హుస్సేన్‌సాగర్ శుద్ధిపై హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులు నిలిపివేత | Green Tribunal orders the suspension of refined hussen sagar | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్ శుద్ధిపై హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులు నిలిపివేత

Published Thu, May 7 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

Green Tribunal orders the suspension of refined hussen sagar

మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ శుద్ధి పనులపై స్టే విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు గురువారం నిలుపుదల చేసింది. ఈ మేరకు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుద్ధి పనుల పేరుతో సాగర్‌లోని నీటిని తోడి, ఆ జలాలను మూసీలోకి వదులుతున్నారని స్వచ్ఛంద సంస్థ ‘సోల్’ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి విదితమే.

విచారణ జరిపిన ట్రిబ్యునల్, ఆ పనులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులపై జీహెచ్‌ఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ వ్యాజ్యాలను గురువారం విచారించింది. జీహెచ్‌ఎంసీ తరపు ఏజీ కె.రామకృష్ణారెడ్డి విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement