉండటాన్ని గమనించి చల్లగా స్టేషన్ నుంచి జారుకున్నాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని తిరిగి పట్టుకొని స్టేషన్కు తీసుకొచ్చారు. -
ఏమిటీ చెర?
తెలిసో తెలియకో నేరం చేశారు.. చిన్న వయసులోనే కటకటాలపాలయ్యారు.. ఇలాంటి చిన్నారులను చేరదీసి.. సన్మార్గంలో నడిపించి.. వారికి సత్ప్రవర్తన నేర్పేందుకు ఏర్పాటుచేసినవే జువనైల్ హోమ్స్. బాల నేరస్తుల్లో మార్పుతెచ్చి వారి భవితకు బంగారుబాట వేయాల్సిన ఈ హోమ్స్ లక్ష్యానికి వ్యతిరేక దిశలో పయనిస్తున్నాయి. గుంటూరులోని నెహ్రూనగర్ జువనైల్ హోమ్లో నలుగురు చిన్నారులు తేలిగ్గా పరారవడం.. ఈ విషయం చర్చనీయాంశం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో సదరు హోమ్ను గురువారం ‘సాక్షి’ పరిశీలించగా, అడుగడుగునా అనుమాన ఆనవాళ్లే కనిపించాయి. గుంటూరు (పట్నంబజారు): గుంటూరులోని నెహ్రూనగర్ చివరన వెంకటాద్రిపేట సమీపంలో 1971లో కొత్తపేట మహిళా మండలి (కేఎంఎం) ఏర్పాటుచేశారు. 1975లో రిజిస్ట్రేషన్ అయ్యింది. అప్పటి నుంచి పిల్లలు వదిలేసిన వృద్ధులు, అనాథలు, ఎవరూ లేనివారు, కుటుంబాలకు దూరమైన మహిళలను చేరదీస్తూ వసతి కల్పిస్తున్నారు. మూడు నెలల కిందటే జువైనల్స్ సంరక్షణ బాధ్యతను కేఎంఎం తీసుకుంది. దీనిలో 30 మంది పలు నేరాలు చేసిన జువనైల్స్ ఉండగా, 60 నుంచి 70 మంది వరకూ ఆసరా లేని వృద్ధులు ఉన్నారు. వీరికి భద్రతగా ప్రైవేట్ వ్యక్తులను నియమించారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం ఈ హోమ్లో ఉంటున్న చిన్నారిని చూసేందుకు వచ్చిన అతని సోదరుడు యాక్సాబ్లేడును ఇచ్చి వెళ్లాడు. దానిద్వారా ఆ చిన్నారి హోమ్ వెనుక భాగంలోని తలుపులకు ఉన్న మూడు తాళాలను కోసి, దుప్పట్లు ఒక దానికి ఒకటి ముడివేసి రెండో అంతస్తు నుంచి కిందకు దిగి నలుగురు స్నేహితులతో పరారయ్యాడు. పరారీ అయిన చిన్నారులు.. తమ తల్లిదండ్రులను చూసొస్తామని లేఖ రాసి వెళ్లినట్లు తెలుస్తోంది. సత్ప్రర్తనపై శ్రద్ధ ఏదీ.. చిన్నారుల్లో మార్పునకు తీసుకోవాల్సిన చర్యల్లో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోంది. యోగా సాధన, కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలేమీ తీసుకోవట్లేదు. తామే స్వయంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నా అలాంటి వాతావరణమేమీ కనిపించలేదు. నిబంధనలివీ.. జువనైల్ హోమ్ విశాలంగా ఉండాలి. సిబ్బంది వద్ద ఎలాంటి ఆయుధాలు ఉండకూడదు. బాల నేరస్తులను మానసికంగా, శారీరకంగా శిక్షించకూడదు. బాల నేరస్తులకు కొబ్బరి నూనె, స్నానం చేసేందుకు, బట్టలు ఉతికేందుకు తగినన్ని సబ్బులు ఇవ్వాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత హోమ్ నిర్వాహకులదే. ప్రతి నలుగురైదుగురికి ఒక మరుగుదొడ్డి ఉండాలి. బాల నేరస్తులు ఆడుకునేందుకు ఇండోర్ పరికరాలు ఉండాలి. వారిలో నేరప్రవృత్తి తగ్గించే కార్యక్రమాలను పరిశీలనా గృహంలో నిర్వహించాలి. టీవీలను ఏర్పాటు చేయవచ్చు. బాల నేరస్తులకు ఉదయం టిఫిన్, పాలు, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలి. వారానికి ఒకరోజు మాంసాహారం, ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి కోడిగుడ్డు ఇవ్వాలి. బంధువులు కేటాయించిన సమయంలో మాత్రమే కలవాలి. కారణమేంటి? భద్రతా సిబ్బంది ప్రైవేట్ వారైనా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలి. సెక్యూరిటీ నిమిత్తం సిబ్బంది ఉన్నారని చెబుతున్నా గేటు వద్ద వాచ్మెన్ కూడా కనిపించలేదు. సిబ్బంది మొద్దునిద్రలో ఉండటం వల్లే తాళాలు కోస్తున్నా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. అయితే, యాక్సాబ్లేడు ఇచ్చిన సమయం రాత్రి 7 గంటలు కావడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిర్వాహకులు ఇప్పటివరకు న్యాయస్థానానికి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. పరారీ అయిన జువనైల్స్ మంగళగిరి పోలీసులకు చిక్కారని తెలుస్తోంది. అత్యవసరమైతే అంతే.. జువనైల్ హోమ్లో ఉండే చిన్నారుల ఆరోగ్యం పట్ల నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కాలపరిమితి లేని మందులనే మెడికల్ రూమ్లో ఉంచడం ఇందుకు నిదర్శనం. సెలైన్లు, ఎలక్ట్రాల్ పౌడర్, ఇంజ క్షన్లో కలిపే వాటర్ ప్యాకెట్లు కాల పరిమితి చెల్లినవి. వీటిని ‘సాక్షి’ గమనిస్తుండగా, నిర్వాహకులు వాటిని బల వంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. అత్యవసరమైతే ఆస్పత్రికి తీసుకెళ్లే వాహనం కూడా ఇక్కడ అందుబాటులో లేదు. నొప్పులు, జ్వరం వస్తే వినియోగించే యాంటిబయోటిక్ మందులే తప్ప వేరే ఏమీ లేవు. నిర్వాహకులు చెబుతున్న ఏఎన్ఎం విధులకు రాలేదు. ఆరోగ్యం బాగోలేక రాలేదని నిర్వాహకులు బుకాయిస్తున్నట్లు చిన్నారులు చెబుతున్నారు. మందుల గది స్టోర్రూమ్ను తలపించేలా ఉంది. బిడ్డల్లా చూస్తాం.. కేఎంఎంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కన్నబిడ్డల్లా చూస్తాం. అయితే, సెక్యూరిటీ తప్పిదం వల్లే చిన్నారులు పరారయ్యారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే కొత్తపేట పీఎస్లో ఫిర్యాదు చేశాం. – పి.రాజ్యలక్ష్మి, నిర్వాహకురాలు -
ఇల్లు బోర్ కొట్టిందో ఏమో..
అనంతపురం: ఇల్లు బోర్ కొట్టిందో లేక కొత్తగా ఏదైనా చేయాలి అనే కుతూహలమో తెలియదు గాని అనంతపురంలో ఇద్దరు చిన్నారులు పెద్ద పనే చేశారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉంచిన 2 లక్షల రూపాయలతో బయటపడ్డారు. చిన్నాళ్లు కదా ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అనే విషయంలో స్పష్టత లేదు. రైల్లో వెళ్తే బాగుంటుందని రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో చిన్నారుల బిత్తరచూపులు అర్థం కావడంతో ఆటో డ్రైవర్లు నిలదీశారు. అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లలను వారికి అప్పగించారు. పోలీసులు పిల్లలతో పాటు నగదును తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంత చిన్నారులైనా వారి ఆలోచనలేంటి అనే విషయంపై తల్లిదండ్రులు కాస్త నజర్ ఉంచడం మంచిదంటున్నారు పోలీసులు. -
అర్ధరాత్రి బాలనేరస్తుల హల్ చల్
మంగళగిరి: చిన్నతనంలోనే పలు నేరాలు చేసిన యువకులు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకుని మళ్లీ నేరం చేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జువెనైల్ హోమ్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు యువకులు మంగళవారం అర్ధరాత్రి హోం తాళాలు పగులగొట్టి తప్పించుకున్నారు. వారు గుంటూరులో ఒక ద్విచక్రవాహనాన్ని దొంగలించి దానిపై విజయవాడ బయలుదేరారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వినుకొండ వెళుతున్న సాక్షి దిన పత్రిక ఆటోను చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రి వద్ద నిలిపి డ్రైవర్పై దాడి చేసి అతడి వద్ద ఉన్న రూ.వెయ్యి నగదు, సెల్ఫోన్ తీసుకున్నారు. ఫోన్లో సిమ్ తీసేసి మళ్లీ గుంటూరు వైపు వెళ్లారు. ఇంతలో ఆటో డ్రైవర్కు తెలిసిన వ్యక్తి అటుగా రావడంతో ఇద్దరూ కలిసి వారిని వెంబడించారు. వీరిని పోలీసులుగా భావించిన యువకులు గుంటూరు వెళ్లి ద్విచక్రవాహనాన్ని అక్కడ వదిలేశారు. అక్కడినుంచి ఆటోలో విజయవాడ బయలుదేరారు. హోం నుంచి తప్పించుకున్న విషయాన్ని పోలీసులు సెట్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు తెలపడంతో అప్రమత్తమైన తాడేపల్లి పోలీసులు వారధి వద్ద ఆటోను ఆపారు. అందులోని ఐదుగురు యువకుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో స్టేషన్కు తరలించారు. సాక్షి పేపర్ ఆటో డ్రైవర్ తన్నీరు శ్రీనివాస్ మంగళగిరి రూరల్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్పై దాడి చేసింది తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న యువకులేనని గుర్తించి వారిని మంగళగిరి స్టేషన్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పరారీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్
► వైద్య విద్యార్థిని మృతిచెందిన రోజే అదృశ్యం ► ప్రకాశంజిల్లా పుల్లలచెరువు వద్ద సెల్ సిగ్నల్ గుర్తింపు ► ఆమె కోసం మూడు పోలీస్ బృందాల గాలింపు సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె సూసైడ్ నోట్లో పేర్కొన్న ప్రొఫెసర్ పరారీలో ఉన్నారు. గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ ఎ.వి.వి.లక్ష్మి వేధింపులు తట్టుకోలేకే తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు మృతురాలు తన డైరీలో సూసైడ్ నోట్ రాసింది. ఆమె మృతితో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీన్ని గుర్తించిన ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల రోజులపాటు సెలవు పెడుతున్నట్లు ప్రిన్సిపాల్కు లెటర్ పంపారు. మృతురాలి తల్లిదండ్రులు తనపై నేరుగా ఫిర్యాదు చేయడం, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకుని పరారయ్యారు. పోలీసులు సెల్ నెట్వర్క్ను పరిశీలించగా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వద్ద ఆ ప్రొఫెసర్ ఉన్నట్లు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుర్తించారు. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలంటూ మృతురాలి బంధువులు, వైద్య విద్యార్థులు ధర్నాకు దిగిన విషయం తెలుసుకుని సిమ్ను వేరుచేసి పక్కనపడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మి కర్నూలు, కడప, అనంతపురం, బెంగళూరు వైపు వెళ్లిందా లేక ఎవరితోనైనా తన సెల్ను పంపి పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరంపాలెం సీఐ మొహమ్మద్ హుస్సేన్ నేతృత్వంలో మూడు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి ప్రొఫెసర్ లక్ష్మి జీమెయిల్ ద్వారా మృతురాలిపై ఆరోపణలతోపాటు తన వివరణతో కూడిన ప్రకటనను అన్ని పత్రికా కార్యాలయాలకు పంపడంపై సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మిపై సస్పెన్షన్ వేటు: లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గుంటుపల్లి సుబ్బారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఎంఈ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. -
పరారైన ముగ్గురు బాలికలు సేఫ్
-చేరదీసి పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్లు - ఇద్దరికి టీసీలిచ్చి ఇళ్లకు పంపించిన వైనం గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల హాస్టల్ నుంచి 6వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఆదివారం రాత్రి హాస్టల్ గేట్ దూకి పరారయ్యారు. సోమవారం వేకువజామున గోదావరిఖని బస్టాండ్కు చేరుకున్న వారిని స్థానిక ఆటోడ్రైవర్లు పోలీస్స్టేషన్లో అప్పగించారు. పోలీసులు హాస్టల్ నిర్వాహకులను పిలిపించి లేఖ రాయించుకుని వారితో పంపించారు. అయితే పారిపోయిన వారిలో ఇద్దరు బాలికలకు టీసీలిచ్చి ఇళ్లకు పంపినట్లు సమాచారం. రామగుండం పట్టణ శివారులో సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ను, దీనికి అనుబంధంగా పాఠశాల, కళాశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో రామగుండం హాస్టల్కు చెందిన 620 మంది, కాటారం మండలంలో ఏర్పాటు చేయదలుచుకున్న హాస్టల్ భవనం ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అక్కడికి చెందిన 140 మంది 5,6,7 తరగతుల బాలికలు ఉంటున్నారు. రామగుండం హాస్టల్లో ఉండే పి.అంజలి, కాటారం హాస్టల్కు చెందిన లక్ష్మీప్రసన్న, ఎస్.మధుప్రియ ఆదివారం రాత్రి 11.30 గంటలకు గేట్ దూకి పారిపోయూరు. విద్యార్థులు గేట్ దూకి పారిపోవడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టినప్పటికీ హాస్టల్ వార్డెన్గానీ, వాచ్మన్గానీ, ఇతర సిబ్బంది గానీ గమనించకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలుపుతోంది. హాస్టల్ నుంచి బయటపడ్డ ముగ్గురు విద్యార్థినులు చేతిలో టార్చిలైట్ పట్టుకుని గోదావరిఖని వైపు బయలుదేరారు. అలిసిపోయినప్పుడు మధ్యమధ్యలో ఆగుతూ సోమవారం వేకువజామున 3గంటలకు రామగుండం