suspension
-
చెప్పినా వినలేదు.. పాకిస్తాన్కు భారీ షాక్!
అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (FIFA) పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. ‘ఫిఫా’ నియమావళికి అనుగుణంగా పాక్ ఫుట్బాల్ సమాఖ్య (PSF) నిర్వహణ జరగకపోవడంతో ‘ఫిఫా’ శుక్రవారం ఆ దేశ సమాఖ్యపై నిషేధం విధించింది. ‘ఫిఫా’ నియమావళి ప్రకారం నడుచుకునేలా పీఎఫ్ఎఫ్ నిబంధనల్ని సవరించుకోవాలని.. తద్వారా దేశంలో ఆటపై జవాబుదారీతనం పెరగాలని ‘ఫిఫా’ పలు సూచనల్ని చేసినా... పీఎఫ్ఎఫ్ పెడచెవిన పెట్టింది. నిషేధాజ్ఞలుంటాయని హెచ్చరించినా సవరణలు చేయకపోవడంతో ‘ఫిఫా’ తాజాగా సమాఖ్యను సస్పెండ్ చేసింది.అదే విధంగా తాము సూచించిన సవరణలు పూర్తి చేసేదాకా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2019 జూన్లో ‘ఫిఫా’ నియమించిన కమిటీనే పీఎఫ్ఎఫ్ వ్యవహారాలను చక్కబెడుతోంది. కానీ హరూన్ మాలిక్ నేతృత్వంలోని ఈ కమిటీని అక్కడి ప్రభుత్వం శాసించడంతో ఎన్నికల నిర్వహణ, నిబంధనల్లో సవరణల ప్రక్రియ మాత్రం చేపట్టలేకపోయింది.ఈ నేపథ్యంలో హరూన్ తమపై వేటు తప్పదని ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ దృష్టికి తెచ్చినా అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘ఫిఫా’ నియమావళికి తగ్గ మార్పుచేర్పులకు పాక్ ప్రభుత్వ ఆజమాయిషీలోని సమాఖ్య సిద్ధంగా లేదని హరూన్ మాలిక్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ఫిఫా’ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 2017 నుంచి పాక్ సమాఖ్యపై వేటు పడటం ఇది మూడోసారి! మరిన్ని క్రీడావార్తలు40 ఏళ్ల వయసులో 40 పాయింట్లు!.. లెబ్రాన్ జేమ్స్ కొత్త రికార్డు లాస్ఏంజెలిస్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఒక ఎన్బీఏ గేమ్లో 40కి పైగా పాయింట్లు సాధించిన అతి పెద్ద వయస్కుడిగా అతను నిలిచాడు. గురువారం లెబ్రాన్ గోల్డెన్ స్టేట్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 120–112 పాయింట్ల తేడాతో లాస్ఏంజెలిస్ లేకర్స్ విజయం సాధించింది. ఇందులో లెబ్రాన్ ఒక్కడే 42 పాయింట్లు సాధించాడు. గత ఏడాది డిసెంబర్ 30న లెబ్రాన్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ మైకేల్ జోర్డాన్ 40 ఏళ్ల 3 రోజుల వయసులో (2003లో వాషింగ్టన్ విజార్డ్స్ తరఫున) ఒక గేమ్లో 40కి పైగా పాయింట్లు నమోదు చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు లెబ్రాన్ సవరించాడు.పోరాడి ఓడిన రిత్విక్ జోడీ సాక్షి, హైదరాబాద్: డాలస్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ పేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని టెక్సస్లో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 6–7 (4/7), 7–5, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాజీవ్ రామ్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.1 గంట 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బారింటోస్ మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో అనుభవజ్ఞులైన రాజీవ్ రామ్, క్రాయిసెక్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. రిత్విక్–బారింటోస్లకు 11,840 డాలర్ల (రూ. 10 లక్షల 38 వేలు) ప్రైజ్మనీ లభించింది. గత ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ సర్క్యూట్లో నిలకడగా రాణించిన రిత్విక్ ... గత వారం భారత్–టోగో జట్ల మధ్య న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ గ్రూప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా డేవిస్ కప్లో అరగేంట్రం చేశాడు. -
వివాహేతర సంబంధం.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
సేలం: వివాహేతర సంబంధం వ్యవహారంతో సేలంలో హెడ్ కానిస్టేబుల్ సోమవారం సస్పెండ్కు గురయ్యాడు. సేలం ప్రభుత్వ వైద్యశాల ఔట్ పోస్ట్లో హెడ్కానిస్టేబుల్గా గోవిందరాజన్ (38) పనిచేస్తున్నాడు. ఇతని భార్య సంగీత (22). వీరి పిల్లలు దర్శిణి (4), రోహిత్ (8). గోవిందరాజన్ కుటుంబంతో ఇక్కడ ఉన్న పోలీసు క్వార్టర్స్లో నివసిస్తున్నాడు. కాగా గోవిందరాజన్, సంగీతల మధ్య కుటుంబ గొడవ ఉన్నాయి. ఈ స్థితిలో గత ఏడాది అక్టోబర్ 18వ తేదీ ఇద్దరు పిల్లలు మృతదేహాలుగా పడి ఉండగా, పక్కన సంగీత ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో గోవిందరాజ్కు, మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఆ విష యం భార్య సంగీతకు తెలియడంతో గొవడలు జరుగుతూ వచ్చినట్టు తెలిసింది. ఆ కారణంగా జీవితంపై విరక్తి చెందిన సంగీత పిల్లలకు విషం కలిపిన నీటిని తాగించి, తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ ఘటనపై సోమవారం సేలం నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్కుమార్ అభినబు గోవిందరాజ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
యూపీ ఉప ఎన్నికలు.. ఈసీ వార్నింగ్, ఏడుగురి పోలీసుల సస్పెండ్
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వీటితోపాటు దేశ వ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరుగుతున్నాయి.అయితే ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్లో పోలీసులు బురఖా ధరించిన ఓటర్లను తనిఖీ చేయడంపై వివాదం చేలరేగింది. దీనిపై తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. నిష్పక్షపాతంగా ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని భారత ఎన్నికల సంఘం బుధవారం అధికారులను కోరింది. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఈసీ సస్పెండ్ చేసింది.అర్హత ఉన్న ఓటరు ఓటు వేయకుండా అడ్డుకోరాదని తెలిపింది. ఓటింగ్ సమయంలో ఎలాంటి పక్షపాత వైఖరిని సహించబోమని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ జరుపుతామని, ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.కాగా ఉత్తరప్రదేశ్లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుండగా.. బురఖా ధరించిన ఓటర్ల గుర్తింపును సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ నేత అఖిలేష్ కుమార్ అవస్తీ లేఖ రాసింది. ముసుగులు ధరించిన మహిళలు చాలాసార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిన కేసులు గతంలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకగాక కొంతమంది పురుషులు కూడా బురఖా ధరించి ఓటు వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. అయితే వీరిని ఈసీ అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. బురఖా ధరించిన మహిళల గుర్తింపును తనిఖీ చేయకపోతే, నకిలీ ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. సరైన తనిఖీ మాత్రమే న్యాయమైన, పారదర్శకమైన ఓటింగ్కు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బురఖా ధరించిన మహిళలను తనిఖీ చేసేందుకు తగిన సంఖ్యలో మహిళా పోలీసులను పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా మోహరించాలని ఆయన అన్నారు. ఓటరు ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న పోలీసులపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ ధ్వజమెత్తింది. పార్టీ చీఫ్, లోక్సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఇద్దరు పోలీసులు ఓటర్ల గుర్తింపు కార్డులు అడిగే వీడియోను షేర్ చేస్తూ.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరారు."ఎన్నికల సంఘం యాక్టివ్గా ఉంటే.. పోలీసులు ఓటర్ల ఐడీలను తనిఖీ చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోడ్లు మూసివేయకుండా, ఐడీలను స్వాధీనం చేసుకోకుండా, ఓటర్లను బెదిరించకుండా, ఓటింగ్ వేగం మందగించకుండా, సమయం వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. అధికార పార్టీకి ప్రతినిధిగా ఉండకుండా పరిపాలనను చూసుకోవాలని తెలిపారు. అయితే అఖిలేష్ యాదవ్ పోస్టుపై కాన్పూర్ పోలీసులు సైతం స్పందించారు. ఓటర్లను తనిఖీ చేసిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.. ఎన్నికల సమయంలో రాష్ట్ర పోలీసులు ఎన్నికల సంఘం ఆధీనంలోకి వస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల గుర్తింపు కార్డులను తనిఖీ చేయడానికి మార్గదర్శకాలను ఉల్లంఘించిన పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్రెడ్డి అందజేసిన అఫిడవిట్ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్పై రేపు విచారణ నరేందర్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్కు బాధ్యతలు అప్పగించారు. -
ఐదుగురు రెబెల్స్పై ఉద్ధవ్ శివసేన వేటు
ముంబయి:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (ఉద్ధవ్) పార్టీ ఐదుగురు రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడం వల్లే వేటు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.పార్టీ టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరినీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వారు పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ ఆదేశించింది. కాగా,మహారాష్ట్రలో నవంబరు 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. తులసేంద్రపురంలో పూజలు -
సద్దుమణగని ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైదరాబాద్ కొండాపూ ర్లోని 8వ బెటాలియన్లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్ మార్చ్ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్ డీజీ సంజయ్కుమార్జైన్కు లేఖ రాశారు. సస్పెండ్ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ పోలీసులు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు. అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు. సివిల్ డ్రెస్తో ధర్నా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్ ప్రశాంత్, పి.సంపత్ కె.వినోద్ను సస్పెండ్ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్తోనే బెటాలియన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు. ఫోకస్ పెంచిన ఉన్నతాధికారులు టీజీఎస్పీ సర్విస్ రూల్స్ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. -
TGSP: ఎందుకీ వివాదం.. ఏమిటీ ‘ఏక్ పోలీస్’?
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో కొనసాగుతూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆర్టికల్ 311ను తెలంగాణ పోలీస్ శాఖ ప్రయోగించింది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏక్ పోలీస్’? అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారు. పోలీస్స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను ఐదేళ్లలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయి. జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది.దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్లు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశాము. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాము. వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదు’’ అంటూ ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కులగణనకు ఇంటింటి సర్వే‘‘యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట ను పెంచాలి.. కానీ సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న "దర్బార్" కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది’’ అంటూ డీజీపీ హెచ్చరించారు. -
జేపీసీ భేటీలో రసాభాస
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాగ్వాదాలకు వేదికగా నిలిచింది. రసాభాసగా మారిన ఈ సమావేశంలో తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ పట్టరాని ఆవేశంతో గాజు నీళ్లసీసా పగలగొట్టారు. సమావేశాన్ని గలాటాకు వేదికగా మార్చారంటూ బెనర్జీని కమిటీ నుంచి ఒక రోజుపాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేత జగదాంబికాపాల్ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చ సందర్భంగా బీజేపీ నేత, కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్తో టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిల్లును బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బెనర్జీ గాజు నీళ్ల సీసాను పగలగొట్టి చైర్మన్ కుర్చీ వైపుగా విసిరారు. ఈ క్రమంలో అది బెనర్జీ కుడి బొటనవేలుకు కోసుకుపోయింది. ప్రథమ చికిత్స చేసి కుట్లువేశాక ఆయన మళ్లీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్లతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. బెనర్జీ ఆవేశపూరిత చర్యలను మెజారిటీసభ్యులు ఖండించారు. సభ్యుల ఆవేశాలు చూస్తుంటే రేపు పొద్దున ఇంకొకరు ఇలాగే రివాల్వర్తో కమిటీకి వస్తారేమో అని చైర్మన్ పాల్ అసహనం వ్యక్తంచేశారు. బెనర్జీని సస్పెండ్ చేయాలంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే చేసిన తీర్మానాన్ని 10–8 మెజారిటీతో ప్యానెల్ ఆమోదించింది. దీంతో బెనర్జీ కోపంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు.న్యాయవాదులు, మాజీ జడ్జీలతో కూడిన రెండు ఒడిశా ప్రతినిధి బృందాలతో ప్యానెల్ మాట్లాడుతుండగా ఈ గొడవ జరిగింది. వక్ఫ్ బిల్లుతో వీళ్లకు ఏం సంబంధమని బెనర్జీ నిలదీసినట్లు తెలుస్తోంది. తొలుత బెనర్జీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న చైర్మన్ ఆ తర్వాత పదేపదే బెనర్జీ కలగజేసుకోవడాన్ని తప్పుబట్టడం, దీనికి అభిజిత్ గంగోపాధ్యాయ్ మద్దతు పలకడంతో గంగోపాధ్యాయ్తో బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగా బాటిల్ను విసిరేయలేదని తర్వాత బెనర్జీ వివరణ ఇచ్చారు. వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా అభ్యంతరాల నేపథ్యంలో పరిశీలన నిమిత్తం బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసిన సంగతి తెల్సిందే. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
సాక్షి,ఢిల్లీ:వక్ఫ్ చట్ట సవరణపై ఏర్పాటైన జేపిసీ సమావేశంలో గొడవ జరిగింది. గొడవకు కారణమైన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ కళ్యాణ్బెనర్జీపై సస్పెన్షన్ వేటు వేశారు. వచ్చే సమావేశానికి రాకుండా చైర్మన్ జగదాంబికా పాల్ ఆయనను సస్పెండ్ చేశారు.మంగళవారం(అక్టోబర్ 22) జరిగిన జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో టేబుల్పై గాజుగ్లాసును కళ్యాణ్బెనర్జీ పగులగొట్టారు.దీంతో ఆయన చేతి వేళ్లకు గాయాలయ్యాయి.ఆయనకు వైద్యులు నాలుగు కుట్లు వేశారు.కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన వక్ఫ్ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఈ కమిటీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలతో పాటు గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి -
ఎస్సై శ్వేత సస్పెన్షన్
జగిత్యాలక్రైం: కోరుట్ల ఎస్సై–2గా పనిచేస్తున్న శ్వేతను సస్పెన్షన్ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాలలోని మంచినీళ్ల బావి ప్రాంతాలకు చెందిన బొల్లారపు శివప్రసాద్ తనపై ఎస్సై శ్వేత చేయి చేసుకుందని మనస్తాపానికి గురై అక్టోబర్ 23న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో ఎస్సై శ్వేతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై దాడితోనే ఆత్మహత్యాయత్నం -
ముగ్గురు ఐపీఎస్ లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు
-
మహిళా పీఈటీ అకృత్యం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): క్రమశిక్షణ పేరుతో వ్యాయామ ఉపాధ్యాయురాలు (పీఈటీ) విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. తమను పీఈటీ జ్యోత్స్న బారి నుంచి రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటలకు పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థినులు మీడియాకు తమగోడు వెళ్లబోసుకుంటూ.. ఐదేళ్లుగా గిరిజన గురుకులంలో పీఈటీగా పనిచేస్తున్న జ్యోత్స్న బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని ఇక్కడే కొనసాగుతోందన్నా రు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలకు నెలసరి రావడంతో బాత్రూమ్లలో స్నానం చేస్తుండగా ప్రార్థన సమయంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారని ఆగ్రహంతో బాత్రూమ్ల తలుపులు పగులగొట్టి స్నానం చేస్తుండగా తన ఫోన్లో వీడియో తీయడంతోపాటు కర్ర తో చితకబాదారని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న సిరిసిల్ల రూ రల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేయగా.. బాలికలు మరోసారి పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి కలెక్టర్.. పీఈటీ సస్పెన్షన్ గిరిజన బాలికల ఆందోళన గురించి తెలుసుకున్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్తో మాట్లాడి అప్పటికప్పుడు పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. పీఈటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ పద్మను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో పీఈటీ జ్యోత్స్నపై కేసు నమోదైంది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు దారితప్పడంతో దేహశుద్ధి చేసిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఓ జెడ్పీ హైస్కూల్లో కొంతకాలంగా ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వారు తమ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి హెచ్చరించి వదిలిపెట్టారు. మరో ఉపాధ్యాయుడు విధులకు గైర్హాజరు కావడంతో దాడి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ విషయమై హెచ్ఎంను వివరణ కోరగా, ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని విద్యార్థినులు తన దృష్టికి తీసుకురావడంతో మందలించానని, అయినా వారు ప్రవర్తన మార్చుకోకపోవడంతో విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లిందన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. -
అఫ్ట్రాల్ ఐదుకిలోలు నన్నడిగినా ఇచ్చేవాడినిగా సార్!
-
మైనారిటీ గురుకులాల్లో బదిలీల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ అధీనంలోని సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బదిలీల మార్గదర్శకాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. గురుకుల సరీ్వస్ నిబంధనలకు విరుద్ధంగా జూలై 6న జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హేమలత సహా మరికొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గురుకుల సిబ్బందిని తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సరీ్వస్ నిబంధనల పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం 2022లో ఉత్తర్వులు ఇచి్చందని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, స్టే ఉండగా బదిలీ మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని గురుకులాల కార్యదర్శిని ఆదేశిస్తూ, బదిలీ మార్గదర్శకాలను 18 వరకు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
నాగోలు పీఎస్ ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెన్షన్
నాగోలు: నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకుడిపై దాడి ఘటనలో కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ బదిలీ వేటు వేశారు. దీనిలో భాగంగానే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యలను కూడా సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి చర్యలు తీసుకున్నారు. ఎల్బీనగర్లోని భరత్నగర్ కాలనీ చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు ప్రైవేట్ ఉద్యోగి. ఇతనికి నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్, అతని కుమారుడు (16) మైనర్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌతమ్ పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. దీంతో తనపై జరిగిన దాడి ఘటన గురించి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. -
ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..
సాక్షి, విజయవాడ: ఏపీలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ఎత్తివేయబడింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏబీ వెంకటేశ్వర రావుకు పోస్టింగ్ ఇవనున్నారు. అయితే, అవినీతి ఆరోపణలపై గతంలో సస్పెండ్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు తిరిగి విధుల్లో చేరునున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రింటింగ్ అండ్ స్టేషనరి డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నేడు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. -
మహిళా ఉద్యోగులపై వేధింపులు.. కామారెడ్డి DMHO సస్పెండ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్లు రుజువుకావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఇటీవల 20 మంది మహిళా వైద్యాధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన వైద్యశాఖ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యాధికారి అమర్ సింగ్ నాయక్ బుధవారం కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయానికి వచ్చి వివరాలను సేకరించారు. తమను డీఎంహెచ్వో ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మహిళా ఉద్యోగులు ఆయనకు వివరించారు. దీంతో లక్ష్మణ్సింగ్పై వివిధ సెక్షన్ల కింద మొత్తం ఏడు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మహిళా మెడికల్ ఆఫీసర్లను లక్ష్మణ్ సింగ్ వేధిస్తున్నాడని తేలడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. -
పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ప్రమాదం గురించి వైర్లైస్ కంట్రోల్రూమ్కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.కారును రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్ చెప్పారు. ‘మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కారు నడిపిన మైనర్ ప్రమాదానికి ముందు మందుతాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో సెక్షన్ 304 వర్తిస్తుందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి’అని తెలిపారు. పోర్షే కారు ప్రమాదంలో అనీష్, అశ్వినీ అనే ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. -
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ సబబే
సాక్షి, అమరావతి: నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ తీర్పు అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులు అసమంజసంగా ఉన్నాయన్నారు.అక్రమాలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు, కోర్టులో విచారణ ముగిసేంత వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఇందుకు ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు అనుమతిని స్తున్నాయన్నారు. వెంకటేశ్వరరావుపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయన్నారు. అంతేగాక ఆయనపై నమోదైన కేసులో సాకు‡్ష్యలను ప్రభావితం చేసేలా కూడా వ్యవహరించారన్నారు. రెండో సారి సస్పెండ్ చేయడానికి ఇది కూడా ఓ కారణమని, అయితే ఈ విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు.అవినీతి నిరోధక చట్టం కింద ఏబీ వెంకటేశ్వరరావును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని కూడా ఇచ్చిందన్నారు. వెంకటేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, క్యాట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే తీర్పు ఇచ్చిందన్నారు. ఒకే అభియోగంపై రెండు సార్లు సస్పెండ్ చేయడాన్ని క్యాట్ తప్పు పట్టిందన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకుని జీతభత్యాల బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. సస్పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
-
ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
-
బజరంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ వేటు
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ముగిసేవరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పారిస్ ఒలింపిక్స్ ట్రయల్స్ వేదిక వద్ద బజరంగ్ డోప్ టెస్టుకు నిరాకరించడంతో జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ గత నెల 23న బజరంగ్పై తాత్కాలిక నిషేధం విధించింది. -
ఎవరినీ వదిలిపెట్టను..
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తన కేసుపై వచ్చిన ఓ పోస్టుకు.. ‘ఎవరినీ వదిలిపెట్టను’.. అంటూ సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పోస్టు పెట్టారని.. ఓ ఉన్నతస్థాయి అధికారి ఇలా మెసేజ్ పెడితే ఆయనపై కేసుల్లో దర్యాప్తు అధికారులు పారదర్శక విచారణ ఎలా చేయగలరని క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)లో ఏపీ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు వినిపించారు. ఆలిండియా సర్వీసెస్లోని నిబంధనల మేరకే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ విధించిందన్నారు.కేంద్రం అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తెచ్చినట్లు, అందులోనూ అవినీతి ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఏబీవీను సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ‘సుప్రీం’ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. విధుల్లో చేరిన తర్వాత తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రెస్మీట్ల ద్వారా ట్యాపింగ్ కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు ఏప్రిల్, 2023లో క్యాట్ను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జ్యుడీషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్నే, నాన్–జ్యుడిషీయల్ సభ్యురాలు శాలినీ మిస్త్రా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. సాక్షులను బెదిరించే ప్రయత్నం.. ‘రెండుసార్లు విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు వాడిన భాష సమర్థనీయం కాదు.. ఫోన్ ట్యాపింగ్, ఆవినీతి కేసుపై ‘ఆవుకథ, నాలుగు కాళ్ల జంతువు’ లాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలోని పెద్దలపై, కొందరు అధికారులపై అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇదంతా అన్ని పత్రికలు, చానల్లో ప్రసారమైంది. కేసుకు ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానన్నారు. అంశాలను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా.. ఎవరినీ వదిలిపెట్టను అని వెంకటేశ్వరరావు థంబ్నెయిల్ పెట్టారు.ఓ సీనియర్ ఐపీఎస్ ఇలా పెడితే సాక్షులు, విచారణాధికారులు ప్రభావితమవుతారు. ఆయనను విధుల్లో కొనసాగిస్తే విచారణ పారదర్శకంగా సాగే అవకాశంలేదు. అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఫోన్ ట్యాపింగ్ను కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది’.. అని ఏజీ వాదించారు.రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టులు..‘నిజానికి.. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం.. క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయే వరకు లేదా కొట్టేసేవరకు వారిపై సస్పెన్షన్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. గతంలో సుప్రీంకోర్టు, ఏపీ, బాంబే, హరియాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ హైకోర్టులు తీర్పులిచ్చాయి (వాటిని చదివి వినిపించారు). క్రమశిక్షణా చర్యల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది’.. ఏజీ వాదనలు వినిపించారు. అనంతరం వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు విన్న బెంచ్.. వెంకటేశ్వరరావు ప్రెస్మీట్ ఆడియో కాపీని అందజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, తీర్పు రిజర్వు చేసింది. -
బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్.. మహిళా పైలట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఇంతలో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్ 9) ధృవీకరించారు. సస్పెన్షన్కు గురైన మహిళా పైలట్ సోషల్ మీడియాలో పాపులర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్వాష్లు,టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు -
Kolkata: మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. క్యాష్ ఫర్ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్సభ ఎథిక్స్ కమిటీ ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు -
హెచ్ఎండీఏ ఏపీఓ కృష్ణకుమార్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి పరిశీలన లేకుండానే టీడీఆర్ సర్టిఫికెట్ల జారీలో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన శంకర్పల్లి జోన్ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి బీవీ.కృష్ణకుమార్ను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఉదంతంపై సంబంధిత ప్లానింగ్ అధికారులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నగరానికి పడమటి వైపున శంకర్పల్లి జోన్లో ఔటర్ రింగ్రోడ్డును ఆనుకొని ఉన్న పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరిగాయి. అనేక చోట్ల నిబంధనలను విరుద్ధంగా కొనసాగిన ఈ నిర్మాణాల్లో కృష్ణకుమార్ ప్రమేయం ఉన్నట్టు మొదటి నుంచీ ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఈయన ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో కబ్జారాయుళ్లు, అక్రమ నిర్మాణాలకు పాల్పడే వారికి కృష్ణకుమార్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ♦ గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీఆర్లపైన వచ్చిన దరఖా స్తులను పరిశీలించకుండానే ఉన్నతా«ధికారులను తప్పుదోవ పట్టించినట్టుగా తాజాగా రుజువు కావడంతో కమిషనర్ ఆయన్ను సస్పెండ్ చేశారు. ♦ పుప్పాలగూడలోని 330 నుంచి 332 వరకు సర్వేనంబర్లలో తమకు ఉన్న 11,698 గజాల్లో 100 ఫీట్ల రోడ్డుకు భూమిని గిఫ్ట్డీడ్ కింద గ్రా మపంచాయతీకి రిజిస్టర్ చేసినట్టు శ్రావణ్కుమా ర్తో పాటు, మరికొందరు తెలిపారు. ఈ మేరకు వారు టీడీఆర్కు దరఖాస్తు చేసుకున్నారు. ♦పుప్పాలగూడ గ్రామంలోనే వెంకటరమణ, మరికొందరు 314 నుంచి 317 వరకు సర్వేనంబర్లలో ఉన్న 22,046 గజాల్లో మాస్టర్ప్లా¯న్ కింద 100 ఫీట్ రోడ్డులో భూమి పోయిందంటూ టీడీఆర్కు దరఖాస్తు చేసుకున్నారు. ♦టీడీఆర్ దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కృష్ణకుమార్ తన పై అధికారులను తప్పుదోవ పట్టించారు. ప్రస్తుతం ఈ ఒకటిరెండు ఉదంతాలే బయటకు వచ్చినా, ఇంకా వెలుగులోకి రాని అక్రమాలు పెద్దఎత్తునే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో శివబాలకృష్ణపై ఏసీబీ దాడులు కొనసాగుతున్న సమయంలోనే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన అమెరికాకు వెళ్లడంతో ఏసీబీ దాడుల నుంచి తప్పించుకున్నాడని అప్పట్లో హెచ్ఎండీఏ వర్గాలు చర్చించుకోవడం గమనార్హం. -
ప్రణీత్ రావ్ సస్పెన్షన్ లో సంచలన విషయాలు
-
ప్రణీతావ్ సస్పెన్షన్లో సంచలన విషయాలు
-
Tripura: అక్బర్, సీత సింహాలు.. త్రిపుర సర్కారు కీలక నిర్ణయం
అగర్తల: మగ, ఆడ సింహాలకు అక్బర్, సీత అని వివాదాస్పద పేర్లు పెట్టిన ఉదంతంలో త్రిపుర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఈ విషయంలో బాధ్యున్ని చేస్తూ ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్లైఫ్ అండ ఎకో టూరిజం) ప్రబిన్ లాల్ అగర్వాల్ను సోమవారం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సింహాలకు పెట్టిన పేర్లు హిందూ మతస్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఇప్పటికే కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఉన్నతాధికారి సస్పెన్షన్ నిర్ణయం తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. పశ్చిమబెంగాల్లోని సిలిగురి నుంచి తీసుకువచ్చిన రెండు సింహాల్లో మగ సింహానికి అక్బర్ అని, ఆడ సింహానికి సీత అని త్రిపుర సెపాయిజాలా జూ అధికారులు పేర్లు పెట్టారు. ఇది వివాదస్పదం అవడంతో వీహెచ్పీ కోర్టుకు వెళ్లింది. ఇదీ చదవండి.. జ్ఞానవాపి మసీదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు -
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్ల సస్పెన్షన్తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
AP Assembly: టీడీపీ సభ్యుల రచ్చ.. సభ నుంచి సస్పెండ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు మళ్లీ ఓవరాక్షన్ చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు. ప్రతీసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చరచ్చ చేశారు. రెడ్లైన్ దాడి స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభా నిబంధనలకు విరుద్దంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు. సభ జరుగుతుండా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు. అంతటితో ఆగకుండా ప్రజాప్రతినిధులనే స్పృహ మరిచిపోయి టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్పై విసిరారు. స్పీకర్ తమ్మినేని పట్ల అవమానకరంగా ప్రవర్తించారు. స్పీకర్ను అవమానపరిచేలా నినాదాలు చేశారు. దీంతో, టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బడ్జెట్ వేళ.. 146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి పార్లమెంట్ సమావేశాలను(బడ్జెట్) కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేతకు కృషి చేసింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం అఖిల పక్ష భేటీ తర్వాత ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడితో అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ భద్రతా వైఫ్యలంపై కేంద్ర హోం శాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణంతో లోక్సభ నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అదే సమయంలో రాజ్యసభలోనూ ఇలా అవాంతరాలు కలిగిన సభ్యుల్ని సస్పెండ్ చేశారు చైర్మన్. అయితే బడ్జెట్ సమావేశాలు.. అదీ ఎన్నికలకు ముందు ఓటాన్ బడ్జెట్ కావడంతో సభ్యులంతా ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ‘‘అన్ని సస్పెన్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ విషయమై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లతో మాట్లాడాం. ప్రభుత్వం తరఫున సస్పెన్షన్ ఎత్తివేయాలని వాళ్లను కోరాను. అందుకు వాళ్లు అంగీకరించారు అని తెలిపారాయన. లోక్సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్కు గురయ్యారు. ఇక రేపటి నుంచి(జనవరి 31) ఫిబ్రవరి 9వ తేదీదాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
బలిజపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది ఉపాధ్యాయులపై సస్పెన్షన్
-
Wrestling Federation of India: సస్పెన్షన్ను పట్టించుకోం... కమిటీని గుర్తించం!
