హైదరాబాద్కు రూ.1189కోట్లు ఇవ్వండి | ktr given flood report to venkaiah naidu | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు రూ.1189కోట్లు ఇవ్వండి

Published Thu, Sep 29 2016 7:10 PM | Last Updated on Wed, Aug 1 2018 3:48 PM

ktr given flood report to venkaiah naidu

న్యూఢిల్లీ: వరదల బారిన పడిన తెలంగాణను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భారీగా వరదలు వచ్చి తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ వర్షాలు ముఖ్యంగా హైదరాబాద్ ను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వరద తాలూకు నష్టాన్ని తెలంగాణ అంచనా వేసింది.

ఈ వివరాలను మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి అందించారు. హైదరాబాద్ లో జరిగిన నష్టానికి రూ.1189 కోట్ల సాయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. మరోపక్క, అక్రమంగా నాలాలను సైతం ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేత కార్యక్రమం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement