హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ గర్భిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అనిత(28) అనే గర్భణి కుటుంబ కలహాలతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకొని గర్భిణి ఆత్మహత్య
Published Sun, Dec 25 2016 7:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
Advertisement
Advertisement