న్యూఢిల్లీ: ఇంత జరిగినా కూడా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడం లేదు. కేంద్ర క్రీడాశాఖ విధించిన సస్పెన్షన్ను పట్టించుకోమని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నియమించిన అడ్హక్ కమిటీని కూడా గుర్తించబోమని ధిక్కారపు ధోరణిని ప్రదర్శించారు. త్వరలోనే జాతీయ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్íÙప్ పోటీలను నిర్వహించి తీరుతామని పేర్కొన్నారు. ‘మేం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయ్యాం. రిటరి్నంగ్ అధికారి దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేశారు. అలాంటి కార్యవర్గాన్ని ఎందుకు విస్మరిస్తారు. అడ్హక్ కమిటీతో మాకు సంబంధం లేదు. మా సమాఖ్యను మేమే నడిపించుకుంటాం త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పోటీల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకుంటాం’ అని సంజయ్ వెల్లడించారు. నియమావళిని అతిక్రమించలేదని ఇదివరకే క్రీడాశాఖకు సంజాయిషీ ఇచ్చామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. -
స్టూడెంట్తో అసభ్య ఫోటోషూట్.. టీచర్ సస్పెండ్
పదో తరగది విద్యార్ధితో ఫోటోషూట్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. బీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా చిక్కబళ్లాపూర్ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ (డీడీపీఐ) బైలాంజినప్ప ఉత్తర్వులు జారీ చేశారు అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కబళ్లపూర్లోని మురుగమళ్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పదో తరగది చదువుతున్న విద్యార్ధితో కలిసి అసభ్యకరంగా ఫోటోలు దిగారు. టీచర్ అనే పదానికి అర్ధాన్ని మార్చేస్తూ స్టూడెంట్తో లవర్లాగా పోజులు ఇచ్చారు. ముద్దులు కౌగిలింతలతో హద్దులు మీరి ప్రవర్తించారు. విద్యార్ధి సైతం ఉపాధ్యాయురాలిని ఎత్తుకొని, ప్రేమతో ఆమె కొంగు లాగుతున్నట్లు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఇంకేముంది ఈ ఫోటోలోను అమిత్ సింగ్ రాజవత్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Where are we heading as a society ? Pictures and videos from a romantic photoshoot of a government school teacher with a Class 10 student in Karnataka's Murugamalla Chikkaballapur district, went viral, following which the student's parents filed complaint with the Block… pic.twitter.com/WviIHtOP3J — Amit Singh Rajawat (@satya_AmitSingh) December 28, 2023 ఈ ఫోటోషూట్పై నెటిజన్లు మండుపడుతున్నారు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆ పదవికి కలంకం తెచ్చే ప్రవర్తించిన టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక విద్యార్ధిపై కూడా చివాట్లు పెడుతున్నారు. వీళ్ల కారణంగా ఇతరులు చెడిపోయే ప్రమాదం ఉందని, ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఫోటోషూట్ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లి సైతం టీచర్తో గొడవకు దిగారు. దీంతో ఫిర్యాదు అందుకున్న బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి టీచర్ను సస్పెండ్ చేశారు. -
వారంలోగా నిర్ణయం తీసుకోండి: టూరిజం ఎండీ సస్పెన్షన్ ఎత్తివేతపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ బోయినపల్లి మనోహ ర్రావు సస్పెన్షన్ ఎత్తివేతపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆశాఖ ముఖ్యకార్యదర్శికి కోర్టుధిక్కారం కింద నోటీసులు జారీచేసి విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చ రించింది. తదుపరి విచారణను జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మనోహర్రావును సస్పెండ్ చేస్తూ గతనెల 17న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎండీతోపాటు ఓఎస్డీ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అయితే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మనోహర్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక సమావేశంలో భాగంగా తిరుమ ల వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఎన్నికల సస్పెన్షన్లు దీర్ఘకాలం కొనసాగించాల్సిన అవసరంలేదని, సస్పెన్షన్ ఎత్తి వేతపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచా రణ చేపట్టింది. తమ ఆదేశాలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
మహిళా కానిస్టేబుల్ మృతి! భర్తే హత్య చేశాడా?
ఖమ్మం: ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్ ఎస్ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్నగర్గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇవి చదవండి: కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్లనివ్వకుండా నిర్బంధం -
మత్తు వదిలించేలా..
సాక్షి, హైదరాబాద్ : మత్తు మహమ్మారిని తుద ముట్టించేందుకు ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్ర యువతపై పంజా విసురుతున్న గంజాయి, డ్రగ్స్ పీడ వదిలించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో ఈ ఏడాది నుంచే మత్తు కట్టడిపై ప్రభుత్వం యుద్ధభేరి మోగించినట్టు అయ్యింది. టీఎస్ న్యాబ్ (తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో) డైరెక్టర్గా సందీప్ శాండిల్య బాధ్యతలు తీసుకున్న రోజుల వ్యవధిలోనే మూడు దశాబ్దాలుగా ఆల్ఫాజోలం మత్తుదందా చేస్తున్న నిందితులను వెలుగులోకి తేవడమే కాదు రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫాజోలం స్వాదీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్శాఖ పక్కా ప్రణాళికలు ఫలించాయి. నిరుద్యోగుల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిన టీఎస్పీఎస్సీ వరుస పేపర్ లీకేజీలపై కేసుల నమోదు సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదే జరగడంతో దాదాపు సగం సమయం ఎన్నికల కసరత్తు, ఎన్నికల విధుల్లోనే పోలీసులు గడిపారు. ఈ ఏడాదిలో నమోదైన కొన్ని ప్రధాన నేర ఘటనలు ♦ ఫిబ్రవరి 23న వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ ఫస్టియర్ విద్యార్థిని ధరావత్ ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులతో ఆత్మహత్యకు యతి్నంచగా, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27న చనిపోయింది. ♦ ఫిబ్రవరి 17న అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థి నవీన్ను తోటి విద్యార్థి హరిహరకృష్ణ హత్య చేసి తల, గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేసి, వాటిని తగులబెట్టాడు. ♦ఈ ఏడాదిలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం అత్యంత కీలకమైంది. తొలుత టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్షపత్రం లీకేజీపై మార్చి 10న టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ ఫిర్యాదుతో తొలుత కేసు నమోదైంది. ఆ తర్వాత వరుసగా అనేక పరీక్షల లీకేజీ బయటపడడంతో ప్రభుత్వం మార్చి 14న హైదరాబాద్ సిటీ అడిషనల్ సీపీ క్రైమ్స్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సిట్ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ♦ మార్చి 16 సాయంత్రం సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 14 మందిని అగి్నమాపకశాఖ సిబ్బంది కాపాడింది. ♦ మార్చి 11న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు తొలిసారిగా నోటీసులు జారీ చేశారు. ♦ దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న 12 మంది సభ్యుల ముఠాను ఈ ఏడాది మార్చి 23న సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ♦ ఒక నైజీరియాతో సహా నలుగురు సభ్యుల ముఠాను మే 7న అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుంచి రూ.1.30 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు ♦ మే నెలలో కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదేళ్ల కుమారుడు సహా దంపతులు సజీవ దహనం అయ్యారు. ♦ అప్పు తిరిగి చెల్లించే విషయంలో వచి్చన వివాదంతో మలక్పేటలో మాజీ హెడ్నర్స్ అనురాధారెడ్డిని చంద్రమోహన్ మే 15వ తేదీ రాత్రి హత్య చేసి, శరీరభాగాలను ముక్కలు చేసి ఫ్రిజ్లో 13 రోజులు దాచి, ఆ తర్వాత వాటిని మూసీనదిలో వేశాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ♦ దేశవ్యాప్తంగా వందలమందిని ముంచిన ఈ–స్టోర్ ఇండియా సంస్థ రూ.1,000 కోట్ల మోసాన్ని మే 30న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ♦ మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మే 31న దండకారణ్యం గెరిల్లా జోన్లో గుండెపోటుతో మరణించారు. ♦ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో అప్పరను పూజారి సాయికృష్ణ రాయితో మోది దారుణంగా హతమార్చి మృతదేహాన్ని సరూర్నగర్ మండల ఆఫీస్ వెనుక ఉన్న పాత సెఫ్టిక్ ట్యాంక్లో వేసి ఉప్పు, ఎర్రమట్టి నింపిన ఘటన సంచలనం సృష్టించింది. ♦ ఓ మహిళా కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం నేపథ్యంలో మహబూబ్నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికర్ అహ్మద్పై ఆ కానిస్టేబుల్ దంపతులు జగదీశ్, శకుంతల, మరో వ్యక్తి కృష్ణలు దాడి చేసి అతడి మర్మాంగాలు కోశారు. తీవ్రంగా గాయపడిన సీఐ చికిత్స పొందుతూ మరణించాడు. ♦ తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మిని్రస్టేషన్ (డీసీఏ) డిసెంబర్ 6న మచ్చ బొల్లారంలో జరిపిన సోదాల్లో రూ 4.3 కోట్ల విలువైన యాంటీ కేన్సర్ నకిలీ మందులను గుర్తించారు. ♦ డిసెంబర్ 8న సంగారెడ్డి జిల్లాలో టీఎస్ న్యాబ్ సోదాల్లో డ్రగ్ తయారీ కేంద్రాన్ని గుర్తించడంతోపాటు రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ♦ఏడాది డిసెంబర్ 14న ఖమ్మం పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.1.22 కోట్ల విలువైన 484 కిలోల గంజాయిని టీఎస్ న్యాబ్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ♦ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పుల ఊబిలో చిక్కిన సిద్దిపేట కలెక్టర్ గన్మన్ నరేశ్ డిసెంబర్ 15న చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో తన సర్వీస్ రివాల్వర్తో కుమారుడు రేవంత్, కుమార్తె రిషిత, భార్య చైతన్యలను కాల్చి, తను ఆత్మహత్య చేసుకున్నాడు. నేర నియంత్రణలో కీలక అడుగులు ♦ఓవైపు పెరుగుతున్న సైబర్ నేరాలు, మరోవైపు రాష్ట్ర యువత భవిష్యత్కు ముప్పుగా మారిన మత్తు మహమ్మారి కట్టడికి ఈ ఏడాదిలోనే కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ఎన్ఏబీ), తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు మే 31న ప్రారంభమయ్యాయి. ♦ బస్లో భరోసా పేరిట రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆర్టీసీ బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఈ ఏడాది ఆగస్టు 15న ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రజల భద్రత కోణంలో ఇదో నూతన ఆవిష్కరణ. ♦ మొబైల్ ఫోన్ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా..తిరిగి గుర్తించేందుకు తెలంగాణ పోలీసుల టెలికమ్యూనికేషన్స్ విభాగం రూపొందించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ (సీఈఐఆర్) యాప్ వాడడం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించారు. ఈనెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15,024 మొబైల్ఫోన్లు గుర్తించి దేశంలోనే నంబర్వన్గా నిలిచారు. ♦ పని ప్రదేశాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఈ ఏడాది మే 20న ‘సాహస్’వెబ్సైట్ను ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ కొరడా.. అనూహ్య బదిలీలు ♦ఎన్నికల విధుల్లో ఉండే పోలీస్ ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొంచెం గట్టిగానే కొరడా ఝుళిపించింది. అక్టోబర్ 9న రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన మూడు రోజుల తర్వాత ఏకంగా 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ఆరోపణలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన అనంతరం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ♦ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు నిబంధనలకు విరుద్ధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసిన అప్పటి డీజీపీ అంజనీకుమార్పై ఎన్నికల సంఘం అనూహ్యంగా సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం..పోలీస్శాఖలోని కీలక బదిలీలు వరుసగా జరిగాయి. -
ఎంపీల సస్పెన్షన్పై నేడు దేశవ్యాప్త నిరసన
ఢిల్లీ: పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ఎంపీల సస్పెన్షన్పై ఇండియా కూటమి నేతలు నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించనున్నారు. దేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇండియా కూటమి నేతలు శుక్రవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు సస్పెన్షన్ అయిన ఎంపీల్లో ఒకరైన శశిథరూర్ తెలిపారు. INDIA bloc leaders brace for nationwide protest against bulk suspension of opposition MPs Read @ANI Story | https://t.co/pwYFcPbTwJ#INDIAbloc #SuspendedOppositionMPs #JantarMantar pic.twitter.com/WfuR9d9XFS — ANI Digital (@ani_digital) December 22, 2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్సభ నుంచి 100 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. రాజ్యసభ నుంచి 46 మందిపై ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వేటు వేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. సభ నియమాలను అతిక్రమించినందుకు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. #WATCH | Leaders of the INDIA bloc come together to protest against the suspension of 146 opposition MPs at Jantar Mantar in Delhi pic.twitter.com/63rHfQ46FA — ANI (@ANI) December 22, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని విపక్ష నేతలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు -
Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడంతో బుధవారం లోక్సభలో ఇద్దరు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కేరళ కాంగ్రెస్(మణి) సభ్యుడు థామస్ చెళికాదన్, సీపీఎం సభ్యుడు ఎ.ఎం.అరీఫ్ను సభ నుంచి ఈ సెషన్లో మిగిలిన కాలమంతా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ నుంచి సస్పెండైన విపక్ష ఎంపీల సంఖ్య 143కు చేరుకుంది. లోక్సభ నుంచి 97 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెండయ్యారు. -
ప్రజాస్వామ్యం గొంతు నులిమారు: సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీల సస్పెన్షన్ వేటుపై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నులిమిందన్నారామె. బుధవారం ఉదయం సెంట్రల్ హాల్లో ఆమె అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్టమెంటరీ సమావేశం జరిగింది. పార్లమెంట్ ఘటన పరిణామాలు, తదనంతరం రెండు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సందర్భంగా ఆమె సభ్యులతో చర్చించారు. ‘‘సహేతుకమైన, న్యాయబద్ధమైన డిమాండ్ కోసం విపక్షాలు పోరాడుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి ఖూనీ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అని అన్నారామె. డిసెంబర్ 13వ తేదీన జరిగిన అసాధారణ పరిస్థితులపై హోం మంత్రి అమిత్ షా నుంచి వివరణ కోరుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విజ్ఞప్తిలో కేంద్రానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్నది అర్థం కావడం లేదని అన్నారామె. తెలంగాణలో విజయంపై శుభాకాంక్షలు: సోనియా ‘‘అసెంబ్లీ ఎన్నికలకు అంకితభావంతో, దృఢ సంకల్పంతో పని చేస్తున్నందుకు తెలంగాణలోని మనపార్టీ సహచరులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెరవేర్చేందుకు మన శక్తిమేరకు కృషి చేయాలి. ఈ పార్లమెంట్ సెషన్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పొందుపరచింది. దాని గురించి గొప్పగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడానికి తొమ్మిది సంవత్సరాల పాటు తీసుకుంది. -
Parliament :సస్పెండెడ్ ఎంపీలు కోల్పోయేవి ఇవే !
న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్ సెషన్లో ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. ఈ సెషన్లో ఇప్పటివరకు లోక్సభ, రాజ్యసభల్లో కలిపి విపక్షానికి చెందిన 141 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఒక్క లోక్సభ నుంచే 95 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్తో సభను అడ్డుకున్నందుకు స్పీకర్ ఎంపీలపై వేటు వేశారు. అయితే సస్పెండ్ అయిన ఎంపీలకు సంబంధించి మంగళవారం లోక్సభ సెక్రటేరియట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం సస్పెండెడ్ ఎంపీలు కేవలం సభలోకి రాకుండా ఉండడమే కాక ఎంపీలుగా తమకు సంక్రమించిన మరెన్నో హక్కులను తాత్కాలికంగా కోల్పోతారు. ఆ ఎంపీలకు సభతో పాటు పార్లమెంట్ చాంబర్, లాబీ, గ్యాలరీలకు కూడా ప్రవేశం ఉండదు. సాధారణంగా ఎంపీలు వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిట్టింగ్లలో కూర్చునే హక్కునూ సస్పెండెడ్ ఎంపీలు కోల్పోతారు. సస్పెండైన ఎంపీలు ఇచ్చే ఎలాంటి నోటీసులనూ సభలో అనుమతించరు. వారి పేరు మీద ఏ రకమైన బిజినెస్ను లిస్ట్ చేయరు. వీటితో పాటు ఆర్థిక పరమైన ప్రభావం కూడా సస్పెండెండ్ ఎంపీల మీద ఉంటుంది. సాధారణంగా ఎంపీలకు చెల్లించే రోజు వారి భత్యాలు కూడా సెషన్ మొత్తం సస్పెండ్ అయిన ఎంపీలకు చెల్లించరని సర్క్యులర్లో లోక్సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఇదీచదవండి..కొరియా లేడీ యూట్యూబర్కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు -
మంటలు రేపిన..మాక్ పార్లమెంట్!
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల నుంచి తమ సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్ష ఎంపీలు చేపట్టిన కార్యక్రమం తీవ్ర రాజకీయ దుమారానికి తెర తీసింది. విపక్ష ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ, లోక్సభ సభ్యులు మంగళవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని మకర ద్వారం మెట్లపై మాక్ పార్లమెంటు నిర్వహించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాందీతో పాటు పలు విపక్షాల సభ్యులు అందులో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అచ్చంగా సభల్లో మాదిరిగానే సభ్యులంతా నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉభయ సభల నుంచి విపక్ష సభ్యులను భారీగా సస్పెండ్ చేస్తున్న తీరును తీవ్రంగా ఆక్షేపించారు. పాలక పక్షానివి నియంతృత్వ పోకడలంటూ దుమ్మెత్తిపోశారు. పార్లమెంటులో అధికార పక్షానికి చెందిన సభ్యుల వ్యవహార శైలిని వ్యంగ్యంగా అనుకరించారు. ఆ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ ఉన్నట్టుండి లేచి నిలబడి రాజ్యసభలో చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ నడక తీరును, హావభావాలను, ఆయన సభను నిర్వహించే తీరును రకరకాలుగా అనుకరిస్తూ ఎద్దేవా చేశారు. అచ్చం ధన్ఖడ్ మాదిరిగానే కాస్త వెనక్కు వంగి నిలబడి, ‘వెన్నెముక’ అంటూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులంతా నవ్వుతూ ఆయన్ను ప్రోత్సహించగా దీన్నంతటినీ రాహుల్ తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ కని్పంచారు. మరికొందరు విపక్షసభ్యులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నడిపే తీరును కూడా వ్యంగ్యంగా అనుకరిస్తూ ఆటపట్టించారు. ఇదంతా టీవీ చానళ్లలో లైవ్గా ప్రసారమైంది. ముఖ్యంగా ధన్ఖడ్ను బెనర్జీ అనుకరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిగ్గుచేటు: బీజేపీ విపక్షాల తీరుపై బీజేపీ మండిపడింది. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ మండిపడ్డారు. ఈ చర్యతో విపక్ష ఇండియా కూటమి సంస్కారరాహిత్యం అట్టడుగుకు దిగజారిందన్నారు. ప్రజాస్వామిక విలువల పరిరక్షకుడినని చెప్పుకునే రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు, దేశానికి సిగ్గుచేటంటూ ఆక్షేపించారు. వెనకబడ్డ సాదాసీదా నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత రాజ్యాంగ పదవులను అధిష్టించిన వారిని అవమానించడం ఇండియా కూటమి సంస్కృతి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ‘‘ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ధన్ఖడ్ను అవమానించి తీరు ఇందుకు తాజా నిదర్శనం. ఓబీసీ అయిన ప్రధాని నరేంద్ర మోదీని విపక్షాలు ఎంతగా అవమానిస్తున్నదీ దేశమంతా చూస్తూనే ఉంది. ఈ విషయంలో రాహుల్ను కోర్టు దోషిగా కూడా తేలి్చంది. రాష్ట్రపతి ముర్మును కూడా అదీర్ రంజన్ చౌధరి రాష్ట్రపత్ని అంటూ అవమానించారు’’ అన్నారు. తీరని అవమానం: ధన్ఖడ్ విపక్ష సభ్యుల ప్రవర్తన అత్యంత దారుణ, సిగ్గుచేటు అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ మండిపడ్డారు. ఉదయం రెండుసార్లు వాయిదా పడ్డ రాజ్యసభ మధ్యాహ్నం తిరిగి సమావేశం కాగానే కాంగ్రెస్ ఎంపీ దిగి్వజయ్సింగ్ నినాదాలకు దిగగా కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. విపక్ష ఎంపీలు తనను అనుకరిస్తూ ఎద్దేవా చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘పార్టీల మధ్య వాగ్యుద్ధాలు, పరస్పర విమర్శలు సహజమే. కాకపోతే రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్ వంటి వ్యవస్థలపై కనీస గౌరవం చూపాలి. కానీ నేనిప్పడే చానళ్లలో చూశా. చైర్మన్ను, స్పీకర్ను వ్యంగ్యంగా అనుకరిస్తూ ఒక ఎంపీ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే మీ పార్టీ సీనియర్ నాయకుడు (రాహుల్) దాన్ని వీడియో తీస్తున్నాడు. ఆయన మీకంటే పెద్ద నాయకుడు. ఇది చాలా దారుణం. అభ్యంతరకరం. అత్యంత సిగ్గుచేటు. ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. దేనికైనా ఒక హద్దుంటుంది! కానీ ఈ దిగజారుడుతనానికి హద్దంటూ లేదా? మీకు సద్బుద్ధి కలగాలని ఆశించడం తప్ప ఏం చేయగలను?’’ అంటూ మండిపడ్డారు. అనంతరం మరో కాంగ్రెస్ సభ్యుడు పి.చిదంబరాన్ని ఉద్దేశించి కూడా ధన్ఖడ్ తన ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రాజ్యసభ చైర్మన్ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని ఒకరు వ్యంగ్యంగా అనుకరిస్తుంటే, ఇంకొకరు వీడియో తీస్తుంటే చూసి నా హృదయం ఎంతగా క్షోభిల్లి ఉంటుందో మీరే ఊహించండి! దేశాన్ని చిరకాలం పాటు పాలించిన పార్టీ రాజ్యసభ చైర్మన్ వ్యవస్థను ఇంత దారుణంగా అవమానించడం దారుణం. మిస్టర్ చిదంబరం! ఏమిటిది? మీకో విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఈ ఉదంతంతో నా మనసు ఎంతగానో గాయపడింది. పైగా ఆ వీడియోను మీ పార్టీ ఇన్స్టా్రగాంలో, పార్టీ ట్విటర్లో కూడా పెట్టారు. తద్వారా నా రైతు నేపథ్యాన్ని, ఒక జాట్గా నా సామాజిక నేపథ్యాన్ని, రాజ్యసభ చైర్మన్గా నా హోదాను... ఇలా అన్నింటినీ తీవ్రంగా అవమానించారు’’ అంటూ ధన్ఖడ్ తీవ్రంగా ఆక్షేపించారు. -
బహిష్కరణకూ ఓ పద్ధతుంది!
పార్లమెంట్ సభ్యురాలు మహువా మోయిత్రాను సభా సభ్యత్వం నుండి డిసెంబర్ 8న లోక్సభ బహిష్కరించింది. ఆమెను లోక్సభలో ప్రసంగించడానికి అనుమతించలేదు. ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. అయినా మొయిత్రాను 17వ లోక్సభ నుండి బహిష్కరించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఉనికిలో లేని నీతి నియమావళితో ఆమెను దోషిగా నిర్ధారించారు. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దు చేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘనల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్ ఉదాహరణలు మనకు ఉన్నాయి. మహువా మొయిత్రాను బహిష్కరించే తీర్మా నాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టారు. మొయిత్రా ప్రవర్తన (ఆమె తన పార్ల మెంటరీ లాగిన్ వివరాలను పంచుకోవడం, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి నగదును, సౌకర్యాలను స్వీకరించడం) పార్ల మెంట్ సభ్యురాలికి తగదని ఆ తీర్మానం పేర్కొంది. బహిష్కరణ ప్రక్రియను వెంటాడి వేధించడంగా అభివర్ణించారు మొయిత్రా. తనపై ఆరోపణకు సంబంధించి డబ్బు మార్పిడికి ఎలాంటి రుజువు లేదనీ, నైతిక కమిటీలో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం ప్రేరేపితమైనదనీ, ఇది వైరుద్ధ్యపూరితంగా ఉందనీ అన్నారు. తనపై నిందమోపిన వారిని ఎదురు ప్రశ్నించడానికి ఆమెను అనుమతించలేదు. మన పార్లమెంట్ పనితీరుకు సంబంధించినంత వరకు ఈ మొత్తం అధ్యాయం వివాదాస్పదమైంది. రాజకీయాలు, వ్యక్తిత్వం ఈ ప్రక్రియను కప్పివేశాయి. పార్లమెంట్ తన వ్యవహారాల నిర్వహణకు సొంత నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని మన రాజ్యాంగం ఇచ్చింది. దుష్ప్రవర్తన కారణంగా దాని సభ్యులను బహిష్కరించే అధికారం దీని పర్యవసానమే. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దుచేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘ నల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమె రికా, బ్రిటన్ల ఉదాహరణలు మనకు ఉన్నాయి. అమెరికన్ కాంగ్రెస్తో మొదలుపెడదాం: డిసెంబర్ 1న అమెరికా ప్రతినిధుల సభ, న్యూయార్క్ రిపబ్లికన్ గెరోజ్ శాంటోస్ను తన సభ్యత్వం నుండి బహిష్కరించింది. ఎన్నికల ప్రచారంలో వంచన, ఆర్థికపరమైన అవక తవకలు, ఉల్లంఘనలు, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై సుమారు తొమ్మిది నెలల విచారణ తర్వాత ఈ బహిష్కరణ ఆదేశం వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిపై వచ్చిన ఫిర్యాదులను రెండు వేర్వేరు కార్యాలయాలు పరిశీలించాయి. ఒకటి... కాంగ్రెషనల్ ఎథిక్స్ కార్యా లయం (ఓసీఈ). నైతిక చట్టంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదులు, పరిశోధకులతో కూడిన స్వతంత్ర, పక్షపాతం లేని ఈ సంస్థను 2008లో స్థాపించారు. ఇది హౌస్ సభ్యులపై, కాంగ్రెస్ సిబ్బందిపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది, పునఃపరిశీలిస్తుంది. ఒక వివరణాత్మక పరీక్ష తర్వాత, ఇది తన సిఫార్సును ఎథిక్స్ కమిటీకి పంపుతుంది. ఇది స్వీకరించే ఫిర్యాదులు, వాటిపై తీసుకునే చర్యల గురించి వివరణా త్మక గణాంకాలను కూడా ప్రచురిస్తుంది. శాంటోస్పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన రెండో కార్యా లయం హౌస్ ఎథిక్స్ కమిటీ. ఇది ఇతర సభ్యుల నుండి ఫిర్యాదులను స్వీకరించింది. ‘ఓసీఈ’ నుండి సూచనను, శాంటోస్ వ్యవహారాన్ని విచారించిన ప్రతినిధుల సభ నుండి తీర్మానాన్ని హౌస్ ఎథిక్స్ కమిటీ పరిశీలించి ఒక పరిశోధనాత్మక సబ్ కమిటీని నియమించింది. ఇది 40 మంది సాక్షులను ఇంటర్వ్యూ చేసింది. 72,000 పేజీల పత్రాలను అందుకుంది. సబ్కమిటీకి తన వివరణను ఇవ్వడానికి ఎథిక్స్ కమిటీ శాంటోస్నూ అనుమతించింది. కాని దాన్ని ఆయన తిరస్కరించారు. శాంటోస్ ‘తన వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం, ప్రతినిధుల సభకు తన అభ్యర్థిత్వంలోని ప్రతి అంశాన్నీ మోసపూరితంగా ఉపయోగించు కోవాలని చూసినట్లు’ పరిశోధనాత్మక కమిటీ కనుగొంది. ఎథిక్స్ కమిటీ నివేదికలోని బహిష్కరణ ప్రతిపాదనను ప్రతినిధుల సభ పరి గణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ సభ్యుడిని తొలగించడానికి అమెరికా రాజ్యాంగం ఒక భారీ అడ్డంకిని ఉంచింది. అలాంటి తొలగింపు ప్రతి పాదనకు సంబంధిత సభలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరించాలి. అతడిని తొలగించడానికి చేసిన మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడవ ప్రయత్నంలో, అతని రిపబ్లికన్ పార్టీకి చెందిన 105 మంది సభ్యులు కూడా 206 మంది డెమోక్రాట్లతో కలిసి శాంటోస్ని బహిష్కరించారు. ఎంపీల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండేలా పర్యవేక్షించ డానికి బ్రిటన్ పార్లమెంట్ కూడా విస్తృతమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఇది ప్రయోజనాలకు సంబంధించిన పబ్లిక్ రిజిస్టర్ని నిర్వ హిస్తుంది. ఎంపీలు తమ పార్లమెంటరీ విధుల సమయంలో పొందిన ఆదాయాలు, ఆతిథ్యం, బహుమతులను తప్పనిసరిగా ప్రకటించాలి. పార్లమెంటరీ ప్రమాణాల కమిషనర్ అని పిలిచే ఒక స్వతంత్ర అధికారి ఈ రిజిస్టర్ను నిర్వహిస్తారు. ఎంపీలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలి స్తారు. కమిషనర్ పనిని ఎంపీల స్టాండర్డ్స్ కమిటీ సమీక్షిస్తుంది.ఎంపీలపై ఎలాంటి చర్య తీసుకోవాలో సిఫారసు చేస్తుంది. 2009లో, ఖర్చుల కుంభకోణం (హౌస్ ఆఫ్ కామర్స్ ఎంపీలు పార్లమెంట్ నుండి వ్యక్తిగత ఖర్చులను రీయింబర్స్ చేయడం) తర్వాత, ఎంపీలు, వారి సిబ్బంది వేతనాలు, పింఛన్లను నియంత్రించేందుకు స్వతంత్ర పార్లమెంట్ ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేయడానికి బ్రిటన్ ఒక చట్టాన్ని కూడా ఆమోదించింది. ఫిర్యాదులను స్వీకరించడానికి, దర్యాప్తు చేయడానికి స్వతంత్ర యంత్రాంగాలతో పాటు, అమెరికా, బ్రిటన్ పార్లమెంటులు, వారి సభ్యులు అనుసరించ డానికి వివరణాత్మక మార్గదర్శకాలను కూడా అందించాయి. ఉదాహ రణకు అమెరికాలో ఈ సంవత్సరం ప్రారంభంలో, కాంగ్రెషనల్ ఎథిక్స్ కార్యాలయం ఒక విషయాన్ని హౌస్ ఎథిక్స్ కమిటీకి సూచించింది; ప్రతినిధుల సభకు చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కోర్టెజ్, 2021లో ఛారిటీ మెట్ గాలాలో ధరించేందుకు మేకప్ సేవలు, హ్యాండ్బ్యాగ్, ఆభరణాలు, దుస్తులను అంగీకరించడం ద్వారా బహు మతి నియమాలను ఉల్లంఘించి ఉండవచ్చంది. భారతదేశంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీ తన ఎంపీలకు ప్రవ ర్తనా నియమావళిని నిర్వచించింది. రాజ్యసభ ఎంపీలు తమ పార్ల మెంటరీ వ్యవహారాల కోసం ఎలాంటి ప్రయోజనాలనూ అంగీకరించకూడదని కోడ్ నిర్దేశిస్తుంది. వారి వ్యక్తిగత ప్రయోజనాలకూ, ప్రజా ప్రతినిధిగా వారి విధినిర్వహణకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడిన సంద ర్భాల్లో, వారు తమ ప్రభుత్వ కార్యాలయానికి బాధ్యత వహించాలని కూడా ఇది పేర్కొంది. రాజ్యసభ ఎంపీలు తప్పనిసరిగా బ్రిటన్ పార్లమెంట్ పద్ధతిలో వలే సభ్యుల ప్రయోజనాల రిజిస్టర్ను కూడా పూరించాలి. ప్రత్యక్షంగా ఎన్నికైన సభ ఇంకా ఈ నిబంధనలను తన నియమాలలో పొందుపరచనందున ఈ కోడ్, రిజిస్టర్ రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుంది తప్ప లోక్సభ సభ్యులకు కాదు. 1951లో నాటి మన తాత్కాలిక పార్లమెంటు తన సభ్యులలో ఒకరైన హెచ్జి ముద్గల్ సభా గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తించిన మొదటి కేసును ఎదుర్కొంది. ఈ కేసులో ముద్గల్ను సమర్థించుకోవ డానికి అనుమతించారు. ఆ తర్వాత సభ తనను బహిష్కరించే ముందు ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్రవర్తనను పరిశీలించిన కమిటీ, ఎంపీలకు ప్రవర్తనా నియమావళిని విధించాలని కోరింది. ఏ సభ్యుడైనా సంబంధిత పార్టీల నుండి ద్రవ్య లేదా ఇతర పరిగణనలను అంగీకరించడంపై నిర్దిష్ట కారణాలను, ప్రయోజనాలను సమర్థించు కోవడం అనేది ప్రజాస్వామ్యానికి విషం అవుతుంది. 72 ఏళ్ల తరువాత, ఇదే విధమైన ప్రశ్నపై బహిరంగ చర్చ కేంద్రీకృతమై ఉన్నందున, ఎంపీల నైతిక నిబంధనల ఉల్లంఘనలను నిర్ణయించడానికి పార్లమెంటుకు పటిష్ఠమైన విధానం ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి ప్రక్రియ పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టి, దాని శాసన సమగ్రతను కాపాడే సాధనంగా మారుతుంది. దాని నిర్ణ యాల గురించి ఎలాంటి అనుమానాలనైనా తొలగించివేస్తుంది. వ్యాసకర్త, చక్షూరాయ్, లెజిస్లేటివ్ అండ్ సివిక్ ఎంగేజ్మెంట్ హెడ్, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
‘మహువా’ పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్లో టైమ్ అవుట్ పద్ధతితో పోల్చారు. ‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు. ‘రెండువారాల క్రితం వరల్డ్ కప్ జరిగింది.అందులో ఒక మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ టైమ్ అవుట్ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు. కాగా, పార్లమెంట్లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మహువాపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఆమెపై విచారణకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్ కమిటీ మహువానున లోక్సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్సభ శుక్రవారం వాయిస్ ఓట్తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం -
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ: ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మాణంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్ను కోరారు. AAP MP Raghav Chadha returns to the Parliament as his suspension was revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar, after 115 days. pic.twitter.com/zDWWk80p2l — ANI (@ANI) December 4, 2023 తన సస్పెన్షన్ను రద్దు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఛైర్మన్ ధంఖర్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఛైర్మన్ జగదీప్ ధంఖర్కు ధన్యవాదాలు తెలిపారు. "సుప్రీంకోర్టు జోక్యంతో నాపై విధించిన సస్పెన్షన్ను రద్దు అయింది. నన్ను 115 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ప్రజల గొంతును సభలో వినిపించలేకపోయాను. రాజ్యసభ ఛైర్మన్కు ధన్యావాదాలు తెలియజేస్తున్నాను" అని వీడియో సందేశంలో చెప్పారు. #WATCH | AAP MP Raghav Chadha's suspension revoked by Rajya Sabha Chairman Jagdeep Dhankhar on the motion moved by BJP MP GVL Narasimha Rao. pic.twitter.com/I0UlbnORTe — ANI (@ANI) December 4, 2023 దేశ రాజధాని ఢిల్లీ (సవరణ) బిల్లు-2023పై ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చారంటూ గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. ఇదీ చదవండి: Madhya Pradesh: దిగ్విజయ్కు ఘోర పరాభవం.. -
ముగ్గురు పోలీస్ అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు
-
ఈకామ్ రుణాలు ఆపేయండి
ముంబై: ఈకామ్, ఇన్స్టా ఈఎంఐ కార్డు సాధనాల కింద రుణాల మంజూరు, వితరణ నిలిపివేయాలంటూ బజాజ్ ఫైనాన్స్ను ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ రుణాల మార్గదర్శకాలను పాటించకపోవడమే ఇందుకు కారణం. సదరు లోపాలను సంతృప్తికరమైన విధంగా బజాజ్ ఫైనాన్స్ సరిచేసుకున్నాక ఆంక్షలను పునఃసమీక్షిస్తామని పేర్కొంది. -
ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యార్థి ఏడాది సస్పెన్షన్
గాంధీఆస్పత్రి : ర్యాగింగ్ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కు పాల్పడిన వైద్య విద్యారి్థని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్రెడ్డి నేతృత్వంలో గురువారం కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై తీర్మానాలు చేశారు. అనాటమీ విభాగంలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్లో ర్యాగింగ్కు సంబంధించి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా 2020 బ్యాచ్కు చెందిన ఓ విద్యార్థి పలుమార్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సదరు విద్యారి్థని ఏడాది పాటు హాస్టల్తోపాటు కళాశాలను నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. గతంలో ర్యాగింగ్కు పాల్పడి సస్పెన్షన్కు గురైన విద్యార్థులు, వారి తల్లితండ్రులు యాంటి ర్యాగింగ్ కమిటీని కలిసి మరోమారు ర్యాగింగ్కు పాల్పడమని, సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరగా, కమిటీ వారి అభ్యర్థనను ఏకగ్రీవంగా తిరస్కరించింది. క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా కేవలం సస్పెన్షన్తో సరిపెట్టినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. యాంటీ ర్యాగింగ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇకపై ర్యాగింగ్కు పాల్పడిన వారిపై పోలీస్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. గాం«దీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, కాలేజీకి చెడ్డపేరు తెచ్చెవారిని ఉపేక్షించరాదని తీర్మానించి, ర్యాగింగ్ నిరోధానికి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో గాంధీ వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ రాజారావులతోపాటు పలు విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు 40-50 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించనున్నారని...ఆ లిస్ట్లో తన పేరు ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం రాజాసింగ్ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను స్ఫస్పెన్షన్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలువబోతున్నట్లు పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ -
ప్రీతి కేసు.. సైఫ్పై సస్పెన్షన్ ఎత్తివేత!
