Etela Rajender
-
తెలంగాణలో తుగ్లక్ పాలన.. రేవంత్పై ఈటల ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రధాని మోదీని విమర్శిస్తే.. కేసీఆర్కు పట్టిన గతే సీఎం రేవంత్రెడ్డికి పడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. గవర్నమెంట్ పనుల టెండర్లు తీసుకోవడం అంటే ఉరి వేసుకోవడమే అన్నట్లుగా మారింది. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకుంటే ఈ మాత్రం పనులు కూడా కనిపించవు. సీసీ రోడ్లు, చౌరస్తాలో వెలిగే లైట్లు, స్మశాన వాటికలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి.. వీటిపై చర్చకు వస్తారా రండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కోసం 25 ఏళ్లు కొట్లాడినాం.. మూత వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం... తెరిచింది బీజేపీ ప్రభుత్వం. కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం కేటాయించిందిఅధికారం చేతిలో ఉన్న పని చేసే దమ్ము రేవంత్ కు లేదు.. కానీ కిషన్ రెడ్డి మీద విమర్శలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు ఎలా ముందుకు వెళ్తాయి. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర బస్టాప్ కట్టలేని దుస్థితి. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లో పనులు చూసి రావాలని రేవంత్కు సూచన.మోదీ గురించి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయారో రేవంత్కు అదే గతి పడుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది.. సిగ్గు అనిపించడం లేదా? అని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. -
ఓట్ల కోసమే సీఎం రేవంత్ డ్రామాలు: ఈటల
సాక్షి: ఖమ్మం జిల్లా: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల పట్ల రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్ డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్లు పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు.‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మనవాళ్లు, అనేది చూసి ఓటు వేయాలి. మాట ఇస్తే నిలబడే వ్యక్తికి ఓటు వేయాలి. మోసం చేసేవారికి కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయులు నుంచి మంచి స్పందన వస్తుంది. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం’’ అంటూ ఈటల దుయ్యబట్టారు. -
‘ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చారు’
హైదరాబాద్: ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అక్కడ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ(Delhi Assembly Elections 2025) ప్రజల స్పష్టమైన తీర్పు అని తేల్చిచెప్పారు.ఢిల్లీ గల్లీలో దుర్గంధం చూస్తే అన్నం కూడా తినలేం. ఢిల్లీ ప్రజల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఈ తీర్పునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి 400 సీట్లు ఇవ్వనందుకు ప్రజలు బాధపడుతున్నారు. అందుకే ఆ తర్వాత జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం అందిస్తున్నారు ప్రజలు. ఢిల్లీలో కేజ్రీవాల్ బాగుపడ్డాడు తప్ప.. పేద ప్రజల బతుకులు మారలేదు. గల్లీ గల్లీలో లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు. ఢిల్లీని తాగుబోతు రాష్ట్రంగా మార్చిన ఘనత కేజ్రీవాల్ది. లిక్కర్ స్కాం తో ఢిల్లీ ప్రజలు తలదించుకున్నారు. ఢిల్లీ ప్రజల చేతిలో కేజ్రీవాల్, ిసిసోడియాలు చావుదెబ్బ తిన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు.అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే సత్తా మోదీ(Narendra Modi)కే ఉందని ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణలో పదేళ్లు బీఆర్ఎస్ పాలన చూశాక వారికి పొరపాటున కూడా ఓటేయొద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అతి తక్కువ కాలంలో వ్యతిరేకత మూటగట్టుకుంది. తొందర్లోనే ఢిల్లీ తీర్పు తెలంగాణలో రాబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలపై బీజేపీ మాత్రమే కొట్లాడుతుందని ప్రజలు నమ్ముతున్నారు’ అని ఈటెల పేర్కొన్నారు.కాంగ్రెస్ దీన స్థితి చూస్తే జాలేస్తోంది: కిషన్రెడ్డి -
అవగాహన లోపంతోనే ఏకశిలా నగర్ ఘటన:ఆలూరి వెంకటేష్
-
సీఎం రేవంత్ కార్యాలయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి (cm revanthreddy) కార్యాలయంపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (etela rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కార్యాలయం నుంచి భూ మార్పిడి జరుగుతుందని ఆరోపించారు. మంగళవారం రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటల రాజేందర్, ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనలో ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతాం. టైగర్ నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వరకు పేదలకి అండగా నిలిచిన పార్టీ బీజేపీ(bjp). రేవంత్ సర్కారు రావడంతోనే హైడ్రా పేరుతో పేదలపై విరుచుకుపడింది. హైడ్రా, మూసి బాధితులకు బీజేపీ అండగా నిలబడింది. రియల్టర్ల పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారని సీపీ దృష్టికి తీసుకెళ్లాం కానీ ఫలితం లేదు. కలెక్టర్, సీపీకి సమస్య వివరించినా పరిష్కారం దొరకలేదు.కబ్జా చేసి పహిల్వాన్లను పెట్టి స్థానికులను, మహిళలను బెదిరించారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వారి దౌర్జన్యాలు చూస్తే అర్ధం అవుతుంది. నేను ఎవరిని కొట్టాలని అనుకోలేదు. కానీ వ్యవస్థ విఫలమైంది. పేదల బాధ చూసి ఆవేశం వచ్చింది. పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతాం.2005లో ఏకశిలా నగర్ రాజు, వెంకటేష్, భాస్కర్ అనే ముగ్గురు ప్లాట్లను కొన్నట్టు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో లోన్లుకూడా తీసుకున్నారు. అయితే 2010లో బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన కోర్టు సైతం బాధితులకు అనుకూలంగా తీర్పిచ్చింది. హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ వెంకటేష్ ప్లాట్ల ఓనర్లను ఇంకా భయపెడుతున్నారు. ధరణి లోసుగులతో ఇష్టారీతిన ల్యాండ్లు మార్చుకున్నారు. అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బాసుల మెప్పు కోసం కాదు పేదలకు న్యాయం చేసేలా అధికారులు పని చేయాలి. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తాం. నాడు, నేడు సీఎంల కార్యాలయాల్లోనే ఈ ల్యాండ్ మార్పిడులు జరుగుతున్నాయి. కాళేశ్వరం కాదు అంతకంటే ఎక్కువ కోట్ల అవినీతి ఈ ల్యాండ్ దందాలలో జరిగింది. కేసులకు భయపడను. తెలంగాణ ఉద్యమంలో 150 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 156 అవుతాయి’ అని సూచించారు. -
‘నేను ప్రజల మనిషినయ్యా.. అందుకే వాణ్ని ..’
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కబ్జా రాయుళ్లు తమ భూముల్ని కాజేస్తున్నారంటూ పలువురు బాధితుల ఫిర్యాదతో ఈటల రాజేందర్ మంగళవారం ఏకశిలానగర్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పేదల భూముల్ని కబ్జా చేస్తున్నారంటూ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఈటల రాజేందర్ దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. పోచారం మున్సిపాల్టీ పరిధిలోని కొర్రేముల 1985లో 149 ఎకరాల భూమిని 2076 మందికి విక్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులు లోన్ తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వ్యవసాయ భూమిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. డీపీవో అండదండతో మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చారు.ధరణి లొసుగులతో ఆప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్ 9 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కి కట్టబెట్టే ప్రయత్నం చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాయి గుండాలతో కుక్కలను పెట్టీ ఇక్కడ స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. బాధితులు నా దగ్గరకు వచ్చారు. సీపీకి ఫోన్ చేశాను, కలెక్టర్కు చెప్పాను. రాత్రి పూట ఎంపీ వస్తే ఏం పీకు** అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానికులను బెదరించాడు. నలభై లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంటే కూల్చారని ఒక అబ్బాయి ఏడుస్తూ ఫోన్ చేశారు. దీంతో నేను బాధితుడి ఇంటికి వెళ్లా. నేను వెళ్లే సమయంలో గుండాలు తాగుతూ ఇక్కడే కూర్చున్నారు. ప్రజల మనిషిగా వాడ్ని కొట్టిన.న్యాయం కాపాడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అధర్మానికి అండగా అంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేయాలి. కాంగ్రెస్ నాయకుల అండతోనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. -
రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై చేయి చేసుకున్న ఈటల రాజేందర్
-
రియల్ ఎస్టేట్ బ్రోకర్పై ఎంపీ ఈటల, అనుచరుల దాడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేశారు. పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణల నేపథ్యంలో రియల్ వ్యాపారిపై ఈటల చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.పేదలను భూములను కబ్జా చేస్తున్నారని బాధితులు ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈటల నేడు.. మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో ఉన్న ఏకశిలానగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పేదల భూములను రియల్ వ్యాపారులు ఆక్రమించుకోవడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయిచేసుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘కొందరు తెలియక కబ్జా స్థలాలను కొంటున్నారు. పేదల భూములకు కబ్జా చేయడం నేరం. పేదల భూములను కబ్జా చేసి వ్యాపారం చేసుకుంటున్న బ్రోకర్లు. పేదల భూములను కబ్జా చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయి. బ్రోకర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ. అనేక పేదల కాలనీలకు రూపశిల్పి బీజేపీనే. పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ సంపూర్ణంగా అండగా ఉంటుంది. బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడదు. అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు.1985లో నారపల్లి, కొర్రెముల గ్రామాల్లో పేదవారు కంచెలు, జంగల్ భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు, కలెక్టర్కి, సీపీకి, మంత్రికి, ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ వివరాలతో ఉత్తరాలు రాస్తాను. తప్పు భూములు కొనుక్కున్న వారిది కాదు.. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులది, వాళ్ళని జైల్లో పెట్టాలి. తప్పు బ్రోకర్లది. ఎవరైనా పేదల మీద దౌర్జన్యం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నా. చిన్న జిల్లాలు ఏర్పాటు చెస్తే పాలన సులభం అవుతుంది. కలెక్టర్లు అందుబాటులో ఉంటారు అనుకున్నాం. కానీ కలెక్టర్లు దొరకడం లేదు. పోలీస్ కమిషనర్కి మనకు కలవడానికి సమయం ఉండదు కానీ బ్రోకర్లను కలవడానికి మాత్రం సమయం ఉంటుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మీరు లెక్క చూపించండి.. తల వంచుకొని క్షమాపణలు చెబుతా ..
-
భూములు లాక్కోడానికి నీ అయ్య జాగీరు కాదు: రేవంత్పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని తెలిపారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేసిందన్న ఈటల.. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారని ప్రస్తావించారు. అయితే ఫోర్త్ సిటీ పేరుతో ఆ 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోందని విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా.. బెదిరించి సెకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్. స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పారని గుర్తు చేశారు. లగచర్ల చుట్టూ పక్కల గ్రామాల సమస్య మాత్రమే కాదని, ప్రతీ రైతు తమ దగ్గరకు సమస్య వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. రైతులు నక్సలైట్లు కాదని, వాళ్లు వేరే వాళ్ళ భూములు అడగడం లేదని పేర్కొన్నారురేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారని ఈటల పేర్కొన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. రేవంత్లా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదని తెలిపారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓవైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా.. ప్రభుత్వం సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.రేవంత్.. నీ స్థాయి ఎంత?రేవంత్. నీ స్థాయి ఎంత?. హారాష్ట్ర వెళ్లి ప్రధానిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో ఒకలా, ఢిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నావు. ఈ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. నాలుగు వేల రూపాయలు నెలనెలా ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని స్వయంగా కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటే తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూములు లాక్కోవడానికి నీ అయ్య జాగీరు కాదు. రేవంత్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గతంలో సర్పంచ్లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమిషన్ తీసుకుంటున్నారు సవాల్ స్వీకరిస్తున్నా..హామీల చర్చపై రేవంత్ సవాలును స్వీకరిస్తున్నా. నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు? ఇక్కడ మేము ఉన్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు. మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు.. 420 హామీలపై చర్చిద్దాం.’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
బీజేపీ నేతల లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
-
లగచర్ల ఘటనలో అరెస్టైన వారితో ములాఖత్ అయిన ఈటల, డీకే అరుణ
-
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి: రేవంత్కు ఈటల సవాల్
సాక్షి, నిజామాబాద్: గ్రూప్-1 విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ దుర్మార్గ జీవో ఇచ్చిందని, 29ని సడలించాలని నిరుద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆందోళనకు బీజేపీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు దీరి ఏడాది కావస్తోందని.. ఇప్పటి వరకు ఇచ్చినా ఏ హామీ సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.‘ఏ రైతు అయినా రుణ మాఫీ కాకపోతే రెండు లక్షల రుణం తీసుకోండి రేవంత్ అన్నారు. నేను సీఎం కాగానే మాఫీ చేస్తామని అన్నారు. సూటిగా ఒకటే మాట అడుగుతున్నా. ప్రజా క్షేత్రంలో ఏం హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోండి. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ప్రజలు భావిస్తున్నారు. పెంచిన పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న పింఛన్లు ఎత్తేస్తున్నారు. దేవుళ్ళ మీద ఒట్లు వేశారు. గట్టు మీద పెట్టేశారు. రిటైర్డ్ అయ్యిన ఉద్యోగులకు సెటిల్ మెంట్లు చేసే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నారు.’ అని ఈటల పేర్కొన్నారు. -
రేవంత్ చేస్తున్న పిచ్చి పని.
-
హైడ్రా ఒక డ్రామా.. అవన్నీ అక్రమ నిర్మాణాలు కావు: ఈటల
సాక్షి, హైదరాబాద్: హెడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం రేవంత్పై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బఫర్ జొన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండేవి మొత్తం ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తున్నవి అన్ని అక్రమ నిర్మాణాలు కావని, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.కాగా గతంలోనూ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో ఈటల భేటీ
ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.కారుణ్య నియామకాలు ఐదు శాతం మించకూడదన్న నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మాల్స్ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బ్యూ టిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? రూ. కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని ఈటల సీఎంను డిమాండ్ చేశారు.స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని తెలిపారు. -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వం ఇప్పడికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి రాగానే హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తాం. పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బుల్డోజర్లు ముందుగా మామీద నుండి వెళ్లాలి. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్తాయి. తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్కు తగులుతుంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. భూమి పట్టాలు, లింకు డాక్యుమెంట్స్, గ్రామా పంచాయితీ అనుమతి ఉన్న వారి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న వాళ్లంతా పేదలే. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఇప్పటికైనా హైడ్రాపై ప్రభుత్వం సమీక్ష చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక పిల్లి గంతులు వేస్తున్నారు. బ్యాంకులు 73 లక్షల మందికి రుణాలు ఇచ్చామని చెబుతున్నారు.. 48 లక్షల మందికి అని రేవంత్ రెడ్డి చెప్పారు. 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మేడ్చల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బీజేపీ దీక్ష చేపట్టింది. అప్పులపాలై రుణమాఫీ కానీ రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి. రైతు బంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రేవంత్ వాలకం చూస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి కలిసికట్టుగా పోరాటం చేద్దాంబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. రేపు ధర్నా చౌక్లో రైతు దీక్ష చేపడుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నాం. రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: కూల్చివేతలపై హైడ్రా మరోసారి ఆలోచించాలి: దానం నాగేందర్ -
నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిజాం సర్కార్ కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందిస్తోందా? అని ప్రశ్నించారు.హైడ్రా బాధితులు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కలిశారు. ఈ సందర్బంగా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేసినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. రేవంత్ పాలన నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా ఉంది. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారు. శని, ఆదివారాలు చూసుకొని ఇళ్లను కూలగొడుతున్నారు.సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతీ కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అంటారు. పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు. పేదలతో పెట్టుకున్న ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీ కరణ చేస్తారట. బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దు. నేను ఉన్నంత వరకు మీ పక్షాన కొట్లాడుతాను’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
హైడ్రా అంటే ఒక డ్రామా: ఎంపీ ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా అంటే ఒక డ్రామా అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. పేదల జోలికి వచ్చిన ప్రభుత్వం ఏదీ చరిత్రలో నిలిచిన దాఖలులేవని రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పేదలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట బోయిన చెరువు చుట్టూ ఇల్లు కట్టుకున్న పేదలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లి.. ఆ ప్రాంతాన్ని ఈటల గురువారం పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా అంటే ఒక డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాలనపై కనీస అవగాహన లేదు. పేదల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు నిలవలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలకు వారికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడెందుకు హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారు.ఒక మంత్రిగానో, ఐదేళ్ల పాటు సరైన ఎంపీగానో పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేదోళ్ల బాధ తెలిసేది. బఫర్ జోన్లో ఉన్నారంటూ 40 ఏళ్ల తరువాత పేదోళ్ల ఇండ్లకు నోటీసులు ఎలా ఇస్తారు. రేవంత్ ఏదో ఉద్దరిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పొగడటం సరైన పద్దతి కాదు. పేదల జోలిక వస్తే ఊరుకునేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
వారిని భయపెట్టాలనుకుంటున్నారు.. హైడ్రా కూల్చివేతలపై ఈటల ఫైర్
సాక్షి, వికారాబాద్: హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను, మధ్యతరగతి వారిని భయపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. 40, 50 ఏళ్ల క్రితమే ఎఫ్టీఎల్లో పట్టా భూములకు ప్రభుత్వ అనుమతులతో సామాన్యులు ఇళ్లు కట్టుకున్నారు. సాహెబ్నగర్, సరూర్ నగర్, ఫాక్స్సాగర్ వద్ద ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఇళ్లు కట్టింది’’ అని ఈటల పేర్కొన్నారు.పెద్దవాళ్లవి కూల్చితే మంచిదే. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే పుట్టలేదు. వందల ఏళ్ల నుంచి ఉన్న పార్టీ. ఇప్పుడు ఏదో నాలుగు రోజులు హీరో అన్నట్లు హైడ్రామా చేస్తున్నారు. గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫోజులు కొట్టారు’’ అంటూ ఈటల ఎద్దేవా చేశారు. -
రేవంత్ తప్పుల చిట్టా రెడీ.. హైడ్రా ఓ హైడ్రామా: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న తప్పులపై చిట్టాపద్దు సిద్ధం చేస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ పెద్ద బోగస్ అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మాల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అవసరం వచ్చినప్పుడు ప్రజల ముందు లెక్కలతో సహా బయటపెడతాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ బోగస్. రుణ మాఫీ చేయని రైతులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నాను. ఎఫ్టీఎల్ భూములు ప్రభుత్వ భూములు కావు.హైడ్రా పేరుతో చేస్తున్న ప్రభుత్వ హైడ్రామా చేస్తోంది. కట్టిన ఇళ్లను ఎందుకు కూల్చివేస్తున్నారు. ఎఫ్టీఎల్లో భూములున్న వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలి. బీజేపీలో స్తబ్ధత లేదు.. ఎన్నికల సమయంలో చూపించాల్సిన దూకుడు చూపిస్తాం. సంస్థాగత ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పెద్ద అబద్ధం. ఇదంతా తప్పుడు ప్రచారం. బీజేపీలో అలాంటి చర్చ జరగలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు:ఈటల
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పాలనలో మరోసారి మోసపోయామని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని, ఈ ప్రభుత్వం ప్రజల్ని దండుకోవడం తప్ప పరిపాలన చేయడం లేదని మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .. రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలి(రాజకీయ పార్టీలు, నేతలు... ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని గతంలో రేవంత్ చెప్పిన మాటల వీడియోను ఈటల ప్రదర్శించారు). ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు. మాట తప్పిన వాళ్ళను కాలం ఖచ్చితంగా బొంద పెడుతుంది. విశ్వసనీయత లేని పార్టీలను, మోసం చేసినవాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు అని అన్నారాయన. తెలంగాణ ప్రజలు.. మరోసారి మోసపోయామని చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్దాల మేడ లో కూసొని పేదల గురించి ఆలోచించడం లేదు. రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్లు. మూడున్నర ఎకరాల తడి పొలం ఉన్నవారికి రేషన్ కార్డు ఇవ్వరు. ఏడు ఎకరాల మెట్ట భూమి ఉన్నవారికి రేషన్ కార్డు ఉండదు. పదేళ్లుగా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయంతో.. 69 లక్షల మంది రైతులకు నిరాశ ఎదురవుతుంది. రుణ మాఫీ చేస్తానని రేవంత్ అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేశారు. రూ. 34 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్... ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు సున్నం పెడుతున్నారు. ఇదేకాకుండా.. వరి ధాన్యంకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పి రేవంత్ మోసం చేశారు. రైతులను మోసం చేసిన రాజ్యం బాగుపడదు.కాంగ్రెస్ మ్యానిఫెస్టో చిత్తుకాగితంతో సమానం. రైతుల శాపనార్థాలు రేవంత్ రెడ్డికి తప్పవు. అప్పుల పేరిట.. శ్వేత పత్రాల పేరుతో తెలంగాణ ప్రజల కడుపు కొడుతున్నారు. 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్న దొమ్మరోళ్ళ, బిచ్చగాళ్ల ఇళ్లను కూలగొడుతున్నారు’’ అని ఈటల అన్నారు. ఇక.. తాజా ప్రొటోకాల్ వివాదంపైనా ఈటల స్పందించారు. కూకట్పల్లి జేఎన్టీయూలో పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమానికి ఈటలకు ఆహ్వానం అందలేదు. దీనిపై ఇంతకు ముందే ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రోటోకాల్ విస్మరించారని మండిపడ్డారు. అయితే తాజాగా ఈ వివాదంపై మాట్లాడుతూ.. ‘‘ రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాలని నాకు సోకు లేదు. కానీ, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానించాలి. కానీ, అధికారులు అలా చేయలేదు. ప్రభుత్వం పిలవలేదు. రేవంత్ తీరును ప్రజలు రికార్డు చేసుకుంటున్నారు’’ అని అన్నారాయన. -
కాంగ్రెస్కు బీఆర్ఎస్ గతే.. మంత్రులకు కాల్ చేస్తే తీయలేదు: ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేటర్ కాంగ్రెస్లో చేరడంలేదని అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. ఫిరోజ్గూడలో సాయిప్రియ ఎన్క్లేవ్లో ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్లో చేరడంలేదని ఇళ్లను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం.అవి అక్రమ భూములు అయితే ఇన్ని రోజులు ఎందుకు కూల్చివేయలేదు. ప్రభుత్వ అధికారులు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురిచేయడం సరైన పద్దతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా పేదలు రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడటం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీలో ఏం జరుగుతోంది.. ఈటల Vs రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు అదే పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.కాగా, తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నికపై నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ స్పందిస్తూ.. పార్టీ అధ్యక్ష పదవిని అగ్రెసివ్గా ఉండే వ్యక్తికి కేటాయించాలని.. అలాంటి వ్యక్తే పార్టీ చీఫ్గా ఉండాలన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్యలకు ఈటల కౌంటరిచ్చారు. తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఫైటర్ కావాలని ప్రశ్నించారు.అలాగే, తాను ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడినట్టు చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భంగా వస్తే జేజమ్మతో కొట్లాడేటోల్లం అని అన్నారు. ఇంతకన్నా దమ్మున్న వాళ్లు ఎవరు ఉంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
-
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
అమిత్ షాను కలిసిన ఈటల.. బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు?
బీజేపీ నేత, మల్కాజ్గిరి లోక్ సభ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో తెలంగాణ నుంచి ఎద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయికిషన్రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు ఆశాభంగం తప్పలేదు. ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. -
ఈటల చేతికి తెలంగాణ బీజేపీ పగ్గాలు
-
కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మొదటి దశలో గ్రేటర్ నుంచి మంత్రి పదవి దక్కేదెవరికి? అన్నది హాట్ టాపిక్గా మారింది. ఆదివారం ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో నగరం నుంచి మోదీతో పాటు ప్రమాణం చేసే అదృష్టవంతుడెవరన్నది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. రాజధాని నగరమైన హైదరాబాద్ పరిసరాల నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయంగా తెలుస్తోంది. అయితే.. అది ఎవరిని వరించనుందన్నదే ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా గెలుపొందడం తెలిసిందే. వీరిలో కిషన్రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డికే కేంద్ర మంత్రివర్గంలో తొలి దశలోనే అవకాశం లభించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కిషన్రెడ్డికి ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి లభించనుందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ.. తొలుత మంత్రి పదవి అయితే ఇస్తారని, అంతే కాకుండా అధ్యక్ష పదవి కంటే మంత్రిగానే ఆయనకు ప్రాధాన్యమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ జట్టులో ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రుల జాబితాలో కిషన్రెడ్డి పేరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టేట్ బాస్గా ఈటల? దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, ప్రస్తుతం సీఎంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో గెలిచిన ఈటల రాజేందర్కు తగిన గుర్తింపునిచ్చేందుకు మంత్రిపదవి ఇస్తారనే అభిప్రాయాలున్నా, తొలిదశలో కిషన్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, ఈటలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించలరన్న అభిప్రాయాలు ఉన్నాయి. కిషన్రెడ్డి కంటే ముందు పార్టీ రాష్ట్ర చీఫ్గా ఉన్న బండి సంజయ్ బీసీ కావడంతో త్వరలో నియమించే కొత్త అధ్యక్ష పదవి కూడా బీసీలకే ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈటలకు ఆ అవకాశం కలి్పస్తారని చెబుతున్నారు. ఏ పారీ్టలో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటనలు, కేడర్ను కలుపుకుపోవడం, సమన్వయం చేయడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువని రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. -
మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. -
మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది. -
హామీలన్నీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఈటల
సాక్షి, కొత్తగూడెం: పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అహంకారానికి స్థానం లేదని ప్రజలు నిరూపించారని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాటలు తప్ప హమీల అమలు లేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పేర్కొన్నారు. ఆరు నెలల ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. చైతన్యవంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రజాస్వామ్య విలువ పెంచాలని కోరారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ.. కొత్తగూడెం క్లబ్లోని ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమంలో తొలి తూటా దిగింది కొత్తగూడెం గడ్డ పైనేనని తెలిపారు. ఈ జిల్లా చైతన్య వంతమైన జిల్లా అని పేర్కొన్నారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్స్.. మంచి ఎవ్వరో చెడు ఎవ్వరో తెలుసుకుని ఓటు వేయాలని సూచించారు.ఎన్నికల ఫ్లెయింగ్ స్కాడ్ పేరుతో తమకు ఇబ్బందులు గురిచేయాలని చూశారని ఈటల ఆరోపించారు. లక్ష కోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని తెలిపారు. ప్రతి హామీలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని అన్నారు. భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చింది నరేంద్రమోీదీనేనని.. 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీనేనని అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తెచ్చి.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసిన ఘనత మోదీనేనని ఈటల తెలిపారు. -
6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
సాక్షి, నల్గొండ: లోక్సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంత ఉత్తదేనని అన్నారు. ప్రజలను దోచుకునే వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం దేవరకొండలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లేనని.. మంత్రులు జైలుకు కూడా పోయారని పేర్కొన్నారు.అబద్ధాల నిర్మాణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతికి,అన్యానికి, ధర్మానికి, ఆ ధర్మానికి జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. -
Malkajgiri Lok Sabha: ఈవీఎంలలో అభ్యర్థుల భవిత
చంపాపేట: పార్లమెంట్ ఎన్నికల ఘట్టం ముగియడంతో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో నిలచిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గెలుపుపై టెన్షన్ మొదలైంది. తమ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డి పని చేశారు. ఓటర్లు అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఎల్రక్టానిక్ యంత్రాల్లో భద్రపర్చారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ 20 రోజులూ తమ పార్టీ అభ్యర్థుల విజయంపై ఆయా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటుండగా, ఎల్బీనగర్లోని ప్రధాన పారీ్టల అభ్యర్థులు, నాయకులు మాత్రం బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఓటింగ్ శాతం తాము ఊహించినంతగా లేకపోవటంతో లోలోపల మాత్రం వారిలో ఆందోళన నెలకొంది. 👉 మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలో ఎల్బీనగర్తో పాటు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే అధిక ఓటర్లు కలిగిన ఎల్బీనగర్ శాసన సభ నియోజకవర్గ పరిధిలో 6,04,763 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ 46.27 శాతం మాత్రమే కావటంతో ఆ ప్రభావం ఏ పార్టీ అభ్యర్థి జయాపజయాలపై చూపుతుందోనని పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు, 👉 మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేయడం వల్ల ఎల్బీనగర్ వాసులు, అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సత్సబంధాలు ఉన్నాయి. దానికి తోడు ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. దీంతో ఆయన తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ పార్టీ కార్పొరేటర్లు, క్రియాశీలక కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఈటల విజయం కోసం ఏమాత్రం పాటు పడ్డారో అభ్యర్థి జయాపజయాలను నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 👉 బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం కోసం స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి ఉన్న కొద్దిపాటి పార్టీ కార్యకర్తలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ రాగిడి విజయానికి అహరి్నషలు కృషి చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఉన్న సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు నోచుకోక పోవటం వంటి అంశాల వల్ల రాగిడి లక్ష్మారెడ్డికి ఎల్బీ నగర్లో మెజారిటీ ఓట్లు వచ్చి విజయం ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 👉 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి ఎల్బీనగర్లోని పలు పార్టీ నేతలతో పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయి. దీనికి తోటు ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ఇతర పారీ్టలనుంచి కార్యకర్తలు కాంగ్రెస్లో చేరి బూత్ స్థాయినుంచి పార్టీ ఇన్చార్జీలను నియమించి పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కారణాల వల్ల పార్టీ అభ్యర్థి ఎల్బీ నగర్లో మెజార్టీ ఓట్లు సాధించడం పక్కా అని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నాడి అంతు చిక్కటుంలేదని, ఓటర్లు ఎక్కడా తమ మనోభావాన్ని, అంతరంగాన్ని బయట పెట్టడంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
4 నెలల్లోనే రేవంత్ అబద్ధాలకోరు అని తేలింది
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ వైఫల్యం చెందడానికి పదేళ్ల సమయం పడితే.. ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి నాలుగు నెలలు గడవక ముందే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ‘ఈకొద్ది కాలంలోనే ఆయన అబద్ధాల కోరు అని తేలింది. ఇచ్చిన హామీలు అమలు చేసే వ్యక్తో కాదో నాలుగు నెలల్లో తెలిసిపోయింది. సీఎం అయినా భాష మారలేదు..దబాయింపులు మారలేదు. రేవంత్రెడ్డి మతిభ్రమించినట్టు మాట్లాడుతూ దిగజా రుడు రాజకీయాలు చేస్తున్నారు. అబద్ధాల ప్రచారం, వీడియో మార్ఫింగ్లతో రేవంత్రెడ్డి అందరినీ మించిపోయారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు. మానవబాంబై పేలుతా.. పేగులు మెడలో వేసుకుంటా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడవచ్చా.. ఉన్మాదులు, సైకోలు అలా మాట్లాడతారు. నీ భాష మార్చుకో..సీఎం స్థాయిని, నీ స్థాయిని తగ్గించుకోకు. చిల్లరమాటలు మానుకోవాలి’అని రేవంత్రెడ్డికి ఈటల హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది›ప్రెస్లో ఈటల రాజేందర్ మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని, మళ్లీ దాన్ని దెబ్బతీస్తే రేవంత్కు కూడా పుట్టగతులుండవు. సీఎం మాటలకు విశ్వసనీయత లేదు. కమిటీల పేరుతో కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. గతప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ట్యాపింగ్లపై ఎలాంటి విచారణ లేదు. నేటికీ ట్యాపింగ్లు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో బిల్లుల కోసం ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు మొదలు అందరూ 7 నుంచి 10 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. 20 ఏళ్లకు పైబడిన నా రాజకీయ జీవితంలో ఇంతటి ‘పొల్యూటెడ్ పాలిటిక్స్’ ను చూడలేదు. పాలించే జాతి మాదే, పాలించే కెపాసిటీ మాకే ఉంది అని అహంకారంతో రేవంత్ మాట్లాడుతున్నారు. అంత జాత్యహంకారం, కులరాజకీయం పని కి రాదు. రద్దు చేయాలనుకుంటే అవన్నీ ఎందుకు చేస్తారు ? బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ మార్ఫింగ్ వీడియోలు చేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఫేక్ వీడియోలలో రేవంత్ ప్రమేయముందని ప్రచారం జరుగుతోంది, ప్రధాని మోదీ ఇతర రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే దళితులు, పేదలకు న్యాయం జరగాలని ఏబీసీడీ రిజర్వేషన్ల వర్గీకరణ దిశగా చర్యలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు, వంటివి ఎందుకు చే స్తారు. ముస్లింలకు కాదు మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. బీసీలుగా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారని, మళ్లీ మ తప్రాతిపదికన ఎందుకని బీజేపీ వ్యతిరేకిస్తోంది. మల్కాజ్గిరిలో ఏ సర్వేసంస్థలకు అందని ఫలితాలు ‘మల్కాజ్గిరిలో ఏ సర్వే సంస్థలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. అన్నివర్గాల మద్దతుతో మంచి మెజారిటీతో గెలుస్తా’అని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. తాను మల్కాజ్గిరి ప్రజలను తక్కువ చేసి మాట్లాడినట్టు ఓ మార్ఫింగ్ వీడియో సోషల్మీడియాలో ప్రచారం చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తాను గెలిస్తే మల్కాజ్గిరికి గుర్తింపుతోపాటు, రోడ్డు వ్యవస్థ, మెట్రోరైలు, ఐటీ. ఇండ్రస్టియల్ కారిడార్లు, మంచి విద్య, వైద్యం వస్తాయని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇక తనపై పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గురించి ఇక్కడి ప్రజలకు పెద్దగా తెలియదని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు, ప్రధానకార్యదర్శి ఆర్.రవికాంత్రెడ్డి, ఉపాధ్యక్షురాలు వనజ తదితరులు పాల్గొన్నారు. -
ఈటల గెలుపుపై మల్లారెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మల్లారెడ్డి తన రాజకీయం అనుభవంతోనే ఈటలపై ఆ కామెంట్స్ చేశారని పేర్కొన్నారు. మల్లారెడ్డి చాలా తెలివిగల వ్యక్తి అని, ఈటల రాజేందర్ను మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలనేది ఆయన వ్యూహమని తెలిపారు.బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈటలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మల్లారెడ్డి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారని తెలిపారు. మల్లారెడ్డి మాటల అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాక్యాలు సీరియస్గా తీసుకోవద్దని తెలిపారు. మల్కాజ్గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. అది ఈటల రాజేందర్కు కూడా తెలుసన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి,నేషనల్ మీడియాలో ప్రధాని మోదీకి ఓటేయ్యండి అంటూ చెబుతున్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి వెళతారని పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు ప్రతి ఇంట్లో కేసీఆర్ను తలుచుకోని రోజు లేదని అన్నారు. అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వస్తోందని దుయ్యబట్టారు. చదవండి: కోమటిరెడ్డి.. మాటలు జాగ్రత్త: కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు‘రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాల సినిమాలు చూపిస్తున్నాడు. దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు. కొండంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు.2014లో బడే బాయ్ బడా మోసం చేశారు. అనేక హామీలు ఇచ్చిన మోదీ ఏవీ చేయలేదు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. ప్రపంచ వ్యాప్తంగా క్రుడ్ ఆయిల్ ధరలు తగ్గితే కనీసం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. టోల్ లేని జాతీయ రహదారులు ఉన్నాయా? దేశంలో టోల్ పెట్టీ తోలు తీస్తుంది మోదీ ప్రభుత్వం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీతో జతకట్టి కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టింది . మమ్మల్ని 10 నుంచి 12 సీట్లతో గెలిపించండి. కాంగ్రెస్ మెడలు వంచుతాం.కడియం శ్రీహరి చేసిన ద్రోహం వరంగల్ లో ఏ నాయకుడు చేయలేదు. వరంగల్ ప్రజలను దారుణంగా మోసం చేశారు కడియం. ప్రపంచం వరంగల్ వైపు చూసేలా చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి ముందుగా వరంగల్ కళతోరణం రాష్ట్ర అధికారిక ముద్రలో తీసినందుకు క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఈటలా.. నువ్వే గెలుస్తావ్.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతున్నాయి. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మల్లారెడ్డిలు ఓ పెళ్లి వేడుకలో కలుసుకున్నారు. ఈటలను చూసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన వద్దకు వెళ్లి నువ్వే గెలుస్తున్నవన్నా అంటూ చేసిన వైరల్గా మారాయి.ఈటలను అలింగనం చేసుకోవడమే కాక, ఫోటో తీయండయ్య అన్న తోటి అంటూ ఉత్సాహంగా ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి పట్నం సునితా మహేందర్రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి తమ ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటలనే గెలుస్తున్నారంటూ చెప్పడం చర్చాంశనీయంగా మారింది. -
Telangana: రేపటి నుంచి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు..
సాక్షి, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో గురువారం కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నోటిషికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ విడతలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల ఘట్టం రేపు ఉదయం ప్రారంభమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేతల నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరుకానున్నారు. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ తేదీల వివరాలు 18న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ మెదక్ రఘునందన్ రావు నామినేషన్కు హజరు కానున్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ నామినేషన్కు హాజరు కానున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మహబూబ్ నగర్ డికే అరుణ నామినేషన్కు పీయూష్ గోయల్ 19న సికింద్రాబాద్, ఖమ్మం బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్కు హాజరు కానున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబ్ బాద్ బీజేపీ నేతల నామినేషన్లు జహీరాబాద్ బీబీ పాటిల్ నామినేషన్కు దేవేంద్ర ఫడ్నవీస్ చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్కు పియుష్ గోయల్ మహబూబాబాద్ సీతారాం నాయక్ నామినేషన్కు కిరణ్ రిజిజు 23న భువనగిరి, 24 న పెద్దపల్లి, అదిలాబాద్ ,హైదారాబాద్, వరంగల్ అభ్యర్ధుల నామినేషన్లు పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్కు అశ్విని వైష్ణవ్ అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్కు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి హైదారాబాద్ మాధవి లత నామినేషన్కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అరూర్ రమేష్ నామినేషన్కు అశ్వినీ వైష్ణవ్ 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్ కరీంనగర్ బండి సంజయ్, నాగర్ కర్నూల్ భరత్ నామినేషన్కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు. నిజామాబాద్ అరవింద్ నామినేషన్కు అశ్విని వైష్ణవ్లు హాజరుకానున్నారు. -
ఖబడ్దార్ రేవంత్.. నోరు, ఒళ్లు దగ్గరపెట్టుకో: ఈటల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డి ఖబడ్దార్.. నోరు, ఓళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలంటూ హెచ్చరించారు. ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డ్ అవుందని అన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ రెడ్డి.. రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఇటీవల రేవంత్ మాట్లాడిన ఈటల చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని మోదీ కేటాయించారని చెప్పిన సీఎం .. మళ్లీ అదే నోటితో ప్రధానిని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు. నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకోని జాగ్రత్తగా మాట్లాడాలని రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ హితవు పలికారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించిన రేవంత్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబడ్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చదవండి: ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ పిల్లి కళ్లు మూసుకొని పాలుతాగినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందన్నారు. "ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావని. నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారు అని మర్చిపోకు." అంటూ వార్నింగ్ ఇచ్చారు. మల్కాజ్గిరిలో ఎవరు వచ్చినా.. ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా.. గెలిచేది బీజేపీనే అని.. ఈటల రాజేందర్ దీమా వ్యక్తం చేశారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నందంతా రికార్డ్ అవుతుందన్నారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. -
ఈటెల రాజేందర్ సీటుపై కేసీఆర్ కసరత్తు
-
ఈటలకు మల్కాజ్గిరి ఫిక్స్!.. బీజేపీ నేతలతో కీలక భేటీ?
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ను ఈటల రాజేందర్కు కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో, ఆయన పోటీ ఆసక్తికరంగా మారనుంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఈటల రాజేందర్ను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మల్కాజ్గిరి స్థానం ఈటలకు కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. దీంతో, ఈటల శామీర్పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ మేరకు మెసేజ్లు వెళ్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మల్కాజిగిరి బరిలో ఈటల?
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతలో భాగంగా బీజేపీ కోర్ కమిటీ తెలంగాణలో పార్టీ బలాబలాలపై రాష్ట్ర నాయకత్వంతో మేధోమథనం చేపట్టింది. పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సంబంధించి కసరత్తు నిర్వహించింది. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి సహా ఇతర కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని 17 లోక్సభ సీట్లలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్–జి.కిషన్రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్రెడ్డి, మల్కాజిగిరి–ఈటల రాజేందర్, మెదక్–ఎం.రఘునందన్రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ అభ్యర్థిత్వాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆయా పేర్లకు నడ్డా, షా ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో రెండు సీట్లలోనూ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 29న జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 8 లేదా 9 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, గతంలో ఓడిపోయిన స్థానాల్లో పార్టీ బలం పుంజుకుందని ఈ భేటీలో రాష్ట్ర నేతలు పార్టీ పెద్దలకు వివరించినట్లు సమాచారం. ఐకమత్యంతో పనిచేసి రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వారు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారని తెలిసింది. ఈ సమావేశంలో పార్టీ నేతలు బండి సంజయ్, డా. కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మెజారిటీ సీట్లు గెలుస్తాం: కె. లక్ష్మణ్ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుస్తామని.. గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ చెప్పారు. పార్టీ జాతీయ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాత్రలు, సభలపై అగ్రనేతలతో చర్చ జరిగిందని పేర్కొన్నారు. -
మల్కాజిగిరి ఛాన్స్ నాకివ్వండి: ఈటల రాజేందర్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తమ సొంత కాళ్లపై నిలబడి పోటీ చేసి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీచేస్తానని మరోసారి ఈటల పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడిగడ్డపై సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్.. అధికారం వచ్చాక మాట మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి, తప్పుదోవ పట్టించి హామీలు ప్రకటించిందని మండిపడ్డారు. ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హామీలపై ప్రజల భ్రమలు తొలగుతున్నాయని అన్నారు ఈటల. ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య, అక్యూపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హామీలపై ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. చదవండి: TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగతి సాధిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని.. రూ. 6300కోట్ల రూపాయాలతో మూత పడిన ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారని ప్రశంసించారు. నిజమాబాద్లో పసుపు బోర్డు పెట్టి నేనున్నానని భరోసా ఇచ్చారని ప్రస్తావించారు. దక్షిణాన రూ. 26వేల కోట్లతో రిజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశారని తెలిపారు. ‘ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేసీఆర్ సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశారు. కేసీఆర్ లక్ష రూపాయాల రుణమాఫీ ఐదేళ్ళ కాలంలో పూర్తి స్థాయిలో జరగలేదు. రెండు లక్షల రుణ మాఫీ ఒకటే దఫా చేయాలంటే సాధ్యం కానీ పరిస్థితి. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన హామీలను అరచేతిలో వైకుంఠం చూపెడతున్నారు. 400లకు పైగా ఉన్న హామీలను మరోసారి కాంగ్రెస్ చదువుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఇండియా కూటమి అతుకుల బొంతగా మారింది. దేశం ఒక్కప్పుడు బాంబుల మోతలు, మత కలహాలు ఉండేది. బీజేపీ పాలనలో దేశమంతా ప్రశాంతంగా ఉంది’ అని పేర్కొన్నారు. -
యాదాద్రిలోని విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్
-
ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ..! ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే.. వాటిని ఆయన కొట్టిపారేశారు. అంతేకాదు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తీరతానని అంటున్నారాయన. తాజా.. పరిణామాలపై సాక్షి టీవీతో తాజాగా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ‘‘నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటా. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తా’’ అని తనలోని ఆసక్తిని బయటపెట్టారాయన. ఇదీ చదవండి: అందరి దృష్టి ఆ సీటుపైనే రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ సెగ్మెంట్ నుంచి నెగ్గి.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దీంతో.. అంతకు ముందు ఆయన ఎంపీగా చేసిన మల్కాజ్గిరి ఖాళీ అయ్యింది. ఈలోపే సార్వత్రిక ఎన్నికలకు పెద్దసమయం లేకపోవడంతో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అవసరం లేకుండా పోయింది. మరోవైపు ఈ నియోజకవర్గంపై ఇప్పటికే అధికార-ప్రతిపక్ష పార్టీల నేతలెందరి కన్ను వేశారు. మాజీ మంత్రి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నటి కాంగ్రెస్ దరఖాస్తుల్లోనూ.. ఈ స్థానానికే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. ఆశావహుల్లో.. రేవంత్రెడ్డి సన్నిహితులతో పాటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా ఉన్నారు. -
కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే వార్తలు ఖండించిన ఈటల రాజేందర్
-
కాంగ్రెస్ నేతలతో ఈటల ఆసక్తికర భేటీ.. హస్తం గూటికి ప్లాన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అనంతరం, కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి చేరగా.. ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఇక, తాజాగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, ఈటల రాజేందర్ కూడా హస్తం గూటికి వెళ్తున్నారనే చర్చ మొదలైంది. అయితే, బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన అనంతరం, ఆయన కాంగ్రెస్లో చేరుతారనే చర్చ నడిచింది. కానీ, అనూహ్యంగా ఈటల.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో హుజురాబాద్కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో(హుజురాబాద్, గజ్వేల్) పోటీచేసి ఓడిపోయారు. కాగా, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈటల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారుతారా? లేక ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, వీరి భేటీపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ఊపందుకుంది. ఈటల కాంగ్రెస్లో చేరి కరీంనగర్లో నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
Karimnagar Lok Sabha: కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ రికార్డులు మరే పార్టీ బ్రేక్ చేయలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటారు. ఆఖరు వరకు నాన్చుతారు. సీటు కోసం పోటీ పడుతున్న నేతలకు టెన్షన్ పెంచుతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ తీరు ఇలాగే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలపుడు కూడా గాంధీభవన్ దగ్గర ఇదే సీన్ కనిపించింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పాత సీన్లే కనిపిస్తాయంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఓ కీలకమైన పార్లమెంట్ సీటు వ్యవహారం ఎలా ఉందో చూద్దాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాలిటిక్స్ బాగా హీటెక్కుతున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి పోటీ చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ బరిలో ఉంటారు. వీరిద్దరి పేర్లను ఆయా పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా..ఒకరు సిటింగ్ ఎంపీ, మరొకరు మాజీ ఎంపీ కావడంతో పార్టీ నాయకత్వం ఇచ్చిన సానుకూల సంకేతాలతో ఇద్దరూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో హస్తం టిక్కెట్ కోసం క్యూ లైన్ బాగా పెరిగింది. గతంలో పోటీ చేసినవారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, మంత్రి సోదరుడు ఇలా అనేక మంది కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, వెలిచాల రాజేందర్ రావు వంటివారితో పాటు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పేరు కూడా బాగా ప్రచారంలోకొస్తోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎక్కడా తాను కాంగ్రెస్లో చేరి కరీంనగర్ ఎంపీగా పోటీచేస్తున్నట్లు ప్రకటించకపోయినా ఆయన పేరును కూడా ప్రచారం చేస్తున్నారు. ఈటల అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన పేరు కూడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కరీంగనర్ నుంచి వినిపిస్తోంది. ఇంతమంది పేర్లు ప్రచారంలోకి రావడంతో అసలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు కాబోతున్నారన్నది ఇప్పుడు కరీంనగర్లో ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికలపుడు నామినేషన్లు ముగిసేవరకు కూడా కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అప్పుడు కూడా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆఖరులో అభ్యర్థిని ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల సామాజిక వర్గానికి చెందిన నేతనే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిగా ప్రకటించినా.. బాగా ఆలస్యం కావడంతో అసలు పోటీ ఇవ్వలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొనసాగిన కన్ఫ్యూజన్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరుగుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళం కొనసాగుతోంది. -
బీజేపీ నేత ఈటల దారెటు?
హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేది ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. తాను కాంగ్రెస్లో చేరడంలేదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. మరి ఈటల కాంగ్రెస్లో చేరతారా? హస్తం గూటికి చేరితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అసలు ఆయన ఆలోచన ఏంటి?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. సుమారు 20 వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారీ ఓటమిపాలైన బండి.. అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్దపార్టీ అరేంజ్ చేసి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓటమిపాలైన వినోద్ ఈసారెలాగైనా గెలవాలన్న తపనతో.. ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు.. అన్ని కార్యక్రమాలకూ హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు. కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నా.. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇంఛార్జ్ గా జీవన్ రెడ్డిని నియమించడంతో.. ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్టుగా సమాచారం. కానీ, జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా.. లేక, కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో.. ఇదిలాఉంటే.. మరోవైపు కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలకపాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.. మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం. త్రిముఖ పోరు..? మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనుక ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంతపార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కూ ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటల గనుక బరిలో ఉంటే కచ్చితంగా కరీంనగర్ లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటల దారెటు? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు -
కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్కుమార్కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
కాంగ్రెస్ లోకి ఈటల రాజేందర్ ?
-
తెలంగాణలో జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా? లేనట్టా?
-
పీవీని ‘భారత రత్న’తో గౌరవించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు పీవీ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో దేశానికి పీవీ చేసిన సేవలను ప్రశంసించారు. ఇక, పీవీ ఘాట్ వద్ద మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘తెలుగు వారికి, తెలంగాణకు, భారత దేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహారావు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత్ను గాడిలో పెట్టి తన వంతుగా దేశానికి సేవలు అందించారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి. ఢిల్లీలో పీవీ ఘాట్ను నిర్మించాలి. భారతరత్న ఇచ్చి పీవీని గౌరవించాలి. పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్ చేశామో ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా పీవీ ఘాట్లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..‘దేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో ఆయన సంస్కరణలు దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాయి. పీవీని కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది. పీవీకి సముచిత స్థానం ఇవ్వలేదన్న కేసీఆర్.. ఆయన వర్థంతి సభకు బీఆర్ఎస్ రాకపోవడం బాధాకరం’ అని విమర్శించారు. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకాంక్షల మేరకు రాష్ట్రంలో అధికార సాధన దిశగా బీజేపీ దూసుకుపోతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలోని ఒక సీటుతో పోలిస్తే 8 సీట్లలో గెలవడంతోపాటు రెండింతల ఓట్ల శాతాన్ని సాధించిందని తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు, నేతలు డా. ఎస్.ప్రకాశ్రెడ్డి, టి. ఆచారి, మురళీయాదవ్, నరహరి వేణుగోపాల్రెడ్డిలతో కలసి ఈటల మీడియాతో మాట్లాడుతూ ఇతర పార్టీలు డబ్బు సంచులు పంచినా ప్రజలు తమకు ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 36 లక్షల ఓట్లు (15 శాతం ఓట్లు) సాధించేలా చేశారన్నారు. అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఈటల పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తలు అందించిన విశ్వాసం, నమ్మకంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో 2019లో గెలిచిన సీట్ల కంటే రాష్ట్రంలో అధిక స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పారు. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ 400 సీట్లలో గెలిచి సత్తా చాటుతుందని ఈటల విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం గురించి తనకేమీ తెలియదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దీనిపై పార్టీ నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కడియం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: రఘునందన్ బీఆర్ఎస్ 39 సీట్లతోపాటు బీజేపీకి 8, ఎంఐఎంకు 7 సీట్లు కలిస్తే తమ బలం పెరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డితో టీడీపీలోని ఆయన పాత మిత్రుడైన కడియం శ్రీహరి కలవదలుచుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించనుందని, ఎంఐఎంతో అంటకాగే పార్టీలతో బీజేపీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోదని ఆయన స్పష్టంచేశారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఈ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతామన్నారు. సోషల్ మీడియాలో పోస్టులొద్దు... బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో పెడుతున్న అభ్యంతరకర పోస్టులను పార్టీ నాయకత్వం గమనిస్తోందని రఘునందన్రావు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. వాటిపై సరైన సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని, ఓటమి బాధతో సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలు నిరుత్సాహానికి గురికావొద్దని, మళ్లీ పూర్తిస్థాయి శక్తితో పుంజుకుంటామన్నారు. -
రెండు చోట్లా ఓటమి.. మున్ముందు మరింత కఠిన పరీక్ష తప్పదా?
ఎప్పుడు ఎన్నిక జరిగినా అక్కడ ఆయనదే గెలుపు. నియోజకవర్గం మారినా ఇప్పటికి ఏడుసార్లు వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2021 ఉప ఎన్నికలో ఓడిపోతారనే ప్రచారం సాగింది. గులాబీ బాస్ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెప్పించారు. పార్టీ మారారు. కాని కారు దెబ్బకు ఢీలా పడతారని అందరూ భావించారు. అయితే అర్జునుడిలా పద్మవ్యూహాన్ని ఛేదించి విజయుడిగా నిలిచారు. తాజా ఎన్నికల్లో మాత్రం అభిమన్యుడిలా ఓడిపోయారు. ఇంతకీ ఆయన ఎవరో? ఆయన కథేంటో చూద్దాం. ఈటల రాజేందర్.. తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ పరిచయమైన పేరు. అప్పటి సీఎం కేసీఆర్ ను ఎదిరించి గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినా..తన పంథాకు భిన్నమైన కమలం పార్టీ నీడకు చేరారు. ఆ పార్టీలో చేరాక తన సొంత జిల్లాకు చెందిన నాటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ తో పొసగకున్నా...తాజా ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ తో పాటు.. సవాల్ విసిరి మరీ గజ్వేల్ లో కేసీఆర్ పై బరిలోకి దిగి, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అటు కమలాపూర్ నియోజకవర్గం నుంచి..ఇటు హుజూరాబాద్ నుంచి వరుసగా ఏడుసార్లు గెలిచిన విజేతగా తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ ను వీడి బయటకు వచ్చాక జరిగిన 2021 ఉపఎన్నిక యావత్ దేశం దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు ఈటలపై అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ఈటల ఓటమి కోసం గులాబీ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. నాటి ఉపఎన్నికలో అభిమన్యుడిని చుట్టుముట్టినట్టు చుట్టుముట్టింది. కానీ, ఈటల మాత్రం తన ఏడో విజయాన్నందుకున్నారు. దాంతో ఈటల క్రేజ్ కమలం పార్టీలో మరింతగా పెరిగింది. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. అదే పరిస్థితి ఈటల విషయంలో ఎనిమిదో ఎన్నికలో జరిగింది. ఇంతకాలం ఎదురులేని మనిషిగా నిల్చిన ఈటల.. తాజా ఎన్నికల్లో తనపైన ఎవ్వరూ అంత ఫోకస్ చేయకపోయినా తాను నమ్ముకున్న హుజూరాబాద్ లో ఓటమి పాలయ్యారు. అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. 2018 ఎన్నికల్లో ఈటలపై కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలైన కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా.. ఈసారి ఎన్నికల్లో గెలిపించి పట్టం కట్టారు. ఈటలను ఓడగొడుతానని సవాల్ విసిరిన కౌశిక్కు.. సెంటిమెంట్ రాజకీయాలు కూడా ఈసారి కలిసివచ్చాయనే టాక్ ఎలాగూ ఉంది. అటు గజ్వేల్ లో తొడగొట్టి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ను ఓడగొట్టేందుకు వెళ్లి అక్కడా ఈటల భంగపడ్డారు. తాను ప్రచారంలో లేని లోటును పూడ్చేందుకు హుజూరాబాద్లో తన సతీమణి జమునను ప్రచారంలోకి దింపారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు ఓటమి తప్పలేదు. ఈటల వచ్చాక బీజేపీలో జరుగుతున్న మార్పులపై ఓ పెద్ద చర్చే జరుగుతున్న క్రమంలో...బీజేపీని అంటిపెట్టుకుని ఉన్న సంప్రదాయవాదుల్లో కొంత వ్యతిరేకత కూడా అంతర్లీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈటల గెలిస్తే ఆయనకు కొంత ప్లస్సయ్యేది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈటల రీగెయిన్ కావడానికి తన శైలిని కొంచెం మార్చుకోవాల్సి ఉందని.. ఆచితూచి అడుగులు వేస్తేనే రాజకీయాల్లో ఇప్పటివరకూ తనకున్న ప్రత్యేకతను కాపాడుకోగలుగుతారనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ చెంతనే ఎక్కువ కాలం రాజకీయాలు చేసిన ఈటల రాజేందర్లో కొంతమేర ఉన్న అహంకార పోకడలు ఆయనకు మైనస్గా మారాయనే వారూ ఉన్నారు. గతంలో హుజూరాబాద్ లోనే ఉంటూ హైదరాబాద్ మంత్రిగా కాకుండా.. హుజూరాబాద్ మంత్రిగా పేరు పడ్డ ఈటల.. ఈమధ్య హుజూరాబాద్కు దూరమవ్వడం కూడా ఆయనలో వస్తున్న తేడాను ఇక్కడి ఓటర్లు పసిగట్టారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిపక్షంలో ఉన్న ఈటల చేసేదెంత?.. అధికారపక్షంలో ఉన్నవారైతే అయ్యే అభివృద్ధి ఎంత అనే లెక్కలతో పాటు...ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ కు ఈసారి పెద్దఎత్తున ఓట్లు పోలవ్వడం..కౌశిక్ రెడ్డిపై వెల్లువెత్తిన సానుభూతి కూడా కలిసి.. ఈటల ఓటమికి ఆయన నమ్ముకున్న హుజూరాబాద్లోనే బీజం పడింది. రెండు నియోజకవర్గాల్లో ఓటమి ఈటల రాజకీయ జీవితాన్ని కొంత సంక్షోభంలోకి నెట్టింది. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థిగా వొడితెల ప్రణవ్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో.. ఇప్పటికే విజయంతో ఊపుమీదున్న కౌశిక్ రెడ్డితో.. మున్ముందు ఫైట్ కూడా ఈటలకు మరింత టఫ్గానే ఉంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చదవండి: AP: కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
గజ్వేల్లో కేసీఆర్ గెలుపు.. హుజూరాబాద్లో ఈటల ఓటమి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలు కీలక నేతలకు షాక్ ఇస్తున్నాయి. అధికార పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదు.. ఇతర పార్టీల్లోని నేతలకు చేదు అనుభవం మిగల్చబోతున్నాయి ఈ ఎన్నికలు. బీజేపీ తురుపుముక్కగా భావించిన ఈటల.. రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్రెడ్డి చేతిలో ఓడారు. ఏకంగా 17వేల ఓట్ల(17,158 ఓట్లు) మెజారిటీతో ఈటలపై కౌశిక్రెడ్డి నెగ్గారు. హుజూరాబాద్లో ఈటల రెండో స్థానానికే పరిమితం అయ్యారు. మరోవైపు కేసీఆర్ను ఓడిస్తానని చాలెంజ్ చేసి మరీ గజ్వేల్ బరిలోనూ ఈటల నిల్చున్నారు. అయితే.. ఇక్కడా కేసీఆర్ చేతిలో ఈటలకు పరాభవం తప్పలేదు. కాకుంటే ఈటల లాంటి బలమైన నేత పోటీ చేయడంతో గత ఎన్నికల కంటే ఈసారి కేసీఆర్ మెజారిటీ తగ్గింది. అయితే గజ్వేల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ రికార్డు మాత్రం నెలకొల్పారు. కరీంనగర్ ఈసారి కచ్చితంగా నెగ్గుతారనే అంచనాలున్న బండి సంజయ్.. గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. స్వల్ప మెజార్టీతోనే ఆయన బండి చేతిలో ఓడారు. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్రావు.. ఇప్పుడు ఎన్నికలో ఓటమి పాలయ్యారు. కొత్త ప్రభాకర్(మెదక్ ఎంపీ) భారీ మెజార్టీతో ఇక్కడి నుంచి నెగ్గారు. -
వెనుకంజ లో బండి సంజయ్, ఈటెల రాజేందర్
-
ఓటేసిన ఈటల..క్రమంగా ఊపందుకుంటున్న పోలింగ్
-
ఓటుహక్కు వినియోగించుకున్న ఈటెల రాజేందర్
-
24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. తప్పుకుంటా: కేసీఆర్కు ఈటల సవాల్
సాక్షి, సంగారెడ్డి/తూప్రాన్: బీజేపీ కండువా కప్పుకున్న వారికి సంక్షేమ పథకాలు రావని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని, పథకాలు మీ అయ్య జాగీరా? అని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఆదివారం తూప్రాన్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్రావు అధ్యక్షతన జరిగిన సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈటల మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కాషాయ కండువా కప్పుకున్న వారికి పెన్షన్లు, రైతుబంధు, డబుల్ బెడ్రూం రాదంటున్నారు. మిస్టర్ సీఎం కేసీఆర్.. మిస్టర్ హరీశ్.. మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ అయ్య జాగీరా..? అని ప్రశ్నించారు. మీరు కేవలం ప్రజల ఆస్తులకు కాపాలదారులు మాత్రమే అన్నారు. తెలంగాణ ప్రజానీకానికి సేవ చేసే జీతగాళ్లు అనే విషయం మరిచిపోతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాజకీయం నుంచి తప్పుకుంటా.. కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తమతోనే ఉద్యోగాలు, 24 గంటల విద్యుత్ సరఫరా అని మాట్లాడటం సిగ్గుచేటని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తే తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కౌలు రైతు చనిపోతే రూ.లక్ష ఇచ్చే సోయి లేని కేసీఆర్.. పక్క రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులకు రూ.3 లక్షల చెక్కులు అందించి తెలంగాణ వ్యవసాయంలో ఆదర్శం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు విత్తనాలు, ట్రాక్టర్లు, పనిముట్లు తదితర వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు. అలాగే ప్రతీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పెన్షన్లు అందించడంతోపాటు రైతులు సాగు చేసిన ధాన్యానికి క్వింటాల్కు రూ.3,500 చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులు మురళీయాదవ్(నర్సాపూర్), నందీశ్వర్గౌడ్(పటాన్చెరు), రాజు (సంగారెడ్డి), శ్రీకాంత్రెడ్డి (సిద్దిపేట), విజయ్కుమార్ (మెదక్) మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్, నందారెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: ఇదీ సెక్షన్.. తప్పదు యాక్షన్! -
ఓపెన్ డిబేట్..బీసీ సీఎం రేసులో ఈటల..!?
-
BJPలో రాజేందర్ BRS కోవర్టా..?
-
కేసీఆర్ను కాదని పనిచేసే సత్తా హరీష్రావుకు ఉందా?: ఈటల
సాక్షి, సిద్ధిపేట: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ అనుమతి లేకుండ చీమ కూడా చిటుక్కుమనదని ధ్వజమెత్తారు. గతంలో తాను ఆర్ధిక మంత్రిగా ఉన్నా సొంత ఇర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపారు. కేసీఆర్ను కాదని పనిచేసే సత్తా ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి హరీష్రావుకు ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు గజ్వేల్ నియోజకవర్గం కుకునూర్పల్లి మండలం లకుడారంలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ మంత్రులంతా అతని బానిసలని, స్వతంత్రంగా పనిచేయలేరని మండిపడ్డారు. కేసీఆర్ను కాదని ఏ మంత్రి కూడా నిర్ణయాలు తీసుకోలేరని అన్నారు. కాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. హుజూరాబాద్తో పాటు గజ్వేల్ గడ్డ మీద సీఎం కేసీఆర్పై పోటీకి నిలబడ్డారు. ఇక్కడ మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్ అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదంతో బరిలోకి దిగారు. మరోవైపు కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డిలో కేసీఆర్పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చదవండి: ప్రచార వాహనంపై స్పృహతప్పిన ఎమ్మెల్సీ కవిత -
రెండేసి నియోజక వర్గాల్లో ముగ్గురు కీలక నేతలు పోటీ
-
బీజేపీ ఐదో జాబితా! ఈటల సీఎం అభ్యర్థి రేసులో బండి సంజయ్
-
బీజేపీకి మద్దతిచ్చి గెలిపిస్తే ఈటల సీఎం.. మోదీ హామీ!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని బీసీవర్గాలంతా కలసి బీజేపీని గెలిపిస్తే పరిపాలనా అనుభవమున్న ఈటలను ముఖ్యమంత్రి చేస్తామని మోదీ పేర్కొన్నారని అంటున్నాయి. నిజానికి బీజేపీ ‘బీసీల ఆత్మ గౌరవసభ’ వేదికగా సీఎం అభ్యర్థిపై ప్రధాని స్పష్టత ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. సభ ముగిశాక 33 బీసీ, కుల సంఘాల ప్రతినిధులతో భేటీ సందర్భంగా ‘మెజారిటీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను, బీసీలను గెలిపించుకోండి. అందరికీ అందుబాటులో ఉండే ఈటల రాజేందరే మీ నాయకుడు’ అని ప్రధాని స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర పార్టీ నేతలతో విడిగా భేటీ అయినప్పుడూ ఈ విషయాన్ని పేర్కొన్నట్టు సమాచారం. సభలో పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని.. సభా వేదికపై మరోవైపు కూర్చున్న ఈటల రాజేందర్ను ప్రధాని మోదీ పిలిపించి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టల తీరు, బీజేపీ అభ్యర్థుల ఖరారు, ఎన్నికల సన్నద్ధత తీరు, పార్టీ బీసీ నినాదానికి ప్రజల్లో వస్తున్న స్పందనపై మోదీ ఆరా తీసినట్టు సమాచారం. గజ్వేల్లో తన నామినేషన్ సందర్భంగా 20వేల మంది వరకు వచ్చారని, ప్రజల్లో మంచి స్పందన ఉందని ఈటల వివరించినట్టు తెలిసింది. అంతకుముందు సభాస్థలికి ఓపెన్ టాప్ జీప్లో వచ్చినప్పుడు వెనుక ఉన్న ఈటలను మోదీ ముందుకు పిలిపించుకుని తన పక్కన నిలబెట్టుకున్నారని పార్టీ నేతలు తెలిపారు. చదవండి: తప్పు చేసిన వారిని వదలం: ప్రధాని మోదీ -
తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలపై ఈటల సంచలన వ్యాఖ్యలు
-
తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై ఈటల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో చంద్రబాబు రాజకీయంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టిన చంద్రబాబు.. కాంగ్రెస్ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2018 లో కాంగ్రెస్తో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు.. 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్పై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఈటల అన్నారు. కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తోక ముడిచింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా కూడా చేశారు. చంద్రబాబు, లోకేష్ తీరుపై తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ‘టీడీపీ ఇక్కడ పోటీ చేయొద్దనడం వెనుక ఎవరున్నరో గానీ, మన చౌదరీలే కాంగ్రెస్కు ఓటేయమని క్లియర్గా చెబుతున్నరు. బాబును మొన్న కలిసినప్పుడు మన కమ్మ వాళ్లే పోటీ చేయడం లేదని ప్రచారం చేస్తున్నరని క్లియర్గా చెప్పిన. టీడీపీ వాళ్లే కాంగ్రెస్కు ఓటేయమని చెబితే ఎట్ల. వీళ్లు ప్రచారం చేసినా.. కొందరే కాంగ్రెస్ అంటున్నరు. మిగతా వాళ్లు బీఆర్ఎస్కు ఓటేయాలంటున్నరు’’ అంటూ కాసాని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఓ లెక్క. జనరల్ ఎన్నికల్లో చేయకపోతే ఎట్ల?’ అంటూ కాసాని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. చదవండి: బాబుకు కోపమొచ్చింది.. అచ్చెన్న పదవి ఊస్టింగేనా? -
Telangana: ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకే జై
సాక్షి, కరీంనగర్: ఎంపీలుగా గెలిచినా, రాజ్యసభకు వెళ్లినా..ఎమ్మెల్సీలుగా ఎన్నికైనా ప్రస్తుత రాజకీయాల్లో అందరికీ శాసనసభలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలనే ఉత్సుకత..ఆసక్తే ఎక్కువగా కనిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యే గారూ అంటేనే వచ్చే కిక్కు వేరే లెవెల్ అన్నదే ఇప్పుడు రాజకీయనేతల మనసుల్లో నాటుకు పోయింది. ఆ క్రమంలో జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరెవరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగారని ఒక్కసారి చూస్తే.. ఇద్దరు ఎమ్మెల్సీలు..! ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో ఎమ్మెల్సీ పాడికౌశిక్రెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన 2021లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తన స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ఆ స్థానానిక ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక ఈటల రాజేందర్ హుజురాబాద్తోపాటు గజ్వేల్లోనూ పోటీ చేస్తున్నారు. ఒకవేళ రెండుచోట్ల రాజేందర్ విజయం సాధిస్తే.. ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తథ్యం.) మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి కూడా జగిత్యాల అసెంబ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జీవన్రెడ్డి 2019లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒకవేళ అసెంబ్లీపోరులో ఈయన గెలిస్తే.. 2025 వరకు అంటే దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. దీంతో ఈయన స్థానానికి ఉపఎన్నిక అనివార్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే! ఇద్దరు ఎంపీలు సైతం! ఇద్దరు ఎంపీలు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. వీరిద్దరూ విజయం సాధించినా.. ఆరునెలలు మాత్రమే వీరి పదవీకాలం మిగిలి ఉండటంతో ఉపఎన్నిక రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ గెలవకపోయినా.. వీరి పదవులకు వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. -
రెండు రోజుల్లో మునుగోడు అభ్యర్థి ఖరారు
చౌటుప్పల్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. అందరికీ అమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని చెప్పారు. మునుగోడు అభ్యర్థిని త్వరగా ఖరారు చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్ర ఇన్చార్జి సునీల్బన్సల్, ఈటలను వారు కలిశారు. ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈటల ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. ఆలస్యం జరగకుండా అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్ దూడల భిక్షంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
telangana: శాసనసభకు అయిదు కంటే ఎక్కువసార్లు ఎన్నికైంది వీరే..
తెలంగాణ నుంచి శాసనసభకు ఐదు లేదా అంతకన్నా ఎక్కువగా ఎన్నికైనవారి సంఖ్య నలబై అయిదు వరకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఏడుసార్లు శాసనసభకు ఎన్నికైన వారు ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి , ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్ ఈ ఘనత పొందారు. జానారెడ్డి 1983,1985 లలో టీడీపీ పక్షాన, 1989,1999,2004,2009,2014లలో కాంగ్రెస్ పక్షాన గెలుపొందారు. ఈటెల రాజేందర్ 2004 ,2008 ఉప ఎన్నిక, 2009, 2010 ఉప ఎన్నిక, 2014,2 018లలో టిఆర్ఎస్ పక్షాన, 2021 ఉప ఎన్నికలో బీజేపీ తరపున ఆయన గెలుపొందారు. ఆరుసార్లు గెలిచినవారిలో జి.గడ్డెన్న, టీ.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీ రాజేశ్వరరావు, తన్నీరు హరీష్ రావు, డాక్టర్ ఎమ్.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి ఉన్నారు. ఇక ఐదుసార్లు గెలిచిన నేతలలో జి.రాజారాం, గంపా గోవర్దన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్ధనరెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసి, సలావుద్దీన్ ఒవైసి, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకరరావు, గురునాధరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తం కుమార్ రెడ్డి, పి.గోవర్దనరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు -
గజ్వేల్కు నేను కొత్త కాదు.. ఈటల ఎమోషనల్ కామెంట్స్!
సాక్షి, గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీలనే కాకుండా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివి అని అన్నారు. అయితే, ఈటల రాజేందర్ గురువారం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్లోనూ జరుగుతుంది. గజ్వేల్లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం. బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీ పార్టీనే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుంది. గజ్వేల్లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్లో అదే జరుగుతోందన్నారు. గజ్వేల్కు నేను కొత్త కాదు. గజ్వేల్లో తొలి పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసి నా జీవితం ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో గజ్వేల్లోనే ఎక్కువగా తిరిగాను. సొంత ప్రాంతంలో తిరగాలని కేసీఆర్ చెప్తే.. హుజురాబాద్లో ఉద్యమం నడిపాను. తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే అయ్యాక తెలంగాణతో పాటు అణగారిన వర్గాల వారి కోసం కూడా పోరాడాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ! -
‘రాజగోపాల్రెడ్డి రాజీనామా ఊహించిందే!’
సాక్షి, హైదరాబాద్: ఏడాది తర్వాత.. సరిగ్గా ఎన్నికల వేళ బీజేపీకి ఝలక్ ఇస్తూ కాంగ్రెస్లో చేరేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సిద్ధమయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని గుర్తించానని, కాంగ్రెస్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. ఈ పరిణామంపై తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా స్పందించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. ‘‘ఎవరి ఊహలు వారివి. ఎవరి ఇష్టం వారిది. బీజేపీ పోటీలో లేదని వారు(రాజగోపాల్రెడ్డిని ఉద్దేశిస్తూ..) అనుకుంటే సరిపోతుందా?’’ అని అన్నారు. ‘‘రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా చదవలేదు. మొన్ననే బీఆర్ఎస్కు.. బీజేపీనే ప్రత్యామ్నాయమన్న రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు ఎలా మాట మార్చారు?’’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అలాగే.. బీఆర్ఎస్ డబ్బు సంచుల్ని నమ్ముకుందని ఆరోపించిన ఈటల.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని.. హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బూర నర్సయ్య గౌడ్ స్పందన.. ‘‘రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉంది. ఆత్మ మాత్రం కాంగ్రెస్లోలోనే ఉండిపోయింది. ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు అందరూ ఊహించినదే. రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన... బీజేపీ బీఆర్ఎస్కు ఆల్టర్నేట్ కాకుండా పోదు. రాష్ట్రంలో కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిల్లో జనాలు లేరు.కేసీఆర్ ని ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నయం కేవలం బీజేపీనే. నేను పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తాను. నాకు భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఉంది. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా శిరసా వహిస్తాను. వివేక్ వెంకటస్వామి కామెంట్స్.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నాకు తెలియదు. కానీ, నేను పార్టీ మారుతానని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదంతా తప్పు. బీజేపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచే పోటీచేస్తా. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందన.. రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్. . కానీ, పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది. నేను మాత్రం ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నా. లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ తో మా కార్యకర్తలు రక్తాన్ని చిందిస్తున్నారు.అటువంటి బిజెపిపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు. జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం సరైంది కాదు. రాజగోపాల్ రెడ్డి కి పార్టీ జాతీయస్థాయిలో మంచి హోదాని కల్పించింది. ఆయన్ని గౌరవించి ఉన్నతమైన స్థానం కల్పించింది. అలాంటిది.. వ్యక్తిగతంగా ఇటువంటి ఆరోపణలు చేయటం సరైనది కాదు. తెలంగాణ ప్రజలు ఇదంతా చూస్తున్నారు. -
లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడానికి సీఎం కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలి
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగిపోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావే పూర్తి బాధ్యత వహించాలని, ఏమాత్రం నిజాయితీ ఉన్నా సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్ టెండర్ పిలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడు దల చేయాలని కోరారు. సోమవారం పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, నరహరి వేణుగోపాల్రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడుతూ...సీఎం కేసీఆర్కు నష్టపోయిన ప్రా జెక్ట్ చూపించేందుకు గానీ, ఏమైందో చెప్పేందుకు నిపుణు ల కమిటీ వేసి దానిని బయటకు వివరించే దమ్ముగానీ లేదన్నా రు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా త ప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనంతో ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుకు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై గతంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఇరిగేషన్ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన విషయా న్ని గుర్తు చేశారు. లక్ష్మీ బ్యారేజీని ఇసుక మీదనే ఫౌండేషన్ వేశారని, పిల్లర్ల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవటంతో ప్రాజెక్టు కుంగిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు. ప్రాజెక్టు నింపే సమ యంలో కూడా వన్ బై ఫోర్త్ మొదట, హాఫ్ ట్యాంక్ రెండవసారి నింపుతారని చెప్పారు. కానీ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టు లీక్ అవుతున్నా కూడా పట్టించుకోలేదని ఈటల ఆరోపించారు. -
హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ Vs కేసీఆర్
-
గజ్వేల్ లో కేసీఆర్ పై నేను పోటీచేస్తున్నాను: ఈటల
-
ఈటల రాజేందర్ సంచలన ప్రకటన
సాక్షి, కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరమైన పోరుకు వేదిక కాబోతోందా? బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారాయన. గురువారం హుజూరాబాద్లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను తన నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వేల్లో రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు. కేసీఆర్ పైసలు కుమ్మరించబోతున్నారు! మానకొండూర్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. ప్రజలనే కాదు.. ఆఫీసర్లను సైతం నమ్మలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ అంగట్లో సరుకుల్లా నాయకుల్ని కొంటున్నారు. నాయకుడి స్థాయిని బట్టి రేట్ అంటగడుతున్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.30 నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు అని ఈటల ఆరోపణలు గుప్పించారు. -
ఈటల హుజూరాబాద్ బరిలో ఉంటారా? ఉండరా?
-
కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట నిజమే: ఈటల
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాటల వాస్తమేనని అన్నారు. విశ్వాసానికి మారుపేరు ప్రధాని మోదీ అయితే.. విశ్వాస ఘాతుకానికి మారుపేరు సీఎం కేసీఆర్ అని విమర్శించారు. కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న కేసీఆర్.. ఈనాటికి కూడా ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదని మండపడ్డారు 2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టలేదని.. అయినా తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రధాని మోదీ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశారని ఈటల ప్రశంసించారు. 2005లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ కోసం అప్పటి రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రూ. 350 కోట్ల రూపాయలు పెట్టారని, అయితే 2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. గృహలక్ష్మీ పథకం పైసలు ఇచ్చే టైం ఉందా? ప్రధాని మోదీ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే సిద్ధిపేట- సికింద్రాబాద్ రైల్వే లైన్ పూర్తి చేసిందన్నారు ఈటల రాజేందర్. బాధ్యత కలిగిన మంత్రి హరీష్ రావు..ప్రధాని ప్లెక్సీ చించేశారని, టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. గృహలక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇచ్చే టైం ఉందా అని ప్రశ్నించారు. కండువా కప్పుకుంటే.. బీసీ బంధు ఇస్తామని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు విని మోసపోతే గోస పడతారని అన్నారు. చదవండి: బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్ హుజురాబాద్లో 600 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు? ‘ప్రధానిని టూరిస్ట్.. చీటర్ అని అంటున్నారు. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెట్టారు. రూ, 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు. దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదు. చీటింగ్లో కేసీఆర్ నెంబర్ వన్. కరప్షన్ ఫ్రీ స్టేట్ అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రూ. 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది. హుజురాబాద్లో 600 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు.? ఇరువైళ్లుగా కేసీఆర్ చేతిలోనే! ప్రధాని సమాచారం లేకుండా మాట్లాడతారా ? దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించారో తెలియదా?. ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను.. తనకు మద్దతు ఇవ్వాలని కొన్ని రాజకీయ పక్షాలను కోరిన మాట వాస్తవం కాదా?. దళితుడికి ఎస్సీ వెల్ఫెర్ , బీసీకి బీసీ వెల్ఫెర్ మంత్రి పదవులు ఇచ్చి సరిపెడతారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇరువైళ్లుగా కేసీఆర్ చేతిలోనే ఉంది. భవిష్యత్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు ముఖం బాగాలేక అద్దం పగలకొట్టుకున్నట్లు ఉంది కేసీఆర్ తీరు. గురువింద గింజ నలుపు ఎరగనట్లు ఉంది సీఎం తీరు. గిరిగీసి బరిలో కొట్లడటానికి బీజేపీ సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్రమోదీ కేసీఆర్ను దూరం పెట్టారు. 2018 లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లాలో చెప్పాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు’ అని ఈటల వ్యాఖ్యానించారు. -
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చలు.. టికెట్ల కసరత్తు షురూ!..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ.. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తను వేగవంతం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సహం ఉన్న వారి నుంచి పార్టీ నాయకత్వం దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 6,003 అప్లికేషన్లు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 40 నియోజకవర్గాల్లో ఒకే అభ్యర్థి ఉన్న ముఖ్య నేతల స్థానాలకు గానూ మొదటి జాబితాను అగ్ర నాయకత్వం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.మిగతా చోట్ల అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, విజయావకాశాలు, ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశాలున్న బలమైన నేతల పేర్లు తదితర అంశాలపై పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆదివారం దిల్ కుశ గెస్ట్ హౌస్లో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నట్టు సమాచారం. చాలాచోట్ల నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అభ్యర్థుల పేర్లను సూచిస్తూ పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన జాబితాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సంఘ్ పరివార్ నుంచి కూడా జాబితా? ఇక సంఘ్ పరివార్ నుంచి కూడా అభ్యర్థుల ప్రతిపాదనలతో మరో జాబితా తీసుకున్నట్టు సమాచారం. ఈ జాబితాలను సరి చూసి కామన్గా వచ్చిన పేర్లతో ముసాయిదా జాబితాను సిద్ధం చేసి జాతీయ నాయకత్వ పరిశీలనకు పంపించ నున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండుమూడు రోజుల్లో ఈ ముఖ్యనేతలు మరోసారి సమావేశమై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సమాలోచనలు జరపనున్నట్టు తెలిసింది. కాగా, ఈ నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సమీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం పొద్దుపోయే వరకు ఈ భేటీ సాగినట్టు సమాచారం. -
‘కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు’
సాక్షి, మహబూబ్నగర్: ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు వస్తున్నారు. రేపు(ఆదివారం) మహబూబ్నగర్కు మోదీ విచ్చేయనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ క్రమంలో సభా ఏర్పాట్లు స్థానిక తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి సహా పలువురు నేతలు పరిశీలించారు. ఈ సందర్బంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్ కుటుoబoపై వ్యతిరేకత కనిపిస్తోంది. అధికార మంత్రులు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి.. అందుకే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యం కలిగిన వారు. కేసీఆర్లా ఫామ్హౌజ్లో ఉండటానికి మోదీ తెలంగాణకు రావడం లేదు. వేల కోట్లు తెలంగాణ ప్రజా సంపద దోచుకున్న కేసీఆర్ కుటుoబానికి మోడీని విమర్శించే నైతిక హక్కు లేదు. కేసీఆర్ సర్కార్ విఫలం.. మోదీ అనేక అభివృద్ధి పనుల కోసం రాష్ట్రానికి వస్తుంటే కేసీఆర్కు రావడానికి సమయం ఉండదు. రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే కలవడానికి సమయం లేదా?. కేసీఆర్ హాటావ్, తెలంగాణ బచావ్ అని ప్రజలు నినాదిస్తున్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్ని పూర్తిగా వైఫల్యం చెందాయి. విద్య, వైద్యం పూర్తిగా కుంటు పడింది. ఆర్థిక వ్యవస్థ విఫలం అయ్యింది. కాంగ్రెస్కు ఓటేస్తే బీఅర్ఎస్కు ఓటేసినట్టే. కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు. ఎలాగో గెలవరు కాబట్టి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తుంది కాంగ్రెస్. ఆరు గ్యారెంటీలు కాదు అరవై గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ చరిత్ర దేశ ప్రజలకు తెలుసు.అరవై యేండ్లు దేశాన్ని పాలించారు. అడుగడుగున అవినీతితో దోచుకున్న కాంగ్రెస్ చరిత్ర ప్రజలకు తెలుసు. ప్రజలు ఆలోచించాలి. రేపు మోదీ పాలమూరు గడ్డపై అడుగు పెడుతున్నారు. ఘనంగా స్వాగతం పలకాలని ప్రజలను కోరుకుంటున్నాను. గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. గంట సేపు మీమీ పరిసరాల్లో శ్రమ దానం చేయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. బీజేపీలోకి క్యూ కడుతున్న నేతలు.. ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీలో చేరిన వారందరికీ శుభాకాంక్షలు. సొంత ఎజెండాతో కొన్ని మీడియా సంస్థలు రాతలు రాస్తున్నాయి. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయి. బీఅర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోంది. తెలంగాణ ప్రజలు అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు: కేటీఆర్ వ్యాఖ్యలు -
బీజేపీలో గెలుపు గుర్రాలేవి?.. కేడర్లో కొత్త టెన్షన్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీలోని సీనియర్ నేతలంతా రాష్ట్ర, జాతీయ స్థాయి వారే. కానీ వారిలో వారికి పొసగదు. అసలు ఒకరంటే ఒకరికి ఏమాత్రం గిట్టదు. జిల్లాలో సెకండ్ కేడర్ ఎదగదు. మూడు నాలుగు సెగ్మెంట్లు తప్పితే మిగిలిన చోట్ల అభ్యర్థులే కనిపించరు. అభ్యర్థులమని చెప్పుకునే వారు ఎప్పుడూ జనంలో కనిపించరు. ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీని.. దూసుకువస్తున్న హస్తం పార్టీని కాషాయ సేన ఢీకట్టగలదా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దశ దిశ లేని కాషాయ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తాజా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సహా పలువురు హేమాహేమీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలం పార్టీకి అండగా ఉన్నారు. ఇంతమంది ముఖ్య నేతల అండతో కొండంత బలాన్ని సంపాదించుకోవాల్సిన జిల్లాని కమలం పార్టీ దశా దిశా లేకుండా పోయిందన్నది ఇప్పుడు టాక్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. రేపో, మాపో అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ రెండు పార్టీలకు ప్రచారంలో ఉన్న అభ్యర్థుల జాబితాలో చాలామంది ఇప్పటికే జనంలో యాక్టివ్గా ఉంటున్నారు. నేతల మధ్య కోల్డ్వార్.. బీజేపీ పరిస్థితి మాత్రం అలా లేదు. గతంలో రెండుమాడు సార్లు డిపాజిట్లు కోల్పోయి.. పనికిరారనుకున్న నేతలే మళ్లీ మళ్లీ తెరపైకొస్తున్నారు. వారే టిక్కెట్ల కోసం పోటీ పడతారు. అసలే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఒకరంటే ఒకరికి గిట్టని ముఖ్య నేతల మధ్య వార్ కొనసాగుతోంది. టిక్కెట్ల పంచాయితీతో వారి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. కరీంనగర్లో బండి సంజయ్, హుజూరాబాద్లో ఈటల రాజేందర్, రామగుండంలో సోమారపు సత్యనారాయణ మినహాయిస్తే.. ఇతర సెగ్మెంట్లలో గెలుపుపై ధీమాతో బరిలో గిరి గీసే నేతలే కరువయ్యారు. దీనికి తోడు నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని పుట్టి ముంచడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ దిద్దుబాటు చర్యలు కనిపించడంలేదని కేడర్ చెబుతోంది. అభ్యర్థులే కరువు.. అభ్యర్థులు ఉన్నారని అనుకుంటున్న సెగ్మెంట్లు కాకుండా మిగిలిన స్థానాల సంగతి పరిశీలిస్తే.. మాజీ ఎంపీ వివేక్ బరిలో ఉంటారో, లేదో తెలియదు. ఆయన చెన్నూరు టిక్కెట్ అడుగుతున్నారని ప్రచారం జరుగుతున్నా.. మరోవైపు కాంగ్రెస్ బాట పడతారనే టాక్ నడుస్తోంది. పెద్దపెల్లిలో గతంలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు.. కీలక నేతలైన ప్రదీప్ రావు, గొట్టిముక్కల సురేష్ రెడ్డి వంటి వారు టిక్కెట్లు ఆశిస్తున్నా.. ఇక్కడ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అనే ప్రచారం జరుగుతోంది. మంథనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అనే ప్రచారం ఉండగా.. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక జగిత్యాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పేర్లే తప్ప బీజేపీకి మూడోస్థానంలో ఉండాల్సినంత పేరు కూడా లేదు. కోరుట్ల సంగతీ అంతే. హుస్నాబాద్లో ఆశావహుల సంఖ్య ఎక్కువ.. హోమ్ వర్క్ తక్కువ. సిరిసిల్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక రాజన్న క్షేత్రం వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుతో పాటు.. కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎర్రం మహేష్ వంటివారు టిక్కెట్లు ఆశిస్తుండటంతో పాటు.. టిక్కెట్ దక్కని నేతలు కచ్చితంగా రెబల్స్ గా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. చొప్పదండి బీజేపీలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పేరు వినిపిస్తున్నా.. నియోజకవర్గంలో ఆమె పేరు ప్రచారంలోనే లేదు. ఇక మానకొండూరు నియోజకవర్గాన్ని బీజేపీ మర్చిపోయిందనే టాక్ నడుస్తోంది. ఆ ముగ్గురే దిక్కు.. బండి సంజయ్ బరిలోకి దిగితే కరీంనగర్.. ఈటల రాజేందర్ పోటీలో ఉంటే హుజూరాబాద్.. రామగుండంలో సోమారపు సత్యనారాయణ తప్ప బీజేపీలో గెలుపు గుర్రాలేవి? ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి జిల్లాలోని ముఖ్య, సీనియర్ నేతల్లో ఒకరంటే ఒకరికి గిట్టకపోవడమే. ఏ ఇద్దరు నేతల మధ్యా సఖ్యత కనిపించడంలేదు. అందుకే జిల్లాలో బీజేపీకి ఒక దిశ అనేదే లేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
తెలంగాణ బీజేపీలో ఊహించని ట్విస్ట్.. ఏం జరుగుతోంది?
తెలంగాణ కమలం పార్టీకి నాయకులు అక్కర్లేదా? ఇతర పార్టీల నుంచి వస్తున్నవారిని ఎందుకు వద్దనుకుంటున్నారు? ముందు రమ్మని ఆహ్వానించి తీరా ఆఫీస్కు వచ్చాక ఎందుకు తలుపులు మూస్తున్నారు? కొత్తగా వస్తున్న నేతల వల్ల నష్టం ఎవరికి? తమ సీట్లు పోతాయనే సీనియర్లు కొత్తగా వచ్చేవారికి ఎర్ర జెండా చూపుతున్నారా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?.. ఎవరైనా తమ పార్టీలో చేరుతామని వస్తే.. అయితే చేర్చుకుంటామనో.. లేక లేదనో సమాధానం ఇస్తారు. కానీ, అన్ని పార్టీల్లోకెల్లా తమ పార్టీ రూటే సెపరేటు అన్నట్లుగా.. ముందు ఒకే చెప్పి తర్వాత నో చెప్పడం బీజేపీలో ప్రస్తుతం ట్రెండ్గా మారింది. ఇటీవల మాజీ మంత్రి కృష్ణయాదవ్ చేరికతో పాటు తాజాగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. ఏ పార్టీలో లేనివిధంగా జాయినింగ్స్ కోసమే ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసుకున్న కమలదళం ఇప్పుడిలా వింతగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ముందుగా చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం తీరా చేరేందుకు వచ్చాక చేతులెత్తేయడంతో బీజేపీ తీరు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇద్దరి విషయంలో ఇలా.. ఇటీవల మాజీ మంత్రి కృష్ణయాదవ్ చేరిక విషయంలోనూ చివరి నిమిషంలో బ్రేక్ పడింది. ఆయన చేరేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. సిటీలో కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేసుకున్నారు. తీరా చివరిక్షణంలో పార్టీ చేర్చుకోలేదు. అలాగే తాజాగా చికోటి ప్రవీణ్ కుమార్ జాయినింగ్ లోనూ ఇదే జరిగింది. సిటీ మొత్తం కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. భారీ ర్యాలీతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చుకున్నారు. తీరా వచ్చాక చూస్తే రాష్ట్ర కార్యాలయంలో ఒక్క ముఖ్య నేత కూడా లేకుండాపోయారు. చేర్చుకుంటామని పిలిచి బీజేపీ నేతలు ముఖం చాటేశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. హ్యాండిచ్చిన బీజేపీ నేతలు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో మాజీ మంత్రి అజ్మీరాచందూలాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రహ్లాద్ చేరిక కూడా ఉండాల్సి ఉంది. కానీ చికోటి ర్యాలీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి సమీపంలో ఉన్నారని తెలియగానే హడావుడిగా ప్రహ్లాద్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాసేపటికే అక్కడి నుంచి బడా నేతలంతా జారుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జి ప్రకాశ్ జవదేకర్ సహా, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ ఒక్కొక్కరుగా పార్టీ కార్యాలయం నుంచి జారుకున్నారు. కిషన్ రెడ్డి సమక్షంలో చికోటి చేరాల్సి ఉండగా ఆయన కూడా పలు మీటింగుల సాకుతో చివరి క్షణంలో హ్యాండిచ్చారు. కిషన్ రెడ్డి రాకతోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకం అనంతరం పార్టీలో జాయినింగ్స్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం చేరికల విషయంలో వింత పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి కృష్ణయాదవ్ అంబర్ పేట నియోజకవర్గం కాబట్టి కిషన్ రెడ్డి సీటుకు ఎక్కడ ఎసరు పడుతుందోననే ఆయన్ను చేర్చుకోలేదని ప్రచారం జరుగుతోంది. ఈటల చేర్చుకుందామంటే.. కిషన్ రెడ్డి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణ యాదవ్, కిషన్ రెడ్డిది ఒకే సెగ్మెంట్ కాబట్టి పోటీ విషయంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని, కానీ చికోటి విషయంలో కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. చికోటిపై ఈడీ కేసులు ఉన్నాయన్న నేపథ్యంలో ఏమైనా అడ్డుకున్నారనుకుంటే.. ఆ విషయం పార్టీకి ముందు తెలియదా? అని ఆయన అభిమానులు లేవనెత్తుతున్నారు. ప్రహ్లాద్ ను చేర్చుకుని చికోటిని చేర్చుకోకపోవడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తెర వెనుక ఏం జరిగింది? చికోటి ప్రవీణ్ చేరిక విషయంలో తెర వెనుక ఏదో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకుంటానని చెప్పి.. తీరా జాయిన్ చేసుకోకపోవడంపై చికోటి అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీలో చేరితే జాయిన్ అయ్యే వారి భవిష్యత్ ప్రమాదకరంలో పడుతుందనే సంకేతాలను రాష్ట్ర నాయకత్వం పంపిస్తోందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎందుకంటే ముందు జాయినింగ్ కు ఒకే చెప్పి.. ఫలానా వ్యక్తులు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరిగాక చేర్చుకోకపోతే సదరు వ్యక్తి ఇమేజ్ ను డ్యామేజ్ అవుతుంది. అలాంటి ప్లాన్ కు ఏమైనా తెరదీశారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీలో ఇదే పరంపర కొనసాగితే కనుక పార్టీలో చేరే వారే కరవయ్యే ప్రమాదం ఉందని చర్చించుకుంటున్నారు. -
రాష్ట్రంలో ఈటలకు అడుగడుగునా స్పీడ్ బ్రేకర్లు
-
రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉంది: ఈటల రాజేందర్
-
ఈటల రాజేందర్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మానకొండూరు వద్ద ఈటల కాన్వాయ్లోని ఒక కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. ఈటల రాజేందర్ ఆదివారం హుజురాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో మానకొండూరు మంలంలోని లలితాపూర్ వద్ద గొర్రెల మంద అడ్డుగా వచ్చింది. దీంతో, ఈటల కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సందర్భంగా ఈటల కాన్వాయ్లోని మిగతా కార్లు ఒక్కదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈటలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో సిబ్బంది, నేతలు ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: TS/AP: రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. -
కమలం నేతల్లో కొత్త టెన్షన్.. అసలేం జరుగుతోంది?
తెలంగాణ కాషాయ నేతల్లో అంతర్మథనం మొదలైంది. రోజురోజుకు నేతలు డీలా పడుతున్నారు. కనుచూపు మేరల్లో మునుపటి జోష్ కనిపించడం లేదు. తమ రాజకీయ నేతల భవితవ్యం ఏంటనే దానిపై నేతల్లో టెన్షన్ మొదలైంది. బీజేపీ యాక్షన్ ప్లాన్ కాగితాలకే పరిమితమవుతుందా ? అగ్ర నేతల క్లాస్లు ఒంట పట్టించుకోవడం లేదా?. కాషాయ గూటిలో ఇమడలేక పోతున్నారా?.. తెలంగాణలో అధికారమే లక్ష్యమని చెబుతున్న కమలనాథులు.. కార్యక్షేత్రంలో ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో సాధిస్తామని ఆశించి కాషాయ కండువా కప్పుకున్న నేతల్లో టెన్షన్ మొదలైంది. పార్టీలో ముందుకు వెళ్లాలో.. వెనక్కి వెళ్లాలో తెలియక నాంపల్లి చౌరస్తాలో నిలబడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గిపోయింది. బీజేపీ కేడర్లో నిస్తేజం అలుముకుంది. మాటలే.. చేతల్లేవ్.. ఇక, ఖమ్మంలో ‘రైతు గోసా– బీజేపీ భరోసా’ అంటూ అమిత్ షా సభ నిర్వహించారు. కానీ.. రైతులకు ఎలాంటి భరోసా.. హామీ ఇవ్వకుండానే సభను మమా అనిపించారు. ఏదో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తాం.. మిషన్ 90 టార్గెట్ అంటూ గొప్పగా చెప్పిన నేతల జాడ లేకుండా పోయింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇక్కడే తిష్టవేసినా.. పెద్దగా వర్కవుట్ కావడం లేదని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. బీజేపీ ప్రణాళికలు కాగితాలకే పరిమితం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్లు సైలెంట్.. చాలా రిస్క్ చేసి పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ మోడ్లో ఉన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉలుకు లేదు.. విజయశాంతి పలుకు లేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కనికనిపించకుండా ఉంటున్నారు. ఇక బండి సంజయ్ సైతం రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. పార్టీ కార్యాలయం వైపే కన్నెత్తి చూడరు. ఇక ఇటీవల గెలిచిన ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరంతా కాషాయ గూటిలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కలిసి కట్టుగా ఎన్నికల బరిలో దిగాలని పార్టీ హైకమాండ్ క్లాసులు తీసుకుంటున్నా.. తెలంగాణ కమలనాథులు మాత్రం ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల రణరంగంలో కమలం నేతలు నిలబడతారో ? చేతులెత్తేస్తారో ? చూడాలి. ఇది కూడా చదవండి: కేసీఆర్ దూతను వెంటాడుతున్న చేదు జ్ఞాపకం.. ఈ పాట ఇంకెన్నాళ్లో? -
కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే.. బండి సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే అంటూ పొలిటికల్ పంచ్లు విసిరారు. నటనలో కేసీఆర్ను మించినోడు లేడంటూ సెటైర్ వేశారు. కాగా, బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లడుతూ.. కేసీఆర్ మళ్లీ గెలిస్తే చంద్రుడిపై కూడా భూమలిస్తానంటాడు. కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే. ఒకరికి టికెట్ ఇచ్చి.. మరొకరిని ఇంటికి పిలుస్తున్నాడు. యాక్టింగ్లో కేసీఆర్ను మించిన వ్యక్తి మరోకరు లేరు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం.. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్పై ప్రజలకు నమ్మకం పోయింది. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉంది. రూ.6వేల కోట్లు ఇచ్చి నన్ను ఓడించాలని చూశారు. ప్రజలు న్యాయంవైపు ఉండి నన్ను గెలిపించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. నాలుగేళ్లలో ఎక్కడా కూడా కాంగ్రెస్ గెలవలేదు. కేసీఆర్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకి తప్ప మరో పార్టీకి లేదు. తెలంగాణలో నియంతపాలన పోవాలని ఇక్కడికి ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాలు వస్తున్నారు. కేవలం మోదీ చేతుల్లోనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది. ఈనెల 27వ తేదీన ఖమ్మంలో అమిత్ షా సభ ఉంటుంది. వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ సభకు హాజరు కావాలని ప్రజలను కోరుతున్నాను. కేసీఆర్కు పేదా, ధనికా తెలియదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: నాగార్జునసాగర్ బరి నుంచి తప్పుకున్న సీనియర్ నేత జానారెడ్డి -
బీజేపీవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని !
సాక్షి, రాజన్న సిరిసిల్ల: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 9 స్థానాల్లో సిట్టింగ్లను మార్చిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చోటు దక్కని నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆశతో పార్టీ మారేందుకు యత్నిస్తున్నారు. ప్రత్నామ్నాయ బీజేపీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని నేతలతో చర్చలు జరుపుతున్నాయి. ఇక అనుకున్నట్టుగానే వేములవాడ చెన్నమనేనికి కాకుండా పోయింది. అంతా భావించినట్టుగానే చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహారావుకే దక్కింది. అయితే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు దారెటు..? బీఆర్ఎస్ లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేక, ఇంకో మార్గమేదైనా చూసుకుంటారా..? చెన్నమనేని రాజకీయ వారసత్వానికి కామానో.. లేక, ఫుల్ స్టాప్ పడేందుకు ఆయన సుముఖంగా ఉంటారా..? టిక్కెట్ కొట్లాటకు ముందు ఎంత ఉత్కంఠైతే నెలకొందో.. అదే ఆసక్తి టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా వేములవాడలో కనిపిస్తోంది. చదవండి: వామపక్షాలతో పొత్తులేదని తేల్చేసిన కేసీఆర్.. కమ్యూనిస్టుల కీలక భేటీ వేములవాడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు అంతా ఊహించినట్టుగానే ఈసారి టిక్కెట్ దక్కలేదు. అందుకోసం గులాబీబాస్ కేసీఆర్ చెప్పిన కారణం.. చెన్నమనేనిపై వేములవాడ కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ ఎప్పట్నుంచో పోరాటం చేస్తూ కోర్టుల్లో రచ్చరచ్చగా మారి ద్వంద్వ పౌరసత్వ వివాదమే. అయితే, అది ఆయన్ను పక్కకు పెట్టేందుకు కేవలం సాకు మాత్రమేనని వాదనా ఇప్పుడు రమేష్ బాబు వర్గం నుంచి వినిపిస్తోంది. అలాగైతే.. 2014, 2018కి ముందు నుంచే ఈ వివాదం కొనసాగుతున్నప్పుడు.. అప్పుడెలా మరి రమేష్ బాబు అధికార బీఆర్ఎస్ అభ్యర్థయ్యారో చెప్పాలన్న వాదన ఇప్పుడు రమేష్ బాబు, ఆయన అనుచరవర్గం నుంచి వినిపిస్తోంది. అయితే గతంలో తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన వేములవాడ.. చెన్నమనేని ఫ్యామిలీకి ఓ కంచుకోటగా మారిపోయింది. ఈసారి తమ ప్రాతినిథ్యమే లేకపోతే.. అది కామాగా భావించాలని ఎవరైనా చెప్పినా.. ఆ తర్వాత అదే పూర్తిగా ఫుల్ స్టాప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మరొకరు వచ్చి జెండా పాతారంటే.. కచ్చితంగా దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలోనే రమేష్ బాబు వేములవాడలో తన తదుపరి భవిష్యత్ కార్యాచరణకై సీరియస్ గా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. చదవండి: ఖానాపూర్లో నా సత్తా ఏంటో చూపిస్తా: రేఖా నాయక్ సంచలన వ్యాఖ్యలు పైగా నిన్న తనకు టిక్కెట్ దక్కదన్న ప్రచారం నేపథ్యంలోనే.. కేసీఆర్ ప్రకటన కంటే ముందే ఓ భావోద్వేగంతో.. ఒకింత నిర్వేదంతో తన తండ్రి మాటలను ఉటంకిస్తూ.. ఆత్మగౌరవం అనే పదాన్ని వాడుతూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన అంతరగాన్ని తెలియజెప్పింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే వేములవాడ టిక్కెట్ ను కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న చల్మెడకు కేటాయించడంతో వేములవాడలో ఒకవైపు చల్మెడ అనుచరుల్లో ఆనందం కనిపిస్తే.. ఇంకోవైపు ఒకింత నైరాశ్యం, మరింత స్తబ్దత వాతావరణం కనిపించింది. తన తండ్రి నుంచి కొనసాగుతూ వస్తున్న రాజకీయ వారసత్వాన్ని వదలుకోవడానికి చెన్నమనేని ఫ్యామిలీ సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాబాయ్ అబ్బాయ్ తో పాటు.. చెన్నమనేని ఫ్యామిలీ సభ్యుల్లో కీలకమైనవారంతా వేములవాడలో నెక్స్ట్ జరుగబోయే రాజకీయమెలా ఉండబోతోంది.. తామేం చేయాలనే సమాలోచనల్లో పడ్డట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే బీజేపి ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.. చెన్నమనేనితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న రమేష్ బాబు.. ఈనెల ఆగస్ట్ 25వ తేదీన వేములవాడకు రానున్నారు. మొత్తంగా రమేష్ బాబు చూపు కూడా బీజేపీ వైపు పడినట్టుగా తెలుస్తోంది. అందుకు తన బాబాయ్ సపోర్ట్ తో పాటు.. ఈటెల కూడా చొరవ తీసుకోవడంతో.. వేములవాడ నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న యోచనలో రమేష్ బాబు కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నర్సాపూర్లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం పెద్దలకు కూడా ఈటెల చేరవేసినట్టు తెలుస్తుండగా.. మరి రమేష్ బాబు పయనమెటు...? ప్రచారం జరుగుతున్నట్టుగా ఆయన బీజేపీలో చేరతారా...? ఈసారి తన టిక్కెట్ కు గండికొట్టే సాకుగా మారిన ద్వంద్వ పౌరసత్వ వివాదాన్నీ.. కేంద్రంలో ఉన్న పార్టీతో కలిస్తే ఏమైనా తొలగించుకునే అవకాశం దొరుకుతుందా వంటి పలు విశ్లేషణలతో కూడిన చర్చలకు ఇప్పుడు తెర లేస్తోంది. మొత్తంగా టిక్కెట్ కన్ఫర్మేషన్కు ముందు రసవత్తరంగా సాగిన రాజన్న క్షేత్రంలోని రాజకీయం.. టిక్కెట్ కన్ఫర్మేషన్ తర్వాత కూడా అంతకంతకూ రసకందాయంగా మారుతుండటం ఇక్కడి విశేషం. -
31వేల ఇళ్లు మాత్రమే పేదలకిచ్చారు: ఈటల
-
కేసీఆర్ సర్కార్పై బీజేపీ నేతల సంచలన ఆరోపణలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది.. కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా తలపెట్టింది. రాష్ట్రంలో పేదలకు డబుల్ బ్రెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంపై బీజేపీ నిరసనకు దిగింది. ఈ మహాధర్నా బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. ఎన్నో కలలు కని తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల ఊబిలోకి దించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. మోసం చేయడం, గొంతు కోయడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కేసీఆర్కు లేదు. దోపిడీ డబ్బుతో కేసీఆరే ఫార్మ్ హౌస్లు కట్టుకుంటున్నారు. తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. తెలంగాణలో నిజాం నవాబుల పాలన, అబద్దాల పాలన కొనసాగుతోంది. రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ మోసం చేశారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసింది. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంచే దమ్ము కేసీఆర్కు లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5లక్షల మంది ఇళ్లు లేని పేదలున్నారు. ఏపీలో 20లక్షల ఇల్లు కట్టించి ఇచ్చారు. తెలంగాణలో మాత్రం లక్ష ఇళ్లు కూడా కట్టలేదు. 5వేలలకు పైగా ఎకరాల అసైన్డ్మెంట్ భూములు పేదల నుంచి కేసీఆర్ లాక్కున్నారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇక, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కల్వకుంట కుటుంబమంతా దొంగలే. అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్. తెలంగాణలో కేసీఆర్ పాలనలో సమస్యలు పెరిగాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఎలుకలు, కుక్కలు ఉంటున్నాయి. ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబానికి 10లక్షల ఆర్థిక సహాయం అన్నారు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వైన్స్ టెండర్స్ మాత్రం పక్కాగా జరుగుతాయి. ఇళ్లు కట్టాలంటే హౌసింగ్ శాఖ ఉండాలి. అది లేనే లేదు. కుల ధ్రువీకరణ పత్రానికే 30రోజుల సమయం కావాలి. అలాంటిది మూడు రోజుల్లో గృహలక్ష్మికి ఎలా దరఖాస్తు చేస్తారు? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డబుల్ డిజిట్గా కూడా రాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సంక్షేమంలో మేమే నంబర్ వన్ అంటూ.. 'ఎవరి ధీమా వారిదే'! -
సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
-
సీఎం కేసీఆర్పై ఈటెల రాజేందర్ మండిపడ్డారు
-
రియల్ ఎస్టేట్ కోసమే ఎకరం వంద కోట్లని ప్రచారం: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే(బీఆర్ఎస్) ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం భూములు ఎలా అమ్ముతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికే ఎకరం వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చూస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పేదల కోసం కాదు.. పెద్దల కోసం మాత్రమే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్స్ పెట్టారు. చట్ట సభలపై కేసీఆర్కి నమ్మకం సన్నగిల్లింది. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు మూడు రోజులు. ఈ ఏడాది మొత్తంలో అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు మాత్రమే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్లుగా.. పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారు. అసెంబ్లీలో నేడు నాలుగు పార్టీలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని బీఏసీ సమావేశానికి పిలవలేదు. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బీఏసీ సమావేశంలో పాల్గొనేవారు. సభ సజావుగా సాగిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. స్పీకర్ కనీసం మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. మూడు రోజులు సభ జరిగితే.. ఒకరోజు హరీష్ రావు, రెండోరోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్.. ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉంది. ప్రజల మీద, ప్రజాస్వామం, చట్ట సభల మీద బీఆర్ఎస్ నేతలకు నమ్మకం లేదు. ఈ సభలో బీఆర్ఎస్కి బైబై చెప్పినట్టే. ఇటీవల రాష్ట్రంలో వరదల కారణంగా 41 మంది మృతిచెందారు.. వారికి కనీసం అసెంబ్లీలో సంతాపం చెప్పలేదు. వరదలతో చాలా మంది నష్టపోయారు. వారికి కనీసం ప్రభుత్వం సహాయం చేయలేదు. 109 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అహంకారంతో చెబుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాగ్ రిపోర్టుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో బడ్జెట్ పెరుగుతోంది. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఖర్చులతో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుంది. నాలుగు కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. -
కేసీఆర్ పొలిటికల్ దాడి.. ఈటల రూటు మార్చేశారా?
ఈటల రాజేందర్ రూట్ మార్చేశారా?.. గతంలో మంత్రిగా ఉన్నపుడు హుజూరాబాద్కే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అటువైపు రావడమే మానేశారా?. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించే క్రమంలో రూట్ మార్చారా? తనపైనే ఫోకస్ చేస్తూ.. పదవులు కట్టబెడుతున్న తరుణంలో.. తానెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే బరిలో ఉంటారా? ప్లేస్ మార్చుతారా? ఈటల ఆలోచన ఏంటి? అనేది హాట్ టాపిక్గా మారింది. గులాబీ బాస్ కేబినెట్లో మంత్రిగా ఉన్నపుడు ఈటల రాజేందర్ ఎప్పుడూ తన నియోజకవర్గమైన హుజూరాబాద్లోనే కనిపించేవారు. కేసీఆర్ను ధిక్కరించి బయటకొచ్చాక కూడా నియోజకవర్గానికి ఎన్నడూ దూరంగా లేరు. అయితే, గత ఉప ఎన్నికలో తనను టార్గెట్ చేస్తూ గులాబీ దళం చేసిన ముప్పేట దాడితో ఈటల ఉక్కిరిబిక్కిరి అయింది వాస్తవం. గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం ఈటలనే వరించింది. ఈ పరిణామం గులాబీ దళపతిని మరింత అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతం నుంచి నలుగురికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి.. విప్గా క్యాబినెట్ హోదా కల్పించడమ కాకుండా.. హుజూరాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. జరుగుతున్న పరిణమాలన్నీ ఇప్పుడు ఈటలలో మధనానికి కారణమయ్యాయా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. తెలంగాణ అంతటా ఈటల పర్యటన.. కేసీఆర్ వ్యూహ రచన గురించి బాగా తెలిసినవాళ్లలో ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఈ క్రమంలో గులాబీబాస్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా ఈటల అడుగులు వేస్తున్నారా..? అందుకే తరచూ పర్యటిస్తూ ఉండే సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారా..? బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ హోదాను ఆసరా చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ.. రాబోయే ఎన్నికల నాటికి తన ఛరిష్మాను ఇంకా పెంచుకోవడంతో పాటు.. తానెక్కడ నిలబడ్డా గెలవగలిగే అనుకూల పరిస్థితులను సృష్టించుకుంటున్నారా?. ఈక్రమంలో ఏ నియోజకవర్గం అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారా అని చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఈటల ఎప్పుడూ లేనివిధంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో.. అసలు వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారా? మరో నియోజకవర్గం ఎంచుకుంటారా? అనేది హాట్ టాపిక్గా మారింది. ప్లాన్ మార్చనున్న ఈటల? ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే మళ్లీ బరిలోకి దిగొచ్చూ, లేకపోవచ్చు.. ఎన్నికలనాటికి రాజకీయ సమీకరణాల ఆధారంగా పరిస్థితులు మారిపోతాయి. కానీ, తననే ఫోకస్ చేస్తూ తనను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న గులాబీబాస్నే ఒకింత కన్ఫ్యూజ్ చేసే క్రమంలోనే ఈటల అడుగులెటువైపో తెలియకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన చిరకాల ప్రత్యర్థిలా మారిన గులాబీ బాస్ కేసీఆర్ మీద లేదంటే జిల్లాలో ప్రధాన ప్రత్యర్థిగా తయారైన మంత్రి గంగుల కమలాకర్ మీద గానీ ఈటల బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: హలో కేటీఆర్గారూ.. ఈ ఫొటో గుర్తుందా? -
అసెంబ్లీలో కనీసం గది కూడా కేటాయించలేదు: ఈటల రాజేందర్
-
ఈటలతో కేటీఆర్ ఆప్యాయ పలకరింపు.. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను మంత్రి కేటీఆర్ అప్యాయంగా పలకరించారు. ఈటల సీటు వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. నేతలు ఒకరినొకరు హత్తుకున్నారు. దాదాపు పది నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డీతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. పలు అభివృద్ది పనుల కోసం కేటీఆర్ చాంబర్లో మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. జగ్గారెడ్డిని చూడగానే పిల్లలతో కలిసి తిరిగితే ఎట్లా అన్న అంటూ కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పటికే జగ్గారెడ్డితో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉండగా.. మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడిగారు. మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల బదులివ్వగా.. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తవా అని కేటీఆర్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తానని.. మన దగ్గరకు (బీఆర్ఎస్లోకి) పట్టుకొస్తానని మామిళ్ల రాజేందర్ నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. చదవండి: 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ మీటింగ్లో నిర్ణయం -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
కేసీఆర్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
-
కిషన్ రెడ్డి వచ్చినా కొత్త టెన్షన్.. తలలు పట్టుకున్న బీజేపీ నేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇక, శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్చుగ్ పాల్గొన్నారు. ఇక, ఈ మీటింగ్ సందర్బంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్ కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు రావడంతో తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్కుమార్ రెడ్డి రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్కుమార్రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబులాగా భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ను ఫాంహౌస్ అరెస్టు చేస్తాం -
కేసీఆర్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి ఫైర్
Updates.. ► కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. అందుకే మా పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ చర్యలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. సమాధానం చెప్పలేని నిస్సహాయస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది. ►పేదలు, బడుగు, బలహీన వర్గాల తరఫున ప్రశ్నిస్తాం. బీఆర్ఎస్ సర్కార్పై శాంతియుతంగా యుద్దం చేస్తాం. ► అనంతరం.. వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. ► కిషన్రెడ్డి, రఘునందన్రావును బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపిన పోలీసులు. ► ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత భయమెందుకు?. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చిన నిధులేవి?. కేంద్రమంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. ► ఇలాంటి అణిచివేత ధోరణి మంచిది కాదు. కేంద్రమంత్రిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించే హక్కు కిషన్రెడ్డికి లేదా?. కిషన్రెడ్డితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకుకెళ్తాం అని అన్నారు. ► కిషన్ రెడ్డి కారులోనే ఆయనను పోలీసు స్టేషన్కు తరలింపు. ► కిషన్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. తన వాహనంలో ఆయనను కూర్చోబెట్టేందుకు పోలీసులు యత్నించారు. కారులో కూర్చునేందుకు కిషన్రెడ్డి నిరాకరించారు. ► ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నన్ను చంపేయండి. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కచ్చితంగా బాట సింగారం వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. ► నేనేమైనా ఉగ్రవాదినా?.. టెర్రరిస్టునా?. నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ► పోలీసులతో కిషన్రెడ్డి వాగ్వాదానికి దిగారు. ► రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. ► శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాట సింగారం వెళ్తున్న కిషన్రెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ సహా బీజేపీ నేతలు వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్కార్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక, ఛలో బాట సింగారం నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ► మరోవైపు.. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్లను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హౌస్ అరెస్ట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్ఎస్కు ఉలికిపాటెందుకు?. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగబాటా?. కేవలం ఇళ్లు చూడటానికి వెళ్తుంటే భయమెందుకు?. బీఆర్ఎస్ను గద్దె దింపేవరకు ఉద్యమం ఆగదు. గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తే అక్రమ అరెస్ట్లు ఎందుకు?. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ► మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావును తార్నాకలోని నివాసంలో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ల కోసం ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఆగిపోయాయో చూడడానికే మేము వెళ్తున్నాము. మేము ఇళ్లను చూడడానికి వెళ్లకూడదా?. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్లను ఆయన ఖండించారు. డబుల్ ఇండ్ల పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ► అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, పలువు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: అందుకే కేసీఆర్ను కలవలేదు.. భవానీ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
కేసీఆర్ను ఎవ్వరూ నమ్మరు..
అబిడ్స్: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తాను అనుసరిస్తున్న అవకాశ రాజకీయ విధానాలతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఈటల మీడియాతో మా ట్లాడారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా కేసీ ఆర్ను నమ్మడం లేదన్నారు. ‘విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి వెళ్లి.. నన్ను నాయకున్ని చేయండి దేశమంతా ఎన్నికలకు ఫండింగ్ చేసా’్త అని చెప్పి వచ్చారు. అయినా ఆయన్ను ఎవరూ నమ్మడం లేదు’ అని ఈటల విమర్శించారు. ఊదితే కొట్టుకు పోయే పార్టీ బీఆర్ఎస్... ‘అక్రమ కేసులు పెట్టి బీజేపీ నాయకులను, కా ర్యకర్తలను వేధిస్తున్నారు. మీ పాలనకు పోయేకా లం వచ్చింది. కేసీఆర్ మీ పార్టీ ఊదితే కొట్టుకు పోయే పార్టీ. మాతో గొక్కోవద్దు, ఖబడ్దార్’ అని ఈటల హెచ్చ రించారు. గోషామ హల్లో, గజ్వేల్లో, హుజూరాబాద్ తదితర చోట్ల బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యా నికి పాల్పడుతున్నా రని ధ్వజమెత్తారు. అధికార పార్టీ అసహనంతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న విష యాన్ని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందన్నారు. గోషామహల్లో బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం చేస్తుంటే బీజేపీ కార్పొరేటర్ శశికళ సముదాయించే ప్రయత్నం చేయగా.. చివరికి ఆమెపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్తో ఈటల భేటీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో ఈటల సమావేశమయ్యారు. ధూల్పేటలోని రాజాసింగ్ నివాసానికి విచ్చేసి పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఈటల మీడియా తో మాట్లాడుతూ, రాజాసింగ్పై సస్పెన్షన్ ఎత్తివే త జాతీయ నాయకత్వ పరిధిలో ఉందన్నారు. దీని పై త్వరలోనే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ... బీ ఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా తిరి గి బీజేపీదే విజయమన్నారు. కార్యకర్తలకు, నాయ కులకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. -
కేసీఆర్కు కొత్త టెన్షన్.. పొలిటికల్ ప్లాన్ రివర్స్!
గులాబీ బాస్కు కొరుకుడు పడని సీటుగా హుజూరాబాద్ పేరు తెచ్చుకుంది. తనను ధిక్కరించి కమలం గుర్తు మీద మళ్ళీ గెలిచిన ఈటల రాజేందర్ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఈటలకు సరిజోడు అనుకున్న కౌశిక్రెడ్డి దుందుడుకు స్వభావం సీఎం కేసీఆర్ను చికాకు పెడుతోందట. రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ కారు అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్లో గులాబీ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి పాలు కావడంతో గులాబీ దళపతి కేసీఆర్ మరింత కసిగా వచ్చే ఎన్నికల్లో ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజల్ని ఆకర్షించడానికి ఉప ఎన్నికల సమయంలోనే దళితబంధు సహా పలు పథకాలు హుజూరాబాద్ నుంచే ప్రకటించారు. పార్టీ నియమించిన అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ ఓటమితో.. కాంగ్రెస్ నుంచి కౌశిక్రెడ్డిని తీసుకువచ్చి ఎమ్మెల్సీని చేసి, ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి కేబినెట్ ర్యాంక్ కల్పించారు. హుజూరాబాద్ ఇన్చార్జ్గా నియమించి వచ్చే ఎన్నికల కోసం రెడీ అవ్వమని కౌశిక్రెడ్డిని ఆదేశించారు. అయితే, కౌశిక్రెడ్డి దూకుడు స్వభావి అనుకుంటే.. ఆయన దుందుడుకు పోకడలతో అందరికీ దూరం అవుతున్నారు. వివాదాస్పద వ్యవహారాలతో పార్టీ పరువును తీస్తున్నారని కేసీఆర్కు నివేదికలందాయి. తెరపైకి ప్రశాంత్ రెడ్డి.. కౌశిక్రెడ్డిని తీసుకువచ్చి అత్యంత ప్రాధాన్యమిచ్చి, పదవి ఇచ్చి, ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ కావడంతో కేసీఆర్కు ఆలోచన మొదలైంది. కౌశిక్రెడ్డి ప్రత్యామ్నాయంగా మరొకరిని చూడాలని నిర్ణయించుకున్నారు. కొత్త ముఖాన్ని తీసుకువచ్చి హుజూరాబాద్లో నిలపాలని భావిస్తున్నారు. ఆ ఆలోచనతోనే సర్వేలు నిర్వహించగా.. కౌశిక్రెడ్డి, ఉప ఎన్నికల అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ను కాదని.. ఓ పోలీస్ ఆఫీసర్ను నియోజకవర్గ ప్రజలు ఆదరించడం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అంతర్గత సర్వేల్లో డీఎస్పీగా ఉన్న పింగళి ప్రశాంత్రెడ్డి పేరు బాగా వినిపించిందట. అయితే, అంతకుముందే మాజీ మంత్రి పెద్దిరెడ్డిని హుజూరాబాద్లో ఉండమని కేసీఆర్ ఆదేశించారట. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్బాబును హుజూరాబాద్ బరిలో దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోందట. ఈటలకు దూరపు బంధువు.. హుజూరాబాద్లో ఈటలకు ధీటుగా డీఎస్పీ పింగళి ప్రశాంత్ రెడ్డి పేరు వినిపించడంపై గులాబీ బాస్ కూడా ఒకింత ఆశ్చర్యపోయారట. కుల, మతాల మధ్య సమైక్యతతో పాటు జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంచే క్రమంలో ప్రశాంత్ రెడ్డి.. జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన నిత్య జనగణమన కార్యక్రమం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. నిత్య జనగణమన కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అమలుచేస్తున్నారు. ఆ కార్యక్రమంతో ప్రజలకు చేరువైన ప్రశాంత్ రెడ్డి అయితే ఈటలకు ధీటైన వ్యక్తిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు ప్రజల ఆదరణ కూడా ఉండటంతో.. ప్రశాంత్పై ఇప్పుడు గులాబీ బాస్ గుడ్ లుక్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈటలకు దూరపు బంధువు కూడా అయిన ప్రశాంత్నే బరిలో దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జరుగుతోందని సమాచారం. తన ప్రమేయమేమీ లేకుండానే ప్రజల్లో ఆదరణ కనిపిస్తున్నప్పుడు సహజంగానే ప్రశాంత్ రెడ్డి లాంటి అధికారుల్లో ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అదీ తనను ఓ పొలిటీషియన్గా ప్రజలు చూడాలనుకోవడం పట్ల ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో పింగళి ప్రశాంత్ రెడ్డి అనే డీఎస్పీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి అవుతారా..? లేక ఆ మూడో కృష్ణుడు పెద్దిరెడ్డా.. సతీష్ అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది. ఇది కూడా చదవండి: బీజేపీ ‘పరివార’ చర్చలు -
బీజేపీలో సోషల్ మీడియా వార్.. షాకిచ్చిన ఈటల వర్గం!
తెలంగాణ కమలం పార్టీలో కాంగ్రెస్ పోకడలు కనిపిస్తున్నాయా?.. నాయకుల మధ్య విభేదాలు కొత్త చీఫ్కు తలనొప్పిగా మారుతున్నాయా?. ఏకంగా రాష్ట్ర పార్టీ ఆఫీస్లోనే ఇద్దరు ముఖ్య నేతల అనుచరులు రచ్చ చేయడం దేనికి సంకేతం? ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని దూషించుకోవడంపై ఇప్పుడు హాట్ హాట్గా చర్చ సాగుతోంది. సోషల్ మీడియా వార్కు కారణమైన ఆ ఇద్దరు నేతలు ఎవరు?.. తెలంగాణలో కమలం పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ వార్తలు వచ్చిన సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా వార్ మొదలైంది. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్గా నియమితులైన ఈటల రాజేందర్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. అప్పటికే ఇద్దరు నేతల మధ్య విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో వారిద్దిరి అనుచరులు ఒకరి మీద మరొకరు పోస్టులు పెడుతూ.. వార్ కొనసాగిస్తున్నారు. తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ల సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినపుడు.. ఈటలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని గురించి స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మాటా మాటా పెరిగి ఇరు వర్గాలవారు ఒకరినొకరు తిట్టుకున్నారు. ఆఫీసుకు తాళం.. రాష్ట్ర బీజేపీ ఆఫీస్ వేదికగా నడుస్తున్న పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే ప్రశాంత్తో పోట్లాడిన వారిలో ఈటల రాజేందర్ అనుచరులతో పాటుగా.. పార్టీ కొత్త అధ్యక్షుడు కిషన్రెడ్డి అనుచరులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. సోషల్ మీడియా రూమ్కు తాళం వేసిన ఈటల అనుచరులు సోషల్ మీడియా ఇన్చార్జ్ ప్రశాంత్ను ఈటలకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులపై ప్రశ్నించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత పార్టీ ఆఫీస్ సిబ్బంది ప్రశాంత్ను అక్కడి నుంచి పంపించేశారు. రెండు వర్గాల వారికి కార్యాలయ సిబ్బంది నచ్చ చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో, పార్టీ ఆఫీస్లో ఉద్రిక్త వాతావరణం చల్లబడింది. నిర్వాహకులకు వార్నింగ్.. ఇక, పార్టీ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాలో ఒక నేతకు అనుకూలంగా.. మరో నేతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం సరికాదని దాని నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. మొన్నటి వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయనకు వ్యతిరేకవర్గం నేతలపై పోస్టులు పెట్టారని బాహాటంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ సోషల్ మీడియా వ్యవహారం కొత్త బాస్ కిషన్రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇది కూడా చదవండి: హరీశ్రావుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్: రేవంత్ -
బండి Vs ఈటల.. బీజేపీలో సోషల్ మీడియా పోస్టుల చిచ్చు
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు బీజేపీ సోషల్ మీడియా వింగ్లో కలకలం రేపాయి. ఈ పోస్టులపై సోషల్వింగ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది. కొన్నిరోజుల కిందటివరకు నేతల గ్రూపుల విభేదాలు బయటపడగా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తాజా వివాదానికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను కించపరిచే విధంగా పోస్ట్లు పెడుతున్నారని పలువురు ఈటల వర్గీయులు సోషల్ మీడియా వింగ్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల కేంద్రంగా కాకుండా, పార్టీకి మేలు చేసేలా పోస్టులు ఉండాలని సూచించారు. బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించొచ్చని వార్తలొచ్చిన సందర్భంగా అటు బండి వర్గం, ఇటు ఈటల వర్గం ఒకరికి ఒకరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జుల సమావేశానికి నాంపల్లి కార్యాలయానికి వచ్చిన ఈటల వర్గీయులు... ఈటలకు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడంపై స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి, ఈటల వర్గాలు పరస్పరం దూషించుకున్నాయి. బీజేపీ సోషల్ మీడియా ఉద్యోగి ప్రశాంత్పై కొందరు దూషణకు దిగారు. వీరిలో ఈటల, కిషన్ రెడ్డి అనుచరులు అమర్ నాథ్, గిరివర్ధన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా రూమ్కు తాళం వేసి మరీ దాడికి ప్రయత్నించినట్టు, ఈటలకు అనుకూలంగా కొందరు నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! -
ఈటల, అర్వింద్కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్కు కేంద్రం వై ప్లస్, అర్వింద్కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది. ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి సీఆర్పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా ఇప్పటికే ఈటల రాజేందర్కు తెలంగాణ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు? -
బీజేపీకి బిగ్ షాక్.. బండి సంజయ్ ఎఫెక్ట్ మామూలుగా లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. తెలంగాణ చీఫ్గా బండి సంజయ్ను తప్పించిన నేపథ్యంలో పార్టీలోని సీనియర్ నేతలు బీజేపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా?. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయి. వివరాల ప్రకారం.. బండి సంజయ్ మార్పు నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ హైకమాండ్పై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న బండి సంజయ్ను ప్రస్తుత పరిస్థితుల్లో మార్చడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో గుర్తింపు లేదన్నారు. కిషన్రెడ్డిని డీగ్రేడ్ చేయడం సరికాదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తి నేతల మధ్య పార్టీ బలపడదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక, ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఆదివారం హుటాహుటిన చంద్రశేఖర్ను ఈటల కలిశారు. ఈ సందర్భంగా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల కోరారు. బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటలకు చంద్రశేఖర్ వివరించారు. పార్టీలో చేరి రెండున్నర ఏళ్లు అయినా ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తాను తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేశామని.. వారికి ఉమ్మడిగా ఎజెండా ఉందని ఈటల రాజేందర్ అన్నారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ తనకి ఏమి చెప్పలేదని.. తాను పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఈటలకు చెప్పానన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలనే అంశాలపైనే చర్చించామని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ, బీఆర్ఎస్కు షాక్ తప్పదా?.. రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
పోరాడండి.. తోడుగా ఉంటాం.. ఈటలకు మోదీ భరోసా
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రధాని మోదీ ప్రసంగం ముగిశాక సభా వేదికపై ఓ వైపు నిలుచున్న రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భుజంపై చేయి వేసి పలకరించారు. కాసేపటికి వేదిక వెనక్కి వెళ్లాక కూడా ఈటల భుజంపై చేయి వేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘మేం అన్ని విషయాల్లో మీకు అండగా నిలుస్తాం. ధైర్యంగా పోరాడండి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయండి. పూర్తి సహకారం అందిస్తాం’’ అని ఈటలతో ప్రధాని మోదీ పేర్కొన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో పొంగులే టిని కూడా మోదీ పలకరించారు. ఇక సభా వేది క వెనకాల ఈటల, ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలతో కేంద్ర మంత్రి గడ్కరీ కాసేపు మాట్లాడారు. కాగా శనివారం వరంగల్ పర్యటన ప్రధాని విచ్చేసిన విషయం తెలిసిందే. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మోదీ.. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో పాల్గొని మాట్లాడారు. చదవండి: కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం -
వయసు,అనుభవం ఉన్నవారు ఏదీ పడితే అది మాట్లాడకూడదు
-
బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదు: ఈటల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హన్మకొండ: తెలంగాణ బీజేపీలో ఇటీవల కీలక మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీ చీఫ్గా కిషన్రెడ్డికి, ఎన్నికల ప్రచార సారధిగా ఈటలకు బీజేపీ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. దీంతో, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈటల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే, ఈనెల 8వ తేదీన ప్రధాని మోదీ వరంగల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్ కాలేజీ మైదానాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తారు. బీజేపీలో సంస్థాగత మార్పులు రాబోయే కాలంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే జరిగాయి. తెలంగాణలో బీజేపీపై కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉంది. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోంది. ఒక్కసారిగా పైకి వెళ్లి కిందకి పడిపోవడానికి.. బీజేపీ బలమేమీ సెన్సెక్స్ కాదు. బీజేపీలో భేదాభిప్రాయాలకు తావు లేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది సమయంలో తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు. మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు. ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంతం చేస్తుందన్నారు. మోదీ సభకు ప్రజలు ఎక్కు సంఖ్యలో తరలి రావాలని సూచించారు. అలాగే, కుట్రలు, కుతంత్రాలు తిప్పి కొట్టే సత్తా తెలంగాణ జాతికి, బీజేపీ ఉందని స్పష్టం చేశారు. మేము తక్కువ మాట్లాడి, ఎక్కువ పని చేస్తాం. కేసీఆర్ కుటుంబ పాలనను వదిలే ప్రసక్తే లేదు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. దేశంలోని స్వార్ధపరులు, స్వార్థ పార్టీలు, నేతల గురించి ప్రజలకు తెలుసు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలోచ్చినపుడు ఇష్టారీతిన హామీలు ఇస్తారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చినా రాష్ట్రం రైతులకు ఇచ్చే పరిస్తితి లేదు. ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయో తెలిసిన పార్టీ బీజేపీ. బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నారు. కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: చేరికలపై దూకుడు.. టీ కాంగ్రెస్ సైలెంట్ ఆపరేషన్.. -
కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు: ఈటల
సాక్షి, హైదరాబాద్: తనపై విశ్వాసముంచి బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, జాతీ య సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్లకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ‘తెలంగాణ అంతరంగం, సమస్యలు తెలిసిన వాడిని. కేసీఆర్ బలం, బలహీనతలు తెలుసు. ఒక కార్యకర్తగా నా బాధ్య తను సంపూర్ణంగా నిర్వహిస్తా. కిషన్రెడ్డి సీనియర్ నాయకులు.. ఆయనతో కలిసి పని చేస్తాం’ అని ఈటల పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురేయాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లోనే అంకురార్పణ చేశారన్నారు. బండి సంజయ్ నాయకత్వంలో నాలుగు ఎన్నికల్లో గెలిచాం. తెలంగాణలో గెలిస్తే బీజేపీ.. లేదంటే బీఆర్ఎస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ గెలవలేదు. బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఒక కుటుంబానికి లాభం. బీజేపీ గెలిస్తే ప్రజలకు లాభం. దేశానికి ఒక ఓబీసీ ప్రధానిని అందించిన పార్టీ బీజేపీ. అధిష్టానం మా మీద పెట్టిన విశ్వాసాన్ని శక్తి వంచన లేకుండా నిలుపుకుంటాం. కిషన్రెడ్డితో కలిసి శభాష్ అనే విధంగా పని చేస్తాం’ అని ఈటల స్పష్టం చేశారు. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి -
Kishan Reddy: అందుకే కిషన్రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓసీ, బీసీ సామాజికవర్గాల వారీగా సమతూకం పాటిస్తూ బీజేపీ తాజా నియామకాలు జరిగాయని చెబుతు న్నారు. పార్టీలోని సీనియర్లు, కొత్తగా చేరిన నేతలు, పాతతరం నాయకులు, కార్యకర్తలు అందరినీ సమర్థవంతంగా సమన్వయం చేస్తారనే అంచనాతో పాటు, పార్టీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన అనుభవం పరిగణనలోకి తీసుకుని కిషన్రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ వ్యూహాలు, కార్యాచరణను, రాజకీయాలను సమ ర్థంగా ఎదుర్కొంటారనే భావనతో పాటు వివిధ వర్గాల ప్రజల్లో పట్టును పరిగణనలోకి తీసుకుని ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించారని అంటున్నారు. మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున రాష్ట్రపార్టీని పూర్తిస్థాయిలో సమాయత్తం చేసేందుకు మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. స్వయం కృషితో అంచెలంచెలుగా.. గంగాపురం కిషన్రెడ్డి.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన నేత. బీజేపీ అగ్రనాయకత్వం మోదీ, అమిత్షా, నడ్డాలకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, మోదీ, అమిత్షాలకు సన్నిహితుడిగా పేరు గడించారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎంపీ అయ్యారు. మోదీ కేబినెట్లో హోంశాఖ సహాయ మంత్రి పదవిని చేపట్టారు. తర్వాత కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొంది పర్యాటక, సాంస్కృతిక శాఖ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పార్టీలో స్తబ్ధత, అసంతృప్తి నేపథ్యంలో.. కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో రాష్ట్ర పార్టీలో స్తబ్ధత నెలకొంది. మరోవైపు నేతల మధ్య సమన్వయ లేమి, రాష్ట్రనాయకత్వం తీరుపై నాయకుల్లో అసంతృప్తి పెరగడం వంటివి చోటు చేసుకున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం, గందరగోళం నెలకొంది. దీనికి తోడు గత కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలిపై పలువురు అసంతృప్త నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. ముఖ్యనేతలతో సమన్వయం లేకపోవడం, వారికి తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వకపోవడం తదితర అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కొందరు ముఖ్యనేతలు గ్రూపులు, వర్గాలను మెయింటెన్ చేయడం, ఎవరికి వారు ఇష్టారీతిన వ్యాఖ్యానాలు, పరస్పర విమర్శలు, ఆరోపణలకు దిగడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, జాతీయ కార్యవర్గసభ్యులు, ఇతర నాయకులతో అగ్రనేతలు అమిత్షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్, శివప్రకాష్ దశల వారీగా సంప్రదింపులు జరిపారు. సమస్యలన్నీ అధిగమించేందుకు ఏమి చేయాలన్న దానిపై అభిప్రాయాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి మార్పు, ఇతర నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో బీజేపీ నాయకులు ఎవరికి వారే యమునే తీరే అన్నట్టుగా వ్యవహరించడం, సమన్వయ లేమి కారణంగా ఎన్నికల్లో తీరని నష్టం జరగడాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలో అలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కోకూడదనే భావనతో తాజా మార్పులకు నాయకత్వం శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డిని, ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటలను నియమించవచ్చని కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారం చివరకు వాస్తవ రూపం దాల్చింది. తనదైన ముద్ర వేసినా... మూడేళ్ల మూడునెలలకు పైగా రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగిన బండి సంజయ్ తనదైన ముద్రను బలంగానే వేశారని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ‘రాష్ట్ర పార్టీలో ఫుల్జోష్ను నింపడంలో సఫలీకృతమయ్యారు. బీఆర్ఎస్ పాలన పై, సీఎం కేసీఆర్ తీరుపై, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా అధికార పార్టీకి బీజేపీయే ప్రత్యా మ్నాయ చర్చ ప్రజల్లో జరిగేట్టు చేశారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు..’ అని అంటున్నారు. ముఖ్యనేతల్లో అసంతృప్తి అయితే ఎప్పుడూ తానే ఫోకస్లో ఉండాలనే సంజయ్ ప్రయత్నం.. ముఖ్యనేతల్లో అసంతృప్తికి కారణమయ్యిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా సంజయ్పై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో పాదయాత్ర ఒక్కటే ఎందుకు మోటర్సైకిల్ యాత్రలు, జీపు యాత్రలు, ఇతరత్రా రూపాల్లో ప్రజల వద్దకు వెళ్లాలంటూ అమిత్షా సూచించారు. ఆ తర్వాత కూడా ఒకట్రెండు విడతల పాదయా త్రలు సాగడం, వాటిలోనూ సంజయ్ తీరు మారకపోవడం, ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో.. మొత్తం రాష్ట్రాన్ని పాదయాత్రల ద్వారా కవర్ చేయడం సాధ్యం కాదంటూ ప్రజాసంగ్రామ యాత్రకు హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టింది. మూడేళ్ల పదవీ కాలం ముగిశాక ఆయనను కొనసాగిస్తు న్నట్టు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ నాయకత్వ మార్పు జరిగేదాకా ఆయనే కొనసాగుతారనే సంకేతాలు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పార్టీ పరిస్థితి, నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకుని గడువు ముగిసిన దాదాపు నాలుగు నెలలకు రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంది. -
బండితో విభేదాల్లేవ్.. ఆయనతో సఖ్యత ఉంది: ఈటల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్గా బాధ్యతల అప్పగింతపై ఈటల రాజేందర్ స్పందించారు. కీలక బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారాయన. అలాగే.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్లను ఓడించాలని తెలంగాణ సమాజానికి పిలుపు ఇచ్చారాయన. ‘తెలంగాణ ప్రజల అంతరంగం నాకు తెలుసు. ఈ ప్రాంత సమస్యలూ నాకు తెలుసు. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగానే ఉన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే.. ఒక కటుంబం మాత్రమే అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే.. ఒక వర్గం అధికారంలోకి వస్తుందని అన్నారాయన. కేసీఆర్ అహంకారాన్ని ఓడించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమన్న ఈటల.. కేసీఆర్ బలం, బలహీనతలు తనకు తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్తో తనకు ఎలాంటి విభేదాల్లేవని మరోమారు స్పష్టం చేశారు. అయితే.. కొత్త చీఫ్ కిషన్రెడ్డితో మంచి సఖ్యత ఉందని, ఆయనతో కలిసి పని చేస్తానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం అని ఈటల పేర్కొన్నారు. -
తెలంగాణకు కిషన్రెడ్డి.. ఏపీకి పురంధేశ్వరి
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వ్యూహంలో భాగంగా.. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్లను మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణకు కొత్తగా జి. కిషన్రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్కు దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ కొత్త చీఫ్గా నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది. అలాగే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిని సైతం తీసుకుంది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అయిన అనంతరం.. పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. అలాగే.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జక్కడ్ పేరును ప్రకటించారు. కిందటి ఏడాది మేలో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి జంప్ కొట్టారు. పంజాబ్లో జాతీయవాదం, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకే తాను పార్టీ మారానంటూ ఆ టైంలో ప్రకటించుకున్నారాయన. ఇక.. జార్ఖండ్ బీజేపీ చీఫ్గా బాబూలాల్ మారాండి పేర్లను ప్రకటించారు. జార్ఖండ్ తొలి ముఖ్యమంత్రి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారాయన. కిషన్ రెడ్డి గురించి.. జి.కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఉండడం విశేషం. (ఆనాటి అమెరికా పర్యటనలో కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ) కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే 2009లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక 2012 జనవరి 19న మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర 2019లో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నిక ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు హోంశాఖ సహాయ మంత్రిగా చేయడం వల్ల ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం పురంధేశ్వరి గురించి..రాజకీయ ప్రస్థానం దగ్గుబాటి పురంధేశ్వరి.. చెన్నైలో ఏప్రిల్ 22, 1959లో జన్మించారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు కుమార్తె. భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇద్దరు పిల్లలు. 14, 15వ లోక్సభకు రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికై.. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2004లో కాంగ్రెస్ తరపున బాపట్ల ఎంపీగా నెగ్గిన ఆమె.. ఆ సమయంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2009లోనూ విశాఖపట్నం నుంచి రెండోసారి ఎంపీగా నెగ్గి మరోసారి కేంద్ర సహాయశాఖ మంత్రిగా పని చేశారు. గృహ హింస బిల్లు, హిందూ వారసత్వ సవరణ బిల్లు, మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి పలు బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంటులో ఆమె పనితీరును మెచ్చుకుంటూ, ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05కి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక చేసింది. 2014లో బీజేపీలో చేరి.. రాజంపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆమె వాగ్ధాటి, ఉచ్చారణ, ఉద్రేకపూరిత ప్రసంగాలకుగానూ ‘‘దక్షిణాది సుష్మా స్వరాజ్’’ బిరుదును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బీజేపీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారామె. -
నిన్నటి దాకా ఘాటు కౌంటర్లు.. ఇవాళ ఆత్మీయ ఆలింగనం!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు ఎడమొహం, పెడమొహం పెట్టుకున్న నేతలిద్దరూ లంచ్ మీట్.. ఆపై ఆత్మీయ ఆలింగనంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్వీట్ల యుద్ధంతో కాకరేపిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. చివరకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లంచ్ మీట్లో కలవడం, ఆపై ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొయినాబాద్లోని జితేందర్ రెడ్డి ఫాంహౌజ్ ఏర్పాటు చేసిన లంచ్ మీట్లో మాజీ ఎంపీ జితేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల భేటీ అయ్యారు. అనూహ్యంగా ఈ ఇద్దరూ నేతలు భేటీ అవ్వడం వెనుక ఆంతర్యమేంటనే దానిపై కార్యకర్తలు విస్తృతంగా చర్చ సాగుతోంది. కొద్ది రోజులుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులు, చేర్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈటల రాజేందర్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పరస్సర కౌంటర్లు చేసుకున్న వీళ్లు.. ఆప్యాయంగా పలకరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈటలతో భేటీ అనంతరం.. ‘‘రాష్ట్ర బీజేపీపై తప్పుడు ప్రచారం సరికాదు. పార్టీలో అంతా కలిసి పని చేస్తాం. నా ట్వీట్ను ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం’’ అంటూ మీడియా ద్వారా జితేందర్రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇంతకు ముందు ‘తెలంగాణ నాయకత్వాన్ని వ్యతిరేకించేవాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం’ అంటూ దున్నపోతును ట్రాలీ ఎక్కించే వీడియో ఒకటి పోస్ట్ చేసి పెనుదుమారమే రేపాయాన. ఆపై ఆ ట్వీట్ను డిలీట్ చేసి.. మళ్లీ పోస్ట్ చేసి.. చివరకు బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ అనే మీనింగ్ వచ్చేలాగా దానిని పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంపైనా ఈటల కూడా కాస్త కటువుగానే స్పందించారు. సీనియర్లు, అన్నీ తెలిసిన వారు ఇతరుల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని ఈటల కామెంట్స్ చేశారు. అంతేకాకుండా వయసు పెరిగిన కొద్ది జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇప్పుడు లంచ్ మీట్ లో ఈ ఇద్దరు నేతల మధ్య నవ్వులు.. ఆత్మీయ అలింగనాలతో భేటీ సాగింది. ఇదిలా ఉంటే.. ఈటల, ఏపీ జితేందర్ రెడ్డికి మధ్య ముందు నుంచే స్నేహముంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు జితేందర్ రెడ్డి ఇంచార్జీ గా సైతం వ్యవహరించారు. అన్నీ తానే దగ్గరుండి చూసుకున్నారు. కాగా గత నెల జితేందర్ రెడ్డి ఇంట్లో అసంతృప్తి నేతలు సమావేశం నిర్వహించారు. అప్పటి నుంచి బీజేపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొత్తానికి ఇప్పుడు లంచ్ మీట్ తో పాత మిత్రులు మళ్లీ ఒక్కటయ్యారు. ఇదీ చదవండి: ఏయ్.. నన్నే ఆపుతారా?.. కేఏపాల్ హల్చల్ -
రేపు వరంగల్లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా?
సాక్షి, వరంగల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలల తెలంగాణ పర్యటనకు విచ్చేయనున్న విషయం తెలిసిందే. జూలై 8న వరంగల్కి రానున్నారు. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓవర్హాలింగ్ సెంటర్, మెగా టెక్స్టైల్ పార్క్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ క్రమంలో రేపు(ఆదివారం) వరంగల్లో బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణపై చర్చించనున్నారు. అయితే కొంతకాలంగా ఎడముహం, పెడముఖంగా ఉంటున్న కీలక నేతలు.. ప్రధాని పర్యటనలో అయినా కలిసి పనిచేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే విధంగా మోదీ సభ ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్ పీవోచ్ శంఖుస్థాపన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బహిరంగ సభ కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం, ఓ సిటీ గ్రౌండ్ను బీజేపీ నాయకులు పరిశీలించనున్నారు, ఇప్పటికే రెండు చోట్ల పర్మిషన్ కోసం బిజేపి నాయకులు దరఖాస్తు చేశారు. తన వరంగల్ పర్యటనలో భాగంగా మోదీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. , అందుకు తగ్గ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. చదవండి: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్న్యూస్.. -
మమ్మల్నెందుకు పట్టించుకోరు.. బీజేపీలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్త స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనేంత స్థాయి వరకు నేతలు గళం విప్పుతున్నారు. జాతీయ, రాష్ట్ర నాయకత్వాల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో అధికమౌతున్నాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు సైతం ఈ తరహా నేతల జాబితాలో ఉండటం గమనార్హం. వారితో మాట్లాడి.. మమ్మల్ని విస్మరించారు! పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డిలు అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఇటీవల వారిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. ఈ నేపథ్యంలో మరికొందరు ముఖ్యనేతలు.. తమ అసంతృప్తిని తెలుసుకునేందుకు నాయకత్వం ఎందుకు ప్రయత్నించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం ద్వారా పార్టీకి పెద్ద ఊపు తెచ్చిన తనను ఎమ్మెల్యేగా, ముఖ్యనేతగా పరిగణించకుండా రాష్ట్ర నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్యే రఘునందన్రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్ ఫైర్.. రాష్ట్ర అధ్యక్షుడి తీరును, పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం గురించి పలుమార్లు అమిత్షా, నడ్డాలకు తెలియజేసినా ఓపిక పట్టాలనే సూచన తప్ప సమస్య పరిష్కారానికి ఏ చర్యా తీసుకోలేదనే భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈటల, రాజ్గోపాల్రెడ్డిలను ఢిల్లీకి పిలిపించారని, తనను మాత్రం పట్టించుకోలేదనే భావనతో ఆయన ఉన్నట్టు సమాచారం. బీజేఎల్పీ నేత రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత తనకు శాసన సభాపక్షపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించి తనను విస్మరించడం, పార్టీకి తాను చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తారని ఆశించినా అవి జరగకపోవడం రఘునందన్లో అసంతృప్తిని మరింత పెంచిందని అంటున్నారు. తన కార్యకర్తలు, అనుయాయులు వెలిబుచ్చుతున్న అసంతృప్తినే తాను బయటకు చెబుతున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి రాష్ట్ర బీజేపీపై వ్యంగ్య ధోరణిలో ఓ ప్రతీకాత్మక వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయడం పారీ్టలో దుమారాన్నే రేపింది. దున్నపోతును వెనుకనుంచి తన్ని వ్యాన్లోకి ఎక్కించే వీడియో పోస్ట్ చేసి, రాష్ట్ర నాయకత్వానికి ఇలాంటి చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నేరుగా నడ్డా దృష్టికి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల హైదరాబాద్కు వచ్చిన సందర్భంగానూ పలువురు నాయకులు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించక పోవడంపై అసంతృప్తిని తెలియజేశారు. జాతీయ కార్యవర్గసభ్యులు డా.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఎమ్మెల్యే ఎం.రఘునందన్రావు వేర్వేరుగా నడ్డాను కలుసుకుని వివిధ అంశాలపై తమ అసంతృప్తికి గల కారణాలను తెలియజేశారు. రాష్ట్ర పార్టీలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులతో నాయకులు సమైక్యంగా లేరనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడం, పార్టీలో సమష్టి నిర్ణయాలు కొరవడడంతో నష్టం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు. తీవ్ర అసంతృప్తి.. పలు సందర్భాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను సంప్రదించకుండానే ముఖ్య నేతల భేటీలో నిర్ణయమంటూ ప్రకటనలు వెలువడుతున్నాయని నడ్డా దృష్టికి తీసుకొచ్చారు. తాము జాతీయ కార్యవర్గ సభ్యులుగా, మాజీ ఎంపీలుగా, ఉద్యమకారులుగా ఉన్నా తగిన ప్రాధాన్యత, గుర్తింపునివ్వడం లేదని, నష్టం కలుగజేసేలా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి వంటి వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలపై జాతీయ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఇది కూడా చదవండి: చర్చనీయాంశంగా.. సామేలు రాజీనామా -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈటలకు భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది. కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్ ఐపీఎస్తో వెరిఫై చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి గురువారం డీసీసీ సందీప్ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: కేటీఆర్కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి -
వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి: ఈటల కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. ఇక, నిన్న(గురువారం) బీజేపీ నేత జితేందర్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలపై ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ట్వీట్పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఇక, తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డి అలా ఎందుకు ట్వీట్ చేశారో ఆయననే అడగాలి. వయసు, అనుభవం ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీలో క్రమశిక్షణ పట్టాలు తప్పుతుండటంతో గీత దాటుతున్న నేతలకు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం చేస్తున్న నేతలను హెచ్చరించారు. క్రమశిక్షణారాహిత్యం, నిర్లక్ష్యపూరిత వైఖరిని సహించేదిలేదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీపైనా, పార్టీ నాయకత్వంపైనా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తే పార్టీకి నష్టం చేసినట్టేనని అన్నారు. పార్టీ ఎజెండా కంటే వ్యక్తిగత ఎజెండాలు ఎప్పటికీ ఎక్కువ కాదని స్పష్టం చేశారు. పార్టీలో ఒక లక్ష్మణ రేఖ ఉందని మర్చిపోకూడదని సూచించారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్, బీజేపీకి షాక్!.. పొంగులేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
ఇదీ తెలంగాణలో సంగతి!.. మోదీ వద్ద కీలక చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికలతో పాటు ఈ ఏడాది చివర్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ, రాష్ట్రస్థాయిలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరిపే మార్పుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం దక్కవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి సంబంధించి అవసరమైన మేర సంస్థాగతంగా మార్పులు, ఎన్నికల ప్రచార కమిటీలు, మరింత మెరుగైన సమన్వయానికి ముఖ్యమైన కమిటీలను నియమించే అవకాశాలున్నట్టు ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్ర పార్టీలపై ప్రత్యేక దృష్టి.. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్షా వివరించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై వీరు సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ జాతీయ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ సహా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరంతో పాటు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపై బుధవారం అర్ధరాత్రి వరకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. దీనికి అమిత్షా, నడ్డాలతో పాటు పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈటల, రాజగోపాల్ సూచనలు ఈ సందర్భంగా తెలంగాణలో నేతల సమన్వయలేమి, సీనియర్నేతలు అసంతృప్తి వ్యక్తంచేయడం, ముఖ్యనాయకుల ఏకపక్ష ధోరణి వంటి ఇటీవలి రాజకీయ పరిణామాలను షా, నడ్డాలు మోదీకి వివరించినట్టు సమాచారం. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లోపించడం, కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో మొదలైన చేరికలు, పార్టీ నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చలు వంటి అంశాలపై నివేదించారు. అలాగే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కాలంటే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు చేసిన సూచనలపైనా ఇందులో చర్చించినట్లు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా నడ్డాకు పలువురు సీనియర్నేతలు తమ అసంతృప్తిని, అందుకు గల కారణాలను వివరించిన సంగతి కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అయోమయం, గందరగోళ పరిస్థితులను దూరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమైన కమిటీలకు నియామకాలు.. అగ్రనేతల సమావేశంలో కొన్ని కీలక కమిటీల నియామకాలపై చర్చ జరిగిందని సమాచారం. జూలై మొదటి వారానికి ముఖ్యమైన కమిటీల నియామకాలను పూర్తి చేయాలని, నేతల మధ్య సమన్వయం చెడకుండా ఎప్పటికప్పుడు వారితో చర్చించాలని మోదీ సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో పాటే బడుగు, బలహీన వర్గాల ప్రజలతో మమేకం అయ్యేలా నియోజకవర్గస్థాయి కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించాలని నిర్దేశించినట్లు సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష మార్పులతో పాటు, ఆయా రాష్ట్రాల నుంచి కొత్తవారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలనే అంశంపై కూ డా చర్చలు జరిగినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశం రద్దు.. అయితే ఏయే రాష్ట్రాల్లో మార్పులుచేర్పులు ఉంటాయన్న దానిపై స్పష్టత లేదు. తెలంగాణలో నాయకత్వ మార్పుతో పాటు, కేంద్రమంత్రివర్గంలో ఒకరికి చోటు లభిస్తుందని ఊహాగానాలు వస్తున్నా, వాటిపై జాతీయ నాయకత్వమే స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. ఇదే భేటీలో తెలంగాణలో ఈ నెల 8న ప్రధాని పర్యటన షెడ్యూల్ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. వరంగల్లో ప్రధాని పర్యటనను పురస్కరించుకొని ఈ నెల 8న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నాయకుల సమావేశాన్ని సైతం రద్దు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇది కూడా చదవండి: చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది! -
బీజేపీలో పెను మార్పులు!.. కేంద్రమంత్రిగా బండి, ఈటలకు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల గడువు సమీపిస్తున్నకొద్దీ పొలిటికల్ పార్టీలు ప్లాన్స్ మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఇక, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీలో కీలక పదవుల్లో మార్పులు జరుగుతున్నట్టు అధిష్టానం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మార్పు ఉంటుందని కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కాగా, ఆ వార్తలు నిజమేనని తెలుస్తోంది. బీజేపీ చీఫ్ మార్పువైపే పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ప్రచార కమిటీ పగ్గాలు అప్పగించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో పార్టీ చీఫ్ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇందులో భాగంగానే హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జోడు గుర్రాల వేటలో భాగంగా ఈటలకు సరైన జోడి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్నట్టు పార్టీలో చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బండి సంజయ్, ఈటల మధ్య పొసగకపోవడంతోనే పార్టీ చీఫ్ మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక, త్వరలోనే మోదీ కేబినెట్ విస్తరణకు కూడా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ జితేందర్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ఓ వ్యక్తి ట్రాలీలో ఎక్కిన వీడియోను పోస్ట్ చేసిన.. ఇది తెలంగాణ బీజేపీకి అవసరమంటూ క్యాప్షన్ ఉంచారు. ఆయన కాసేపటికే దానిని డిలీట్ చేశారు. పైగా ఆ ట్వీట్కు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్ లాంటి అగ్రనేతలను ట్యాగ్ చేశారాయన. అయితే ఆయన ట్విటర్ వాల్పై ఆ పోస్ట్ కనిపించకపోవడంతో.. ఆయన దానిని డిలీట్ చేసినట్లు అర్థమవుతోంది. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్కు కొత్త టెన్షన్! -
ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ తో వెరిఫై చేయించాలని సూచన
-
ఈటల నివాసానికి పోలీసులు.. భద్రతపై చర్చ
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి డీసీసీ సందీప్ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్ -
ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తున్నారని,ఫ్రస్టేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి అన్నారు. బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ఆయన్ను చంపాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఈటల కోసం 20 కోట్లు కాదు కదా.. 20 రూపాయలు ఖర్చు వేస్ట్.. కావాలనే ఈటల రాజేందర్, జమున డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘2018లో తనను చంపించేందుకు ఈటలనే కుట్ర చేశారు. ఇటీవల నాపై రెక్కీ చేసినట్టుగా అనుమానం ఉంది. నాకు, నా కుటుంబానికి ఏం జరిగినా ఈటలదే బాధ్యత’’ అని కౌశిక్రెడ్డి అన్నారు. కాగా,ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారంటూ జమున వ్యాఖ్యానించారు. చదవండి: బక్రీద్పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు -
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోంది: జమున
-
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్పై ఈటల జమున మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్ ఐపీఎస్ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్పై ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ హుజురాబాద్లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర... స్పందించిన కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్వి హత్యా రాజకీయాలని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హత్యా రాజకీయాలను ఆయనక కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. 2014లో బాల్రాజ్ అనే వ్యక్తిని ఈటల రాజేందర్ హత్య చేయించారని ఆరోపించారు. ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్ను థర్డ్ డిగ్రీ పెట్టించి వేధిస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. 2018 మర్రిపల్లిగూడెంలో ఈటల తనను చంపించే ప్రయత్నం చేశారని అన్నారు. ఎక్కడ హుజురాబాద్లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. చదవండి: అంతా తెలుసు.. టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్ ‘నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటెల రాజేందర్ను ఓడించేందుకు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుంది. బీసీలపై గౌరవం ఉంటే ఎందుకు ముదిరాజ్ కోడల్ని, అల్లున్ని తెచ్చుకోలేదు. కోళ్లఫామ్ పెట్టుకున్న వ్యాపారులు దివాళ తీస్తంటే ఈటల రాజేందర్ మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన పెంచే కోళ్లు ఏమైనా బంగారు గుడ్లు పెడుతున్నాయా? ఈటల రాజేందర్ కాస్త ఇవాళ చీటర్ రాజేందర్గా మారారు. రోడ్డు పొడిగింపు కోసం అమర వీరుల స్థూపాన్ని తొలగించేందుకు తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన అమరుల స్తూపం శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈటల లేడు’ అని పేర్కొన్నారు. కాగా ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిఇసందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని జమున వ్యాఖ్యానించారు -
ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలకు దిగారు. తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నాడని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్పై ఈటల జమున మండిపడ్డారు. అలాగే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికంగా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదీ చదవండి: కేసీఆర్కో హఠావో.. తెలంగాణకో బచావో -
ఢిల్లీలో నడ్డాతో ముగిసిన ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీ
-
ఢిల్లీలో హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్.. హస్తినాలో ఏం జరుగుతోంది?
సాక్షి, ఢిల్లీ: ఒక వైపు కేంద్ర మంత్రులతో కేటీఆర్ వరుస భేటీలు.. మరో వైపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలతో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం.. దీంతో ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. పార్టీ హై కమాండ్ నుంచి పిలుపు మేరకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మరో వైపు హోం మంత్రి అమిత్షాతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇప్పటికే రాజ్నాథ్, హర్దీప్సింగ్, పీయూష్ గోయల్ను కేటీఆర్ కలిశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ దగ్గరవుతున్నాయంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కేటీఆర్కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావులు ఏఐసీసీ నేతలను కలిసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 26న ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈనెల 25న కలవాలని అనుకున్నా రాహుల్ అపాయింట్మెంట్ 26న లభించడంతో ఆ రోజున ఢిల్లీ వెళుతున్నట్టు పొంగులేటి శిబిరం చెబుతోంది. చదవండి: కమలం పార్టీ శ్రేణుల్లో గుబులు.. నిధుల వాడకం వ్యాఖ్యలతో మైనస్ కానుందా? పొంగులేటి, జూపల్లిలు తమ ముఖ్య అనుచరులతో కలిసి ఆ రోజున రాహుల్గాంధీని కలిసినప్పుడే వారు పార్టీలో ఎప్పుడు చేరాలన్న దానిపై ఓ స్పష్టత రానుంది. వచ్చే నెల మొదటి వారంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముగిసే అవకాశమున్నందున అదే నెల 2న లేదా మరో రోజున ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే సభలో పొంగులేటి అండ్ టీం కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆయన ఖమ్మంలో తన అనుచరులతో కలిసి సభ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఇక, ఖమ్మంలో జరిగే సభలో మాజీమంత్రి జూపల్లి కూడా కాంగ్రెస్లో చేరతారా లేక మహబూబ్నగర్లో సభ నిర్వహిస్తారా అన్నది కూడా రాహుల్గాంధీని కలిసిన రోజునే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. చదవండి: ఆ నియోజకవర్గాల్లో మళ్లీ అదే సీన్ రీపిట్ అవుతుందా? -
ఈటల, కోమటిరెడ్డి ఎఫెక్ట్.. వెంటనే ఢిల్లీకి రావాలని కిషన్రెడ్డికి ఫోన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిస్థితులపై హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో ఆయన హస్తినకు బయలుదేరనున్నారు. దీంతో, హైదరాబాద్లో ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సెట్ చేసే పనిలో పడింది బీజేపీ అధిష్టానం. ఇందులో భాగంగానే కిషన్రెడ్డి ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది. ఇక, అంతకుముందే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సైతం ఢిల్లీకి రావాలని సూచించడంతో ఇప్పటికే కోమటిరెడ్డి హస్తినకు వెళ్లారు. ఈటల కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, వీరిలో జేపీ నడ్డా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. జేపీ నడ్డా రేపు(ఆదివారం) తెలంగాణకు రానున్నారు. సంజయ్ సమక్షంలో చర్చ ఇదిలా ఉండగా.. నాగర్కర్నూల్లో నడ్డా బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, బూర నర్సయ్య గౌడ్ తదితరులు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పార్టీ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల, రాజ్గోపాల్రెడ్డిల ఢిల్లీ పర్యటన చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. పలువురు సీనియర్లు ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు నేతలతో సంజయ్ విడివిడిగా సమావేశమైనట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీని వీడాలనుకుంటే ఆపొద్దు..! పార్టీలో చోటుచేసుకుంటున్న వివిధ పరిణామాలు చర్చకు వచ్చినపుడు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని సంజయ్కు కొందరు స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులకు కాకుండా.. లీకులిస్తున్న నాయకులకే అగ్రనేతలు అపాయింట్మెంట్లు ఇస్తున్నారంటూ ఓనేత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీని వీడాలనుకునే నాయకులను ఆపవద్దని సంజయ్కు సీనియర్లు చెప్పినట్లు సమాచారం. కాగా అధికార బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, బీఆర్ఎస్కు బీజేపీయే నిజమైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇది కూడా చదవండి: శేజల్తో బీఆర్ఎస్ నేతల చర్చలు.. ఎమ్మెల్యే చిన్నయ్యకు షాక్! -
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు
-
ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి రండి.. బీజేపీలో కీలక పరిణామం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కంటే ముందే తెలంగాణలో పాలిటిక్స్ స్పీడ్ అందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇక, తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా, పార్టీలో బాధ్యతల అప్పగింతపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, ఈరోజు సాయంత్రం ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. వీరిద్దరూ రేపు(శనివారం) అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా.. ‘మహా జన్సంపర్క్ అభియాన్’లో భాగంగా తెలంగాణలో జరిగిన ‘ఇంటింటికీ బీజేపీ’ కార్యక్రమంలో ఈటల రాజేందర్, కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో వీరిద్దరూ ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ కొనసాగింది. ఈ క్రమంలో మరుసటి రోజే వీరిద్దకి హస్తిన నుంచి పిలుపు రావడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్ అయ్యే ఛాన్స్! -
నేతలు చేజారకుండా బీజేపీ అప్రమత్తం
-
తెలంగాణ బీజేపీలో సైలెంట్ వార్.. వారిద్దరూ ఎందుకు రాలేదు?
సాక్షి, హైదరాబాద్: ‘మహా జన్సంపర్క్ అభియాన్’లో భాగంగా తెలంగాణలో నేటి నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మహా జన్సంపర్క్ అభియాన్’ ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో, తెలంగాణ కాషాయ పార్టీలో ఉన్న విబేధాలు మరోసారి బహిర్గమయ్యాయి. అయితే, ఈ కార్యక్రమానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి దూరంగా ఉన్నారు. ఇక, కొద్ది రోజులుగా ఈ ఇద్దరు నేతలు పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్రెడ్డి తీరుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈటల సైలెంట్ అయినట్టు సమాచారం. మరోవైపు.. కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్ కావడంతో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ వీడిన వారందరూ మళ్లీ హస్తం గూటికి వస్తారు అని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, రాజగోపాల్రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. ఇది కూడా చదవండి: గద్దర్ అంటే మాకు గౌరవం ఉంది: బండి సంజయ్ -
కేసీఆర్ లీక్స్ పట్టించుకోవద్దు.. బీజేపీ కేడర్కు జితేందర్ రెడ్డి సూచన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి నివాసంలో బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో విజయశాంతి, కొండా సురేఖ, నర్సయ్య గౌడ్, విఠల్ పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీలో పరిణామాల(మార్పులు, చేర్పులపై) చర్చించినట్టు సమాచారం. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టార్గెట్గా సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఇక, భేటీ అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళతాం. జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళతాం. కేసీఆర్ కొన్ని లీక్లు ఇస్తూ మా పార్టీ కేడర్లో అయోమయం సృష్టిస్తున్నారు. కేసీఆర్ దుష్ర్పచారాన్ని తిప్పికొడతాం. కేసీఆర్ కుట్రలను పట్టించుకోవద్దని పార్టీ కేడర్కు చెబుతున్నాం. హైకమాండ్లో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయి. లీక్స్పై పార్టీ కేడర్కు మెసేజ్ పంపేందుకే భేటీ అయ్యాం. మాది జాతీయ పార్టీ. మాకు ఓ విధానం ఉంటుంది. తెలంగాణ బీజేపీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పార్టీ బలోపేతంపై చర్చించాం. కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తుపెట్టుకోవడం ఖాయం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ.. వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు -
బండికి కేంద్రమంత్రి పదవి.. టీబీజేపీ చీఫ్గా డీకే అరుణ!
సాక్షి, ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వర్గపోరుతో కేడర్ను అయోమయంలో నెట్టేసిన తెలంగాణ బీజేపీకి బూస్టింగ్ ఇచ్చే పనిలో తలమునకలైంది అధిష్టానం. నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాల నడుమ.. వారం రోజులుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి బీజేపీ పార్టీ శ్రేణులు. వర్గపోరుకు చెక్ పెట్టేలా హస్తినలో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. క్యాడర్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించడానికి.. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నాయకత్వంలో ప్రధాన మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు అసంతృప్తికి లోనుకాకుండా చూసుకుంటూనే.. కేడర్ను పటిష్టంగా మార్చాలన్నది బీజేపీ అధిష్టానం అభిమతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణకి.. బీజేపీ తెలంగాణ బీజేపీ చీఫ్ పగ్గాలు అప్పజెప్పాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఉన్న పలువురి పేర్ల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్(ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు)ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తోందట. ఇక ఇప్పటికే ఈటల రాజేందర్కు ఎన్నికల ప్రచార సారథిగా బాధ్యతలు అప్పజెప్పగా.. ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పనులు మొదలుపెట్టారు కూడా. తద్వారా.. పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది. గత పక్షం రోజులుగా ఇక్కడి నుంచి నేతలు వరుసగా అక్కడికి వెళ్తుండడం.. వాళ్లతో మంతనాలు కొనసాగిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పుపై సాధారణంగానే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నెల 15న ఖమ్మం లో అమిత్ షా పర్యటించనున్నారు. ఆ పర్యటనకు ముందే నాయకత్వ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
తెలంగాణ బీజేపీలో కోవర్టుల కలకలం.. మళ్లీ తెరపైకి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ‘కోవర్టుల’అంశం కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయపార్టీల కార్యకలాపాలు ఊపందుకోగా, కోవర్టుల అంశాన్ని బీజేపీ మరోసారి చర్చకు తెరలేపింది. బీజేపీలో ఉన్న సీఎం కేసీఆర్ కోవర్టులే తాను కాంగ్రెస్లో చేరబోతున్నానని ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ తాజాగా చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కోవర్టులెవరో జాతీయ, రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన వెల్లడించారు. దీంతో బీజేపీలో కోవర్టులు ఎవరై ఉంటారా? అని రకరకాల ఊహాగానాలు పార్టీ నాయకుల్లో సాగుతున్నాయి. ఇప్పటికే కోవర్టులపై ఈటల వ్యాఖ్యలు.. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారంటూ కొద్ది రోజుల క్రితమే సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. బహిరంగంగా మాత్రం తమ పార్టీలో ఎవరూ లేరని గంభీరంగా చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఫలానా నేత అయ్యి ఉండొచ్చా.. సదరు నాయకుడి ప్రకటనలు, ప్రవర్తన చూస్తే అలాగే అనిపిస్తోంది’అనే దాకా చర్చలు వెళ్లాయి. ఇప్పుడు నందీశ్వర్గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చకు కారణమయ్యాయి. గత కొన్నిరోజుల్లో ముఖ్యనేతలు నాలుగైదు సందర్భాల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మాటలు పేర్లు ప్రస్తావించకుండా పత్రికల్లో ప్రచురితమవ్వడం, టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. చదవండి: బీజేపీ మాస్టర్ ప్లాన్.. ప్రచార ‘సారథి’ ఈటెల!.. ప్రకటన ఎప్పుడంటే? మళ్లీ ఇప్పుడెందుకు ? నందీశ్వర్గౌడ్ వ్యాఖ్యలతో మళ్లీ కోవర్టుల పంచాయితీ ముందుకొచ్చింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు ఢిల్లీలో అధినాయకత్వం మేధోమథనం నిర్వహిస్తున్న సందర్భంలోనే ఇవి ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి చాన్స్ తీసుకోకూడదని.. సంస్థాగతంగా అధ్యక్షుడి మార్పు, ఎన్నికల కమిటీ నియామకం వంటి మార్పుచేర్పులపై నాయకత్వం దృష్టి పెట్టిన సందర్భంలో ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి? ఇవి ఎవరిని ఉద్ధేశించి చేసినవి? అనే చర్చ సాగుతోంది. ఈ కోవర్టుల గోలపై పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. -
బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్కు కీలక బాధ్యతలు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇక, తెలంగాణ విషయంలో బీజేపీ హైకమాండ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ కమిటీ సారధిగా నియమించినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నాయకత్వాన్ని సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రొజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈటల రాజేందర్ ఈరోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే తెలంగాణ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ మేథోమథనం జరిపింది. రెండు రోజుల పాటు దాదాపు పది గంటలు నేతలు సమాలోచనలు చేశారు. కాగా, అధిష్టానం నిర్ణయంతో తెలంగాణ బీజేపీలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతోసహా చెల్లిస్తా: పొంగులేటి -
తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు తప్పదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నాయకత్వ మార్పు తప్పదా?.. పార్టీ చీఫ్ను మారుస్తారనే ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. అందుకు కారణం.. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇవాళ(శుక్రవారం) ఢిల్లీకి బయల్దేరడం!. వర్గ పోరుతో తెలంగాణ బీజేపీ సతమతమవుతోంది. ఈ ఎఫెక్ట్ వల్ల క్యాడర్లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. కలిసి పని చేయకపోగా.. పరోక్ష విమర్శలతో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నారు పార్టీ కీలక నేతలు. ఈ తరుణంలో.. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు నాయకత్వ మార్పుపైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గత పదిహేను రోజులుగా పార్టీకి చెందిన ముగ్గురు అగ్రనేతలు హస్తిన పర్యటనలు చేశారు. మరోవైపు బీజేపీ క్యాడర్లో గత వారం రోజులుగా అయోమయం నెలకొంది. ఇంకోవైపు ఎన్నికలకు పట్టుమని ఐదు నెలలు కూడా లేదు. దీంతో తెలంగాణ బీజేపీకి బూస్టింగ్ ఇవ్వడానికే అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అవన్నీ రైతు ఆత్మహత్యలు కావు..!! -
Telangana BJP: బండి సంజయ్ వెనుక ఏం జరుగుతోంది?
తెలంగాణ కాషాయ సేన చీఫ్ బండి సంజయ్కు పార్టీలో వ్యతిరేకులు ఎలా తయారయ్యారు? పాత నేతలతో పాటు..కొత్త నాయకులు కూడా బండికి దూరంగా జరుగుతున్నారా? సొంత జిల్లా.. పక్క జిల్లా అనే తేడా లేకుండా అసమ్మతి పెంచుకుంటున్నారా? ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుని పార్టీని పరుగులు తీయించిన బండి సంజయ్ వెనుక ఏం జరుగుతోంది? బీజేపీ తెలంగాణా రాష్ట్ర రథసారథిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక.. పార్టీ పరుగులు తీసిన తీరుతో రాష్ట్ర, జాతీయ నాయకులంతా ఆయన్ను ప్రశంసించారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నా.. తనతో పాటు పదిమంది కలిసి నడిచేలా చేయడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే అంశాన్ని పార్టీలోని ముఖ్యనేతలు అధిష్ఠానం ముందు మొర పెట్టుకున్నారని.. అందరికీ కలుపుకుని పోలేకపోతున్న బండి సంజయ్ పదవిని కొనసాగించాలా? ఇంతటితో ముగించి మరొకరికి రాష్ట్ర పగ్గాలు అందించాలా అనే ఆలోచనతో హైకమాండ్ ఉందని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీజేపీలో చేరమని ఆహ్వానించేందుకు ఈటల రాజేందర్ వెళ్ళినపుడు.. ఆ అంశం గురించి మీడియా అడిగితే.. ఆ విషయం తనకు తెలియదంటూ బండి సంజయ్ చేసిన కామెంట్..ఇద్దరి మధ్యా ఉన్న దూరాన్ని చెప్పకనే చెప్పారు. మరోవైపు తన జిల్లాకే చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డితో కూడా బండికి గతం నుంచీ పొసగదు. గుజ్జుల ఈ మధ్య బండిపై బాహాటంగానే విమర్శలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు సుగుణాకర్ రావుతోగానీ.. మరో జాతీయ నాయకుడైన మురళీధర్ రావుతోగానీ బండి సంజయ్కు పొసగదనే విషయం బహిరంగ రహస్యం. చదవండి: కేటీఆర్ సార్.. మెట్రో మాక్కూడా! అంతేకాదు.. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరు ముఖ్య నేతల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావుతోనూ అంటీముట్టనట్టుండే బండి సంజయ్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డీతోనూ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ తోనూ దూరం..దూరంగానే ఉంటారని టాక్. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ స్థాయిలో వ్యవహరించడం లేదని.. ఏదో ఒక జిల్లా నేతగానే ఇప్పటికీ ఆయన వ్యవహార శైలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడయ్యాక.. ఆయన దూకుడు వల్లే రాష్ట్రంలో కాషాయ పార్టీ పరుగులు తీసిందని కాషాయ సేనలో అందరూ అంగీకరిస్తారు. కాని అంతా తానొక్కడే అన్నట్లుగా ఉండటం. ఎవరినీ కలుపుకునిపోకుండా వ్యవహరించడం ఆయనకు నెగిటివ్గా మారినట్లు సమాచారం. సీనియర్లనూ కేర్ చేయకపోవడం వంటి చాలా అంశాలు బండి సంజయ్ నాయకత్వపై నిరసనలకు కారణమవుతున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండినే కొనసాగిస్తారా? మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారా అనే చర్చ కమలం పార్టీలో ఆసక్తికరంగా సాగుతోంది. -
పార్టీలో అసంతృప్తులు, కర్ణాటక ఓటమితో కష్టాల్లో పడిన బీజేపీ
-
ఆ పార్టీలో రేవంత్ రెడ్డి చిచ్చు ..!
-
పొంగులేటి, తుమ్మల బీజేపీలో చేరికపై ఈటల సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరికపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చర్చలు జరిపి పొంగులేటి, జూపల్లి ఇతర పార్టీల్లో చేరకుండా ఆపగలిగానని ఈటల రాజేందర్ తెలిపారు. అయినా, వారిద్దరూ బీజేపీలో చేరతారని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఈటల సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు వాళ్లతో మాట్లాడుతున్నానని.. అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీని అప్పట్లో పొంగులేటి కలిశారని తెలిసింది. అంతకంటే ముందే ఖమ్మం వెళ్లి తాను పొంగులేటితో చర్చించాననని తెలిపారు. కొంతమంది తను అనని వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్త ం చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ను అవలీలగా మింగేస్తారని.. సీఎంకు ట్రిక్స్ బాగా తెలుసని అన్నారు. కాగా ఈటల తాజా వ్యాఖ్యలతో పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. చదవండి: ఇందిరా, రాజీవ్ గాంధీ పథకాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు -
వెంటనే వస్తే ప్రాధాన్యమిస్తాం!
సాక్షి, హైదరాబాద్: పార్టీలో చేరికల విషయంలో ఇకపై దూకుడుగా ముందుకు వెళ్లాలని, కసరత్తు వేగవంతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నవారు.. ఈ విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే చేరితే ప్రాధాన్యమిస్తామని భరోసా కల్పించేందుకు సిద్ధమైంది. ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున చేరికల అంకాన్ని త్వరగా ముగించి ఎన్నికల సన్నద్ధతపై దృష్టి పెట్టాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం, చేరికల కమిటీ అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు పది ఉమ్మడి జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలతో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఇతర నేతలు మరో విడత సంప్రదింపులు మొదలుపెట్టారు. కొనసాగిన ఈటల ఆపరేషన్! చేరికల ప్రక్రియలో భాగంగా ఈటల రాజేందర్ శుక్రవారం కూడా పలువురు నేతలను స్వయంగా కలుసుకోవడం, సన్నిహితుల ఫోన్ల ద్వారా మంతనాలు సాగించడం చేసినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఉదయమే ఇంట్లో నుంచి బయలుదేరిన ఈటల.. తొలుత విద్యానగర్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డితో భేటీ అయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో జరిపిన చర్చల సారాంశాన్ని, వారి నుంచి వచ్చిన స్పందనను ఆయనకు వివరించారు. ఈటల తన వ్యక్తిగత సహాయకులు, డ్రైవర్, గన్మన్లు లేకుండానే.. పలుచోట్లకు వెళ్లి ఇతర పార్టీల నేతలను కలిశారని, కొందరితో ఫోన్లలో సంప్రదింపులు జరిపారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కీలక నిర్ణయాలతో త్వరలోనే ఊపు? రాష్ట్ర పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని, కచ్చితంగా విజయం సా ధించేలా పార్టీలో జరుగుతాయని చెప్తున్నారు. ఆ మార్పుల తర్వాత చేరికల వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని, ఈ క్రమంలోనే బీజేపీలో చేరనున్న నేతలకు పలు అంశాలపై హామీలు ఇచ్చేందుకు ముఖ్య నేతలు సిద్ధపడినట్టు పేర్కొంటున్నారు. -
కన్ఫ్యూషన్ లో బీజేపీ
-
ఎన్నికల డబ్బు కోసమే జీవో 111 రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేందుకు, దేశంలోనూ ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ నిమిత్తమే జీవో 111 రద్దుతో సీఎం కేసీఆర్ అక్రమ సంపాదనకు తెరలేపారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ వందిమాగధుల ఆస్తుల సంపాదనకు, ఆయనకు డబ్బులిచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. హైదరాబాద్ మహానగర పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసి, నగరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేసి, వరదలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటల బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల్ని కాపాడాల్సిన వారే.. జీవో 111 పరిధిలో 18 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయని ఈటల చెప్పారు. దళితులకు ఇస్తామన్న మూడెకరాలు ఇవ్వలేదు కానీ.. హైదరాబాద్ శివార్లలో 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 5,800 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుని 300–400 గజాల ప్లాట్లు మాత్రం ఇస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములతో డబ్బులు సంపాదించవచ్చునని కేసీఆర్ గుర్తించడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణం ఏమైంది? కూకట్పల్లి ఎల్లమ్మ బండ భూముల కేసు సర్కార్ ఎందుకు ఓడిపోయింది? అని ప్రశ్నించారు. చట్టాన్ని, భూములను కాపాడాల్సిన ప్రభుత్వం డబ్బులు ఉన్నవారికి కొమ్ము కాస్తూ కోర్టులలో కేసులు ఓడిపోతోందని ఆరోపించారు. భూముల ద్వారా సంపాదించిన డబ్బుల్నే పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు, తన లాంటి వారిని ఓడించేందుకు ఖర్చు పెడుతున్నారని, ఇతర రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఒక్క గజం కూడా ఇవ్వడం లేదు.. కాళేశ్వరంలో నీళ్ళు ముందే నింపిపెడితే.. వర్షాకాలంలో వచ్చిన వరదలకు కాళేశ్వరం నుండి ఎల్లంపల్లి వరకు పొలాలు మునిగిపోయాయని ఈటల విమర్శించారు. జీవో 111 రద్దుతో జంట జలాశయాలను నిర్లక్ష్యం చేస్తే హైదరాబాద్ కూడా మునిగిపోతుందని హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పేదల కోసం లక్షలాది ఇళ్లు నిర్మించి ఇస్తుంటే, కేసీఆర్ సర్కార్ మాత్రం డబుల్ బెడ్రూమ్లతో సహా, పేదలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్క గజం జాగా కూడా ఇవ్వడం లేదని చెప్పారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ధరణిలో తప్పులు సరిదిద్దేందుకు 18 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ పరిష్కారం లభించలేదని విమర్శించారు. అధ్యక్షుడి మార్పు అధిష్టానం చూసుకుంటుంది ఎన్నికల ఏడాదిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు ఈటల బదులిచ్చారు. బండి సంజయ్ తన శక్తి మేరకు పని చేస్తున్నారని, అయితే పార్టీ ఇంకా విస్తరించడంతో పాటు కొత్తవాళ్లు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో గెలవగానే కాంగ్రెస్ దేశమంతా గెలుస్తుందా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ముందు తన పార్టీని, నాయకులను కాపాడుకోవాలని సూచించారు.