మజీద్టర్నింగ్ నుంచి బీ-పవర్హౌస్ వైపు నడుస్తుండగా... ఓ ఆటోడ్రైవర్ గమనించి ఎటు వెళ్తాన్నారని ప్రశ్నించాడు. గోదావరిఖని బస్టాండ్కు వెళ్లాలంటే ఆటోలో తీసుకొచ్చి దింపేశాడు. బాలికల ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆటో యూనియన్ నాయకుడు ధర్మేందర్, మరికొందరు వారిని చేరదీసి గోదావరిఖని వన్టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. పోలీసులు బాలికల నుంచి వివరాలు తెలుసుకొని కాటారం గురుకులం ప్రధానోపాధ్యాయురాలు హైమవతికి ఫోన్లో సమాచారం అందించారు. ఆమె వచ్చి పోలీసులకు లేఖ రాసిచ్చి వారిని తీసుకెళ్లారు. అర్ధరాత్రి ఆడపిల్లలు హాస్టల్ నుంచి పరారైతే గుర్తించి అప్పగించినప్పటికీ న్యూసెన్స్ చేయవద్దంటూ ఉపాధ్యాయురాలు హైమవతి ఆటోడ్రైవర్లతో వాగ్వాదం చేయడంతో వారు ఆమె తీరును ఖండించారు. బాలికలు గోదావరిఖని వైపు కాకుండా మరోవైపు వెళితే... వారి పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొన్నారు. టీసీ ఇచ్చి పంపించారు.. : లక్ష్మీప్రసన్నది గోదావరిఖని బాపూజీనగర్ కాగా.. పి.అంజలిది కాటారం మండలం మద్దెలపల్లి, ఎస్.మధుప్రియది అదె మండలంలోని స్తంభంపల్లి. వీరిని హాస్టల్కు తీసుకొచ్చిన ప్రధానోపాధ్యాయురాలు తల్లిదండ్రులకు సమాచారం అందించి వారు రాగానే లక్ష్మీప్రసన్న, మధుప్రియలకు టీసీలిచ్చి ఇళ్లకు పంపించినట్లు సమాచారం. అంజలి తల్లిదండ్రులు రాకపోవడంతో ఆమెను హాస్టల్లోనే ఉంచుకున్నారని తెలిసింది. తాము హాస్టల్లో ఉండలేమని పిల్లలు చెప్పడంతో తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లినట్లు హాస్టల్ వర్గాలు చెబుతున్నాయి. అమ్మానాన్నలు వచ్చినా చూడనివ్వడం లేదు: హాస్టల్లో చేరిన తర్వాత ఇంటిపై, తల్లిదండ్రులపై ధ్యాస ఏర్పడింది. మమ్మల్ని చూడడానికి వచ్చిన అమ్మానాన్నలు వచ్చినా కనీసం మాట్లాడించకుండా బలవంతంగా లాక్కెళ్తున్నారు. మా పేరెంట్స్ వచ్చిన సమాచారం కూడా చెప్పడం లేదు. రామగుండం హాస్టల్ విద్యార్థినులకు భోజనం పెట్టిన తర్వాత కాటారం హాస్టల్ విద్యార్థులకు పెడుతున్నారు. అప్పటిదాకా వేచిఉండాల్సి వస్తుంది. మా తల్లిదండ్రులను చూడాలనే హాస్టల్ నుంచి బయటకు వచ్చాను. -లక్ష్మీప్రసన్న,విద్యార్థిని కనీసం కృతజ్ఞత చూపలేదు హాస్టల్ నుంచి పరారై వచ్చిన ముగ్గురు ఆడపిల్లలు బస్డాండ్కు చేరడంతో వారిని గుర్తించి టీ తాగించాను. వారి బాధను తెలుసుకుని ఓదార్చి పోలీస్స్టేషన్లో అప్పగించా. అయితే స్టేషన్కు వచ్చిన హాస్టల్ ఉపాధ్యాయురాలు పిల్లలను అప్పగించినందుకు కృతజ్ఞత చూపకుండా న్యూసెన్స్ చేయవద్దు, నాకు పెద్ద అధికారులందరు తెలుసు.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల పిల్లలకు రక్షణ ఉండదు.- ధర్మేందర్, ఆటోడ్రైవర్ వేకువజామునే వెళ్లిపోయూరు.. : పదిహేను రోజుల క్రితం హాస్టల్కు వచ్చిన ముగ్గురు విద్యార్థినులు హాస్టల్ వాతావరణానికి ఇంకా అలవాటుపడలేదు. ఈక్రమంలోనే సోమవారం వేకువజామున వాచ్మెన్ విద్యుత్ మోటార్ ఆన్ చేసేందుకు హాస్టల్లోకి వచ్చిన సమయంలో విద్యార్థినులు గేట్ దూకి పరారయ్యారు. అప్పటికే వాచ్మన్ గుర్తించి మాకు సమాచారం అందించాడు. మేమంతా వెంటనే గాలింపు చర్యలు చేపట్టాం. ఇంతలోనే గోదావరిఖని పోలీస్స్టేషన్ నుంచి సమాచారం రావడంతో వెళ్లి తీసుకువచ్చాం. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదు. - హైమవతి, కాటారంగురుకులం హెచ్ఎం