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి(26) సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి సైఫ్ పై సస్పెన్సన్ను ఎత్తేశారు. హైకోర్టు ఆదేశంతో సైఫ్ పై సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ ప్రకటించారు. దీంతో.. తరగతులకు హాజరు అయ్యేందుకు సైఫ్కు అనుమతి లభించినట్లయ్యింది. డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే.. ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 22 న ఎంజీఎంలో ఆమె ఆత్మహత్యా యత్నం చేయగా.. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. మరోవైపు ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు, కళాశాల ప్రిన్సిపల్ కు పిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద కేసు నమోదు చేసి సైఫ్ ను రిమాండ్ తరలించిన పోలీసులు. మరోవైపు కేఎంసీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఈ కేసు తీవ్రంగా పరిగణించింది. ఏడాదిపాటు సైఫ్ తరగతులకు హాజరు కాకుండా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో.. బెయిల్పై సైఫ్ ఈ విడుదల అయ్యాడు కూడా. అయితే.. తన నుంచి వివరణ తీసుకోకుండానే కాలేజీ తనపై సస్పెన్షన్ వేటు వేసిందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు సైఫ్. ఈ క్రమంలోనే.. సైఫ్ వివరణ తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. అయితే.. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని గత శుక్రవారం సైఫ్ కు నోటీస్ ఇచ్చారు కేఎంసీ ప్రిన్సిపాల్. కానీ, ఆ సమావేశానికి సైఫ్ హాజరు కాలేదు. దీంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రిన్సిపాల్. అయితే.. ప్రస్తుతానికి సస్పెన్షన్ ను తాత్కాలికంగా నిలిపివేసి సైఫ్ను తరగతులకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత అతని వివరణ తీసుకోవాలని.. ఆపై యాంటీ ర్యాగింగ్ కమిటీదే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఆదేశాల మేరకు సైఫ్ సస్పెన్సన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు కేఎంసీ ప్రిన్సిపాల్. -
బాబు మాజీ పీఎస్ ‘పెండ్యాల’ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటుపడింది. ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. అయితే, ఆయన ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయారు. ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్విసు రూల్స్ను అతిక్రమించడమేనని సర్కారు స్పష్టంచేసింది. మరోవైపు.. శ్రీనివాసరావు శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా ప్రభుత్వం నోటీసు పంపింది. అయితే, ఆయన రాకపోవడంతో సర్విసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శ్రీనివాసరావుపై సస్పెన్షన్ తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు కొనసాగుతుందని ప్రభుత్వం అందులో స్పష్టంచేసింది. ఈ కాలంలో రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ను విడిచి వెళ్లరాదని పేర్కొంది. సస్పెన్షన్ సమయంలో శ్రీనివాసరావుకు నిబంధనల మేరకు అలవెన్స్ను చెల్లించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పెండ్యాల పారిపోయింది ఇలా.. ♦ అమెరికాలో తన తోడల్లుడి గృహప్రవేశంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉండటంతో సెలవు కోరుతూ ఆగస్టు 23న ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ♦ స్కిల్ కుంభకోణంలో విచారించడానికి సీఐడీ ఆయనకు నోటీసులిచ్చినట్లు సెపె్టంబర్ 5, 6 తేదీల్లో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. ♦ దీంతో అత్యవసర ఆరోగ్య పరీక్షల కోసం తక్షణం అమెరికా వెళ్లాలంటూ సెపె్టంబర్ 5న మరో లేఖ రాశారు. కానీ, ఈ లేఖతో ఆరోగ్యానికి సంబంధించి కానీ, డాక్టరు సిఫార్సు లేఖ కానీ జతచేయలేదు. ♦ సెపె్టంబర్ 6న ప్రభుత్వ సర్విసు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండానే అమెరికా వెళ్లిపోయారు. ♦ అనంతరం.. ఆరోగ్యం బాగోలేదు దానితో వెంటనే అమెరికా వెళ్లిపోయాను, లీవ్ ఇవ్వమని కోరుతూ సెపె్టంబర్ 7న లేఖ రాశారు. సాధారణంగా ఇటువంటి సెలవులకు కనీసం 10 రోజుల ముందుగా లేఖ రాయాల్సి ఉంటుంది. ♦ ఇక ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయారని నిర్థారించుకున్న తర్వాత సెపె్టంబర్ 13న సెలవును తిరస్కరించారు. ♦ తక్షణం విధుల్లో చేరాల్సిందిగా మెమో జారీచేయగా సెపె్టంబర్ 20న సెలవు కోరుతూ మరో లేఖ రాశారు. ♦ ఆ తర్వాత మరో మూడ్రోజుల అదనపు సమయం ఇచ్చినా విధుల్లో చేరకపోయేసరికి ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. -
చంద్రబాబుకు మరో షాక్..
సాక్షి, అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్కు గురయ్యాడు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివరాల ప్రకార.. చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు శ్రీనివాస్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నాడు. ఇక, స్కిల్ కుంభకోణం కేసు, ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక, ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. ఈ క్రమంలో శుక్రవారంలోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా శ్రీనివాస్ వెనక్కి రాలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్పై సస్పెన్షన్ విధించారు. మరోవైపు.. నారా లోకేష్ సన్నిహితుడు రాజేష్ కూడా దేశం నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: విశాఖ బీచ్కు కొట్టుకొచ్చిన అరుదైన పెట్టె.. చూసేందుకు ఎగబడ్డ జనం! -
ప్రశాంతంగా ‘మండలి’ కార్యక్రమాలు
సాక్షి, అమరావతి : ఉదయం కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్ద ఈలలు, నినాదాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తప్పితే శుక్రవారం శాసన మండలి కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయి. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ప్రశ్నోత్తరాలలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, గిరిజనుల సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లు తదితర ప్రశ్నలపై చర్చలో పలువురు అధికార పార్టీ సభ్యులతోపాటు ప్రతిపక్ష పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంబంధ అంశాలపై పలువురు ఎమ్మెల్సీలు ‘స్పెషల్ మెన్షన్’ కింద మండలి చైర్మన్ మోషేన్రాజుకు విజ్ఞాపన పత్రాలు అందించారు. ‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగతి – రాష్ట్ర ప్రభుత్వ చర్యలు’ అంశంపై రెండు గంటలపాటు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో వివిధ పార్టీల సభ్యుల ప్రసంగాల అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సమాధానమిచ్చారు. వారంతట వారుగా సభ నుంచి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుపై పెట్టిన కేసులపై చర్చించాలంటూ టీడీపీ, ‘జాబ్క్యాలెండర్’పై చర్చ కోరుతూ పీడీఎఫ్ సభ్యులు రెండు వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఆ రెండింటినీ తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు కోరుతున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మండలి కార్యక్రమాల అజెండాలోనూ ఉందని చైర్మన్ వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై చర్చించాలని బీఏసీలోనూ నిర్ణయించినందున టీడీపీ ఎమ్మెల్సీలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి అంబటి రాంబాబు కూడా సూచించారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు వినకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక టీడీపీ ఎమ్మెల్సీలు మరోసారి పోడియం పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. మండలి చైర్మన్ మోషేన్రాజు మార్షల్స్ను పిలిపించి వారు పోడియం వద్దకు రాకుండా నిలువరించారు. టీడీపీ సభ్యులు మార్షల్స్ను నెడుతూ, విజిల్స్ వేస్తూ అల్లరి చేశారు. దీంతో మంత్రి సురేష్ చేసిన ప్రతిపాదన మేరకు టీడీపీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్ను ఈ సమావేశాలు జరిగే అన్ని రోజులు, బీటీ నాయుడు, పంచుమర్తి అనురాధను శుక్రవారం ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. వారిని మార్షల్స్ బయటకు తరలించారు. అనంతరం మిగిలిన టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. వారి నుంచి ప్లకార్డులు స్వా«దీనం చేసుకోవాలని చైర్మన్ మార్షల్స్ను ఆదేశించారు. దీంతో ఆ టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వారంతట వారే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చారు.. రౌడీయిజంతో ప్రవర్తించడం వల్లే..– మండలి చైర్మన్ ఈ సభ చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం తీవ్ర విచారకర సంఘటన అని చైర్మన్ మోషేన్రాజు అన్నారు. సస్పెండ్ అయిన సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘చాలా దురదృష్టకరం. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు. సభా సంప్రదాయాలను తెలుసుకోవాలి. చైర్మన్ స్థానానికి, ఇతర సభ్యులకు గౌరవం ఇవ్వాలి. అది తెలుసుకోకుండా ఏదో రౌడీయిజంగా ప్రవర్తించడం చాలా విచారించదగ్గ అంశం’ అని మోషేన్రాజు వ్యాఖ్యానించారు. -
పలాయనవాదమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్’ స్కామ్పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్ విసిరినా పట్టించుకోలేదు. çసభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్–చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. సభ ప్రారంభమైంది మొదలు.. రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్తో మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ తీరుపై మండిపాటు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిషేధం ఉన్నా సెల్ఫోన్లతో చిత్రీకరణ మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్లు తమ సెల్ఫోన్ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడియో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు స్పీకర్ను కోరారు. వీడియో రికార్డింగ్ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్లను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూల్ పాస్ చేశారు. దీంతో వీరిని మార్షల్స్ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ సహా టీడీపీ సభ్యులు కుర్చిలలో నిల్చొని విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు. -
కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు
సాక్షి, వరంగల్: సీనియర్ ర్యాగింగ్, భరించలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ర్యాగింగ్కు పాల్పడిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ప్రకటించారు. ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు మూడు నెలలపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. మరో 20 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీన కేఎంసీ హాస్టల్లో ఓ జూనియర్పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడి దాడి చేసి గాయపర్చారు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ర్యాగింగ్ యాక్ట్ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు అయింది. ర్యాగింగ్ పై కేఎంసీ లో ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై.. ఆరుగంటల పాటు చర్చించింది. ర్యాగింగ్ నిర్ధారణ కావడంతో.. పాల్పడిన వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కమిటీ. అయితే.. కేఎంసీలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ అంటున్నారు. ప్రీతి ఘటన డిపార్ట్మెంట్ లో జరిగిందని, ప్రస్తుతం హాస్టల్ లో జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన తీసుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మొదటి తప్పుగా భావిస్తు మూడు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే.. హాస్టల్ లో బర్త్ డే పార్టీలు నిషేధించామన్నారు. దాడికి పాల్పడ్డ 7గురి పై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారి విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. -
వరంగల్ కేఎంసీలో ర్యాగింగ్!
ఎంజీఎం: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను ర్యాగింగ్ భూతం వెంటాడుతోంది. ఈ కళాశాలలో పీజీ వైద్యవిద్య చదువుతున్న ప్రీతి మృతి చెందిన విషయాన్ని ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న క్రమంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కేఎంసీలో రాజస్తాన్కు చెందిన మనోహర్ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న కళాశాల లైబ్రరీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు చదువుకుని హాస్టల్ గదికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న 15 మంది విద్యార్థుల కళ్లు మనోహర్పై పడ్డాయి. అతడిని దగ్గరికి పిలిచి మద్యం తాగించి, నృత్యాలు చేయించారు. సీనియర్లు ఎంతకీ వదలకుండా వేధిస్తుండగా ఎదురుతిరిగాడు. దీంతో అతడిని వారు దారుణంగా చితకబాదారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి ఈ నెల 15న తల్లిదండ్రుల సహాయంతో ప్రిన్సిపాల్కు, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ ర్యాగింగ్ ఘటనలో గాయపడ్డ మనోహర్ను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. ర్యాగింగ్ విషయాన్ని ప్రిన్సిపాల్ మోహన్దాస్ డీఎంఈకి వివరించగా కళాశాల అంతర్గత కమిటీతో విచారణ చేపట్టారు. 10 మంది విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు విచారణలో నిర్ధారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు విద్యార్థులను సంవత్సరంపాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేఎంసీ అధికారులపై ఒత్తిళ్లు మొదలైనట్లు తెలుస్తోంది. ఘటనపై అంతర్గత విచారణ చేస్తున్నామని, ర్యాగింగ్ జరిగినట్లు రుజువైతే ఆ విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): గాంధీ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల సస్పెన్షన్పై పునరాలోచించాలని కోరు తూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన పదిమంది వైద్య విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య విద్యా ర్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో గాంధీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, చిలకలగూడ సీఐ మట్టంరాజులు వైద్యవిద్యార్థులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్కు ఫిర్యాదు అందిన నేపధ్యంలో.. అక్కడి ఉన్నతాధి కారుల సూచన మేరకు గాంధీ వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణయిందని అధికారులు వివరించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానం మేరకే చర్యలు చేపట్టామని, ఇది డీఎంఈ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన వారిపై చట్టప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. డీఎంఈ, గాంధీ ప్రిన్సిపాల్ రమేశ్రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరని, బుధవారం ఆయనతో సమావేశం ఏర్పాటు చేస్తామని వైస్ ప్రిన్సిపాల్ నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించి, తరగతులకు హాజరయ్యారు. -
ఐఐటీ మండీలో ర్యాగింగ్ ఘటన
న్యూఢిల్లీ/మండీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మండీలో జూనియర్లను ర్యాగింగ్ చేసిన 10 మంది సీనియర్లను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. మరో 62 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్స్ సస్పెన్షన్కు గురయ్యారు. ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులకు రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించారు. 20 నుంచి 60 గంటలపాటు సమాజసేవ చేయాలని ఆదేశించినట్లు ఐఐటీ–మండీ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ముగ్గురు విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్లతోపాటు 10 మంది విద్యార్థులను తరగతి గదులు, వసతి గృహాల నుంచి డిసెంబర్దాకా సస్పెండ్ చేశారు. బీ.టెక్ కోర్సుల్లో కొత్తగా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పరిచయ కార్యక్రమాన్ని ఇటీవల కాలేజీలో నిర్వహించారు. ‘ఈ ఘటనలో 72 మంది సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని కాలేజీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. -
అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు..
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ను రద్దు చేస్తూ పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం పార్లమెంటరీ కమిటీ ముందు ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. దీంతో బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ కమిటీ సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తన రిపోర్టును స్పీకర్కు సమర్పించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని పట్టుబట్టాయి. ఈ క్రమంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఈ సందర్భంలో ఎంపీ అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని దృతరాష్ట్రునితో పోల్చుతూ గందరగోళం సృష్టించారు. దీంతో ఆగష్టు 11న ఆయనపై సస్పెన్షన్తో స్పీకర్ వేటు వేశారు. పార్లమెంట్ కమిటీ ముందు తాజాగా హాజరైన అధీర్ రంజన్ చౌదరి.. ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. పార్లమెంట్లో ఆ రోజు అన్నటువంటి మాటలకు పశ్చాత్తాపపడుతున్నానని అన్నారు. ఆగష్టు 11న సస్పెన్షన్ అయిన తర్వాత హాల్ నుంచి బయటకు వచ్చిన అధీర్ రంజన్ చౌదరి.. పార్లమెంట్లో ప్రజల తరుపున మాట్లాడేప్పుడు ఆవేదన ఉంటుందని, దాన్ని యాథావిధిగా బయటపెడతామని చెప్పారు. ఆ క్రమంలో మనసుకు ఏం అనిపిస్తే అది మాట్లాడుతామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాల్నీ కేంద్ర పాలితంగా మారుస్తారా?.. జమ్ము విభజనపై సుప్రీం -
స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం.. సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారిని సస్పెండ్ చేస్తూ సోమవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్నేహితుడి కుమార్తె అయిన మైనర్పై గత కొన్ని నెలలుగా అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ఆమె ఆమె గర్భం దాల్చడానికి కారకుడయ్యాడనే కారణంతో ఆప్ సర్కార్ చర్యలు చేపట్టింది. అదే విధంగా నేటి సాయంత్రం 5 గంటల్లోగా ఈ ఘటనకు సంబంధించి నివేదిక అందించాల్సిందిగా సీఎస్ను ఆదేశించారు.. కాగా మహిళా శిశు అభివృద్ధి శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ప్రమోదయ్ ఖాఖాకు.. తన స్నేహితుడు కుమార్తెతో తొలిసారి చర్చిలో పరిచయం ఏర్పడింది. 2020 అక్టోబర్1న స్నేహితుడు మరణించడంతో అతడి కుమార్తె బాధ్యతను తాను చూసుకుంటానని చెప్పాడు. అనంతరం ఆమెను తన ఇంటికే తీసుకెళ్లాడు. బాలిక అతన్ని మామ అని పిలిచేది. ఈ క్రమంలో నవండర్ 2020 నుంచి 2021 జనవరి మధ్య అనేకసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం నిందితుడు భార్యకు బాధితురాలు తెలియజేయగా.. బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమె కూడా అతడికి సహకరించింది. తన కుమారుడితో గర్భస్రావ మాత్రలు తెప్పించి బాలికతో మింగించింది. అనంతరం 2021 జనవరిలో తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. అయితే బాలిక ఈ నెలలో అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె తల్లికి సమాచారమివ్వగా తనకు ఎదురైన వేధింపులను ఆమెకు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.నిందితుడిపై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇంకా కోలుకుంటోంది. మరోవైపు బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది. దీంతో ప్రమోదయ్ ఖాఖాతోపాటు ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఈ ఘటనపై ఆప్ నేత సురభ్ భరద్వాజ్ తీవ్రంగా స్పందించారు. ‘సదరు అధికారి చేసింది హేయమైన పని. నిందితుడి భార్య కూడా ఈ నేరంలో భాగమైంది. ఈ ఘటన సమాజానికి మాయని మచ్చ. ఇలాంటి చర్యలను సహించేది లేదు. త్వరలోనే కఠిన చర్యలు తీసుకోవాలి. నిందితుడైన అధికారిని సస్పెండ్ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎస్ నుంచి సాయంత్ర 5 గంటల వరకు నివేదిక కోరారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం ఢిల్లీ పోలీసులు విఫలమవ్వడం దారుణమైన అంశం. ఇది సిగ్గుమాలిన చర్చ. ఆ అధికారిని చట్టపరంగా పూర్తి స్థాయిలో శిక్షించాలి’ అని పేర్కొన్నారు. -
నలుగురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
మర్రిపూడి: ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో భూ అక్రమాలకు పాల్పడిన స్థానిక తహసీల్దార్ సీహెచ్ కృష్ణారావు, డీటీ జి.జగదీశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి ఆర్ఐ ఎంవీఎం శేషాచలం, పన్నూరు గ్రామ వీఆర్వో డి.శివారెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ దినేష్కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మర్రిపూడి మండలంలోని పన్నూరులో సర్వే నంబర్ 12–2, 169–1, ఇతర సర్వే నంబర్లలో 143.29 ఎకరాల పట్టా భూమికి ఆ గ్రామ వీఆర్వోతో పాటు ఆర్ఐ కలిసి రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండా ఫ్యామిలీ ట్రీ అనే ఒక పత్రం తయారు చేసి అసలైన వారసులకు కాకుండా సంబంధం లేని 65 మందికి పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేసేందుకు సిఫారసు చేశారు. అప్పటి తహసీల్దార్, ప్రస్తుత డీటీ జగదీశ్వరరావు కూడా పూర్తిగా పరిశీలించకుండా పట్టాదారు పుస్తకాలు జారీ చేశారు. ప్రస్తుత తహసీల్దార్ కృష్ణారావు కూడా వాటిని వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. వెబ్ల్యాండ్లో నమోదు చేసిన భూముల్లో 71.75 ఎకరాలను వారం రోజుల్లోనే వీఆర్వో శివారెడ్డి బంధువుల పేర్లమీద రిజి్రస్టేషన్ చేశారు. దీనిపై హక్కుదారులైన గోరంట్ల వెంకటేశ్వర్లు, మరికొంతమంది ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు భూముల మీదుగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు వెళ్తున్నందున రెవెన్యూ అధికారులంతా కలిసి అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం అంశంపై కనిగిరి ఆర్డీవోతో విచారణ చేపట్టిన కలెక్టర్..ఆర్డీవో ఇచ్చిన నివేదిక ప్రకారం భూ అక్రమాలు జరిగినట్లు గుర్తించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. ఆ భూములకు సంబంధించి 91 మంది వారసులు ఉండగా, వీఆర్వో శివారెడ్డి తన బంధువుల పేర్ల మీద అక్రమంగా రిజి్రస్టేషన్ చేయించుకున్నారని, అందుకు మిగతా రెవెన్యూ అధికారులు కూడా చేతులు కలిపి సహకరించారని తేలడంతో నలుగురు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. -
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్, శామీర్పేట: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హరికృష్ణ స్థానంలో ఇన్చార్జ్ ఓఎస్డీగా సుధాకర్ రావును నియమించారు. లైంగిక వేధింపుల ఆరో పణలపై నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యు లతో కూడిన కమిటీని మంత్రి ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్పోర్ట్స్) శైలజా రామయ్యర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) వైస్చైర్మన్, ఎండీ, క్రీడా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యు లు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పోర్ట్స్ స్కూల్లోని బాలికలు, సిబ్బందిని వేర్వేరు గా విచారించారు. పాఠశాలతోపాటు బాలికల హాస్టల్లోని సీసీ టీవీ ఫుటేజీలను సేకరించారు. విచారణ ముగిశాక ఈ కమిటీ నివేదికను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు అందించనుంది. కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. కాగా తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత మంత్రి శ్రీనివాస్గౌడ్కు ట్వీట్ చేశారు. ఓఎస్డీని వెళ్లొద్దంటూ కారుకు అడ్డుగా నిలిచిన బాలికలు సస్పెండ్ అయిన హరికృష్ణను స్పోర్ట్స్ స్కూల్ నుంచి వెళ్లొద్దంటూ కొందరు బాలికలు కారుకు అడ్డుగా నిలిచారు. మీరు లేకుంటే స్కూల్ అభివృద్ధి జరగదని, మీరు ఎలాంటి తప్పు చేయలేదని క్యాంపస్లోనే ఉండాలంటూ వారు భావోద్వేగానికి లోనయ్యారు. -
Adhir Ranjan: ఉరి తీసి విచారణ చేస్తున్నట్లుంది!
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదురీ తన సస్పెన్షన్ వేటుపై ఏం చేయబోతున్నారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు పశ్చాత్తాపం చెందుతున్నారా?. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. వేటు విషయంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నాపై వేటు అధికార పార్టీ తిరోగమనంగా చెప్పొచ్చు. నన్ను ఉరి తీసి.. ఆపై విచారణ జరిపినట్లు విచిత్రంగా ఉంది వాళ్ల తీరు. నాతోపాటు నలుగురు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం.. కొత్త దృగ్విషయం. నా పార్లమెంట్ అనుభవంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నిందనే విషయం నాపై వేటు ద్వారా స్పష్టమవుతోందని అన్నారాయన. న్యాయస్థానాల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందంటే.. తప్పకుండా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా, సస్పెన్షన్ వేటుపై సుప్రీం కోర్టుకు వెళ్లే అంశమూ పరిశీలనలో ఉంది అని అధిర్ రంజన్ చౌదురీ స్పష్టం చేశారు. ఇక ప్రధానిని అవమానించారనే అభియోగం మీదే ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘నీరవ్’ (నీరవ్ మోదీ అని బీజేపీ ఆరోపణ) ప్రస్తావన తాను సందర్భోచితంగానే తెచ్చానని, మణిపూర్ అంశంపై మోదీ నీరవ్(మౌనంగా) ఉన్నారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడనని, అంతేగానీ అవమానించే ఉద్దేశం తనకు లేదని అధిర్ రంజన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ బహరంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అయిన అధిర్ రంజన్ చౌదురీ.. గురువారం లోక్సభ నుంచి సస్పెండ్ అయ్యారు. పదే పదే సభకు అంతరాయం కలిగించడం.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న వేళ ప్రసంగాలకు అవాంతరం కలిగించారనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. అంతేకాదు ప్రధాని మోదీని అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు నమోదు అయ్యింది. నీరవ్ మోదీ ప్రస్తావన తేవడంతో పాటు ప్రధాని మోదీని దృతరాష్ట్రుడితో పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. (దృతరాష్ట్రుడు అంధుడు కాబట్టే.. ద్రౌపది పరాభవం పాలైంది. ఇవాళ ఇక్కడ రాజు కళ్లున్న కబోదిలా కూర్చున్నాడు. హస్తినాపురానికి, మణిపూర్కి పెద్దగా తేడా లేకుండా పోయింది అని అధిర్ రంజన్ చౌదురీ వ్యాఖ్యానించారు). అయితే బీజేపీ వెంటనే స్పందించింది. ప్రధానిపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ అభ్యంతరకర వ్యాఖ్యల్ని రికార్డుల్లోంచి తొలగించడంతో పాటు అధిర్ రంజన్ చేత క్షమాపణలు చెప్పించాలని స్పీకర్ను బీజేపీ కోరింది. ఈలోపే ఆయన్ని సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేయగా.. మూజువాణి ఓటుతో అది పాస్ అయ్యింది. అధిర్ రంజన్ చౌదురీపై వేటు పడడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని మండిపడుతోంది. అధిర్పై వేటేసిన స్పీకర్ ఈ కేసును ప్రివిలేజెస్ కమిటీకి దర్యాప్తు కోసం పంపారు. అది తేలేదాకా ఆయన లోక్సభలో అడుగుపెట్టడానికి వీల్లేదు. #WATCH | Congress leader Adhir Ranjan Chowdhury on his suspension from Lok Sabha "This is a new phenomenon we have never before experienced in our career in Parliament...This is a deliberate design by the ruling party to throttle the voice of the opposition...This will undermine… pic.twitter.com/Um5kvbHH7p — ANI (@ANI) August 12, 2023 ఇదీ చదవండి: మణిపూర్లో సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి! -
రాజ్యసభలో హైడ్రామా.. డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్.. ఆపై ఉపసంహరణ
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ సస్పెన్షన్ అంశంపై మంగళవారం రాజ్యసభలో హైడ్రామా నడిచింది. మంగళవారం సభ ఆరంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మణిపూర్ అంశంపై చర్చించాలంటూ పట్టుబడ్డారు. దీంతో చైర్మన్ ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డుతగులుతున్న ఒబ్రియాన్ను సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందుకు ఆయనను వర్షాకాల సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యసభలో నేత గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్కు చెందిన ప్రమోద్ తివారీ సహా పలువురు సభ్యులు ఒబ్రియాన్ పట్ల సౌమ్యంగా వ్యవహరించాలని చైర్మన్ను కోరారు. స్పందించిన ధన్ఖడ్.. ఒబ్రియాన్ తిరిగి సమావేశాలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రతిపక్ష నేతలపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయెల్పై ‘ఇండియా’ కూటమి నేతలు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. న్యూస్క్లిక్ వెబ్పోర్టల్కు నిధులందాయంటూ గోయెల్ చేసిన ఆరోపణలపై విపక్ష పార్టీల నేతలు మంగళవారం రాజ్యసభ చైర్మన్కు ఈ మేరకు నోటీసు అందజేశారు. -
Manipur Violence: ఆగని మణిపూర్ అల్లర్లు
ఇంఫాల్: మణిపూర్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి మణిపూర్లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు. జంకుతున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు. -
ముగ్గురు అధికారుల సస్పెన్షన్
ఒడిశా: జిల్లాలో కల్యాణ సింగుపూర్ సమితి మజ్జిగుడ పంచాయతీలోని ఉపొరొసొజ్జ గ్రామంలో సోమవారం కల్వర్టు సెంట్రింగ్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం అందుకు సంబంధించి రూరల్ డవలప్మెంట్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రదీప్ కుమార్ మహంతి, అసిస్టెంట్ ఇంజినీర్ రాజేష్ కుమార్ మండల్, జూనియర్ ఇంజినీర్ వెంకటరమణ ముదిలిలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సంజయ్ సింహ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలయ్యాయని, సమగ్ర దర్యాప్తు జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు కల్వర్టు కూలిన ఘటనలో సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ తెలియజేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. కల్వర్టు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్పై ఇప్పటికే కేసు నమోదయ్యిందని పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలి బాధితులకు నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోకుండా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బిజయ్ కుమార్ గొమాంగొ డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి ఆయన చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటువంటి తరహా ఘటనలు పునరావృతమవ్వకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నా, తగిన పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. -
హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు?
భారత మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్ సహనం కోల్పోయి బ్యాట్తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది. అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు హర్మన్ దూరం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్లకు వైస్కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా హర్మన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెపె్టన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. భద్రతా కారణాల దృష్ట్యా..! -
నోట్ల మార్పిడి కేసు.. ఆర్ఐ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విశాఖపట్నం: నోట్ల మార్పిడి దందా వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏఆర్ ఆర్ఐ(హోంగార్డ్స్) స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు కేసులో ఏ2గా ఉన్న ఎం.హేమ సుందర్ను కూడా సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సి.ఎం.త్రివిక్రమ్ వర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రూ.90 లక్షల విలువ గల రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువ గల రూ.2 వేల నోట్లు ఇస్తామని ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసిన విషయం తెలిసిందే. బాధితులను బెదిరించి వారి నుంచి రూ.15 లక్షలు బలవంతంగా వసూలు చేసిన వ్యవహారంలో పోలీసులు ఆర్ఐ స్వర్ణలతతో పాటు మధ్యవర్తి సూరిబాబు, ఏఆర్ కానిస్టేబుల్ హేమసుందర్, హోంగార్డ్ శ్రీనివాసులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ముగ్గురికి కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వీరిని శనివారం విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. సాధారణ మహిళా ఖైదీలతోపాటు స్వర్ణలతను బ్యారెక్లో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆర్ఐతో పాటు కానిస్టేబుల్పై సీపీ చర్యలకు ఉపక్రమించారు. హోం గార్డు శ్రీనుదే కీలకపాత్ర ఎబ్బీ-2లో పనిచేస్తున్న హోంగార్డు శ్రీను.. సూరిబాబుతో తనకున్న పరిచయంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. గతంలో గాజువాక, 2వ పట్టణ పోలీసు స్టేషన్లలో పనిచేసిన సమయంలో శ్రీనుపై పలు ఆరోపణలు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హోంగార్డుల ఆర్ఐగా ఉన్న స్వర్ణలతను మంచి చేసుకొని విధులకు కూడా సరిగా హాజరుకాపోవడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. ఆరిలోవకు చెందిన సూరిబాబు జనసేనకు చెందిన ఓ నేతలకు అనుచరుడిగా వ్యవహరిస్తున్నట్లు.. ఆ నాయకుడు తీస్తున్న సినిమాలో స్వర్ణలత నటించేలా చూస్తన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్ఐ స్వర్ణలత జీవితంలో ఈ కోణం కూడా చూడాల్సిందే.. రెండో భార్యతో కలిసి దోపిడికి ప్లాన్ సాక్షి, హైదరాబాద్: విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శ్యామూల్ ప్రసాద్ ఇంట్లో దోపిడీకి ఎస్సై కృష్ణ, అతడి రెండో భార్యపాప పక్కా పథక రచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటిరకు ఈ కేసులో చింతలపూడి సురేంద్రబాబు, పాత నేరస్థుడు శ్రీశైలం, దుగ్గిపోగె ఆశీర్వాదంను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఎస్సై కృష్ణ, అతడి రెండో భార్యపాప కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ఆ ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో విజయం కన్నా బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఆసీస్ జట్టుకు నేరుగా గెలవడం చేతగాక ఇలా చీటింగ్ చేసి గెలవాలని చూసిందంటూ ఇంగ్లండ్ అభిమానులు ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. నిజానికి బెయిర్ స్టో ఔట్ సరైనదే. బంతి డెడ్ కాకముందే క్రీజులో నుంచి బయటికి వెళ్లి మాట్లాడడం తప్పు. ఇదే అదనుగా భావించిన అలెక్స్ క్యారీ వికెట్ల వైపు బంతిని వేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అయితే దీన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా పేర్కొంటూ ఆస్ట్రేలియా టీమ్పై విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఐదో రోజు మొదటి సెషన్ ముగిసిన అనంతరం లార్డ్స్ లాంగ్ రూమ్లో ఉన్న కొందరు ఎంసీసీ సభ్యులు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లను బూతులు తిట్టారు. వీరితో ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్ వాగ్వాదానికి దిగారు. సాధారణంగా మిగిలిన క్రికెట్ గ్రౌండ్లో క్రికెటర్లు, డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లే దారిలో వేరే వాళ్లు ఉండడానికి, కూర్చోవడానికి అవకాశం ఉండదు. అయిలే లార్డ్స్లో మాత్రం లాంగ్ రూమ్ పేరుతో ఎంసీసీ సభ్యుల కోసం ఓ లాంగ్ రూమ్ ఉంటుంది. ఇందులో మెర్లీబోన్ క్రికెట్ క్లబ్, మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సభ్యులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.. వీళ్లు వీవీఐపీల హోదాల లాంగ్ రూమ్లో కూర్చొని మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచే ఇరుజట్ల క్రికెటర్లు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కొంతమంది ప్రతినిధులు ఉస్మాన్ ఖవాజాతో గొడవపడ్డారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ ప్రతినిధులను వారించాల్సింది పోయి ఉస్మాన్ ఖవాజాను బలవంతంగా తోసేశారు. ఆ తర్వాత వార్నర్ను కూడా టార్గెట్ చేయడంతో తాను కూడా ఏం తగ్గలేదు. అయితే వివాదం మరింత ముదురుతుందేమోనని సెక్యూరిటీ వచ్చి వార్నర్ను బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై ఉస్మాన్ ఖవాజా స్పందించాడు. ''ఇది నిజంగా చాలా నిరుత్సాహపరిచింది. వాళ్లు మమ్మల్ని బూతులు తిట్టారు. ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే నేను వాళ్లను నిలదీశా.. వాళ్లలో కొందరు మాపై నిందలు వేశారు. ఇది మమ్మల్ని అవమానించడమే.. ఎంసీసీ మెంబర్స్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎంసీసీ ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ కోరుతూ బహిరంగ లేఖను విడుదల చేసింది.''ఆస్ట్రేలియా క్రికెట్కు, ఉస్మాన్ ఖవాజా, వార్నర్లకు క్షమాపణలు. అమర్యాదగా ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దురుసుగా ప్రవర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.గ్రౌండ్లో జరిగిన విషయాన్ని నిలదీస్తే అధికారం బయటివాళ్లకు లేదు. అది వాళ్లకు సంబంధం లేని విషయం.'' అంటూ ప్రకటన విడుదల చేసింది. Usman Khawaja was pulled back by security after speaking to one the members inside the long room 😳 🗣️ "I've NEVER seen scenes like that!" pic.twitter.com/2RnjiNssfw — Sky Sports Cricket (@SkyCricket) July 2, 2023 MCC Statement.#Ashes pic.twitter.com/fWYdzx1uhD — Marylebone Cricket Club (@MCCOfficial) July 2, 2023 జరిగింది ఇదీ.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో ఆఖరి బంతిని వదిలేసిన జానీ బెయిర్స్టో, ఓవర్ అయిపోయిందని భావించి కీపర్ వైపు చూడకుండానే ముందుకు వచ్చేశాడు. జానీ బెయిర్స్టో క్రీజు దాటడాన్ని గమనించిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, వికెట్లవైపు త్రో వేశాడు. అది తగలడంతో ఆస్ట్రేలియా వికెట్ కోసం అప్పీల్ చేసింది. రన్ తీయాలనే ఉద్దేశంతో జానీ బెయిర్స్టో క్రీజు దాటలేదు. ఓవర్ అయిపోయిందని నాన్ స్ట్రైయికింగ్ ఎండ్లో కెప్టెన్ బెన్ స్టోక్స్తో మాట్లాడాలని ముందుకు నడుచుకుంటూ వచ్చేశాడు. వెనకాల ఏం జరిగిందో కూడా తెలియని జానీ బెయిర్స్టో, అవుట్ కోసం అప్పీల్ చేయడంతో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లమొహం వేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇవ్వడంతో చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. చదవండి: ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు 'చహల్ విషయంలో తప్పు చేస్తున్నారు'.. బీసీసీఐకి గంగూలీ హెచ్చరిక -
సస్పెన్షన్ వేటు.. బౌలర్కు షాకిచ్చిన ఐసీసీ
క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023లో ఆడుతూ బిజీగా ఉన్న అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కైల్ పిలిప్పై సస్పెన్షన్ వేటు పడింది. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ప్యానెల్ పేర్కొంది. కైల్ పిలిప్పై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ''ఆర్టికల్ 6.7 రెగ్యులేషన్స్ ప్రకారం.. కైల్ పిలిప్ బౌలింగ్ యాక్షన్పై అనుమానముంది. అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించాం. తన బౌలింగ్కు సంబంధించిన రీఅసెస్మెంట్ జరిగేవరకు కైల్ పిలిప్పై సస్పెన్షన్ కొనసాగుతుంది'' అని ఐసీసీ ప్యానెల్ తెలిపింది. 2021 నుంచి అమెరికా తరపున ఐదు వన్డేలు ఆడిన కైల్ పిలిప్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్ 2023 టోర్నీలో భాగంగా వెస్టిండీస్తో అమెరికా తొలి మ్యాచ్ ఆడింది. మ్యాచ్లో యూఎస్ఏ ఓడినప్పటికి కైల్ పిలిప్ మూడు వికెట్లు తీశాడు. కాగా టోర్నీలో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసిన అమెరికా దాదాపు నిష్క్రమించింది. ఇక తనపై నిషేధం పడడంతో కైల్ పిలిప్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC) టోర్నీలో ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు కైల్ పిలిప్ను 10వేల యూస్ డాలర్లకు సొంతం చేసుకుంది. చదవండి: 50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్బండ్పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
రాజాసింగ్పై సస్పెన్షన్ త్వరలో ఎత్తివేత!: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద వాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై విధించిన సస్పెన్షన్ త్వరలోనే ఎత్తివేయనున్నట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ప్రకటించారు. ఆ మేరకు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. నిజాంకాలేజీ మైదానంలో ‘ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్’పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల ఫైనల్స్ను తిలకించడానికి వచ్చిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించే మీడియాను ప్రభుత్వం నిషేధిస్తోంది. మరో ఐదు నెలలు ఆగితే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధించబోతున్నారు. ప్రజలు అల్లాడుతుంటే.. ప్రజాధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారు. బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇస్తున్నారు. కేసీఆర్కు దమ్ముంటే.. తన పాలనలో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’అని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఓపీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ‘ఖేలో భారత్.. జీతో భాగ్యనగర్’పేరుతో హైదరాబాద్లో క్రీడా పోటీలు నిర్వహిస్తుండటం హర్షణీయమన్నారు. యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరమని, సమష్టిగా పని చేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి క్రీడలే ఉదాహరణ అని సంజయ్ తెలిపారు. పంటనష్టపోయి రైతులు ఏడుస్తుంటే.. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడుతుంటే.. చూస్తూ అవసరం లేకపోయినా కేసీఆర్ కొత్త సచివాలయం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఓ వర్గం మీడియా తనపైనా అసత్య ప్రచారం చేస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Karnataka: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. సీఎం ఆయనే! -
బీఆర్ఎస్కు మూడోసారి పాలించే హక్కులేదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్రాన్ని మూడోసారి పాలించే హక్కును బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కిరీటం ఏమీ పోలేదని, మరింత గౌరవం పెరిగిందన్నారు. గత మూడేళ్లుగా తనను పార్టీ సభ్యుడిగా చూడలేదని, కనీసం సభ్యత్వ పుస్తకాలను కూడా చేతికివ్వలేదని చెప్పారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇప్పుడు తనకు పంజరం నుంచి బయటకు వ చ్చినంత సంతోషంగా ఉందని చెప్పారు. రిమోట్ కంట్రోల్ అంతా ప్రగతిభవన్లోనే ఉందని చెప్పా రు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఇంట్లో పెట్టుకుంటే మంత్రి నిరంజన్రెడ్డికి కోపమెందుకని ప్రశ్నించారు. తన ఇంట్లో సీఎం కేసీఆర్ ఫొటో కూడా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 సీట్లలో బీఆర్ఎస్ వ్యతిరేకులే గెలుస్తారని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ కనీసం ఒక్క సీటు గెలవడం కూడా అనుమానమేనన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదట 2.50 లక్షల ఎకరాల సామర్థ్యానికే మంజూరైందని, తర్వాత 3.50 లక్షల ఎకరాలకు తానే పెంచానని చెప్పారు. కేఎల్ఐ ద్వారా వనపర్తికి నీళ్లు రావడంతోనే ఆయనకు పేరొ చ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఖాదీ బోర్డు చైర్మన్గా ఉన్న నిరంజన్రెడ్డి అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిందని గుర్తుచేశారు. అయినా పదవికి రాజీనామా చేయకపోవడంతో బోర్డునే రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జూపల్లికి డీకే అరుణ ఫోన్ ‘మీరు దేని కోసమైతే పోరాడారో ఆ లక్ష్యం నెరవేరలేదు. ఉద్యమించి సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడంలేదు. ఈ నియంతృత్వ ప్రభుత్వంపై సమష్టిగా పోరాటం చేద్దాం’అని సీనియర్ నేత, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలోకి రండి అంటూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్సన్కు గురైన జూపల్లికి ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. -
పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆనందంగా ఉంది : జూపల్లి
-
పదో తరగతి పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు..
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి నిందితుల రిమాండ్ రిపోర్టులు కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలిసిన విద్యార్థుల కోసమే బందెప్ప, సందెప్ప పేపర్ లీక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్లిప్ల రూపంలో సమాధానాలు పంపేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. క్వచ్చన్ పేపర్ ఫొటో పెట్టాలని బందెప్పను సమ్మప్ప కోరగా.. పరీక్షకు రాని ఓ విద్యార్థి ప్రశ్నాపత్రాన్ని అతను పంపినట్లు రిమాండ్ రిపోర్టులో వివరించారు. పొరపాటున మరో వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రశ్నాత్రాన్ని బందెప్ప పోస్ట్ చేశాడని, అప్రమత్తమై డిలీచ్ చేసే లోపే పలువురు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లు చెప్పారు. బందెప్ప నుంచే పేపర్ బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు.. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం పదో తరగతి ఆన్సర్షీట్ల కట్ట మిస్ అయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్కు తీసుకు వస్తున్న క్రమంలో ఇవి ఆటో నుంచి మాయమయ్యాయి. విషయం బయటకు రావడంతో అధికారులు బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆన్సర్ పేపర్ మిస్సింగ్కు కారణమైన ఇద్దరు తపాలా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న వీ రజిత(ఎంటీఎస్), నాగరాజు(ఔట్ సోర్సింగ్)లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్తో 2023,24 వార్షిక బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా పేర్కొన్నారు. చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్