రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్డు మరియు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సచివాలయాలతో పాటు కమిషనరేట్లు, డైరెక్టరేట్ల భవనాల విభజనపై ఈ సందర్బంగా చర్చించారు. ఆ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరైయ్యారు.
అయితే గవర్నర్ సలహదారు ఏఎన్ రాయ్ ఈ రోజు సచివాలయంలో కలియ తిరిగారు. అన్ని బ్లాక్లను తిరిగి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కొత్తగా కేటాయించే హెచ్బ్లాక్ను ఆయన పరిశీలించారు.