
రాష్ట్రంలో 75 వేల మందికి రేషన్ కార్డులను క్లియర్ చేశారని, మిగతా వారికి ఏప్రిల్ నెలాఖరులోగా ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ పద్దుపై చర్చ అనంతరం ఆయన సమాధానం ఇచ్చారు. ఈపాస్ సమస్యలను పరిష్కరిస్తామని, వేలిముద్రలు పడకపోయినా రేషన్ ఇమ్మని చెప్పామని తెలిపారు.
వారికి ఐరిష్కు లింకు చేయమని సూచించామన్నారు. ప్రజలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే రేషన్ బియ్యం తీసుకునే విధానం తెచ్చామన్నారు. కిరోసిన్ వినియోగం ప్రస్తుతం తగ్గిందని, 100 శాతం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పూర్తిగా తగ్గిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment