రేపే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల దృష్ట్యా నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలోని సీ బ్లాక్లో మంత్రివర్గం సమావేశమవనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సమావేశాల ప్రాధాన్యం, ఆమోదించాల్సిన కీలక అంశాలను భేటీలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన జీఎస్టీ బిల్లును ఆమోదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో బిల్లు ప్రాధాన్యాన్ని చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలుపనుంది. గతంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ పాలక మండళ్లలో సభ్యుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను, సైబరాబాద్ కమిషనరేట్ విభజనకు సంబంధించిన ఆర్డినెన్స్నూ చట్టంగా మార్చేందుకు ఈ సమావేశంలోనే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మంత్రి వర్గ భేటీలో ప్రధానంగా ఈ మూడు అంశాలను ఎజెండాగా చేర్చినట్లు సమాచారం.
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
Published Mon, Aug 29 2016 2:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement